🌻ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌺
*భక్తుడు :*
ఒకరు ఒక విషయాన్ని ఒక విధంగా చెప్పగా, మరొకరు అదే విషయాన్ని వేరే విధంగా చెప్తారు! సత్యాన్ని నిర్ధారించేది ఎలా?
*మహర్షి :*
ప్రతివారూ వారి ఆత్మనే చూస్తారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ..... ప్రపంచాన్నీ, దైవాన్ని కూడా వారు ఉన్న స్థితిని బట్టే చూస్తారు.
ఒకసారి ఒక నాయనార్ దైవదర్శనానికి కాళహస్తికి వెళ్ళాడు. వారికి అందరూ శివుడుగా, శక్తిగా కనిపించారు. ఎందుకంటే తాను అట్టివాడే కనుక.
*ధర్మపుత్రుడు ( ధర్మరాజు )*
ఇలా భావించాడు ....
*ప్రపంచంలోని ప్రజలు అందరూ ఏదో ఒక విధంగా పుణ్యశీలురని, ఏదో ఒక కారణంగా తన కన్న గొప్పవారే.*
*దుర్యోధనుడు*
ఇలా భావించాడు ...
*ఈ ప్రపంచంలో ఒక్క మంచివాడు కూడా కనిపించటం లేదు.*
అదేవిధంగా , *ప్రతి వ్యక్తికి వారి వారి ప్రతిబింబమే ( స్వభావమే ) కనిపిస్తుంది.*
🌺ఓం తత్సత్🌻
No comments:
Post a Comment