🎻🌹🙏 మన మహర్షుల చరిత్రలు..
🌹🙏ఈరోజు 54, వ మతంగ మహర్షి గురించి తెలుసుకుందాము..🙏🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌹మతంగ మహర్షి : 🌹
🌿పూర్వం గౌతమ మహర్షి వంశంలో ఒక బ్రాహ్మణుడికి పుట్టినవాడు మతంగ మహర్షి .
🌸తండ్రి వేదశాస్త్రాలు యజ్ఞానికి సంబంధించిన పన్లు అన్నీ నేర్పాడు . ఒకనాడు తండ్రి పనిమీద పంపిస్తే వెడుతూ దార్లో ఒక గాడిదపిల్లని కొట్టాడు మతంగుడు .
🌿అది ఏడుస్తూ తల్లికి చెప్పింది . వాడు పూర్వజన్మలో పాపపు పన్లు చేశాడు అందుకే ఇప్పుడు కూడా అదే చేశాడు అంది తల్లి .
🌸మతంగ మహర్షికి అన్ని జాతుల భాషలు వచ్చు . గాడిద చెప్పింది విని దాని దగ్గరకెళ్ళి నువ్వు శాపం వల్ల గాడిదవయినట్లున్నావు .
🌿నేను పూర్వజన్మలో ఎవరినో నీకు
తెలుసా ? అని అడిగాడు . నువ్వు బ్రాహ్మణ స్త్రీకి , మంగలివాడికి పుట్టావు అందుకే నువ్వు హింస చెయ్యగలిగావు అంది .
🌸మతంగుడు తండ్రికి జరిగిందంతా చెప్పి తపస్సు చేసుకునేందుకు వెళ్ళి కొన్నివేల సంవత్సరాలు తపస్సు చేశాడు .
🌿ఇంద్రుడు వచ్చి ఏం కావాలన్నాడు . బ్రహ్మ విద్వర్యుడ్ని కావాలన్నాడు మతంగుడు .
🌸అది అంత తేలిక కాదు . ఇలాంటి తపస్సుకు పదిరెట్లు ఎక్కువచేస్తే ఛండాలుడుగా పదివేలరెట్లెక్కువ చేస్తే ఛండాలుడు సూద్రుడుగానూ ,
🌿నూరు రెట్లెక్కువ చేస్తే సూద్రుడు వైశ్యుడిగానూ , దానికి వెయ్యి రెట్లెక్కువ చేస్తే వైశ్యుడు క్షత్రియుడుగానూ , క్షత్రియుడు బ్రాహ్మణుడుగాను ,
🌸బ్రహ్మణ నియమాలు పాటించి శమ , దమ , సత్య హింసలచేత , ఈర్యలేకుండా వుండి ఇంతకంటే లక్షరెట్లు ఎక్కువ తపస్సుచేసి ఎన్నో జన్మలెత్తుతే గాని బ్రహ్మవిదుడవుకాలేవని చెప్పాడు ఇంద్రుడు .
🌿మతంగుడు పట్టువదలని విక్రమార్కుడిలాగా కాలిబొటనవేలొక్కటే నేలమీదుంచి మరో వంద సంవత్సరాలు తపస్సు చేశాడు .
🌸మళ్ళీ ఇంద్రుడొచ్చి నీ కెంత చెప్పినా అర్ధం కావట్లేదు . కాబట్టి ఈ జన్మనుంచి రెండవ జన్మకి బ్రహ్మ విదుడయ్యేలా వరమిస్తున్నాను . ఇంక తపస్సు ఆపమన్నాడు .
🌿ఇంద్రుడి వరాలు పొందాక మాతంగుడు పెళ్ళి చేసుకుని ప్రసన్నుడనే వాడికి తండ్రి అయ్యాడు . కొంతకాలం తర్వాత ధర్మవ్యాధుడనే చెంచురాజు కూతురు అర్జునకిచ్చి ప్రసన్నుడికి పెళ్ళి జరిపించాడు .
🌸మతంగుడు తల్లి చచ్చిపోయిన ఒక ఏనుగు పిల్లని తెచ్చి పెంచుతున్నాడు . అది కూడా కొంచెం పెరిగాక మతంగ మహర్షిని తండ్రిలాగ గౌరవిస్తూ తొందరగా పూజకి కావల్సిన సామాన్లు తీసుకురావడం ,
🌿నీళ్ళు తెచ్చి ఆశ్రమం శుభ్రం చెయ్యడం అన్ని చెస్తోంది . ఇంద్రుడు మారు రూపంలో వచ్చి మతంగ మహర్షిని ఏనుగుని నాకియ్యి . ఏనుగు నీకెందుకు ? నువ్వు బ్రాహ్మణుడివి నీకు గోవులు , ధనం ఇస్తాను తీసుకోమన్నాడు .
🌸మతంగ మహర్షి బ్రాహ్మడికి జంతువులెందుకు అన్నవాడివి నాకు గోవులు ధనం మాత్రం ఎందుకు ? అన్నాడు . నువ్వు రాజువి కావు ఇంద్రుడవని నాకు తెలుసు .
🌿నాకు ఏ వరాలు వద్దు . నా ఏనుగుని నాకొదిలేసి వెళ్ళిపొమ్మన్నాడు . ఇంద్రుడు నీ తపస్సుకి ఫలితంగా నిన్ను , కొడుకులాంటి నీ ఏనుగుని కూడ స్వర్గలోకం తీసికెళతానని తనతో తీసుకెళ్ళాడు .
🌸ఇంద్రలోకానికి వెళ్ళే అదృష్టం మహామహులకు గాని కలగదు . మన మతంగ మహర్షి మాత్రం పట్టుదలతో సాధించాడు
🌹వాలిని శపించిన మతంగుడు...!!🌹
🌸వాల్మీకి రామాయణం ప్రకారం మతంగ మహర్షి ఒకరోజు ఋష్యమూక పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండగా
🌿దుందుభి అనే రాక్షసుడిని
వాలి యుద్ధం చేసాడు. భీకర యుద్ధంలో దుందుభి బలహీనుడయ్యాడని అర్థం చేసుకున్న వాలి వాడిని పిడికిటి పోటులతో చంపి,
🌸వాడి కళేబరాన్ని చేతులతో పైకెత్తి, ఆమడ దూరంలో పడేట్లు విసిరి వేశాడు.అప్పుడారాక్షసుడి నోటినుండి కారుతున్న నెత్తురు గాలికి కొట్టుకుని వచ్చి మతంగాశ్రమంలో పడింది.
🌿అది చూసి మతంగుడికి బాగా కోపం వచ్చింది. "దుష్టబుద్ధి, పాపి, బుద్ధిలేనివాడు, జ్ఞానహీనుడు, ఎవడిలా నామీద నెత్తురు పడేశాడు?" అని ఆశ్రమం బయటకి వచ్చి చూస్తే,
🌸ప్రాణం పోయి కొండలాగా పడివున్న రాక్షసుడిని చూశాడు.
ఎవరీ పని చేశాడని ఆలోచించి, తన తపశ్శక్తితో బలోన్మత్తుడైన వాలి చేసిన పని ఇది అను గ్రహించాడు.
🌿వాలిమీద ఆగ్రహంతో వాలి ఈ ఆశ్రమానికి వస్తే చచ్చిపోతాడు అని శపించాడు.
🌸ఆ ఆశ్రమ ప్రదేశం ఒక ఆమడ విస్తీర్ణం కలది. దానిలోపలికి వాలి వస్తే చచ్చిపోతాడు.
🌿అక్కడున్న వాలి పక్షాన వున్న కోతులను సూర్యోదయం లోపల
ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాలని, వెళ్లకపోతే అందరూ శిలలుగా వేల సంవత్సరాలు వుండిపోతారని కూడా శపించాడు.
🌸 ఇలా మునీశ్వరుడు శపించడంతో అక్కడున్న కోతులు భయపడి వాలి దగ్గరకు పోయి జరిగిన సంగతంతా చెప్పాయి.
🌿ఆ విషయాన్ని తెలుసుకున్న వాలి మునీశ్వరుడి దగ్గరకు పోయి, నమస్కారం చేసి, ‘దయాశాలీ నన్ను క్షమించు’ అని ఎన్ని విధాల వేడుకున్నా ఆయన కోపం వదలలేదు.
🌸రాముడి చేతిలో వాలి వధింపబడేవరకు సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీదే భద్రంగా నివసించాడు. రామాయణంలో వర్ణించిన సుగ్రీవుడి గుహ, అతని మధువనం హంపిలోని కిష్కింధలో నేటికీ ఉంది ఇదండీ వాలిని శపించిన మతంగ మహర్షి.
No comments:
Post a Comment