Wednesday, November 26, 2025

 *అన్నదాన మహిమ*
🌹🌹🌹🌹🌹🌹🌹

*కాశీ పట్టణం లో ధనవంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు వుండేవాడు.*

అతను ప్రతీ రోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవ భక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడ చేసేవాడు.

*ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో   కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు లేకుండా పోయాయి.*

పక్క ఊరిలో ఒక పెద్ద సేఠ్  నివసిస్తున్నాడని  అతడు ఇతరుల పుణ్యం ను కొని ధనం ఇస్తాడని  బ్రాహ్మణుడి  భార్య అతనికి చెప్పి 
వారి వద్దకు వెళ్లి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్లీ ప్రారంభం చేయవచ్చును 
అని సలహా ఇస్తుంది.

బ్రాహ్మణుడు  మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు, కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధ పడక తప్పలేదు.

దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకొని ప్రయాణం అయ్యాడు.

 అతను నడుచుకుంటు అడవి దారిలో పోయేవేళ
ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్కపిల్లలతో ఎదుట నిలబడుతుంది. 

పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరులోకి వెళ్లలేకపోయింది.
 
బ్రాహ్మణునికి  బాధగా అనిపించి అతను కుక్క పై  కుక్కపిల్లల కోసం జాలిపడి,  తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు.

కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో, కుక్క త్వరగా రొట్టె తినేసింది, కానీ  ఇంకా ఆకలితో ఉండటంతో  బ్రాహ్మణుడి వైపు చూడ సాగింది.

బ్రాహ్మణుడు  జాలిపడి  రెండవది, తరువాత మూడవది, చివరి నాల్గవది అలా  మొత్తం రొట్టెలు కుక్కకు వేసి  తను మాత్రం కేవలం   నీరు త్రాగి సేఠ్ వున్న వూరికి చేరుకన్నాడు.

 బ్రాహ్మణుడు సేఠ్‌తో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్పాడు.
 
అప్పుడు సేఠ్ నేను పనిలో ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను అని చెప్పాడు.

మధ్యాహ్నం సేఠ్ ఇంటికి భోజనానికి వెళ్లి తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్పుతాడు.  అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు అని సలహా
అడిగాడు.

 సేఠ్ భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ.  ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని ధ్యానం  చేసి తెలుసుకొంటుంది.

కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యం ను
బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది.

సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినపుడు సేఠ్  ఇలా అంటాడు.
 
*ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనుకుంటున్నాను అనగా.*

 బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు.  నా దగ్గర యజ్ఞానికి సరిపడ  ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా ??

*ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకూ ఆహారం పెట్టి ఆ కుక్కను, దాని పిల్లలను నువ్వు రక్షించావు అదే మహా యజ్ఞం అని వైశ్యుడు అన్నాడు.  

నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని
అనుకొంటున్నాను అని అంటాడు.

బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు.  

దానికి బదులుగా  నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు ఇస్తానని  సేఠ్ అనటం దానికి  బ్రాహ్మణుడు కూడ అంగీకరించడం 
జరిగిపోతాయి.

 నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో  కాటాకు ఒక ప్రక్కన ఉంచబడతాయి.
  
రెండవ దానిలో, సేఠ్ ఒక సంచీ నిండా వజ్రాలు, ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు. 

*త్రాసు యొక్క కాటా కొంచెం కూడ కదలదు.* 

రెండవ సంచీ ఉంచినా కూడ కాటా కొంచెం కూడ కదలక పోయేసరికి  సేఠ్ తన దగ్గర 
వున్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున వుంచినా కూడ కాటా అసలుకే కదలదు. అది చూసిన తర్వాత అక్కడ వున్న వారందరు 
ఆశ్చర్య పోతారు.
 
*అప్పుడు బ్రాహ్మణుడు  సేఠ్‌తో, "నేను నా మనసు మార్చుకున్నాను."  ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు అని రిక్త హస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు.*

ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి,
 దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు  నుంచి కొన్ని గులకరాళ్లు ఏరుకుని దానితో ఒక మూటనూ తయారు చేసి ముడివేస్తాడు.

ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడుగటం తో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి
అప్పు దొరుకుతుందేమోనని గ్రామం లోకి వెళ్ళుతాడు.

*ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి ఆగలేక, భర్త వెళ్లగానే ఆ  మూట  తెరిచి చూస్తుంది.  ఆ మూట  నిండా వజ్రాలు, నగలు ఉండటం తో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.*

బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది.

*మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడ నుండి వచ్చాయి.* 

*వజ్రాలు, నగలా ఎక్కడ ఉన్నాయో చూపించు అని అంటాడు బ్రాహ్మణుడు.*
 
భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే
అందులోంచి విలువైన ఆభరణాలు బయట పడటంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు.

*అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలు అన్నీ పూస గుచ్చినటుల చెబుతాడు.*
 
విపత్తు సమయంలో తన పుణ్యంను  విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది.
 
*ఇదీ కథ....*

నిజానికి ఇది కథ కాదు. జీవితం. 

ఈ కలిలో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి.  ఆపదలో ఉన్న వారికి సాయం చెయ్యండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే. మీ  డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు. కానీ, మీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు.
 
*అందుకే, మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా  మార్చుకోండి. పరలోక ప్రయాణానికి పుణ్యం తోనే టిక్కెట్టు కొనుక్కోండి.*

దేవుడు మనల్ని పరీక్షిస్తాడు
మనం ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే,  మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు

*అందుకే ఎంతటి సంక్షోభం వచ్చినా భగవంతునిపై విశ్వాసం వదలకూడదు*

*ప్రపంచానికి భయపడకు*

*మనలను దూషించే వారి వల్ల మనకు ఏమీ నష్టం కలగదు.*

*మన కర్మ ఫలమే మనకు లభిస్తుంది.*

*ఆ దేవుడినే నమ్ముకొండి. అంతా ఆయన ఆధీనంలోనే జరుగుతుంది.*
🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment