*శ్రీ కావ్యకంఠ గణపతిముని (నాయన)*
"నాయన" అయ్యల సోమయాజులు గార్జు గణపతిశాస్త్రి గారు
"'నేను, నే' ననునది యెచ్చట నుండి వచ్చుచున్నదో విచారించిన యెడల, అది ఉదయించు స్థలమందే లీనమగును. అదియే తపస్సు. జపము చేయునప్పుడు మంత్రనాద మెచ్చట నుండి యుదయించు చున్నదని పరికించినచొ, అది యుధ్భవించు స్థలమందు పరికించు మనస్సు లీనమగును. అదియే తపము."
అని మితాక్షరములతొ తమ ఉపదేశవాణిని తమిళ భాషలో వెలువరించిరి.
అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి (నవంబరు 17, 1878 - జూలై 27, 1936) ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు మరియు ఆధ్యాత్మికవేత్త. రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడుగా వారి "జయంతి" (17 నవంబర్ 1878).
అయ్యల సోమయాజులు గారు జననం అయ్యల సోమయాజులు గారు
నవంబరు 17, 1878
విజయనగరం జిల్లా లోని కలవరాయి అగ్రహారం
మరణం జూలై 27, 1936, ఖర్గపూర్ రచయిత, జ్యోతిష పండితుడు, ఉభయ భాషా పండితులు
వసిష్ఠ గణపతి ముని అని ప్రసిద్ధులు
తండ్రి నరసింహశాస్త్రి; తల్లి నరసమాంబ.
అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి (నవంబరు 17, 1878 - జూలై 27, 1936) ప్రముఖ పండితుడు, జ్యోతిష్యుడు మరియు ఆధ్యాత్మికవేత్త. రమణ మహర్షి శిష్యులలో ప్రముఖుడు. ఆయన వసిష్ఠ గణపతి ముని అనీ కావ్యకంఠ గణపతిముని అనీ ప్రసిద్ధుడు. వారు పదియేండ్ల వయసు నండే తెలుగు, సంస్కృత భాషలందును, వేదములు, తర్క శాస్త్రము, గణిత శాస్త్రము, జ్యోతిష శాస్త్రము మరియు ఆయుర్వేదములో అసమాన ప్రతిభ చూపినారు.
వీరి యొక్క వాక్చాతుర్యము, సంస్కృత భాషా ప్రావీణ్యము మరియు అన్ని శాస్త్రములందును విశేష ప్రతిభతో - నవద్వీప మందు విద్వత్పరీక్ష లందు పాల్గొని ‘కావ్యకంఠ’ బిరుదమును పొందిరి. వివిధ ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు.
పుట్టు పూర్వోత్తరాలు
గణపతి శాస్త్రి విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతం విజయనగరం జిల్లా) లోని కలవరాయి అగ్రహారం లో నవాబు అయ్యల సోమయాజుల అనే ఇంటి పేరుగల బ్రాహ్మణుల కుటుంబంలో అయ్యన సోమయాజుల నరసింహశాస్త్రి, నరసమాంబ దంపతుల రెండవ సంతానంగా జన్మించాడు.వీరి అసలుపేరు అసలు పేరు సూర్య గణపతిశాస్త్రి.
వారు ఋగ్వేదులు, మరియు కౌండిన్యస గోత్రులు. సంస్కృతంలో జానకీ పరిణయం అనే కావ్యం రాసిన రామభద్ర దీక్షితులు ఈ వంశంలోని వాడే. ఈ వంశంలో పుట్టిన జగన్నాథ శాస్త్రికి మామ గారి ద్వారా గ్రామాధిపత్యము సంక్రమించింది. ఆయన కుమారుడు భీమశాస్త్రి. భీమశాస్త్రికి నరసింహశాస్త్రి, సర్వేశ్వర శాస్త్రి అనే ఇద్దరు కుమారులు కలిగారు.
నరసింహశాస్త్రి గ్రామానికి ఆధిపత్యం వహిస్తూ, ఆయుర్వేద, జ్యోతిష, మంత్ర శాస్త్రాలనందు ప్రావీణ్యం గడించి చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు సంపాదించాడు. ఈ వంశంలో శ్రీవిద్యాదీక్షను పొందిన వారిలో ఆయన ఐదవవాడు. ఆయనకు డుంఠి గణపతి, భార్యయైన సరసమాంబకు సూర్యుడు ఇష్టదేవతలు. వీరిరువురికి గణపతి ముని వరప్రసాదంగా జన్మించాడు. ఆరోఏట నుండి ఆయనలో అసాధారణ లక్షణాలు కనిపించసాగాయి.
పది సంవత్సరాలు వచ్చేసరికి జ్యోతిష, గణిత, మంత్రశాస్త్రాలపై పట్టు సాధించారు. పన్నెండేళ్ల వయసులో… ఎనిమిదేళ్ల విశాలాక్షితో వివాహం జరిగింది. తండ్రి నుండి పంచాక్షరితో సహా పన్నెండు మహా మంత్రాల ఉపదేశం పొందారు. పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి సకల శాస్త్రపారంగతుడై తాను కూడా ఋషులలాగ తపస్సు చేసి శక్తులను పొంది లోకాన్ని ఉద్ధరించాలనుకున్నారు. వీరు ఆనేక ప్రదేశములలో తపస్సు ఆచరించి మంత్ర సిద్ది పొందినారు.
తల్లిదండ్రులు వీరు గర్భంలో ఉండగానే కలిగిన కొన్ని దివ్య నిదర్శనాల వలన గణపతి దైవాంశ సంభూతునిగా భావించి వీరికి గణపతి అని నామకరణం చేశారు. పదేళ్ళ వయసులోనే మూడు కావ్యాలు రచించి కవిత్వం చెప్పేవారు. జ్యోతిశ్య శాస్త్రంలో పట్టు సంపాదించి పంచాంగ గణనలో ఒక నూతన పథకాన్ని కూడా రచించి గురువును మించిన శిష్యుడు అని పేరుపొందారు. వీరి పదవ ఏట తల్లి మరణించగా, పన్నెండవ ఏట వివాహమైనది. వీరు భార్యను ఉద్దేశించి 'భృంగ సందేశమ్' అనే సరస కావ్యాన్ని మందాక్రాంత వృత్తాలలో రచించారు. పదహారు సంవత్సరాలకు కావ్య శాస్త్రేతిహాస పారంగతుడును, ఉజ్జ్వల ఆశుకవి అయిన తండ్రి నుండి మహా మంత్ర దీక్షలచే తపస్సు చేయడానికి నాసిక్, భువనేశ్వర్ దివ్య క్షేత్రాలను వెళ్ళారు.
ఇరవై సంవత్సరాలకు గణపతి శాస్త్రి కవిత్వ ప్రజ్ఞలో పూర్వ కవులకు గల ప్రాభవాన్ని గడించారు. 1900లో విజిగీషతో నవద్వీప విద్వత్పరీక్షలకు వెళ్ళగా, అక్కడ సభలోని పరీక్షక వర్గం వారు ఇతని కవిత్వ ప్రజ్ఞా ప్రదర్శనను చూసి 'కావ్యకంఠ' బిరుదుతో అభినందించారు. 1903లో మద్రాసులో నారాయణ సుదర్శనునితో పోటీలో ఆరు నిమిషాలలో కావ్యకంఠుడు ఇరవై శ్లోకాలను రచించి బంగారు కడియాన్ని బహుమానంగా పొందారు. 1902లో అరుణాచల క్షేత్రం వెళ్ళినప్పుడు వీరు శివుని సహస్ర శ్లోకాలతో స్తుతించి అక్కడ అధ్యాపకునిగా కొంతకాలం పనిచేసారు. తరువాత వేలూరులో తెలుగు పండితునిగా దాదాపు నాలుగు సంవత్సరాలు నిర్వర్తించారు.
గణపతిముని నిర్యాణము తరువాత గుంటూరు లక్ష్మికాంతము గారు తరచూ భగవాన్ శ్రీ రమణ మహర్షి యొద్దకు వచ్చుచుండెడి వారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి.
స్వయముగా లక్ష్మికాంతమును ఆశీర్వదించి, పలు వ్యక్తులను కలిసి నిజ నిర్ధాణము చేసుకొని, ఈ జీవిత చరిత్రను వ్రాయమని ఆదేశించిరి. ఈ జీవిత చరిత్ర మొదట 1958 లో ప్రచురింపబడింది.
కావ్య కంఠ గణపతి ముని (1878-1936)
20 ఏళ్ళ వయస్సులోనె అన్ని శాస్త్రాల్లొ దిట్ట వారు.
గురుకులంలోని విద్యార్థులకు వంట వండి పెట్టడానికి ఒక నిమ్న వర్గానికి చెందిన వ్యక్తిని నియమిస్తాడు.
కుల ప్రాతిపదికన భేదాలు వేదాలు అంగీకరించవని చెప్పాడు.
బెల్గాం కాంగ్రెస్ సభలొ అస్పృశ్యత కు వ్యతిరేకంగా ఉపన్యాసమిచ్చాడు.
స్త్రీలకు ఆర్థిక,సాంఘిక, ఆధ్యాత్మిక హక్కులు పురుషులతో సమానంగా అందాలని కోరాడు.
కులాలవారిగా విడిపోయిన భారత దేశాన్ని, మళ్ళీ శక్తివంతం చేయమని భారత మాతను ప్రార్థిస్తూ ఒక శ్లోకం వ్రాశాడు.
1923 కాకినాడ కాంగ్రెస్ సభలో మాట్లాడుతూ సామాజిక అసమానతలు దేశ్ ఐక్యతకు మంచిదికాదని,కల్పిత శ్లోకాలతో మానవుల మధ్య అంతరాలు సృష్టించ వద్దని కోరుతాడు.
అంటరాని తనం మీద 89 సూక్తులు వ్రాసి కాంగ్రెస్ సభలో కరపత్రాలు పంచిపట్టాడు.
1927 లో భాగ్యనగర్ లో భాగ్య రెడ్డి వర్మ నాయకత్వం లో మాడపాటి హన్మంత రావ్ ఇంటి నుండి చాదర్ ఘాట్ ఆది హిందూ భవన్ వరకు కావ్య కంఠ గణపతి మునిని వూరేగించారు.వారి నిమ్న వర్గాల అభ్యున్నతికి చేసిన కృషికి గుర్తింపుగా వారికి ముని అనే బిరుదునిచ్చి గౌరవించారు.
మన భారత దేశ స్వాతంత్ర్య సంపాదనలో ప్రచ్ఛన్నపాత్ర పోషించిన మహా మహులెందరో కలరు.వారిలో శ్రీ భగవాన్ రమణ మహర్షి,శ్రీ కావ్యకంఠ వాసిష్ట గణపతిముని,శ్రీ అరబిందో వంటి వారు ముఖ్యులు.
శ్రీ గణపతిముని గారివంటి దేశ భక్తులు చాలా అరుదు.అమ్మా నాకేమీ అక్కరలేదు నా దేశ ప్రజల సంక్షేమమే నాకు ముఖ్యం అని అహర్నిశాలు వైదిక దేవత అయిన ఉమను ప్రార్ధించిన మహా తపస్వి శ్రీ కావ్యకంఠ వాసిష్ట గణపతిముని.
వారి ఉత్తమోత్తమ రచన "ఉమాసహస్రం"లో వారేమంటున్నారో చూడండి.
శ్లో||. జయతు జయతు భరత క్షోణీఖండం విషాద వర్జితమ్.
జయతు గణపస్తస్యక్షేమం విధాతు మనా మునిః
జయతు రమణస్తస్యాచార్యో మహర్షికులాచలో
జయతు చ తయోర్మాతాపూతా మహేశవిలాసినీ.
(ఉమాసహస్రం-34వ స్తబకము-24వ శ్లోకము).
No comments:
Post a Comment