ఓం నమో భగవతే శ్రీ రమణాయ
భక్తురాలు :
భగవాన్! నాకు ఒక మంత్రం ఉపదేశం అయింది. దాన్ని జపిస్తే అనుకోని ఫలితాలు వస్తాయని కొందరు భయపెడుతున్నారు? ఇంతకూ అది ప్రణవం. మీ సలహా వేడుతున్నాను. దాన్ని జపించేదా? నాకు దానిలో చాలా నమ్మకముంది!
మహర్షి :
ఖచ్చితంగా చెయ్యవచ్చు. దాన్ని విశ్వాసంతో జపించాలి.
భక్తురాలు :
ప్రణవం మాత్రం చాలునా? లేదా దయచేసి వేరే ఏదైనా సలహా ఇస్తారా!
మహర్షి :
మంత్ర జపం ఉద్దేశం ఏమిటంటే ఆ జపం తనలోనే, తన ప్రయత్నం లేకుండానే జరుగుతోందని తెలిసుకోవడానికే. వాక్కు రూపంగా వచ్చే జపం మానసిక జపమై, ఆ మానసిక జపం చివరకు నిత్యసిద్ధంగా అనుభవం అవుతుంది. ఆ మంత్రం వ్యక్తి యథార్థ స్వభావమే. ఆత్మసాక్షాత్కార స్థితి కూడ అదే.
భక్తురాలు :
ఆ విధమైన జపం వలన, సమాధిస్థితి ఆనందాన్ని కూడ అందుకోగలమా?
మహర్షి :
జపం మానసికమై చివరకు ఆత్మగా సాక్షాత్కరిస్తుంది. సమాధి అంటే అదే.
భక్తురాలు :
కృపతో నన్ను అనుగ్రహించండి. నా సాధనకు బలాన్ని చేకూర్చగలరు.
మహర్షి అనుగ్రహ దృష్టిని వారి మీద సారించారు.
No comments:
Post a Comment