*దేవుని చూడగానే చెంపలను కొట్టుకోవడం, నమస్కారం చేయడం మాత్రమే కాదు.*
నమస్కారము అంటే - ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియములు...ఈ పది ఇంద్రియాలతోనే మనం ప్రవర్తిస్తున్నాము.
"ఇవన్నీ" భగవంతుడు ఇచ్చినవే, ఇవి నీవే స్వామీ, వీటిని సక్రమంగా వినియోగించు కోగలగాలి, "అని" ప్రార్థించాలి.
దేహములు మాత్రమే దూరముకానీ, బింబ ప్రతి బింబములవలె, అవినాభావ సంబంధం "దైవం"తో ఏర్పడుతుంది.
భగవంతునితో సఖ్యత పెంచుకోవాలి, జపం, పూజ, ధ్యానం, వ్రతాలు మాత్రమే భక్తి కాదు!!...
అవికూడా చేయవలసినవే! ఇవి రోజూ చేయడంవలన మనకు దైవంతో అనుబంధం, ప్రేమ పెరగుతుంది, ఆయనను ప్రేమించడం మనవిధి.
రూప నామములతో మనిషిగా దైవాన్ని గుర్తించి, ప్రేమించి పూజించడం, అంటే అది పూర్వ జన్మ సంస్కారమే.
అందరికీ భగవంతునితో బంధం కలగదు, ఆయన అనుగ్రహం ఉన్నవారికే అది "సాధ్యం" అవుతుంది...
సఖ్యత భగవంతునితో కుదరాలంటే, ఎప్పుడూ ఆయన మన దృష్టిలో, భావనలో ఉండాలి, ప్రేమ పూర్వకంగా అతనితో ముచ్చట సలపాలి.
No comments:
Post a Comment