Tuesday, January 10, 2023

****🌹మోహక్షయమే మోక్షం🌹

 🔱🏵️🏵️🏵️🏵️🏵️🏵️🔱

🌹మోహక్షయమే మోక్షం🌹
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

సనాతన ధర్మం పునాదులే స్థితప్రజ్ఞత, వైరాగ్యం, మోక్షం.

‘సుఖ దుఃఖే సమేకృత్వా లాభాలాభౌ జయాజయౌ- సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమానంగా భావించడమే స్థితప్రజ్ఞత’ అని గీతాచార్యుడు పేర్కొన్నాడు. స్థితప్రజ్ఞత కన్నా ఉన్నత మానసికస్థితి వైరాగ్యం. స్థితప్రజ్ఞత స్వీయ అనుభవానికి ప్రతిస్పందన. వైరాగ్యం.. బాహ్య వస్తువుల పట్ల, సంఘటన పట్ల విముఖత. రాగద్వేషాలు లేకుండటమే వైరాగ్యం. ఇక మోక్షం అనేది స్థితప్రజ్ఞతను, వైరాగ్యాన్ని మించిన అత్యున్నత మానసికస్థితి. మోక్షం అంటే జన్మ రాహిత్యం అనే ఒక బలీయమైన నమ్మకం. నిజానికి మోక్షం అంటే ఏమిటో మండనమిశ్రునితో జరిగిన వాదనలో ఆదిశంకరాచార్యులు తేల్చిచెప్పాడు. ‘మోక్షం.. శాశ్వతమైన ఆనంద స్వరూపం. ముక్తి అంటే క్రియా రూపులేని పరమతత్వం. మోక్షం ప్రాప్య వస్తువు కాదు. సర్వదా సిద్ధమైనది. తానే ‘పరబ్రహ్మ స్వరూపం’ అన్న దృఢజ్ఞానం కలిగి ఉండటమే మోక్షం. జ్ఞానం వేరుగా, ముక్తి వేరుగా లేవు. జ్ఞానంతో కైవల్యం లభించడం అంటే ఇదే. బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాతే మోక్షం కలుగుతుందని వేదాంతాలు బోధిస్తున్నా యి’ అని వివరించాడు శంకరాచార్యులు.

బ్రహ్మజ్ఞానంతో మోక్షాన్ని అనుభవించే సాధకుడు తాను పరబ్రహ్మ స్వరూపం గా మారి బ్రహ్మానందాన్ని పొందుతాడు. అదే బ్రహ్మీస్థితి. అదే అపరోక్షాను భూతి. ఈ విషయాన్ని అష్టావక్రుడు జనకుడితో

‘దేహం కంటే ఆత్మ వేరని విచారించి, తెలుసుకుని.. ఆత్మలోనే మనసును లగ్నం చేస్తే సుఖశాంతులను పొందవచ్చు. ఎంతవరకు ఈ పరస్పర అధ్యాస (మిథ్యా జ్ఞానం) నాశనం కాదో అంతవరకు జీవుడు బందీగానే ఉంటున్నాడు. అధ్యాస గ్రంథి ఎప్పుడు తొలగిపోతుందో ఆ క్షణమే జీవుడు ముక్తి పొందుతాడు’ అని పై శ్లోకానికి భావం.

మోక్షస్య న హి వాసో�సి గ్రామాన్తరమేవ వా
అజ్ఞాన హృదయ గ్రంథినాశో మోక్ష ఇతి స్మృతః॥

‘మోక్షమనేది లోకాంతరంలో ఉండేదో లేదా ఇంటి లోపలగాని, గ్రామంలోగాని ఉండేదో కాదు! మరెక్కడ ఉందది, అజ్ఞానంతో నిండిన కర్తృత్వ, భోక్తృత్వ భావన అనే చిత్‌జడ గ్రంథి నాశనమే ముక్తి’ అని తేల్చింది శివగీత. ఇక భగవద్గీత మోక్షసన్యాస యోగంలో ‘ఆత్మను యథార్థ రూపంలో తెలుసుకున్న వాడు వెంటనే మోక్షస్థితిని పొందుతాడు. సమస్త కర్మలను ఆచరిస్తున్నప్పటికీ, ఆత్మను శరణుపొందిన భక్తుడు శాశ్వతమైన, అవ్యయమైన మోక్షాన్ని అనుభవిస్తాడు’ అని శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు.

మోక్షం అనగా !!

దేహస్య మోక్షో నో మోక్షో న దండస్య కమండలోః
అవిద్యా హృదయగ్రన్ధిమోక్షో మోక్షో యతస్తతః

మోక్షం అంటే ఏమిటో ఈ శ్లోకంలో జగద్గురువులు శంకరభగవత్పాదులు తన వివేక చూడామణి లో వివరించారు. 
దేహాన్ని విడిచిపెట్టడం మోక్షమా కాదు,

మోక్షో న దండస్య కమండలోః ... 
అంటే జీవితపు చరమాకంలో ఇంక పొందటానికి కానీ కోల్పోవడానికి ఏమీ లేని సమయంలో దండ కమండలాలు పట్టుకుని సన్యాసాశ్రమంలో చేరటమూ మోక్షం కాదు!!..

మోహక్షయమే మోక్షం !!...
మన లోపలి మొహాన్ని తొలగించి, సర్వాంతర్యామి ని ఆశ్రయించి, సర్వం ఆయనే అని తెలుసుకోవడం, 
హృదయంలోని మాలీన్యాన్ని తొలగించి, ప్రేమను పెంచుకోవాలి...

అవిద్యా హృదయగ్రన్ధి మోక్షం,
మన హృదయన్ని అంటి పెట్టుకున్న అవిద్య అహం అనే చిక్కుముడుల నుండి విముక్తి పొందటమే మోక్షం!!...
ఇదంతా ఎలా సాధ్యం !!... 
కేవలం దైవానుగ్రహం మన సాధనా వున్నపుడే సాధ్యమవుతుంది!!!..

 అలాంటి నిర్వికార, నిరంజన మనోస్థితే మోక్షం. దానిని అనుభవించేవాడే ముముక్షువు. భారతీయులలో సనాతన రుషులు మొదలుకుని ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షిలాంటివారు కోకొల్లలు ఉన్నారు.

🌹సర్వేజనాసుఖినోభవంతు 🌹

No comments:

Post a Comment