Sunday, May 24, 2020

మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్న మూర్ఖులం... నిజానికి మనం రోజూ కొద్దీ కొద్దీ గా మరణిస్తున్నాం.


మన శరీరం లోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో....మలినంగా బయటికి వెళ్లిపోవాలి.లేక పోతే జబ్బులు.

మన శరీరం లోకి వెల్లిన నీరు 4 గంటల్లో బయటికి వెళ్లిపోవాలి. లేకపోతే....జబ్బులు

మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా బయటికి వెళ్లిపోవాలి...లేకపోతే..మనం రోగ గ్రస్థులం అవుతాం..

మరి మనలోకి చేరిన కోపం, అసూయ, ద్వేషం,....మోసం...ఇలాంటివన్నీ సంవత్సరాలుగా మనలోనే ఉంటే....ఏమౌతుందో తెలుసా...

మనం నిత్య రోగగ్రస్తులుగా అవుతాం.
ఓషో అంటాడు..."మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్న మూర్ఖులం... నిజానికి మనం రోజూ కొద్దీ కొద్దీ గా మరణిస్తున్నాం.

మనకు వయసు పెరిగితే...ఆయుష్షు తగ్గినట్టా ,పెరిగినట్టా?...మనం ప్రతి రోజూ...నెగెటివ్ ఎనర్జీ లతో కొద్ది కొద్దిగా మరనిస్తున్నామన్న చేదు నిజాన్ని త్వరగా గ్రహించాలి.

మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని....మన జీవితాల్ని మృతప్రాయం చేస్తున్న కోపాన్ని,ఒత్తిడిని,ద్వేశాన్ని, బద్ధకాన్ని ,అనారోగ్యాన్ని....ప్రతి రోజూ ధ్యానం , యోగ చెయ్యడం ద్వారా ప్రాణ శక్తిని ఎక్కువగా పొంది దూరం చెయ్యాలి.

మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణ శక్తిని చేర్చే ఏకైక మార్గం యోగమే...

అందుకే భారతీయ ఋషులు యోగ మార్గాన్నే అనుసరించారుగానీ.....ఏవో దిక్కుమాలిన వ్యాయామ పద్దతుల్ని కాదు.

రోజూ అర గంట...యోగ , ధ్యానం చెయ్యండి...జీవితాన్ని రోజూ జీవించండి.

No comments:

Post a Comment