Friday, May 8, 2020

అల్లూరి సీతారామరాజు గురించి మీకు ఇవి తెలుసా.

అల్లూరి సీతారామరాజు గురించి మీకు ఇవి తెలుసా.
..

👉 అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4 న వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు
👉 అసలు పేరు శ్రీ రామ రాజు.
👉 వీరి పూర్వీకులు గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో నివసించేవారు
👉 తరువాత తునికి వలస వెళ్లారు
👉 సీతారామరాజు గారి తండ్రి ఫోటోగ్రాఫర్ గా పనిచేసేవారు
👉 రామరాజు గారు ఆరవ తరగతిలో ఉండగా తండ్రి మరణించారు
👉 కుటుంబం ఆర్థికంగా చితికి పోయింది
👉 తుని లో ఉండగానే అడవులలో తిరుగుతూ గిరిజనుల కష్టాలను వింటూ ఉండేవారు
👉 ఎలా అయినా వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు
👉 రామరాజు గారు జ్యోతిష్యం హఠయోగం కవిత్వం సంస్కృతం ఆయుర్వేదం గృహవైద్యం అశ్వ శాస్త్రం గజ శాస్త్రం మంత్రపుష్పం మాల, రసాయన శాస్త్రంలో పండితులు
👉 ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తల్లి పాదాలకు నమస్కరించి మాత్రమే బయటకు వెళ్తారు.
👉గిరిజన ప్రజలకు కు వైద్యం చేసేవారు, సీతారామరాజుకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రజలు నమ్మేవారు
👉 తుని సమీపంలోని గోపాలపట్నం లో సీతమ్మ కొండపై శివునికై చాలాకాలం తపస్సు చేశారు
👉 అడవులలో నివసించే ప్రజలను బ్రిటిష్ వారు హింసించడం గమనించిన రామరాజు వారిని కాపాడడం కోసం ఇంటిని వదిలి శాశ్వతంగా అడవులలో నివసించేవారు
👉 కుటుంబము అనే బంధాలు ఏర్పడితే స్వాతంత్రోద్యమంలో త్యాగాలు చేయలేమని భావించి చిన్ననాటి నుంచి ఎంతో గాఢంగా ప్రేమించిన తన మేనమామ కూతురు సీతతో వివాహాన్ని విరమించుకున్నారు
👉 స్వాతంత్రోద్యమం కోసం వివాహం చేసుకోనని సన్యాసాన్ని స్వీకరించి సర్వసంగ పరిత్యాగి గా నిలిచారు.
👉 స్వాతంత్రోద్యమంలో బావకు తాను అడ్డు కాకూడదు మరియు బావ లేని జీవితం గడపలేక సీత ఆత్మహత్య చేసుకుంది
👉 అడవులలో ఆటవికుల మధ్య గడుపుతున్న రామరాజుకు ఈ విషయం తెలిసి... సీత త్యాగానికి గుర్తుగా తన పేరయిన శ్రీరామ రాజును.. సీతారామరాజు గా మార్చుకున్నారు
👉 అడవిలోని అమాయక ప్రజల మీద బ్రిటిష్ వారు సాగిస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటమే న్యాయమని భావించారు
👉 1922 ఆగస్టు 19న శివునికి మహారుద్రాభిషేకం చేసి చింతపల్లి పోలీస్ స్టేషన్ ముట్టడి తో తొలి విప్లవం ప్రారంభించారు
👉 భారత దేశాన్ని ఇక పరిపాలించ లేమని రూథర్ఫోర్డ్ బ్రిటిష్ మహారాణి కి లేఖ రాశారు అంటే సీతారామరాజు ఎంతటి వీరుడు అనేది అర్థం చేసుకోవచ్చు
👉 ఎందరో స్వాతంత్ర సమరయోధులను పొట్టనబెట్టుకున్న కాంగ్రెస్ సీతారామరాజు మీద కూడా తన కాంగ్రెస్ పత్రిక లో విషాన్ని వెదజల్లింది
👉 సీతారామరాజును అణచివేయాలని కథనాలను ప్రచురించింది
👉 అప్పట్లోనే సీతారామరాజును పట్టించిన వారికి పదివేల రూపాయలు బహుమానం ఇస్తామన్నా ఎవరు ముందుకు రాలేదు
👉 దానితోటి ఇ అమాయకులైన వందలాది ప్రజలను బంధించి సీతారామరాజును ఒంటరిగా రావాలని లేదంటే అమాయకులైన ప్రజలను సజీవదహనం చేస్తామని ఆంగ్లేయులు బెదిరించారు
👉 దానితో ఒంటరిగా వెళ్లిన సీతారామ రాజును చూసి చేతిలో తుపాకీ ఉన్న సైనికులు సైతం భయపడ్డారు
👉 1924 మే 7వ తేదీన 27 సంవత్సరాల పిన్న వయసులో సీతారామరాజు భరత మాత ఒడిలో చేరారు



" సీతారామ రాజు లాంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధున్ని పొగిడే అదృష్టం ఇచ్చినందుకు భరత మాతకు ధన్యవాదాలు. యువత రామరాజులోని పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలి..
- నేతాజీ సుభాష్ చంద్రబోస్

విప్లవ వీరుడు సీతారామ రాజు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ...🙏🏻

భారత్ మాతాకీ జై

No comments:

Post a Comment