Monday, July 12, 2021

నిజమైన చరిత్ర తెలసుకుందాం

 #నిజమైన_చరిత్ర_తెలసుకుందాం:


పురుషోత్తముడు గొప్ప అలేగ్జాండర్ గొప్ప ఎవ్వరు ఎవ్వరి దగ్గర శిరస్సు వంచారు .? 


 భారతీయులను 'ఆంగ్ల మానస పుత్రులు'గా తయారుచేసే విద్యావిధానాన్ని ఆనాడు మనపై బలవంతంగా రుద్దారు. అందులో బాగంగానే మన చరిత్రని వక్రీకరించారు. 


#మనది_పరాక్రమ_చరిత్ర కాదు, #పరాజయ_చరిత్రే అని అసత్యాలను వ్యాపింపజేశారు. 


బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత కూడా ఈ దేశాన్ని విదేశీయ బుద్దులతో పరిపాలించిన వారు వక్రీకరించబడిన చరిత్ర పాఠాలనే కొనసాగిస్తూ వచ్చారు. 


బ్రిటీష్ వాళ్లకు తోడుగా కమ్మీ కుక్కలు జత కట్టాయై  నెహ్రు  # ఇందిరాగాంధీ సమయంలో 1971లో మన విద్యవ్యవస్థలో తల దూర్చి మన చరిత్ర  మనకు కాకుండా చేశారు ( కేంద్ర విద్యశాఖ తీసుకొని) ..


దాని ఉదాహరణ మన పురోషోతముని వీర చరిత్రను వక్రీకరించి చెప్పటం:


*    శివాజీకి జిజియామాత బాల్యంలోనే రామాయణ, మహాభారత గాధలు, చరిత్రలోని స్పూర్తివంతమైన కధలు చెప్పింది కాబట్టే ఆయన అంత గొప్ప వాడయ్యాడు.


*  శక్తి ఉన్నా మన సమాజంలో ఐక్యత లోపించినప్పటి నుండీ ఒకరి తరువాత ఒకరుగా మనదేశం మీదకి దండెత్తి వచ్చినవారి చేతిలో మనం ఓడిపోతూ వచ్చాం.


*  మన దేశంలో అడుగుపెట్టిన అరబ్బులు, తురష్కు లు, మొఘలులు మొదలగువారంతా ఏనాడూ మన దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోలేకపోయారు.


*  దేశంలో ఏదో ఒక మూల ప్రతినిత్యం దురాక్రమణదారులకు ప్రతిఘటన ఎదురవుతునే ఉంది. హిందూ వీరుల నుండి తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం వారు కంటిమీద కునుకులేకుండా అవస్థలు పడ్డారు. 


*  మన ధర్మం, సంస్కృతులను నాశనం చేయడానికి విదేశీయులు ఎంతగా ప్రయత్నించిన ఈనాటికీ అవి చెక్కుచెరకుండా వున్నాయి. అందుకు కారణం హిందూధర్మర పరిక్షణకై ఎందరో వీరులు చేసిన బలిదానాలే.


*  నిజానికి మనది పరాజిత చరిత్ర కాదు. పరాక్రమ చరిత్ర. ఈ దృష్టిలో కొన్ని ఉదాహరణలు చూద్దాం.


*  క్రీ.పూ 327 సంవత్సరంలో జీలం నది ఒడ్డున జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ పురుషోత్తముని ఓడించినట్టుగా మన పాఠ్యపుస్తకాలలో ఉంది. ప్రొఫెసర్ హరిశ్చంద్ర సేథ్ (లండన్) 1938లో జరిగిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో సమర్పించిన "వాజ్ పోరస్ ది విక్టర్ ఆఫ్ ది బాటిల్ ఆఫ్ జీలం? అన్న వ్యాసంలో పురుషోత్తముడే అలెగ్జాండర్ని ఓడించాడని పేర్కొన్నాడు. ఇందుకు భారతదేశంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని, ఐరోపా చరిత్రకారుల వ్రాతల ఆధారంగానే ఈ విషయం స్పష్టం అవుతుందని సేద్ చెప్పారు.


* కుర్టిదయస్, జస్టిన్, డయోడరస్, అరియన్, ఫ్లూటార్క్ అన్న చరికారుల వివరణలు జాగ్రత్తగా పరిశీలిస్తే అలెగ్జాండర్ పురుషోత్తముని చేతిలో ఓడిపోయి అతనితో సంధి చేసుకుని ఈ దేశాన్ని వడిచిపెట్టి పారిపోయాడన్న విషయం స్పష్టమవుతుంది.


*  ప్లూటార్క్ కధనం ప్రకారం- "ఒకలక్షా ఇరవై వేల మంది పదాతిదళంతో 15వేల మంది అశ్విక దళంతో మన దేశం మీదకి అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడు. పురుషోత్తముని పట్ల శత్రుత్వం వహించిన తక్షశిల రాజు అంభి సహాయం కూడా అతనికి ఉంది. పురుషోత్తముని వద్ద 20వేల మందితో కూడిన పదాతిదళం, 2వేల మంది గల అశ్విక దళం మాత్రమే ఉంది.


 *  పురుషోత్తముని సైనికులు సాటిలేని మేటి వీరులు. వారితో పోరాడి గెలవడం అసాధ్యమని యుద్ధం ప్రారంభంలోనే అలెగ్జాండర్ సైనికులు గ్రహించారు.


*  కుర్టియస్ ఇలా వ్రాస్తాడు. జీలం నదిలో ఒక దీవిలో విడిది చేసిన అలెగ్జాండర్ సైనికుల మీదకి పురుప్లోముడు దాడి చేస్తాడు. ఆ దాడిలో చాలామంది గ్రీకు సైనికులు మరణిస్తారు. పురుషోత్తముని ధాటికి తాళలేక చాలామంది గ్రీకు సైనికులు తప్పించుకునేందుకు జీలం నదిలోకి దూకి జలసమాధి అయిపోయారు.


*  జస్టిన్ కధనం ప్రకారం- "యుద్ధం ప్రారంభంలోనే పురుషోత్తముడు అలెగ్జాండర్తో ఒంటరిగా పోరాడాలనే కోరికను వెలిబుచ్చుతాడు. దీని ద్వారా రక్తపాతం జరగకుండా చూడవచ్చని అతని ఆలోచన. దీనిని అ లెగ్జాండర్ అంగీకరించడు. 


*  యుద్ధం ప్రారంభంలోనే అలెగ్జాండర్ గుర్రం చనిపోతుంది. కిందపడిన అతడిని గ్రీకుసైనికులు తీసుకుపోతారు.


*  కుర్టియస్, డయోడరస్ కధనం ప్రకారం- "పురుషోత్తమునికి అతని ఏనుగులు చాలా ఉపకరించాయి. అలెగ్జాండర్ సైనికులలో అత్యధిక భాగం పురుషోత్తముని ఏనుగుల చేత క్రూరంగా చంపబడ్డారు."


 *  ఇధియోపియూక్తి చెదిన ఇ.ఎ.డబ్ల్యుట్యాడ్జ్ తన 'ది లైఫ్ అండ్ ఎక్స్ప్లాయిట్స్ ఆఫ్ అలెగ్జాండర్" అన్న పుస్తకంలో ఇలా వ్రాస్తాడు. 


* 'జీలం యుద్ధంలో అలేగ్జాండర్కు చెందిన అశ్విక దళంలో అధిక భాగం హతమైంది. ఒక సందర్భంలో యుద్ధం చేయటోమని అలెగ్జాండర్ సైనికులు ఎదురు తిరుగుతారు. యుద్ధం కొనసాగితే తనకు కూడా చావు తప్పదని గ్రహించిన అలెగ్జాండర్ పురుషోత్తమునితో సంధి చేసుకుని తన రాజ్యంలోని కొన్ని భాగాలను పురుషోత్తమునికి అప్పచెప్తాడు."


*  అలెగ్జాండర్ పురుషోత్తమునితో సంధి ప్రయత్నాలు చేసినట్టు చాలామంది ఐరోపా చరిత్రకారులు రాయగా మన పాఠ్యపుస్తకాలలో మాత్రం పురుషోత్తముడే అలెగ్జాండర్తో సంధి చేసుకున్నాడని ఉంది. 


సంధి చేసుకున్న తరువాత అలెగ్జాండర్ సింద్, మర్మన్ గుండా తిరుగుప్రయాణం కడతాడు.


అప్పటికే యుద్ధంలో తీవ్రంగా గాయపడిన అలెగ్జాండర్ క్రీ.పూ 323లో బాబిలోనియాలో మరణించాడు. పూటార్క్ ఇలా అంటాడు, "భారత్ లో అందరూ తనని అసహ్యించుకున్నారని అలెగ్జాండర్ అన్నాడు." అది నాటి కధ. 

మరి నేడో.?

 అలెగ్జాండర్ని విశ్వవిజేతగా పొగుడుతూ మన పిల్లలకి చెప్తున్నాం. ఎంత అవమానకరమైన విషయమిది?


* అలెగ్జాండర్ తరువాత మన దేశం మీదకి దండెత్తి వచ్చిన సెల్యుకస్ని చంద్రగుప్తుడు ఓడించాడు. 


*  చంద్రగుప్తుని పరాక్రమానికి ఆశ్చర్యపోయిన సెల్యుకస్ అతనితో బంధుత్వం నెరపాడు.


*  పవిత్ర మాతృభూమిపై విధర్మీయులైన యవనుల దురాక్రమణ తనకు దుస్సహం కాగా, నిస్వార్ధ దేశభక్తి ఆధారంగా వ్యక్తిగతమైన ప్రతిఫలం ఆశించని వీరులతో అపార సేనావాహినిని నిర్మించి, వ్యక్తిగత పూజ కన్నా జాతివ్రేయస్సు ప్రధానమనే సత్యాన్ని ప్రజల హృదయాల్లో ప్రతిష్టించి యవనులను సింధునది ఆవలకు పారదోలి, దేశ సమైక్య సాధనకై అశ్వమేధ యాగానన్ని చేసిన విరవ్రతధారి పుష్యమిత్రుడి జీవితగాధ మన జాతి మార్గదర్శనానికి ఒక మణిదీపిక,


*  మట్టిబొమ్మలను మహావీరులుగా మలచి మన దేశంపైకి దండెత్తి  వచ్చిన వారిని తరిమికొట్టి నవశకానికి నాంది పలికిన శాతవాహనుడు, దేశ సమగ్రతను కాపాడడం కోసం విదేశీయులతో చేతులు కలపక వారినెదిరించిన ఖారవేలుడు, భారతదేశం వెలుపల హిందూ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేసిన శైలేంద్రుడు, మన దేశాన్ని ఆక్రమించిన హూణులను ఓడించి తరిమికొట్టిన యశోధర్ముడు, 8వ శతాబ్దంలో చైనానుండి వచ్చిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన కాశ్మీర్ చక్రవర్తి లలితాదిత్యుడు-వీరందరి సాహస గాధలను విన్నప్పుడు మన హృదయాలు ఉత్సాహంతో ఉరకలు వేసాయి.


*  బాగ్దాద్ నుండి మన దేశం మీదకి దండెత్తి వచ్చిన మహ్మద్ బీన్ కాశింతో సింధ్ ప్రాంతంలోని దాహిర్ రాజులు పోరాడారు. ఒక్కరు కూడా వెన్ను చూపలేదు. దాహిర్ రాజు చనిపోతే దాహిర్ రాణి నాయకత్వంలో వేలాదిమంది మాతృమూర్తులు విదర్మీయులతో పోరాడి ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం చేసారు. 


*  గజనీ మహమ్మద్ బందేలుఖండ్ ని పాలిస్తున్న విద్యాధరుని చేతిలో ఘోరంగా ఓడిపోయి పలాయనం చిత్తగించాడు. అలాంటి విద్యాధరుని గురించి మన చరిత్రలో ఒక్క ముక్క కూడా చెప్పరు.

క్రీశ 1035లో గజనీ మేనల్లుడు సాలార్ మసూద్ లక్షా 50 వేల మందితో దండెత్తి వస్తే పాశీరాజులు ఇద్దరిని తప్ప మిగిలిన అందరినీ చంపేసారు. జరిగిన విషయం వాళ్ల రాజుకి చెప్పడం కోసం ఆ ఇద్దరినీ వదిలేసారు.


*  బాగ్దాద్ వరకు కాషాయ ధ్వజ ఛాయలను వ్యాపింపచేసిన బాప్పారావల్ చాతుర్యం  మనకి స్పూర్తిదాయకం.


*  1178లో మహమ్మద్ పెూరీ గుజరాత్ పై దండెత్తాడు. గుజరాత్ రాజు బాలుడైనందున అతని తల్లి నాయకీదేవి సైన్యానికి నాయకత్వం వహించి అబూ పర్వతం సమీపంలో పెూరీని ఓడించింది. మరి ఆ వీరవనిత నాయకీదేవి గురించి మన చరిత్రలో లేదు.


*  మనం పిల్లలకి బోధించాల్సింది కల్పితాలతో కూడిన అక్బర్ గొప్పదనం గురించి కాదు. అతనికి ఏనాడూ తలవంచని రాణాప్రతాప్ స్వాభిమానాన్ని గురించి చిన్నారులకు చెప్పాలి. 


* పరమ క్రూరుడైన ఔరంగజేబుకు మహారాష్ట్రల్లో శివాజీ నుండి, అస్సాంలో లాచియ్ బడ్ పుకన్ (అస్సాం శివాజీ) నుండి, పంజాబ్లో గురు గోవింద్ సింగ్ నుండి నిరంతరం ఎదురుదెబ్బలు తగులుతునే ఉన్నాయి. 10, 11 ఏళ్ల పసిప్రాయంలోనే ధర్మం కోసం ప్రాణాలర్పించిన గురుగోవిందుని కుమారులు ఫతేసింగ్, జోరావర్సింగ్ల బలిదానం అత్యంత ప్రేరణదాయకం.


*  మొఘలుల దురాక్రమణను ఎదిరించి నిలిచిన వీరవనిత, వింద్య ప్రాంతాలలో ఉన్న గడ్మల్ రాజ్యానికి రాణి అయిన దుర్గావతి, ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్, రాణి చెన్నమ్మ, రాణి రుద్రమదేవి మొదలైన మాతృమూర్తుల శౌర్యం మనకు చైతన్యాన్నిస్తాయి.


*  సుదీర్ఘకాలం మన దేశంలో అధికారం చెలాయించిన మొఘలులు దక్షిణ భారతదేశానికి తమ రాజ్యాన్ని విస్తరింపచేయలేక పోయారంటే దానికి కారణం దక్షిణ భారతంలో సువ్యవస్థితం, సురక్షితం అయిన విజయనగర సామ్రాజ్యం ఉండడమే


* మతం మార్చుకున్న  కొన్ని కుక్కలు  మొత్తం భారతీయులను  శాసించే స్తితిలొకి రావడం వల్ల  , స్కూలుమొహమే చూడని  వాళ్ళు కేంద్రంలొ విధ్యాశాఖామంత్రులుగా  ఉండటం వల్ల  మతాభిమానం వల్ల అలాంటివాళ్ళను కీలక శాఖల్లొ నియమించడం వల్ల మన చరిత్ర ను పూర్తిగా మార్చి దొంగలను హంతకులను గొప్పవాళ్ళగా  దొంగ చరిత్ర ను చదివించేరు కనీసం ఇప్పుడైనా నిజ చరిత్ర మన పిల్లలకు తెలియ చేద్దాం ఫిల్లల పాఠ్యాంశలలొ నిజచరిత్ర ఉండేలా చూద్దాం.


*  ఈ విధంగా అసంఖ్యాకంగా ఉన్న మన వీరుల గాధలు వింటుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. మనది సంఘర్షణ ప్రవృత్తి. మనం ఏనాడూ ఎవరికీ తలవంచలేదు. అటువంటి సాహసమయ సంఘర్షణ ప్రవృత్తి మన విద్యార్ధులలో నిర్మాణం కావాలి. ఇది జరగాలంటే మనదైన చరిత్ర బోధన జరగాలి. ఇందుకోసం మన విద్యావిధానంలో తగు మార్పులు చేయాలి. మేలుకో హిందూ నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు .

No comments:

Post a Comment