🤘 విదుర నీతి 🤘
నిద్ర పట్టని వాళ్లు ఎవరు?
జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు.
సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు.
ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి.
నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది.
మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో ఇవి చెబుతాయి.
మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి.
కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.
ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు.
విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ ఉండేవాడు.
సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత,
ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు.
అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు.
విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు.
విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు.
‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి,
సంపద పోగొట్టుకున్న వాడికి,
కాముకుడికి,
దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు.
విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!
జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో,
మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు.
తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు,
పోయినదాన్ని గురించి విచారించనివాడు,
ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని.
అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.
మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ,
ఆలస్యంగా చేస్తాడు.
అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు.
ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా
ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.
‘మధుర పదార్థం నలుగురికీ పం�
No comments:
Post a Comment