Tuesday, May 12, 2020

మే 9.. మహారాణప్రతాప్ సింహ్ జయంతి

మే 9..
మహారాణప్రతాప్ సింహ్ జయంతి
ఆదేశ భక్తుని గురించి మనం
కొద్దిగా తెలుసుకొందాం..
ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది. కనీసం 20 సంవత్సరాలుసాగిన యుద్దంలో ఆఖరికి అమెరికాని ఓడించింది. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అధ్యక్షునికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.

విలేకరి: ఇప్పటికీ అర్ధం కాని విషయమేమిటంటే,అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలిచారు??.
ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి అధ్యక్షుని సమాధానం

"అన్నీ దేశాలలోకెల్ల శక్తిశాలి అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు ,శ్రేష్టమైన దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని జీవనంనుండి ప్రేరణపొంది యుద్దనీతి ,ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్ధంలో గెలిచాము."

విలేకరి : ఎవరా భారతీయ మహారాజు?
వియత్నాం అధ్యక్షుడు - గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు. ”అతడే రాజస్తాన్ లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్”

మహారాణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పేటప్పుడు అతని కళ్ళలో వీరత్వం నిండి వెలుగు ఉన్నది.
ఇంకా ఇలా అన్నాడు
“ఒకవేళ అలాంటి రాజు
మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.”

కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు. అయితే అతని సమాధి మీద ఇలా రాశి ఉంది “ఇది మహారాణాప్రతాప్ యొక్క శిష్యుడి సమాధి అని రాసి పెట్టారు.

కట్ చేస్తే ..,.

కాలాంతరంలో వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహుల శ్రద్ధాంజలి ఘటించడానికి మొదట గాంధీ,నెహ్రూ సమాధులను అతనికి చూపించారు ఆ తరువాత ఎర్రకోట,ఇంకా,ఇంకా ఇలా చూపించారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు
“మహారాణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”.
ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి..... ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు.

విదేశాంగమంత్రి వెంటనే అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు ....
”ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది,
ఈ మట్టిని తీసుకెళ్లి
మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి మహారాజుని ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారాణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గవీరుడు అని అన్నాడు

మహారాణా ప్రతాప్
పేరు-కుంవర్ ప్రతాప్ జి.
జన్మదినం-9 మే,1540
జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్
పుణ్యతిథి-29 జనవరి,1597
తండ్రి – మహారాణా ఉదయ్
సింహ్ జి
తల్లి-రాణి జీవత్ కాంవర్ జి.
ధార్మికం-హిందూధర్మం
ప్రసిద్ధ యుద్ధం - హల్ది ఘాట్ యుద్దం
రాజధాని-ఉదయ్ పూర్.

అబ్రహం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి వచ్చేటపుడు
తన తల్లిని భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అన్నాడట.. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ను అక్బరు చక్రవర్తి " సగం భారత్ ను ఇస్తాం మేవాడ్ ఇచ్చేయమని ప్రలోభపెట్టినా ఆయన తన రాజ్య ప్రజల సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందట. కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయ్యింది.
ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” లో మనం చదువొచ్చు.

డిల్లీ చక్రవర్తి అయినటువంటి అక్బర్ మహారాణా ప్రతాప్ ని ఒకసారి తల దించి నా కాళ్ళ మీద పడితే సగం హిందూస్థాన్కి రాజుని చేస్తా అని ప్రలోభపెట్టాడు కానీ మహారాణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా తిరస్కరించాడు.

హల్దిఘాట్ యుద్ధంలో
మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో సమీకరించబడ్డాయి

హల్ది ఘాట్ యుద్దం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నేలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుధం దొరికింది.

మహారాణా ప్రతాప్ సింహ్ దగ్గర యుద్ద శిక్షణను
శ్రీ జైమల్ మేడతీయ ఇచ్చేవాడు. ఈయన 8000 మంది రాజపుత్రుల వీరులతో కలిసి 60000 మంది మొఘలులతో యుధ్ధం చేశారు. ఆ ఆయుద్ధంలో 48000 మంది చనిపోయారు.ఇందులో 8000 మంది రాజపుత్రులు 40000 మంది మొఘలులు...
మహారాణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట.
హల్ది ఘాట్ యుద్ధంలో
మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు .వాళ్ళు మహారాణాను
వారి పుత్రుడిగా భావించేవారు.మహారాణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నం లో ఒకపక్క రాజపుత్ మరొక పక్క భీల్ ఉంటారు.

మహారాణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెల్చుకున్నాడు.

మన దేశం వీరమాతలకు, వీరపుత్రులకు,దేశభక్తులకు,
వీరపత్నులకు మాత్రమే కాదు వీర,స్వామిభక్త జంతువులకు కూడా కొదువలేని పుణ్యభూమి.
అభేధ్యమైన యుధ్ధంలో శత్రువు దొంగ దెబ్బకు ఒక ముందరి కాలువిరిగిపోయి నప్పటికి తనమహారాజును శత్రువు చేతకి చిక్క కుండా 26 అడుగుల కందకం
ఒక్క ఉదుటన దాటి
తన రాజును రక్షించి ఆనందంతో ప్రాణాలను వదిలిన , శ్రీ మహారాణా ప్రతాప్ కి అత్యంత ఇష్టమైన “చేతక్”. అనే గుర్రం ఈ కోవకు చెందిందే.
అది ఎక్కడైతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది.అదే ప్రదేశంలో దాని గౌరవార్ధం చేతక్ మందిరం కట్టారు మహారాణా.
ఆ గుడి ఇప్పటికీ
సురక్షితంగా ఉంది.
చేతక్ ఎంత బలమైనదంటే ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి తన మహారాజు కత్తికి అందేలా అంతా ఎత్తులో గాలిలో ఎగిరేది అది కూడా మహారాణాతో పాటు సుమారు 250 కేజీల బరువుతో.....
ఆ బరువు ఏమంటే...
మహారాణా ప్రతాప సింహ్
యొక్క ఈటె 80 కిలోలు, మహారాణా ప్రతాప్ యొక్క బరువు 110 కిలోలు ,
చేతి కవచం,
శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి.
అతని చేతిలో రెండువైపులా పదునుతీరిన కత్తికలిపి
మొత్తం 270 కిలోలు.
ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్థుల సంగ్రహణాలయం లో ఉన్నాయి.....

మహారాణా ప్రతాప్ దగ్గర అతనికి ఇష్టమైన ఒక ఏనుగు కూడా ఉండేది.దాని పేరు రాంప్రసాద్.
అల్ బదౌని అనే రచయిత రాంప్రసాద్ ఏనుగు గురించి తన గ్రంథంలో రాసుకున్నాడు.
అక్బర్ బాద్షాహ్ మేవాడ్ మీద యుద్ధం చేసేటప్పుడు తన సైన్యానికి ఏమని ఆదేశించాడంటే. మహారాణా ప్రతాప్ తోపాటుగా రాంప్రసాద్ ఏనుగుని కూడా బందీగా పట్టుకుంటే సరిపోద్ది అని చెప్పాడట. రాంప్రసాద్ ఎంత బలం కలిగినదంటే ఆ ఒక్క ఏనుగు మొఘలుల 13 ఏనుగులని చంపిందట.అలాగే దాన్ని పట్టుకోవడానికి 7 పెద్ద ఏనుగులమీద 14 మంది నైపుణ్యం కలిగిన మావటిలు కూర్చుని ఒక చక్రవ్యూహం ప్రకారంగా దాన్ని బందీ చేశారట అని అల్ బదౌని తన రచనల్లో పేర్కొన్నాడు.
బందీని చేసిన రాంప్రసాద్ ని అక్బర్ ముందు నిలబెట్టగ
అది రాంప్రసాదు కాదు
పీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడు 18 రోజులవరకు దాణా తినకుండా,నీళ్ళు త్రాగకుండా తన ప్రాణాలు
వదిలింది. ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్ "నా ముందు ఈ ఏనుగుని
వంచలేకపోయాను మహారాణాను
ఎలా వంచగలుగుతా" అని అన్నాడట.

మన దేశంలో దేశభక్తుల్లో మనుషులతో బాటు చేతక్,రాంప్రసాద్ లాంటి జంతువులు కూడా ఉన్నాయని మనం గర్వించాలి...
జై మహారాణా...
భారతమాతకీజై
వందేమాతరం

No comments:

Post a Comment