🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 👏
🚩🚩నమః శుభోదయం 🚩🚩
విమలానంద బొడ్ల మల్లికార్జున్.
*అహంకారం*
"నిత్య వికాసమే జీవితం. ఆహంకారం, సంకుచితత్వమే మరణం. సుబాలకై ఆరాటపడుతూ స్వలాభం ఆహమే పరమావధిగా సుప్తావస్థలో జీవించే స్వార్ధపరుడికి నరకంలోనే స్థానం అన్నది ఉపనిషత్ వ్యాఖ్య నేను, నాది నావారు, పెరవారు అనే భావన చాలా ప్రమాదకరమని ఉపనిషత్తులు తెలియజెబుతున్నాయి.
స్వార్ధపరత్వమే అహంకారానికి ప్రాతిపదిక. పురాణాల్లో, ఇతిహాసాల్లో, చరిత్రపుటల్లో అహంకారంతో విర్రవీగినవారి గురించి చదువుకొని తెలుసుకున్నాం.
అయినా అహంకరిస్తూనే ఉన్నామంటే మనిషి ఎంత బలహీనుదో అర్థం అవుతుంది. రామాయణం చదివి, రావణుడిలా ప్రవర్తించే మానవులనెందరినో మనం చూస్తూనే ఉన్నాం.
శ్రీకృష్ణుడి గురించి తెలిసి కూడా అసూయా ద్వేషాలతో ప్రవర్తించి అసువులు బాసిన శిశుపాలుడు అసూయా గర్వాలకు మరో పేరు అయినా ఈ మానవ సమాజంలో శిశుపాలుడి లాంటివారు నేటికీ కనిపిస్తూనే ఉన్నారు.
మంచి చెప్పేవారే మనవారు. మన మేలుకోరేవారు నిస్వార్ధపరులు, మనం చెడిపోతే సంతోషించేవారు. స్వార్ధపరులు. ఇలాంటివారిలోనే అహంకారం. నిండి ఉంటుంది. ఫల్గుణుడు, శ్రీకృష్ణుడు ఎంతోకాలం సన్నిహితులుగా మెలిగారు. రణరంగం మధ్యలో రధాన్ని నిలిపి గీతను బోధిస్తున్నప్పుడు పార్ధసారథి తన చెలికాడే కదా... ఈయన చెప్పేది తానెందుకు కౌంతేయుడు భావించి వినాలని ఉంటే బహుశా మహాభారత యుద్ధం సంభవించేదే కాదేమో! ధీరులు అంటే కండబలం ఉన్నవారు. కానేకాదు. సమర్ధులై, వివేకం కలిగినవారే ధీరులు. సమర్ధత ఉంటే కార్యసాధకులవుతారు. అశోకుడి జీవిత చరిత్ర గమనిస్తే చకితులం అవుతాం. కండ బలంకన్నా అతడి మస్తిష్కం గొప్పది. అందువల్ల అతడెన్నో యుద్ధాలను జయించగలిగాడు. అతడి బలహీనత రాజ్యకాంక్ష, ఆలోచనలు మాత్రం గొప్పవి. జయాపజయాలు ఇహానికి సంబంధించినవని శాంతిలోనే ధర్మం ఉందని గ్రహించాడు. అందుకే కళింగ యుద్ధంలో విజయం సాధించిన అనంతరం వివేకం మేలుకొని గౌతమ బుద్ధుడు చెప్పిన పథంలో నడిచాడు.
సమర్థులైన కార్య సాధకులను అదృష్టం వరిస్తుంది. దిగంతాలను తాకే ధైర్యోత్సాహాలతో భగీరథుడిలా సర్వుల మేలు కొరకు ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారు అద్భుతాలను సుసాధ్యం చేయగలరు. బలవంతుడ నాకేమని పలువురితో అహంకరిస్తూ పలకడం మేలుకాదు... ఎందుకంటే బలవంతమైన సర్పం చలిచీమల పాలబడి మరణిస్తుందని బద్దెన భూపాలుడు చెప్పనే చెప్పాడు. మాలిన్యాలతో కూడి చంచలమైన అసూయతో కూడిన మనసు నుంచి అహంకారాన్ని పారదోలాలి. మరుక్షణం ఆత్మదేవుడు మన హృదయంలో స్వయానా ప్రభువై విరాజిల్లుతాడు. తత్వ విచారణ కారణంగా ఆత్మ అనే జ్యోతి ప్రాప్తించి సమస్త దోషాలు తొలగిపోతాయని భర్తృహరి చెప్పాడు.
మనం మంచిని సాధన చేస్తే మంచివాళ్లమే అవుతాం. అనవసరంగా అహంకరిస్తూ. అసూయతో జీవిస్తే శక్తిహీనులమవుతాం. మోహన్దాస్ కరంచంద్ గాంధీ బక్కపలచనివాడు. కానీ.. మహా తేజోవంతుడు. ఆత్మబలాన్ని ఉదృతం చేసుకొని లక్షలాది ఆంగ్లేయులతో శాంతియుద్ధం చేశాడు. చివరకు మువ్వన్నెల జెండా ఎగరనే ఎగిరింది. సౌశీల్యంతో శక్తిని సంతరించుకున్న సంకల్పబలమే దీశక్తి,
అహంకారం లాంటి అగ్ని మరొకటి లేదు. ద్వేషం లాంటి భయానక జ్వాలకు ఆదే కారణం, గుణాల్లో కెల్లా ఉత్తమమైంది ప్రేమ అందరినీ ప్రేమించగలిగితే బహం అనేదే ఉండదని బుద్ధుడి బోధ.
అహం అసహనానికి కారణం అయితే, ప్రేమ సుగుణాలకు మూలం. ప్రేమ అనే యశస్సు ముందు ఆహం ఆపకీర్తి పాలవుతుంది.
జై గురుదేవ్
No comments:
Post a Comment