Monday, August 1, 2022

’నీ అంత పనికిమాలిన జీవితం ఎవ్వరూ గడపకూడదు నువ్వొక వ్యర్థ జీవివి' అన్నారు శ్రీరామతీర్థులు వారు

 ❤️  ’స్వామి! బాధ్యతలన్నీ తీరిపోయాయి' 

💕  ’మంచిది' 

❤️  ’కొడుకులూ, కూతుళ్లు ఎవరి సంసారాలు

వారివి. అందరూ బాగున్నారు!'

💕  ’సంతొషం' 

❤️  ’నేను హాయిగా, ప్రశాంతంగా ఉన్నాను, ఒకరి ముందు చెయ్యిచాపనవసరం లేదు. జీవితాంతం దిగులు లేకుండా బ్రతుకుతాను. 

💕  ’భేష్ ! చాలా మం..చి..దే...!' 

❤️  అధ్యాత్మిక గ్రంథాలు చదువుతున్నాను. 

 నిత్యమూ పూజలు చేస్తున్నాను. ధార్మిక ప్రవచనాలు వింటున్నాను. 

 జీవితం సంతోషంగా సాగిపోతున్నది. 

 అదృష్ట వంతుణ్ణి 

 అనుకొంటున్నాను స్వామీ !' 

🌺  ’నీ అంత పనికిమాలిన జీవితం ఎవ్వరూ గడపకూడదు నువ్వొక వ్యర్థ జీవివి' అన్నారు శ్రీరామతీర్థులు వారు 

❤️  ఈ మాట వినగానే అప్పటిదాక మాట్లాడిన వ్యక్తి ఆశ్చర్యపోయాడు. 

 అదేమిటి స్వామీ! అలా అనేసారు'  అన్నాడు


💕  అవును నాయనా!  నేను అన్నదాంట్లో  తప్పేమి లేదు, స్వయం ఉద్ధరణే జీవిత పరమార్ధం అనుకొంటున్నావా? పైగా ధార్మిక ప్రవృత్తికి అలవడుతున్నాను అంటున్నావు, ఆ మాత్రం గ్రహింపు రావడంలేదా ఇప్పుడు నీ వయసెంత?' 

❤️  అరవై దాటుతున్నాయి స్వామీ' 

💕  ’ఇంతకాలం నీ కోసమే బ్రతికావు, ఈ దశలోనైనా పదిమందికోసం బ్రతుకు' 

💕  ’సరిగ్గా అర్థం కాలేదు.’ 

 ❤️  తన కోసం మాత్రం బ్రతికేవాడు స్వార్ధపరుడు, తన వారి కోసం బ్రతికేవాడు సగటు మనిషి, పదుగురికోసం బ్రతికేవాడు మహా మనిషి. మన సాటివారు సుభిక్షంగా ఉన్నప్పుడే మనమూ సుఖంగా ఉండగలమని గ్రహించు' అన్నారు శ్రీరామతీర్థులు . 

❤️  తత్వం బోధపడింది స్వామీ! మీరు చూపిన మార్గంలోనే నడుస్తాను'   అంటూ ఆ వ్యక్తి 

 పాదాభివందనం చేసి   వెళ్లిపోయాడు. 

🌺  ”నేను, నాది”కి బదులు 'మనం '   అన్న భావన

పెంపొందాలి.  తోటివారి అభ్యున్నతికి పాటుపడడం సమాజాన్ని సేవించడం ద్వారానే పరిపూర్ణత వస్తుందని గ్రహించాలి. 

❤️  ’నావరకే' నన్న ఊబిలోంచి బయట పడాలి, అటువంటివాడికి అంతటా పరమేశ్వరుని తత్వం గోచరిస్తుంది. ఆ తత్వం ఆ వ్యక్తిని తరింపజేస్తుంది. 

No comments:

Post a Comment