*శూర్పణఖే త్రివక్ర ...!!*
*ఆనందగురువు అనే దేవర్షి యొక్క కుమార్తె ‘సుముఖి.’*
*ఆమె తన తండ్రి వద్ద శిష్యరికం చేస్తున్న ‘శంఖచూడుడ’నే యువకుని ప్రేమించింది.*
*కానీ గురుపుత్రిక కావడం వలన ‘శంఖచూడుడు’ ఆమె ప్రేమని నిరాకరించాడు. దానితో అతనిపై పగపట్టిన ‘సుముఖి’ అతని మీద లేనిపోని నిందలు వేసింది.*
```
కుమార్తె మాటలను నమ్మిన గురువు గారు ‘శంఖచూడుడు’ని తండ్రి వద్ద ఫిర్యాదు చేశాడు.
నిజానిజాలు గ్రహించకుండా గురువుకి అపచారం చేసాడనే అభియోగంతో తన పుత్రుని కాళ్ళు, చేతులు నరికించాడు అతని తండ్రి.
మరణావస్థలో భూమి మీదకు కూలిపోయిన శంఖచూడుడు “న్యాయ విచారణ జరపకుండా శిక్షించడం న్యాయమా? ధర్మమా?” అని ఆక్రోశించాడు అడిగాడు.
ఆ సమయంలో భూభారాన్ని మోస్తున్న ఆదిశేషువు వెలుపలికి ప్రత్యక్షమై “శంఖచూడా! విచారించకు. నీమీద అపనిందలు వేసిన సుముఖిని నేను శిక్షిస్తాను” అని అభయమిచ్చాడు.
మరుజన్మలో శంఖచూడుడు రావణుని సోదరుడు విభీషణునిగా జన్మించాడు. అతని చెల్లెలు శూర్పణఖగా ‘సుముఖి’ జన్మించింది.
ఆదిశేషువు లక్ష్మణుని గా జన్మించి వనవాస కాలంలో తనను కామించి వచ్చిన శూర్పణఖ ను దండించి నీతిని నిలబెట్టాడు.
శూర్పణఖ దానవకులంలో జన్మించినా అత్యంత సౌందర్యవతి. ఆమె నిజంగానే శ్రీరాముని ప్రేమించింది. కానీ శ్రీరాముడు ఏకపత్నీ వ్రతుడైనందున ఆమె ప్రేమను తిరస్కరించాడు.
ఇది పూర్వజన్మల పాప కర్మల ఫలితం. రామావతారంలో రాముని ప్రేమను పొందలేని శూర్పణఖ కృష్ణావతారంలో ప్రేమను పొందినది. రామావతారంలో నిరాకరించిన
శ్రీ రాముడు కృష్ణావతారంలో , గోకులంలో ఆమె ప్రేమను స్వీకరించాడు....
అది ఏవిధంగా జరిగిందంటే దుష్టుడైన కంసుని వధించడానికి మధురానగరానికి వచ్చిన బలరామకృష్ణులు ముందుగా కలసినది పూలమాలలు కట్టి అందరికి ఇచ్చే ‘త్రివక్ర’ అనే అందవికారమైన స్త్రీని.
త్రివక్ర పువ్వులు మాలలు కట్టి కంసుని భవనంలో విక్రయించేది.
ఆమె శ్రీకృష్ణుని గురించిన వృత్తాంతమంతా తెలుసుకుని శ్రీరాముడే… శ్రీకృష్ణుడని గ్రహించి అతనే తన ప్రాణ నాయకుడని భావిస్తూ పూజించసాగింది.
ఆమె ప్రేమకు, భక్తికి కట్టుబడిన కృష్ణుడు ఆమెను అనుగ్రహించాడు. లక్ష్మణునిగా రామావతారంలో శూర్పణఖని శిక్షించిన బలరామునికి అన్ని విషయాలు మరొకసారి గుర్తుచేసి కృష్ణుడు త్రివక్రకు మోక్షం అనుగ్రహించాడు...✍️```
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment