_*"అసలు దైవానుగ్రహాన్ని కోరుకోవటం ఏమిటి ?*
*తద్వారానే ఎలాంటి ప్రయోజనాలైనా కలుగుతున్నాయని నిర్ధారణ అవుతుంది !?"*_
_*దైవానుగ్రహం ఎందుకంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్న బాధ, కష్టం లేకుండా పోవాలని.*
*ఎవరైనా భగవంతుని అనుగ్రహం కావాలనే పూజలు, జపాలు, తపాలు ఆచరిస్తారు.*
*అయితే...*
*భగవంతుడు సూచించిన విధంగానే ఉండగలిగితే దైవానుగ్రహం సులభంగా లభిస్తుంది.*
*ప్రాపంచిక విషయాలతో పరిమిత బంధమే దైవం సూచించే జీవనవిధానం.*
🕉 *దైవాన్ని విశ్వసించటం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి మనం కోరిన కోరిక తీరటం. రెండవది మన కోరికలు తీరటం మన చేతిలో లేదన్న సత్యం అర్థం కావడం.*
*మనకు సాధ్యంకాని విషయాల్లో మాత్రమే దైవానుగ్రహాన్ని కోరుతాం. సాధ్యమయ్యే విషయాల్లో దైవాన్ని తలుచుకోనుకూడా తలుచుకోము. అంటే మనకు సాధ్యమవుతున్న పనులన్నీ మన ప్రతిభాపాటవాలతోనే నెరవేర్చుకుంటున్నామన్న భావన కలుగుతుంది.*
🕉 *నియమబద్ధమైన దీక్ష జీవనంద్వారా మన ప్రతిపనిలోనూ దైవానుగ్రహం ఎలా ఇమిడివుందో తెలుస్తుంది.*
*మన కోరికలు తీరడం, తీరకపోవడం రెండూ భగవంతుని దయాతోనే జరుగుతున్నాయని అర్ధమైతే మనసు శాశ్వత శాంతిని పొందుతుంది. !*
_*సాధనంతా ఆత్మగా మారటానికి కాదు.. అనాత్మభావన పోవటానికే !''*-
No comments:
Post a Comment