Monday, September 23, 2024

 విశ్వామిత్రుడు మరియు వశిష్ఠ మహర్షి మధ్య శత్రుత్వానికి కారణం ఏమిటి? విశ్వామిత్రుడు బ్రహ్మర్షి ఎలా అయ్యాడు?
వశిష్టుడు బ్రహ్మర్షి. ఆయన కి ఎవరి మీద శతృత్వం లేదు. ఒక రోజు రాజు విశ్వామిత్రుడు అడవిలో వేట కి వచ్చాడు. వశిష్టుని ఆశ్రమం కి వచ్చారు. సైన్యం తో సహా తన అతిద్యం స్వీకరించమని ఋషి కోరారు. నందిని అని పేరు గల తన దేనువు కి చెప్పగా అందరికి కావలసినవన్నీ అమర్చింది. ఆ దేనువు ని తన కి ఇమ్మని రాజు అడిగాడు. తపస్సు లేని దగ్గర దేనువు ఉండదు అని ఇవ్వలేనని ఋషి చెప్పారు. రాజు దౌర్జన్యం గా తీసుకొని వెళ్ళబోగా నందిని శరీరం నుండి సైనికులు పుట్టి రాజు ని ఓడించారు. రాజు బ్రహ్మస్త్రం ఋషి మీద కి వేస్తే బ్రహ్మ దండం లో లీనమవుతుంది. ఎన్నో శాస్త్రాస్త్రాలు ఉన్నాయి విశ్వామిత్రుని వద్ద. అవన్నీ నిర్వీర్యం అయ్యాయి.

అందుకు కోపించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవడం కోసం తపస్సు చేసారు. మేనక వచ్చింది. 1000 సంవత్సరాలు చేసిన తపస్సు అంతా ఖర్చు అయిపోయాక వెళ్లి పోయింది. మళ్ళీ తపస్సు మొదలు పెట్టారు. రంభ ని పంపాడు ఇంద్రుడు. కోపించి రాయి కమ్మని శపించారు.1000 సం తపస్సు ఖర్చు అయిపొయింది. మళ్ళీ తపస్సు మొదలు పెట్టారు. ఈ సారి దేనికి లొంగలేదు. బ్రహ్మ గారు వచ్చి రాజర్షి లెమ్మని పిలిచారు. నేను బ్రహర్షి ని కావాలి. అని ఇంకా తపస్సు చేసాక బ్రహ్మ గారు వచ్చి బ్రహ్మర్షి లెమ్మని పిలిచారు. నన్ను బ్రహ్మర్షి అని వశిష్టుడు అనాలి. అన్నారు. వశిష్టుడు వచ్చి బ్రహ్మర్షి అంటే సంతోషించారు.

No comments:

Post a Comment