మనలో అధిక సంఖ్యాకులు దైవము నుండి విలువలేని వాటిని పొందటానికి ప్రార్థిస్తుంటారు.
*ప్రాపంచిక సుఖ సంతోషాలూ, వ్యాధి నివారణలూ, ఉద్యోగాభివృద్ధులు ఇవన్నీ ఆకర్షణీయంగా కనిపించే కాకిబంగారపు నగలు.
*కానీ దైవము మనకు మోక్షం అందించుటకు సంకల్పించాడు. అయితే దానిని కోరువారు మనలో
అతి కొద్దిమంది మాత్రమే!
*దైవమును మనల్ని రక్షించే వస్తువును అడిగి అందుకోవాలి తప్ప మనలను బంధించే విషయాలు కోరుకోకూడదు.
*ఒక వెయ్యి ప్రాపంచిక విషయాల కోసం దేవుని అడుగుతుంటాము తప్ప తనను కావాలని అడిగేవారు చాలా అరుదు.
*ఇలాంటివారు ఏనాటికీ భక్తులు కాలేరు! భగవంతుని తప్ప ఇంక దేనినీ కోరనివాడే నిజమైన భక్తుడు.
*మేము శివభక్తులమనీ, రామభక్తులమనీ, కృష్ణభక్తులమనీ మనకు మనము చెప్పుకుంటున్నాము కానీ ఆయన కూడా మనల్ని తన భక్తులుగా అంగీకరించాలి కదా!
*మనము భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులమై ఆయన యొక్క ఉపకరణాలుగా అయితే తప్ప మనము తన భక్తులమని చెప్పుకొనే అర్హత మనకు కలుగదు.
.
No comments:
Post a Comment