Tuesday, June 17, 2025

 🔔 *జై శ్రీరాం* 🔔

*పిల్లలపెంపకం విషయంలో రామాయణం ఏం చెపుతున్నది*

*శ్రీ రాముడు సీతాదేవి నగలను లక్ష్మణుడికి చూపించి “ఇవి మీ వొదిన కేయూరాలేగదా!   ఒక్కసారి నువ్వు కూడా గురుతు పట్టు” అంటే అప్పుడు లక్ష్మణస్వామి అంటారు కదా ....*
 *"నాహం జానామి కేయురే*              
*నాహం జానామి కుండలే*              
*నూపురే త్వభి జానామి*              
*నిత్యం పాదాభివందనాత్"*
.
 *దీనర్ధం ఏమిటంటే.. “ఓ అన్నా!వదినగారు భుజానికి పెట్టుకునే కేయూరాలుగానీ గానీ, చెవులకు పెట్టుకునే కుండలాలు గాని నే నెరుగను, కానీ  ఆవిడ పాదాలకు పెట్టుకునే నూపురాలను మాత్రం గుర్తు పట్టగలను. ఎందుకంటే ఆ తల్లి పాదాలకు నిత్యం నమస్కారం చేస్తాను కాబట్టి!”*

*పరస్త్రీని కన్నులెత్తి చూడని సంస్కారం*

*అసలు ఆడువారి ముఖంలో ముఖంపెట్టి కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు మాట్లాడాలి ?*

*ఈవిధమైన శీల సంపద లక్ష్మణుడికి ఎక్కడనుండి వచ్చింది ?*

 *తల్లి సుమిత్రాదేవి పెంపకం!!*

*రాముడితో అడవికి వెళ్ళేటప్పుడు        ఆ మహాతల్లి కొడుకుకు ఏమని చెపుతుందో తెలుసా !*

*"రామం దశరధం విధ్ధి,*
*మాం విధ్ధి జనకాత్మజాం,*
*అయొధ్యాం అటవీం విధ్ధి*
*గచ్చ తాత యధాసుఖం"*

*రాముణ్ణి దశరధుడనుకో,*
 *సీతను నన్ననుకో!*
*అడవిని అయొధ్య అనుకో 
*హాయిగా వెళ్ళిరా నాన్నా!*

*ఇంత సంస్కారమున్న తల్లి పెంచింది కాబట్టే  లక్ష్మణుడు అంత శీలవంతుడయ్యాడు.* 
*చీరతొలగి మత్తులో ఉన్న తారతో మాట్లాడవలసివచ్చినప్పుడు... తలవంచుకుని మాట్లాడిన అద్భుత శీలసౌందర్యం లక్ష్మణస్వామిది!*

*నేడు ప్రతి తల్లి  తెలుసుకోవలసిన సత్యం ఇది కాదా ! *

*పిల్లలను ఈవిధంగా పెంచితే దేశంలో ఏ ఆడబిడ్డయినా ఎందుకు బాధపడుతుంది?*
*నిర్భయ లాంటి ఘటనలు ఎందుకు చోటు చేసు కుంటాయి?  బంగారుతల్లుల జీవితాలు ఎందుకు చిదిమి వేయబడతాయి ?*
*రామాయణం, రామకధలు విరివిగా ప్రచారం చేయండి !*

పరస్త్రీని ఇష్టం లేకుండా చెరబడితే దండన ఏదో ! స్త్రీలతో ఎలామెలగాలో అన్నీ తెలుస్తాయి !

No comments:

Post a Comment