Tuesday, October 15, 2024

 అయ్యో! రావణ భక్తులారా అసలు విషయం తెలుసుకోండి...
పర రాజ్యపహరణం పర
ధనాపహరణం పర ధారాపహరణం... అంటే ఇతరుల రాజ్యాన్ని ఇతరుల ధనాన్ని ఇతరుల భార్యల్ని అపహరించడం నా ధర్మం అని రావణాసురుడు చెప్పుకున్నాడు... పూర్తిగా తెలియకుండా ఇటీవల కాలంలో రావణ భక్తులు ఎక్కువైపోయారు. కొన్ని పిచ్చి సినిమాల కారణంగా విలన్లకు హీరో పాత్రలు వేస్తున్నారు. రావణుడు రాక్షస రాజని మా వంశస్థుడని మురిసిపోతున్నారు. రావణాసురుడు రోజు ఈ సో కాల్డ్ విదేశీ మానస పుత్రులు వ్యతిరేకించే బ్రాహ్మణైజేషన్ కి చెందిన బ్రాహ్మణుడు అన్న విషయం ఒక్కసారి రామాయణం చదివి తెలుసుకోండి. ఇంకొందరు రావణాసురుడు ద్రావిడు డు అని వాదిస్తుంటారు. అది తప్పు. రావణబ్రహ్మ జన్మస్థలం నోయిడా. మండోదరి మీరట్లో పుట్టింది. ఇది సగం సగం నాలెడ్జి...
రావణాసురుడు సీతమ్మవారిని సురక్షితంగా అశోకవనంలో దాచాడని పిచ్చి ప్రచారం చేస్తుంటారు. పుంజిక స్థల అనే బ్రహ్మపుత్రికను దేవలోకంలో వెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తే బ్రహ్మ రావణుడి వరాలకు బ్రేక్ ఇస్తూ నీకు ఇష్టం లేని స్త్రీని నీవు ముట్టుకున్నట్టయితే తలో పగిలి చచ్చిపోతావని చెప్పాడు. అందువల్ల సీతమ్మవారిని ముట్టలేదు గాని మిగతా 100 మందిని  బెదిరించి ఒప్పించి తెచ్చుకున్న విషయం గురించి ఈ అజ్ఞానులకు అసలు తెలియదు. ఈ శాపం కారణంగా సీతమ్మవారిని చెరపట్టలేదు గాని లేకపోతే ఒక సంవత్సరం రావణాసురుడు ఆగేవాడు కాదు. దానికి కూడా సీతమ్మని ఎంతో ప్రలోభ పెట్టడానికి బెదిరించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. హనుమంతుడు లంకకు వచ్చి లంకను కాల్చాక సభలో చంపేయమని ఈ సోకాల్డ్ శాంతి దూత రావణాసురుడు ఆర్డర్ వేశాడు. అక్కడ ధర్మం ప్రస్తావన చేసి ఆ శిక్షను తగ్గించింది విభీషణుడు. ఇది వీళ్లకు తెలియక ఆయన ఏదో ధర్మాత్ముడు అని పిచ్చి ప్రేలాపనలు. ఇక శూ ర్పనఖ ను ముక్కు చెవులు కోసినందుకు వీలు తెగ బాధ పడిపోతున్నారు. ఇది అంతులేని అజ్ఞానమే. అడవిలో ప్రశాంతంగా ఉన్న రాముని జీవితంలోకి వచ్చి సీతను గురించి అనేక నిందలు వేసి రాముని పెళ్లి చేసుకోమని అడిగి విఫలమై లక్ష్మణుడు దగ్గరికి వెళ్లి అక్కడ విఫలమై సీతపై పడి చంపడానికి వెళ్ళింది. అప్పుడు రాముడు దుష్టులతో ఎక్కువసేపు వేళాకోళం ఆడకూడదని లక్ష్మణుని పురమాయించాడు. మీ ఇంట్లో మీ స్త్రీల పైకి ఇలాగే ఎవరైనా వస్తే ఏం చేస్తారో... అంతేగాక శూర్పనఖ ఖరుడితో రావణబ్రహ్మతో ఏం మాటలు మాట్లాడిందో ఒక్కసారి రామాయణం చదువుకోండి. అంగదున్ని రాయబారానికి పంపిస్తే అతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు రావణుడు. విభీషణుడు కుంభకర్ణుడు ఇద్దరు మంచి మాటలు ఎన్ని చెప్పినా రావణుడు వినలేదు. విభీషణుడు అధర్మం వైపు ఉండలేనని వానర సైన్యం లోకి వెళ్ళాడు. కుంభకర్ణుడు తప్పని పరిస్థితుల్లో అన్నకు కృతజ్ఞతగా యుద్ధంలో నిలబడి చచ్చిపోయాడు. ఇదంతా వాస్తవం.@@@@
మరి రాముడు...
లక్ష్మణుడు లేకపోతే తను జీవించలేనన్నాడు... సాధారణమైన వానరులను సైన్యంగా మార్చి అంత పెద్ద రావణుడిపై తలపడ్డాడు. శార్దూలుడు శుకుడు సీక్రెట్ ఏజెంట్స్ గా వచ్చిన వాళ్ళని ఏమీ చేయకుండా పంపించారు. ఇది రామధర్మం... రావణ దహనంలో ఎవరికి వ్యక్తిగతంగా రావణాసురుడిపై పగలేదు. కానీ ధర్మం అధర్మం అనే దృష్టితో చూసినప్పుడు సమాజానికి ఇవ్వాల్సిన సందేశాన్ని రావణ వధ ద్వారా తెలియజేస్తారు.. ఇంతకన్నా ఎక్కువ ఊహించుకోకండి

No comments:

Post a Comment