Saturday, October 10, 2020

అతిగా చూడొద్దు, చదవ వద్దు ,మాట్లాడవద్దు.ఇదే మహమ్మారిని మర్చిపోవడానికి బ్రహ్మ రహస్యం!!!

అతిగా చూడొద్దు, చదవ వద్దు ,మాట్లాడవద్దు !!!!🥱

ఇదే మహమ్మారిని మర్చిపోవడానికి బ్రహ్మ రహస్యం!!!!

72 గంటలు పాటు మీ దినచర్యలో మార్పు చేయండి.

తర్వాత మీలో మార్పు కనిపిస్తుంది.

కరోనా పై ప్రజల్లో ఉన్న భయాందోళనలు ఎలా ఉందనే విషయం పై గత నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ, హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల ..

డాక్టర్ల బృందం క్షేత్రస్థాయిలో సర్వే జరిపారు...

సర్వే ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం పనులు చేసుకునే శ్రామికులు ,ఆఫీసులో పనిచేస్తున్న వారిలో

కరోనా గురించి ఆందోళన ఉంది .జాగ్రత్తలు తీసుకుంటూనే పనుల్లో నిమగ్నమై పోతున్నారు...

👉🏻ఇప్పుడు సమస్య అంతా ఇంట్లో కూర్చొని చేతిలో రిమోట్ పట్టుకొని కరోనా గురించి టివీ వార్తలు వింటూ పేపర్ చదువుతూ ....

👉🏻అదేపనిగా
మాట్లాడుకుంటున్న వాళ్లలోనే ఆందోళన పెరుగుతుందని గుర్తించారు.

👉🏻ఏదైనా ఒక అంశం మీద వారం రోజుల పాటు నిత్యం చూసినా చదివినా మనలో అలవాట్లు పెనవేసుకు పోతాయని డాక్టర్లు వాదన..

పెద్ద మొత్తంలో భయాందోళన గురిచేసే సమస్య వచ్చినప్పుడు

ప్రజల్లో మాస్ హిస్టీరియా అనే ఒక మహమ్మారి వ్యాప్తిచెందుతుంది...

మన పక్క వాడికి ఏదైనా జబ్బు వస్తే మనం కూడా వస్తుందనే పెద్ద భయం పట్టుకుంటుంది..

కనిపించని మనసుతో ఉన్న పెద్ద ప్రమాదం అదే

చూడొద్దున్న దాన్ని చూస్తా అంటుంది
చేయొద్దు అన్న దానిని చేస్తానంటోంది.

కానీ దాని ఫలితం భౌతికంగా ఉండే మనమే అనుభవించాలి...

అసలు జబ్బు కంటే ఆందోళనలు వలన ఇతర జబ్బులు, ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఎక్కువ ,

డాక్టర్లు చెవులు చిల్లులు పడే విధంగా మొత్తుకుంటున్నారు...

కరోనా మహమ్మారి కోరలు పీకటానికి ప్రపంచం నలుమూలలా అహర్నిశలు కృషి చేస్తున్నారు..

వారి శ్రమ వృధా కాదు

కానీ ఇప్పుడు పడుతున్న భయాందోళనలు కొద్దికాలం తర్వాత కారు మబ్బులు గా విడిపోయినప్పుడు...

అంత త్వరగా రోగాలు వదిలి పెట్టవ్..

ప్రతి మొదలుకు ఓ చివర అంటూ ఉంటుంది

ఇటీవల కాలంలో వింటున్న పాజిటివ్ అనే పదాన్ని మన మనసు సంబంధించిన పాజిటివ్ గా మార్చుకోవాలి...

అప్రమత్తం ముద్దు ఆందోళన వద్దు

వార్త చదివి ఈ గ్రూపులో కొంత మంది అయినా మార్పుకు అలవాటు పడితే వార్తకు సార్థకత ఏర్పడుతుంది...

బై....

లక్ష్మణ్...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Source - Whatsapp Message

No comments:

Post a Comment