❤️🪷 *రమణ బోధ*
‘నీలోనికి నువ్వు ప్రవహించు. నిర్వి రామంగా ఆలోచనల్ని అల్లే మనసు మూలాన్ని అన్వేషించు. ఎగసిపడే ప్రతికూల భావాల్ని తిరస్కరించు. అన్నింటికీ ఆద్య మైన మనోబలాన్ని విశ్వసించు. హృదయాన్ని శాంతిధామం గా నిర్మిం చు. ఆ అనంత మౌనం లో విశ్రమించు. ఆధ్యాత్మికంగా ఉన్న తిని సాధించు’ అని భగవాన్ రమణ మహర్షి ఆత్మ సాక్షాత్కా రానికి దిశానిర్దేశం చేశారు.
‘నిన్ను నువ్వు తెలుసుకో’- ఆధ్యా త్మి క చింతనకు ఇదే ప్రథమ సోపానం . అంతర్వీక్షణ లేనిదే ఆత్మోద్ధరణ సాధ్యం కాదు. అం తరంగాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ‘నేను’ అనే అహం కారాన్ని విడనాడాలి. శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూప సంబంధిత అం శాలతో మనసు అనుసం ధానం కావాలి. అప్పుడు జ్యో తిర్మయం గా మనో మందిరం వెలుగుతుంది.’ అంటూ రమణులు ప్రబోధిం చారు. అద్వై త యోగాన్ని పరిపూర్ణం గా ఆవిష్క రించిన మహాయోగి భగవాన్ రమణ మహర్షి. భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగాలలోని మార్మి కతను, అంతర్లీన భావగరిమను రమణలు ఏకోన్ము ఖంగా అందించారు.
‘ప్రజ్ఞానం బ్రహ్మ ’ అనేది ఉపనిషద్వా క్యం . ప్రజ్ఞ ద్వారా అన్నిం టినీ తెలుసుకునే నేర్పు అలవడుతుం ది. ‘నాకు జ్ఞానోదయం కావాలి స్వా మీ! నేను అజ్ఞానిని’ అని ఓ భక్తుడు రమణుల్ని ఆశ్రయించాడు. ‘నువ్వు అజ్ఞానివా, ఆ విషయం నీకు నిజం గా తెలుసా?’ అని రమణులు అతణ్ని ప్రశ్నిం చారు. ‘తెలుసు స్వా మీ! నేను పరమ అజ్ఞానిని’ అన్నాడు భక్తుడు. ‘నీ గురించి నీకు తెలిసింది కదా! నువ్వు జ్ఞానివే. ఇక నీకు నాతో పని లేదు’ అన్నారు మహర్షి. ‘ఆత్మ విచారం ద్వారా ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. జీవన్ము క్తి అం టే జీవితం నుంచి ముక్తులు అని కాదు. ఈ జీవితంలోనే ముక్తిని పొం దాలి. ముక్తి అంటే మరణానం తరం పొందేది కాదు. పరం జ్యోతి గుండె గూటిలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ వెలుగులో నిన్ను నువ్వు సంస్కరించుకోవాలి. నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకోవాలి’ అని రమణులు సూచించారు.
అరుణాచలేశ్వరుని దివ్య అనుగ్రహం తో రమణులు అతులితమైన యోగశక్తిని అం దుకున్నారు. అరుణాచలాన్ని తన ఆశ్రమంగా మార్చుకుని, అరుణగిరిపై జ్ఞాన భాస్కరుడై వెలుగొం దారు. నమశ్శివాయ అనేది మహా యోగ పం చాక్షరీ మం త్రమైతే, ‘అరుణాచల’ అనేది దివ్య జీవన జ్ఞాన పంచాక్షరీ మంత్రంగా రమణులు అభివర్ణించారు. భగవం తుని సాన్నిధ్యా నికి, ఆత్మ సామీప్యా నికి ఏది తీసుకుని వెళ్తుం దో అదే ఉపదేశం . దక్షిణామూర్తిగా రుషులకు బోధిం చిన జ్ఞానోపదేశాన్ని, తత్త్వ మార్గాల్ని , యోగసూత్రాల్ని ‘ఉపదేశసారం’గా రమణులు ఆవిష్క రిం చారు.
‘ఆనందమే నా స్వరూపం ’ అనే నవ్యమైన స్థితికి చేరుకోవడానికి ఆధ్యాత్మికత ఉపకరిస్తుంది. ‘నేను దీనుణ్ని , నాకు ఆనందం లేదు. నా జీవితం నిస్సారం. నాకు ఉన్న తి లేదు’ అని భావించేవారికి ఆధ్యా త్మి క అనురక్తి కొత్త ఉత్సాహాన్ని అం దిస్తుం ది. ప్రతికూల భావాలనే చీకట్ల నుంచి సానుకూల భావాలే ఆయుధాలుగా విజయ సోపానాల్ని అధిరోహిం చడానికి ఆధ్యాత్మిక శక్తి కరదీపికగా నిలుస్తుం ది. ‘ఒక్క ఆధ్యా త్మి క దీపశిఖ నీలో వెలుగుతుం టే చాలు- నువ్వు అఖం డ తేజోపుం జమై వెలుగు పువ్వు ల్ని వెదజల్లుతావు’ అని రమణులు పేర్కొన్నారు. ‘భగవంతుడనే సం పూర్ణ, సమున్న త స్థితికి, మనకు ఉన్న దూరం ‘నేను’ అనే అంశం ఉన్నం త వరకే! నేను, నాది, నాకు అనే వ్య క్తిగతమైన అహాల్ని నిర్మూ లించుకుంటే పరమ పూజ్యు డైన పరమాత్మ రూపం మనలోనే సాకారమవుతుంది అని రమణులు నిర్దేశిం చారు. పరబ్రహ్మ తత్త్వా నికి మౌనమే భాష్యం . మౌనం మహా శక్తిమం తమైన ఆయుధం . శబ్దం లోంచి నిశ్శబ్దం లోకి ప్రయాణం చేయడమే నేనం దించే ప్రబోధ సారాంశం - అని ప్రవచించిన రమణుల సందేశ వైభవం ... స్ఫూర్తిమంతం ... స్ఫూర్తి మంత్రం !
No comments:
Post a Comment