Saturday, January 31, 2026

గాంధీజీ ఆశ్రమంలో రాత్రిపూట ఏం జరిగేది? What Happened in Gandhi’s Ashram at Night?

గాంధీజీ ఆశ్రమంలో రాత్రిపూట ఏం జరిగేది? What Happened in Gandhi’s Ashram at Night?

https://m.youtube.com/watch?v=02n6zeiFdCA


https://www.youtube.com/watch?v=02n6zeiFdCA

Transcript:
(00:00) అది 1946 డిసెంబర్ 20వ తేదీ సమయం ఉదయం 4 గంటలు గాంధీజీ ట్రాన్స్లేటర్ అంటే అనువాదకుడు నిర్మల్ కుమార్ బోస్ గాంధీ గది వైపు వెళ్ళారు. ఆయన తలుపు తీశారు. కానీ అక్కడ కనిపించిన దృశ్యం ఆయన్నను దిగ్భ్రాంతికి గురిచేసింది. 77 ఏళ్ల గాంధీజీ తన 19 ఏళ్ల మనవరాలు మనువుతో కలిసి వస్త్రాలు లేకుండా నగ్నంగా నిద్రపోతున్నారు.
(00:23) మనం ఎక్కడో ఒక చోట ఈ కథను వినే ఉంటాం. ఇది నిజమే కానీ అసలు కథ ఇంకాస్త లోతయింది. ఇంకాస్త విచిత్రమైంది. చిన్నప్పుడు మన స్కూల్ పుస్తకాల్లో గాంధీజీ గురించి చదువుకున్నాం. ఆయన ఒక మహాత్ముడని సత్యం అహింస అనే మార్గాల్లో నడిచి దేశానికి స్వాతంత్రం తెచ్చారని మనకు తెలుసు. కానీ గాంధీజీ జీవితంలోని ఆ నాలుగు ఆశ్రమాల కథను మనకు ఎవ్వరూ చెప్పలేదు.
(00:43) ఆ ఆశ్రమాలను గాంధీజీ ఒక ప్రయోగశాలలాగా వాడుకున్నారు. అక్కడ ఆయన తన మీద తన కుటుంబం మీద తన అనుచరుల మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆ ఆశ్రమంలో ఉండే వాళ్ళు గాంధీజీ మీద ఎంతలా ఆధారపడిపోయేవాళ్ళు అంటే ఆయన వాళ్ళ పిల్లల మీద ప్రయోగాలు చేస్తున్న ఎవ్వరూ ప్రశ్నించే వాళ్ళు కాదు. అక్కడ చాలా మంది మహిళలు గాంధీజీ కి ఎంతగా ఆకర్షితులయ్యారంటే ఆయన పక్కన పడుకోవడానికి వాళ్ళు తప్పించిపోయేవాళ్ళు.
(01:08) ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోయేది ఇదే కథ. గాంధీజీ జీవితమంతా ఆయనకున్న ఒక రకమైన లైంగిక వ్యామోహం చుట్టూ తిరిగింది. దీని గురించి మనం మొదటి నుంచి తెలుసుకోవాలి. గాంధీజీకి కస్తూర్బాకి చాలా చిన్న వయసులోనే పెళ్లిఅయింది. అప్పుడు కస్తూర్బా వయసు 14 ఏళ్ళు కాగా గాంధీజీ వయసు 13 ఏళ్ళు వయసు చిన్నదే అయినా వారి మధ్య ఆకర్షణ చాలా బలంగా ఉండేది.
(01:30) స్వయంగా గాంధీజీని రాసుకున్న నేను ఆ హవస్ నిండిన ప్రేమలో ఎంతలా మునిగిపోయానంటే చదువుకోవాలనే కోరిక కన్నా నా భార్యకు చదువు చెప్పలేకపోయాను అని. కానీ ఈ సహజమైన మానవ ప్రవర్తనను ఆయన ఎప్పుడు అసహించుకోవడం మొదలు పెట్టారో తెలుసా ఒకసారి వాళ్ళ నాన్నగారు బాగా అనారోగ్యంలో ఉన్నారు. ఆయనకి సేవ చేయాల్సిన బాధ్యత గాంధీజీది. కానీ ఆ సమయంలో నాన్నగారిని బాబాయికి అప్పగించి గాంధీజీ కస్తూర్బా దగ్గరికి వెళ్ళిపోయారు.
(01:53) సరిగ్గా ఆయన తన భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ సంఘటన గాంధీజీ మనసులో తీవ్రమైన అపరాధ భావాన్ని నింపేసింది. అటువంటి క్లిష్ట సమయంలో కూడా తాను తన కోరికలకు లొంగిపోయానని ఆయన బాధపడ్డారు. అప్పటి నుంచి ఆయన తన లైంగిక ఆసక్తిని ఒక బలహీనతగా చూడడం మొదలుపెట్టారు. దాన్ని వదిలించుకోవడానికి ఎన్నో సార్లు ప్రయత్నించిన అది సాధ్యం కాలేదు.
(02:17) 1888 లో వారి మొదటి కుమారుడు హరిలాల్ పుట్టాడు. ఆ తర్వాత చదువు కోసం లండన్ వెళ్ళినప్పుడు బ్రహ్మచర్యం గురించి తెలుసుకున్నారు. తిరిగి వచ్చాక భార్యతో బ్రహ్మచర్యం పాటించడానికి ప్రయత్నించిన మళ్ళీ 1892 లో రెండవ కుమారుడు మణిలాల్ పుట్టారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు రామదాస్ దేవదాస్ పుట్టారు. గాంధీజీ బ్రహ్మచర్యాన్ని పాటించాలనుకున్నా కానీ ఆయన చాలా గందరగోళంలో ఉండేవారు.
(02:39) ఎంతలా అంటే నేను నా భార్యతో సంభోగం మానలేనా అని తన కజిన్ ని అడిగేవాళ్ళు. చివరకు 1907 లో తన పత్రిక ఇండియన్ ఒపీనియన్ లో ఒక మాట రాశారు. తెలివైన భారతీయులు అసలు పెళ్లే చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్న సంభోగం చేయకూడదు అని. ఇక్కడ అసలైన విచిత్రం ఏంటంటే గాంధీజీ బ్రహ్మచర్యాన్ని స్వీకరించే సమయానికి ఆయన వయసు 38 ఏళ్ళు అప్పటికే ఆయనకు నలుగురు పిల్లలు.
(03:02) ఇక అక్కడి నుంచి ఆయన తన వినూతనమైన బ్రహ్మచర్య ప్రయోగాలను మొదలుపెట్టారు. అయితే ఈ ప్రయోగాలను ఆయన తన వరకే పరిమితం చేసుకోలేదు. గాంధీజీ ఒక లాయర్ గా దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ తెల్లవాళ్ళు మరియు నల్లవాళ్ళు అనే రెండు ప్రధాన వర్గాలు ఉండేవని ఎవరికైనా వెంటనే అర్థమయ్యేది. అక్కడ భారతీయుల పరిస్థితి కూడా ఏం బాగోలేదు.
(03:22) వారి హక్కుల కోసం పోరాడుతూ గాంధీజీ అక్కడ ఒక నాయకుడిగా ఎదిగారు. అక్కడ ఆయన స్వయం సమృద్ధి కలిగిన రెండు ఆశ్రమాలను స్థాపించారు. 1904 లో ఫీనిక్స్ సెటిల్మెంట్ 1910 లో టాల్ స్టాయ్ ఫామ్ ఇక్కడ గాంధీజీ కుటుంబంతో పాటు ఆయన మిత్రులు సహాయకులు కూడా ఉండేవాళ్ళు. కానీ గాంధీజీ ఈ ఆశ్రమాలను కేవలం నివాసాలుగా కాకుండా ఒక ప్రయోగశాలలాగా మార్చుకున్నారు.
(03:43) ఇక్కడ ఆయన తన కుటుంబం పైన తన అనుచరుల పైన రకరకాల ప్రయోగాలు చేశారు. ఈ ఆశ్రమాల్లో పని వాళ్ళు ఎవరూ ఉండేవాళ్ళు కాదు కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కఠినమైన పనులు చేయాల్సి వచ్చేది. ఇందులో లెట్రిన్ పార్ట్స్ అంటే మలమూత్ర కుండలు శుభ్రం చేయడం కూడా ఉండేది. అప్పట్లో అది తక్కువ కులం వాళ్ళు పనిగా చూసేవాళ్ళు. కానీ గాంధీజీ దీన్ని కుల సమానత్వానికి చిహ్నంగా మార్చారు.
(04:06) ఒకసారి కస్తూర్బాను ఒక దళితుడి పాట్ శుభ్రం చేయమని గాంధీజీ అడిగినప్పుడు ఆమె ఇది చిన్న కులస్తుల పని అని నిరాకరించారు. దాంతో కోపం వచ్చిన గాంధీజీ ఆమెను ఇంటి నుంచి గెంటేస్తానని బెదిరించారు కూడా కానీ ఆగండి గాంధీజీ తన పత్రిక హరిజన్ లో ఒక ఆదర్శం గురించి రాస్తూ ఒక విరుద్ధమైన విషయాన్ని చెప్పారు. బ్రాహ్మణుల పని ఆత్మను శుద్ధి చేయడం అయితే బంగీల పని సమాజపు శరీరాన్ని శుభ్రం చేయడమని ఆయన రాసుకొచ్చారు.
(04:30) బంగీలకు మంచి టాయిలెట్స్ కట్టడం వాసన రాకుండా శుభ్రం చేయడం తెలిసి ఉండాలని ఆయన అని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆశ్రమంలో అందరితో టాయిలెట్లు శుభ్రం చేయించడం అనేది కులసమానత్వం కంటే ఎక్కువగా ఆశ్రమం వాసుల మీద తన నియమాలు రుద్దడం అనిపిస్తుంది. ఆశ్రమంలో ఆహారం కూడా చాలా సాధారణంగా ఉండేది. గాంధీజీ కనీసం మసాలాలు కూడా తినేవాళ్ళు కాదు.
(04:50) ఎక్కువగా పచ్చి పళ్ళు నట్స్ తినేవాళ్ళు. కానీ ఈ ఆహార ప్రయోగాలు కూడా ఆయన తన వరకు మాత్రమే ఉంచుకోలేదు. కస్తూర్బా అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్లు ఆమెను బలమైన ఆహారం తీసుకోమని చెప్పారు. ఆమె ఎలాగో మాంసాహారం తినదు. కనీసం మంచి శాఖహారం అయినా తినొచ్చు. కానీ గాంధీజీ తన జబ్బు పడిన భార్య మీద కూడా ప్రయోగం చేయాలనుకున్నారు. ఆమెను ఉప్పు పప్పులు మానేసి కేవలం పండ్లు మాత్రమే తినమని సలహా ఇచ్చారు.
(05:15) కస్తూర్బా దానికి ఒప్పుకోలేదు. అప్పుడు గాంధీజీ నువ్వు అలా చేయకపోతే నేను ఒక సంవత్సరం పాటు ఉప్పు పప్పు తినను అని చెప్పారు. దీంతో కస్తూర్బాకు మరో దారి లేక విచిత్రమైన డైట్ ను ఫాలో అవ్వాల్సి వచ్చింది. కానీ గాంధీజీ చేసిన ఈ ఆహార ప్రయోగాలు ఎప్పుడూ విజయవంతం కాలేదు. గాంధీజీ ఎప్పుడూ మలబద్ధకంతో బాధపడేవారు. అందుకే ఆయన ఎప్పుడూ ఎనీమా తీసుకునేవాళ్ళు.
(05:35) అయితే ఆయన ఎనీమాను కేవలం తన ఆరోగ్యం కోసమే కాకుండా తన మనసు యొక్క శుద్ధి కోసం వాడుకున్నారని నమ్మేవాళ్ళు. ఉదాహరణకు సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒక యూరోపియన్ మహిళకు తానే స్వయంగా తన చేతులతో ఎనీమా ఇచ్చానని గాంధీజీ చెప్పారు. నెమ్మదిగా ఈ అలవాటు ఆశ్రమవాసులందరికీ పాకింది. అక్కడ తినే చప్పని సాధారణ ఆహారం వల్ల చాలా మందికి మలబద్ధకం రావడం ఎనీమాలు తీసుకోవడం సర్వసాధారణం.
(06:01) గాంధీజీ ఎనీమా విషయంలో ఎంతలా నిమగ్నమై ఉండేవారంటే ఆయన ఆశ్రమంలోని మహిళలు ప్రతిరోజు సోదరి ఈ ఉదయం నీ పొట్ట సరిగ్గా శుభ్రమైందా అని అడిగేవాళ్ళు. చివరికి తన కాబోయే కోడలికి కూడా ఎనీమా ఇవ్వమని కస్తూర్బాకు చెప్పారు. గాంధీజీ ప్రయోగాలన్నీ ఆయన మనసు మరియు శరీరం యొక్క పవిత్రత చుట్టూ తిరిగేవి. అందులో ముఖ్యమైనది బ్రహ్మచర్యం. అప్పటికీ గాంధీజీకి సంభోగం అంటే అసహ్యం కలిగేది.
(06:23) ఆయన సిద్ధాంతం ఒక్కటే నేను చేయను ఎవరిని చేయనివ్వను. దీనికోసం ఆశ్రమంలో కొన్ని కఠినమైన రూల్స్ పెట్టారు. స్త్రీ పురుషులు వేరు వేరు గదుల్లో ఉండాలి. దోమపానం, మద్యపానం పూర్తిగా నిషిద్ధం. ఆహారం చాలా సాదా సీదాగా ఉండేది. గాంధీజీ పాలు తాగడం మానేసి కేవలం పచ్చి పండ్లు మాత్రమే తినేవారు. అందరూ చివరకు పిల్లలు కూడా పొలాల్లో కఠినమైన శ్రమ చేయాల్సిందే.
(06:44) పిల్లలకు చదువు కూడా ఈ పనులయ్యాకే వాళ్ళు ఏం తినాలి ఏం కట్టుకోవాలి ఎవరితో ఉండాలి అనే ప్రతి విషయంలో కంట్రోల్ చేయబడేది. దీనివల్ల ఆశ్రమవాసుల వ్యక్తిగత స్వేచ్ఛ పోయి వాళ్ళు పూర్తిగా గాంధీజీ మీద ఆధారపడిపోయారు. ఎంతలా అంటే బాబు తలకి ఎంత నూనె రాసుకోవాలి గుండు కొట్టించుకోవాలా? సోయాబీన్ పేస్ట్ ఒక స్పూన్ రెండు స్పూన్లా అని ప్రతి చిన్న విషయాన్ని గాంధీజీని అడిగేవాళ్ళు.
(07:09) కొంతమంది విమర్శలు ఏంటంటే గాంధీజీ తన ఈగోని సంతృప్తి పరుచుకోవడానికి తన ప్రయోగాల కోసం మనుషులను గినియా పిగ్స్ లాగా వాడుకున్నారని అంటారు. ఆశ్రమవాసులు ఆయన ప్రభావంలో ఎంతలా ఉండేవారంటే ఆయన పిల్లల మీద ప్రయోగాలు చేస్తున్న ఎవరూ ప్రశ్నించేవాళ్ళు కాదు. స్వయంగా గాంధీజన రాసుకున్న నేను కొంతమంది అల్లరి కుర్రాలను అమాయకపు యువతులను ఒకేసారి ఒకే చోట స్నానం చేయడానికి పంపించాను అని వాళ్ళకు ఆత్మ నిగ్రహ అలవాటు చేయాలన్నది ఆయన ఉద్దేశం.
(07:36) ఆ టీనేజర్లు తమ కోరికలను అదుపు చేసుకోగలరా లేదా అని పరీక్షించడానికి గాంధీజీ దగ్గరుండి గమనించేవారట. అంతేకాకుండా ఆ పిల్లలను ఒక బహిరంగ వరండాలు మూడు అడుగుల దూరంలో పక్క పక్కనే పడుకోబెట్టేవారు. అబ్బాయిలు అమ్మాయిలు ఎటువంటి హాని లేకుండా కలిసి జీవించగలరని నిరూపించడానికే ఈ ప్రయోగాలు చేస్తున్నానని ఆయన చెప్పేవారు. టీనేజర్స్ మధ్య శారీరక ఆకర్షణ ఉండడం సహజం.
(08:00) ఆశ్రమంలోని కొందరు అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఏదో లైంగిక విషయం నడుస్తుందని గాంధీజీకి తెలిసిందే. ఆయన అబ్బాయిలను మందలించారు. కానీ అమ్మాయిలకు ఎలాంటి శిక్ష వేయాలని ఆలోచించారు. ఆ అమ్మాయిలపై ఒక శారీరక మచ్చ ఉంటేనే వారికి గుణపాఠం అబ్బాయిలకు హెచ్చరిక ఉంటుందని ఆయన భావించారు. అందుకే ఆ అమ్మాయిల జుట్టు కత్తిరించాలని నిర్ణయించుకున్నారు.
(08:20) అమ్మాయిలు దానికి [సంగీతం] నిరాకరించారు. కానీ గాంధీజీ ఆశ్రమంలోని మిగతా మహిళల మద్దతు కూడగట్టుకొని స్వయంగా తన చేతులతో ఆ అమ్మాయిల జుట్టు కత్తిరించారు. అబ్బాయిలు ఆ కత్తిరించిన జుట్టు చూసి మళ్ళీ అలాంటి పాపం చేయకుండా ఉంటారని ఆయన ఉద్దేశం. బహుశా మైనర్ పిల్లల మీద గాంధీజీ చేసిన ఇలాంటి ప్రయోగాలు ఇవే మొదలు ఇలాంటి ప్రయోగాలు అక్కడితో ఆగిపోలేదు.
(08:41) టాల్స్టాయ్ ఆశ్రమంలో గాంధీజీ రెండవ కుమారుడు మణిలాలు ఉండేవాడు. అక్కడ మణిలాల్కు జాకీ అనే మహిళకు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. వాస్తవానికి జాకీ ఒక వివాహిత. ఆమె భర్త ఫిజీ దేశంలో ఉండేవారు. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉండిండొచ్చు. ఈ విషయం గాంధీజీకి తెలియగానే ఆయన ఏడు రోజుల ఉపవాస దీక్షకు కూర్చున్నారు. ఇలాంటి పాపం చేయడం ఎంత పెద్ద తప్పో అందరికీ తెలియాలని ఆయన ఉద్దేశం.
(09:04) మణిలాలు కూడా తండ్రితో పాటు ఉపవాసంలో కూర్చున్నారు. అప్పుడు గాంధీజీ ఎంత కోపంగా ఉన్నారంటే ఈ ఉపవాసంలో నా కొడుకు చనిపోయినా నాకు అనవసరం అన్నారు. గాంధీజీ ఉపవాసాన్ని ఒక ఎమోషనల్ టూల్ లాగా వాడేవారు. దీనివల్ల ఎదుటి వ్యక్తి తీవ్రమైన అపరాధ భావనలో కూరుకుపోయి ఆ బాధ నుంచి బయట పడడానికి గాంధీజీ ఏం చెబితే అది చేయడానికి సిద్ధపడిపోయేవాళ్ళు. ఉదాహరణకు మణిలాల్ చేత జీవితమంతా బ్రహ్మచర్యం పాటించేలా ప్రమాణం చేయించుకున్నారు.
(09:29) అయితే 35 ఏళ్ల వయసులో మణిలాల్ ఆ మాట తప్పారు. ఇక జాకీ విషయానికి వస్తే ఆమెతో చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆమె చేత ఉపవాసం చేయించారు. ఆమె జుట్టు కత్తిరించారు. ఒంటి మీద నగలు తీయించారు. పశ్చాత్తాపానికి గుర్తుగా ఆమెకు విధవలు వేసుకునే బట్టలు ఇచ్చారు. ఈ సంఘటన గురించి గాంధీజీ రాస్తూ నా జీవితంలో ఇంతటి బాధాకరమైన రోజులను నేను ఎప్పుడూ చూడలేదు. నా గుండె ఎండిపోయింది.
(09:52) జేబులోనుంచి కత్తి తీసి పొడుచుకుంటే బాగుంటుంది అనిపించింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కోపం సమంజసమే ఎందుకంటే ఆయన తన ఆశ్రమాన్ని సెక్స్ ఫ్రీ జోన్ గా ఉంచాలనుకున్నారు. కానీ ఆగండి ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉండొచ్చు. గాంధీజీ ఇంతలా మానసిక వేదన పడడానికి మరో కారణం కూడా ఉంండొచ్చు. బహుశా గాంధీజీ జాకీని కూడా తన బ్రహ్మచర్య ప్రయోగాల్లో భాగం చేసుకున్నారా? ఎందుకంటే ఆయన తన జర్మన్ స్నేహితుడు హెర్మన్ కెలెన్బాకు రాసిన ఒక లేఖలో ఇలా చెప్పారు.
(10:21) మేమంతా వరండాలో పక్క పక్కనే పడుకున్నాం. జాకీ నా పక్కనే పడుకుంది అని నిజానికి ఈ లేఖలో గాంధీజీ ఆమెపై ప్రయోగం చేశారని ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ భవిష్యత్తులో ఆయన చాలా మంది మహిళలను తన ప్రయోగాల్లో భాగం చేసుకున్నారు కాబట్టి అప్పట్లో ఆయన దీని గురించి ఆలోచించి ఉండకపోవచ్చని మన అంచన [సంగీతం] వేయొచ్చు. హిందుస్తాన్ జిందాబాద్ బాపూజీ కి జై గాంధీజీ 21 ఏళ్ల తర్వాత భారతదేశానికి తిరిగివచ్చారు.
(10:44) కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లుగా చేయలేకపోయిన పనిని [సంగీతం] ఆయన చేసి చూపించారు. అదే సామాన్య ప్రజలను నిద్రలేపడం గాంధీజీ భారతీయులకు అహింసతో ఆంగ్లీయులను ఎదిరించడం నేర్పించారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సమయ చేయడం విదేశీ వస్తువులను తగలబెట్టి రాట్నం తిప్పడం నేర్పించారు. దండి సత్యాగ్రహం సమయానికి ప్రతి భారతీయుడు ఈ మహాత్ముని చూడాలని కోరుకునేవారు.
(11:07) 1931 లో గాంధీజీ లండన్ వెళ్ళినప్పుడు టైం మ్యాగజిన్ ఎవరినైతే సంత అని [సంగీతం] పిలిచిందో ఆ వ్యక్తిని చూడడానికి ఆంగ్లేయులు కూడా ఎగబడ్డారు. అప్పటి గాంధీజీ ఒక ప్రపంచ స్థాయి నాయకుడిగా మారిపోయారు. అయితే తన ఈ విజయానికి ఈ స్పిరిచువల్ పవర్ కి కారణం తన బ్రహ్మచర్య ప్రయోగాలే అని గాంధీజీ బలంగా నమ్మేవారు. తనలాగే ప్రతి సత్యాగ్రహి కూడా శుద్ధంగా బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నారు.
(11:30) ఆయన ఇండియాలో 1915 లో తన మొదటి ఆశ్రమాన్ని స్థాపించారు. అక్కడ ఒక విచిత్రమైన నినాదం ఉండేది. సంభోగం గురించి ఆలోచించే సమయం కూడా దొరకనంత పని చేయండి అని ఒకవేళ ఎవరికైనా శారీరక కోరికలు కలిగితే చన్నీళ్ల స్నానం చేయమని సలహా ఇచ్చేవారు. నిజానికి భార్యా భర్తల మధ్య సంభోగాన్ని నిషేధించడం వెనుక ఒక బలమైన కారణం ఉండేది.
(11:50) దంపతుల మధ్య ఉండే సహజమైన సాన్నిహిత్యం తగ్గిపోవాలి. వాళ్ళ మధ్య ఉండే అటాచ్మెంట్ తగ్గి వాళ్ళు ఆధ్యాత్మికంగా పూర్తిగా గాంధీజీ మీద ఆధారపడేలాగా చేయడమే దీని ఉద్దేశం. ఇందుకొక క్లాసిక్ ఉదాహరణ ప్రభావతి. ఈమె భర్త మరెవరో కాదు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు భారతరత్న గ్రహీత జయప్రకాష్ నారాయణ్ ఆయన అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ప్రభావతి గాంధీజీ ఆశ్రమంలో చేరారు.
(12:14) గాంధీజీ ప్రభావంతో ఆమె తన భర్త అనుమతి కూడా లేకుండానే బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసుకున్నారు. దీనివల్ల భర్తతో ఆమె సాన్నిహిత్యం దెబ్బతింది. కానీ గాంధీజీ మీద ఆమె ఆధారపడడం పెరిగిపోయింది. ఎంతలా అంటే ఆమె గాంధీజీ కోసం ఏమైనా చేయడానికి చివరకు ఆయన విచిత్రమైన ప్రయోగాల్లో పాల్గొనడానికి కూడా సిద్ధమయ్యారు. స్వయంగా గాంధీజీ అనే ఒక లేఖలో ప్రభావతి గురించి ఇలా రాశారు.
(12:37) నన్ను వెచ్చగా ఉంచడం కోసం ఆమె తరుచుగా నాతో పడుకునేది. ఆమె చలికి వణకుతూ నేల మీద పడుకున్నప్పుడు నాకోసం నేను ఆమెను నా వైపుకు లాక్కునే వాడిని అని కేవలం పడుకోవడం మాత్రమే కాదు స్నానం చేసేటప్పుడు కూడా ప్రయోగాలు జరిగేది. కస్తూర్బా లేనప్పుడు గాంధీజీ వ్యక్తిగత వైద్యురాలైన 24 ఏళ్ల సుశీలా నాయర్ ఆయన స్నానం చేసేటప్పుడు అక్కడే ఉండేవారు. అప్పుడు గాంధీజీ నగ్నంగా ఉండేవారు.
(12:59) సుశీలా నాయర్ మాత్రమే కాదు ప్రభావతి లీలావతి కూడా ఇలాంటి సందర్భాల్లో అక్కడే ఉండేవారు. సుశీలా బాత్ తబ్ వెనుక స్నానం చేసేటప్పుడు తను కళ్ళు మూసుకునేవాడిని గాంధీజీ చెప్పుకొచ్చారు. గాంధీజీ సుశీలా నాయర్ గురించి రాస్తూ ఆమె నగ్నంగా స్నానం చేస్తోందో లేక దుస్తులు వేసుకుని చేస్తుందో నాకు తెలియదు. కానీ శబ్దాన్ని బట్టి ఆమె సబ్బు వాడుతుందని చెప్పగలను అని అన్నారు.
(13:23) స్నానం తర్వాత గాంధీజీ నగ్నంగా పడుకున్నప్పుడు సుశీల ఆయనకు మసాజ్ చేసేవారు అంటే మాలిష్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆశ్రమంలోని మహిళలు గాంధీజీతో ఈ విచిత్రమైన ప్రయోగాల్లో పాల్గొనడానికి సంతోషంగా ముందుకు వచ్చేవాళ్ళు. గాంధీజీ స్వయంగా రాసిన దాని ప్రకారం ఒకసారి తనను సేవించే అవకాశం దొరకలేదని ఒక మహిళ స్పృహ తప్పి పడిపోయిందట. అసలు ఈ మహిళలు ఎందుకు ఇలాంటి ప్రయోగాలకు ఒప్పుకునేవాళ్ళు దీనికి గాంధీజీ దగ్గర ఒక టెక్నిక్ ఉండేది.
(13:48) 69 ఏళ్ల గాంధీజీ 24 ఏళ్ల సుశీలకు రాసిన లేఖలో ఇలా అన్నారు. ఒకవేళ నీకు ఏదైనా కోరిక కలిగితే పర్వాలేదు. ఎందుకంటే మనఇద్దరం ఒకే స్థితిలో ఉన్నాం. కానీ 69 ఏళ్ల తర్వాత నాలోని వికారాలు నిన్ను ప్రభావితం చేయలేవు. పైకి ఈ ప్రయోగం ఎంత లాజికల్ గా కనిపించినా గాంధీజీ దీన్ని మహిళల ముందు ఒక నైతిక బాధ్యతగా ప్రెజెంట్ చేసేవాళ్ళు. ఈ ప్రయోగాల్లో పాల్గొనడం ద్వారా వాళ్ళు తమ బ్రహ్మచర్యం దీక్షను పరీక్షించుకోవచ్చని మహిళలను నమ్మించేవారు.
(14:17) ఇక ప్రయోగాలు మరింత తీవ్రమయ్యే సమయం ఆసన్నమైంది. గాంధీజీ శారీరకంగా మానసికంగా ఒక కిన్నెరుడిలాగా మారాలనుకున్నారు. దానికోసం కామవాంచలు పెరిగే పరిస్థితుల్లో తనను తాను ఉంచుకొని స్కలనం కాకుండా నిగ్రహించుకోవాలి. దీనికోసం ఆయన ఆశ్రమ మహిళలతో నిత్యం పడుకోవడం మొదలు పెట్టారు. తన ఆశ్రమ మేనేజర్ మున్నాలాల్ షాకు రాసిన లేఖలో ఆభా నాతో మూడు రాత్రులు పడుకుంది.
(14:40) కాంచన్ ఒక రాత్రి పడుకుంది. వీణ నాతో పడుకోవడం ప్రమాద వసత్తు జరిగి ఉండొచ్చు. కానీ ఆమె నా పక్కనే పడుకుంది అని వివరించారు. మున్నాలాల్ షా గాంధీజీకి ఎంతో విధేయుడైన మేనేజర్. గాంధీజీనే దగ్గరుండి మున్నాలాల్కు కాంచన్ అనే మహిళతో పెళ్లి జరిపించారు. కానీ శరత్ ఏంటంటే వాళ్ళద్దర ఒంటరిగా కలుసుకోకూడదు. ఒకరినొకరు తాకకూడదు.
(15:02) అసలు భార్యా భర్తలా కాదు అన్న చెల్లెలలా ఉండాలి. కానీ అదే కాంచన్ను తనతో పడుకోవడానికి మాత్రం గాంధీజీ ఒప్పించారు. అయితే కాంచన్కు ఈ ప్రయోగంపై ఏమాత్రం ఆసక్తి లేదని ఆమె ఒక సాధారణ వైవాహిక జీవితం గడపాలని కోరుకుందని గాంధీజీకి తర్వాత తెలిసింది. కేవలం గాంధీజీ మనసు నొప్పించకూడదనే ఉద్దేశంతోనే ఆమె ఆయన ముందు బట్టలు తీసేది. ఈ ప్రయోగాల పట్ల మున్నాలాల్ అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఆయన గాంధీజీకి విధేయుడు కావడంతో ఏం చేయలేకపోయారు.
(15:29) గాంధీజీ అతడితో మీరు భార్యా భర్తల్లా ఉండాలనుకుంటే నేను వింటాను. కానీ మీరు అన్న చెల్లెల్లా ఉంటున్నప్పుడు మీ తండ్రి ఇచ్చే తీర్పు గురించి మీకెందుకు అని ప్రశ్నించారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ లేఖలో గాంధీజీ ప్రస్తావించిన ఆభా ఎవరో కాదు గాంధీజీ సొంత మనవడు కను గాంధీ భార్య. గాంధీజీ తన సొంత మనవడి భార్య అయిన ఆభాతో కలిసి పడుకునేవాళ్ళు.
(15:51) ఆభాకు కేవలం 16 ఏళ్ళ ఉన్నప్పటి నుంచే ఆయన ఆమెతో ఈ ప్రయోగం చేసేవారు. గాంధీజీ మనవడు కను గాంధీ దీన్ని వ్యతిరేకించాడు. తన భార్యతో ప్రయోగాలు చేయొద్దని వారించాడు. కానీ గాంధీజీ వినిపించుకోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆబానను తాను సమర్ధించుకుంటూ గాంధీజీ నన్ను బట్టలు తీసేయమని అడిగారు. కానీ నాకు గుర్తున్నంతవరకు నేను లంగ మరియు చోళీ వేసుకునే ఉన్నాను అని రాసింది.
(16:13) అయితే గాంధీజీ కుటుంబంలోనే కొంతమంది విజ్ఞులు ఉండేవాళ్ళు. ఉదాహరణకు గాంధీజీ కొడుకు రామదాస్ తన తండ్రి బ్రహ్మచర్యం గురించి రాసిన పుస్తకాలను చదవద్దని తన భార్యను హెచ్చరించాడు. రామదాస్ కూతురు సుమిత్ర కూడా చాలా తెలివైన అమ్మాయి. ఆమె బ్రిటిష్ విద్య అభ్యసించడాన్ని గాంధీజీ వ్యతిరేకించారు. విచిత్రం ఏంటంటే గాంధీజీ స్వయంగా బ్రిటిష్ విద్యను అభ్యసించిన వాళ్లే ఆయన సుమిత్రతో ముందుకు చదివి ఏం చేస్తావ్ ఆశ్రమానికి రా నా సెక్రెటరీగా ఉండు నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను అని అన్నారు.
(16:42) కానీ సుమిత్ర ధైర్యంగా ఇలా బదులిచ్చింది. మీ బట్టలు ఊతికే మీ గిన్నెలు కడికే మీ అపాయింట్మెంట్లు చూసే మీ ఇతర సెక్రెటరీ లాగా నేను మారదల్చుకోలేదు. నెహ్రూ లాంటి గొప్పవాళ్ళు ఎప్పుడు మీ సెక్రటరీలు కారు. వాళ్ళు ఇంగ్లాండ్ లో చదువుకున్నారు కాబట్టే స్వతంత్రంగా ఉన్నారని ఆమె తెగేసి చెప్పింది. సుమిత్ర గాంధీజీ మాట వినలేదు. ఆమె ఉన్నత చదువులు చదివి అమెరికా వెళ్ళింది. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయింది.
(17:04) చివరికి రాజ్యసభ మెంబర్ కూడా అయింది. ఒకవేళ సుమిత్ర గనుక గాంధీజీ మాట విని చదువు మానేసి ఉంటే ఆమె పరిస్థితి ఏమయ్యేది? బహుశా ఆమె కూడా గాంధీజీ మరో మనవరాలు మనో గాంధీ లాగా మిగిలిపోయేదేమో. మను గాంధీ గాంధీజీ తమ్ముడు లక్ష్మీదాస్ మనవరాలు 12 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయిన మనుని కస్తూర్బాని పెంచింది. 16 ఏళ్ల వయసులో కస్తూర్బా చివరి క్షణాల్లో మను ఆమెకు సేవ చేసింది.
(17:29) కస్తూర్బా చనిపోయిన తర్వాత గాంధీజీ మనుకి తల్లిలా మారారు. ఆమె జుట్టు దువ్వడం బట్టలు సెలెక్ట్ చేయడం చివరకు ఆమె శారీరక ఎదుగుదల గురించి కూడా ఆసక్తిగా చూపించేవాళ్ళు. క్లుప్తంగా చెప్పాలంటే మను జీవితాన్ని గాంధీజీ పూర్తిగా లాగేసుకున్నారు. గాంధీజీ సెక్రెటరీ ప్యారేలాల్ మనుని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ గాంధీజీ ఒప్పుకోలేదు.
(17:49) వయసు తేడా వల్ల కాదు మనునే తన చివరి ప్రయోగం కోసం వాడుకోవాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు కాబట్టి అక్టోబర్ 1946 దేశ విభజన మంటలు హిందూ ముస్లిం అల్లర్లుగా మారాయి. బెంగాల్లోని నకాలిలో మారణకాండ జరుగుతోంది. శాంతిని నెలకొలపడానికి గాంధీజీ అక్కడ గ్రామం నుంచి గ్రామానికి తిరుగుతున్నారు. ఆ సమయంలో ఆయన తన అనుచరులను వేరు వేరు గ్రామాలకు పంపించాల్సి వచ్చింది.
(18:10) దీనివల్ల ఆయన బ్రహ్మచర్య ప్రయోగాలకు ఆటంకం కలిగింది. దాన్ని పరిష్కరించడానికి ఆయన 19 ఏళ్ల మనుకి లేఖ రాసి నకాలికి పిలిపించుకున్నారు. గాంధీజీ నౌకాలీలో ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి తిరుగుతున్నప్పుడు మను ఎప్పుడు ఆయనతోనే ఉండేది. 1946 డిసెంబర్ 20న గాంధీజీ ఇంటర్ప్రెటర్ నిర్మల్ కుమార్ బోస్ చూసిన దృశ్యం ఆయన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది.
(18:34) గాంధీజీ తన 19 ఏళ్ల మనవరాలితో ఒకే పడకపై పడుకొని ఉన్నారు. దీనికి గాంధీజీ మనువుతో చెప్పిన కారణం ఏంటంటే మనం ఏ క్షణంలోనైనా ముస్లింల చేతిలో చనిపోవచ్చు. మనం అతి పెద్ద పవిత్ర బలిదానానికి సిద్ధంగా ఉన్నామని తెలుసుకోవడానికి మన పవిత్రతను చివరిసారిగా పరీక్షించుకోవాలి. అందుకే మనం నగ్నంగా కలిసి పడుకోవాలి. మను ఆయన మనవరాలు కాబట్టి ఆయన మాటలు నమ్మేసింది.
(18:56) గాంధీజీ తన సెక్రెటరీ పారేలాల్తో మాట్లాడుతూ నేను మనుకి తల్లి లాంటి వాడిని అమ్మాయి మనసు స్వచ్ఛంగా ఉంటే తన తల్లితో పడుకోవడానికి సిగ్గుపడాల్సిన పని లేదు అని సమర్ధించుకున్నారు. కానీ ఇది ఎంత విచిత్రం ఒక పక్క ఆ అమ్మాయికి తల్లిని అని చెప్తూనే మరో పక్క తన కామవాంచను కంట్రోల్ చేసుకోవడానికి ఆ అమ్మాయిని నగ్నంగా పడుకోబెట్టుకోవడం ఎంతవరకు సమంజసం.
(19:16) గాంధీజీని అందరూ సమర్థించలేదు. ప్రయోగాల వల్ల చాలా మంది ఆయనపై కోపంగా ఉన్నారు. ఆయన సెక్రెటరీ పరశురాం ఇంటర్ప్రెటర్ నిర్మల్ కుమార్ బోస్ ఆయను వదిలి వెళ్ళిపోయారు. హరిజన్ పత్రిక ఎడిటర్లు ఇద్దరు ఈ ప్రయోగాల గురించి తమ పత్రికల్లో రాయలేమని రాజీనామా చేశారు. గాంధీజీ సొంత కొడుకు దేవదాస్ నాన్న మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు అని లేఖ రాశారు.
(19:37) కాంగ్రెస్ లీడర్లు వల్లభాయి పటేల్, కృపాలాలి కూడా దీన్ని విమర్శించారు. మరి గాంధీజీ దీన్ని ఎలా జస్టిఫై చేసుకున్నారో తెలుసా? తాను ఒక మహా యజ్ఞం చేస్తున్నానని ఈ ప్రయోగాలు అందులో భాగమని చెప్పారు. ఇక్కడ లాజిక్ వెతకండి ఎందుకంటే గాంధీజీ తన బ్రహ్మచర్య ప్రయోగాన్ని అఖండ భారత్తో ముడిపెట్టారు. నేను నా కామవాంచను అదుపు చేసుకోగలిగితే ఆ శక్తితో జిన్నాను కూడా ఆపగలను అని నమ్మించారు.
(20:02) కానీ వాస్తవం వేరు జిన్నా ఆగలేదు. ప్రపంచం చూడని అతి పెద్ద వలసలు మారణకాండలు ఆగలేదు. దేశమంతా హింస జరుగుతుంటే తన ప్రయోగాల్లో మరింత పట్టుదల ఉంటే ఈ హింస ఆగిపోతుందని గాంధీజీ భావించారు. బయట హింస పెరిగే కొద్ది ఆయన తన పరీక్షను ఇంకా కఠినం చేసుకోవాలనుకున్నారు. దానికోసం ఇప్పుడు ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో అంటే 19 ఏళ్ల మను మరియు 18 ఏళ్ల ఆభాలతో కలిసి పడుకోవడం మొదలు పెట్టారు.
(20:27) చివరిదాకా ఇందులో లాజిక్ వెతికితే మీకు దొరకదు. గాంధీజీ ఉద్దేశం ఒక్కటే ఆయన సాక్షాత్తు దేవుడిలాగా మారాలనుకున్నారు అంతే కానీ ఆ మహిళల పరిస్థితి ఏంటి నాకు అనిపించేది ఒక్కటే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారు. గాంధీజీకి తెలియకుండానే అయినా సరే ఆయన ఆ మహిళలను తక్కువగా చూశారు. దేశసేవ కోసం సత్యాగ్రహులుగా మారడం కోసం ఆశ్రమానికి వచ్చిన ఆ మహిళలను గాంధీజీ తన వ్యక్తిగత ప్రయోగాల్లో ఎక్కించుకున్నారు.
(20:52) తాము ఒక గొప్ప నైతిక కార్యంలో భాగమవుతున్నామని ఆ మహిళలు బ్రమపడేలా గాంధీజీ చేశారు. కానీ వాస్తవానికి అక్కడ అలాంటి మిషన్ ఏం లేదు. ఇది కేవలం గాంధీజీ యొక్క ఒక విపరీతమైన ఆలోచనా ధోరణి మాత్రమే దీనికి అర్థం పర్థం ఉందంటారా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
(21:15) నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ [సంగీతం] వాచింగ్.

No comments:

Post a Comment