Tuesday, June 24, 2025

 🔔 *శివోహం* 🔔

శివలింగం అంటే ఏమిటి...
శివలింగం ఎక్కడ నుండి వచ్చింది..
శివలింగాలు ఎన్ని రకాలు అవి ఏవి శివలింగాల పూజ ఫలితం .....

ఆకాశమేలింగం. భూమి దాని పీఠం. అది సమస్త దేవతలకు నిలయం. ఇందే అంతా లయం చెందుతుంది. అందుేక దీనిని లింగం అని అన్నారు. 

‘లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, ‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది. అందుేక అది లింగమైంది. ఈ సృష్టి సమస్తం శివమయం. ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది. 

సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిభిడృకృతమై అంతులేని మహాసముద్రం వలె ఉండేది. ఆ మహాజలం నుంచి ఓ మహా తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజఃపుంజమే క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ తేజోమయరూపమే పరబ్రహ్మం. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు.

సామాన్యంగా లింగశబ్దానికి చిహ్నంలేక లక్షనం లనే అర్థాలు న్నాయి. ప్రకృతి, వికృతులు రెండూ లింగమనే సౌంఖ్య దర్శనం చెప్పింది. విగ్రహాన్ని మూర్తి అని అంటారు. మూర్తి ధ్యానాన్ని బట్టి ఆకారాలు ఉంటాయి. కానీ, లింగములో ఆకారంగానీ, రూపంగానీ, చెప్పవీలుబడదు. అదొక చిహ్నం మిత్రమే. 

లయనా ల్లింగముచ్యతే అని అన్నారు. అంటే, లయం ప్రళయంగావడం వల్ల లింగమని చెప్పబడుతోంది. ప్రళయాగ్నిలో సర్వమూ భస్మమై శివలింగంలో చేరుతుంది. లింగార్చనతో సర్వదేవతల పూజ జరుగునని లింగపురాణం చెబుతుంది.

స్వామి సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారం ఉండదు. తాను ఇత రులకు దర్శనమివ్వాలనుకున్నప్పుడు అంబతో కలిసి దర్శనమిస్తుంటాడు. ఆ స్వామి రూపంలేని స్థితి నుంచి సాంబ మూర్తిగా దర్శనమివ్వడానికి మధ్యలో మరొక రూపం ఉంది. దానినే అరూపమని అంటారు.అదే శివలింగం.

శివలింగాలు ఐదు రకాలుగా మనకు గోచరిస్తుంటాయి. తనంతట తానుగా అవతరిచినది స్వయంభూలింగం. ధ్యానపూర్వకమైనది బిందు లింగం. మంత్రపూర్వకమైనది ప్రతిష్ఠాలింగం. నాలుగవది చర లింగం. ఐదవది శివుని విగ్రహమైన గురులింగం. 

ఈ పవిత్ర భారతావనిలో కొన్నివేల శివలింగాలను దర్శించుకోవచ్చు. మరికొన్ని గ్రంథాలు శివలింగం యొక్క రంగు, ఆకారం, కొలతలను అనుసరించి శివలింగాలను నాలుగు విధాలుగా పేర్కొంటున్నాయి. 

అవి :: 
ఆఢ్యం, సురేఢ్యం, అనాఢ్యం, సర్వసమం. 1001 ముఖాలతో కనబడే శివలింగం ఆఢ్యం. 108 ముఖాలతో కనబడే శివలింగం సురే ఢ్యం. ప్రస్తుతం ఉన్నవి, లేనివి అన్ని శివలింగరూపాలను అనా ఢ్యం అంటున్నారు. ఒకటి నుంచి ఐదు ముఖాలుగల శివలింగాలు సర్వసమం.

లింగాలకు ఏక ముఖ రుద్రాక్షల
ముఖలింగాలను మనం అరుదుగానే చూస్తుంటాం. ఏకముఖలింగం, ద్విముఖలింగం, త్రిముఖలింగం, చతుర్ముఖలింగం, పంచ ముఖలింగం, షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడవచ్చు. అయితే ఆరుముఖాలు గల షణ్ముఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు. ఈ ముఖలింగాలను పూజించడం వల్ల ఇహంలో అష్టైశ్వర్యాలను, పరంలో శివసాయుజ్యం లభిస్తుందని పురాణవచనం.

ఏకముఖ లింగం:

ఈ లింగంలో శివుని యొక్క తత్పురుష రూపాన్ని దర్శించుకుం టాం. తూర్పుముఖంగా ఉండే ఏకముఖలింగం ఎరుపురంగులో పరమ శాంతంగా గోచరిస్తుంటుంది. సాధారణంగా ఈ లింగాలు శివ ఆలయాలలో నెైరుతిదిక్కులో ఉంటాయి. 

పదోన్నతి, అష్టైశ్వర్యాలను కోరుకునే భక్తులు, ఈ తత్పురుష లింగపూజలను గర్భాలయంలో ప్రతిష్ఠించుకుని పూజించే పద్ధతి లేదు. అలాగే ఈ ఏకముఖి రుద్రాక్ష తో 11-121 సంఖ్యలో మాలలను తయారుచేసి, లింగమూర్తికి అలంకరించి బిల్వదళాలతో పూజిస్తే మానసికశాంతి.

ద్విముఖలింగం:

శివలింగానికి తూర్పు- పడమరల లో ముఖాలు కలిగి ఉండటం ద్విముఖలింగ లక్షణం. తూర్పుముఖం తుత్పురుష, పడమటి ముఖం సద్యోజాతం. వీరశెైవులు ఈ లింగాన్ని పూజిస్తుంటారు. ద్విముఖలింగ సన్నిధికి తూర్పు పడమర దిక్కులలో ద్వారాలను ఏరర్రచాలన్నది నియమం. ఈ లింగాన్ని ద్విముఖ రుద్రాక్షలతో పూజించాలి. ఈ లింగాలను ఆలయాలలో చూడలేము.

త్రిముఖ లింగం:

ఈ శివలింగం తూర్పు, ఉత్తర, దక్షిణముఖాలను కలిగి ఉంటుంది. తూర్పున ఉన్న తత్పురుష ముఖం చిరునగవుతో, దక్షిణవెైపుగానున్న అఘోరముఖం కోపంతో, ఉత్తరం వెైపునున్న వామదేవముఖం మందహాసంతో గోచరిస్తుంటాయి. ఈ త్రిముఖలింగం సృష్టి, స్థితి, లయకారకులెైన త్రిమూర్తులను సూచిస్తోందని కొందరి భావన, మంత్రార్చనతో, త్రిముఖ రుద్రాక్షమాలను స్వామికి సమర్చించుకుని, మూడు దళాల బిల్వ పత్రాలతో అర్చిస్తే సకల సంపదలు సమకూరుతాయి.

చతుర్ముఖ లింగం:

నాలుగు ముఖాల ఈ లింగానికి తూర్పున తత్పురుషం, పడమట సద్యోజాతం, ఉత్తరాన వామదేవం, దక్షిణాన అఘోర ముఖాలున్నాయి. ఈ నాలుగుముఖాలను నాలుగు వేదమంత్రాలతో పూజిస్తుంటారు. ఈ లింగాన్ని చతుర్ముఖ రుద్రాక్షలతో అలంకరించి బిల్వపత్ర పూజ చేస్తే, అలా పూజించిన వారి మేధస్సు పెరుగుతుందనేది ఐతిహ్యం.

పంచముఖలింగం:

ఈ పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తుం టాయి. నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలతో, తూర్పువెై పున ఐదవముఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు. ప్రస్తుతం నిర్మిస్తున్న శివాలయాలలో చాలా మంది పంచముఖ శివ లింగాలను ప్రతిష్ఠించుకుంటున్నారు. 

పంచముఖ రుద్రాక్ష మాలను స్వామికి అలంకరించి, పంచగవ్యంతో అభిషేకిం చి, బిల్వ పత్రాలతో అర్చించి, ఐదు విధాలెైన ఉపచారాలను చేసి, పంచ నెైవేద్యాలను నివేధించాలి. ఈ ఐదు ముఖాల నుంచి ఆగమాలు వెలువడినందువల్ల దీనిని ‘శివాగమ లింగం’ అని కూడా పిలుస్తారు.

షణ్ముఖ లింగం:

ఈ లింగంలో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుండగా, ఐదవ ముఖం ఆకాశాన్నీ, ఆరవముఖం పాతా ళాన్ని చూస్తుంటాయి. ఈ ఆరు ముఖాల నుంచి వెలువడిన తేజఃపుంజాలతో శివుడు సుబ్రహ్మణ్య స్వామిని సృజించా డని పురాణకథనం. 

అలాగే పాలసముద్రాన్ని మధించినప్పు డు వెలువడిన హాలాహలాన్ని శివపరమాత్మ అథోముఖంతో స్వీకరించాడట అయితే ప్రస్తుతం ఎక్కడా మనం షణ్ముఖలిం గాన్ని దర్శించుకోలేము.

ఇక, ఎవరెవరు ఏయే లింగాన్ని పూజిస్తే ఫలితం ఉంటుం దున్న విషయాన్ని కూడా మన పురాణాలు పేర్కొన్నాయి. 

బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, 

క్షత్రియులు బాణలింగాన్ని, 

వ్యాపారస్తులు స్వర్ణలింగాన్ని, 

ఇతరులు శిలా లింగాన్ని పూజించాలి. 

వితంతువులు స్ఫటికలింగాన్ని లేక రసలిం గాన్ని అర్చిస్తే మంచిది. ఈ స్ఫటికలింగాన్ని అందరూ పూజించవచ్చు. ఏ లింగాన్ని పూజించడం వల్ల ఫలితమన్న విషయాన్ని లింగపురాణం వివరించింది.

గంధలింగం : 

రెండు భాగాలు కస్తూరి, నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే శివసాయుజ్యం లభిస్తుంది.

పుష్పలింగం : 

నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

https://youtu.be/RMgJYI33nYU

గోమయలింగం : 

కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారుచేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. భూమిపెై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.

రజోమయలింగం : 

పుప్పాడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివసాయుజ్యాన్ని పొందగలం.

ధాన్యలింగం : 

యవుల, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.

తిలపిష్టోత్థలింగం : 

నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.

లవణజలింగం : 

హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.

తుషోత్థలింగం : 

మారణక్రియకు పూజిస్తారు.

భస్మమయలింగం : 

భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగుజేస్తుంది.

శర్కరామయలింగం : 

సుఖప్రదం కొసం పూజిస్తారు .

సద్యోత్థలింగం : 

ప్రీతిని కలిగిస్తుందని పూజిస్తారు .

వంశాకురమయలింగం : 

వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.

కేశాస్థిలింగం : 

వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.

పిష్టమయలింగం : 

ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

దధిదుగ్థలింగం : 

కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.

ఫలోత్థలింగం : 

ఫలప్రదమైనది చేపట్టిన కార్యంలో ఫలితాన్ని ఇస్తుంది .

ధాత్రిఫలజాతలింగం : 

ముక్తిప్రదం కలగడానికి పూజిస్తారు .

నవనీతలింగం : 

వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.

దుర్వాకాండజలింగం : 

గరికతో తయారు చేసిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.

కర్పూరజ లింగం : 

ముక్తిప్రదమైనది ముక్తిని ప్రసాదిస్తుంది.

ముక్తాలింగం : 

ముత్యంతో తయారుచేయబడిన లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.

సువర్ణనిర్మిత లింగం : 

బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది వ్యాపారాభివృద్ధి కలుగుతుంది .

రజత లింగం : 

సంపదలను కలిగిస్తుంది.

ఇత్తడి-కంచులింగం : 

ముక్తిని ప్రసాదిస్తుంది.

ఇనుము-సీసపులింగం : 

శత్రునాశనం చేస్తుంది.

అష్టథాతులింగం : 

చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.

వెైఢూర్యలింగం : 

శత్రునాశనం. దృష్టిదోషహరం.

స్ఫటికలింగం : 

సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.

సితాఖండలింగం : 

పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది.

ఇక శివలింగాలు లక్షణ శాస్త్ర గ్రంథాన్ని అనుసరించి రెండు విధాలుగా ఉన్నాయి.

శుద్ధలింగమూర్తులు, 
 
లింగోద్భవమూర్తులు .

శుద్ధలింగమూర్తులు : 

ఇవి సహజంగా ఏర్పడిన లింగాలు, లేదా మనిషి స్వయంగా తయారు చేసిన లింగాలు.
ఇవి సాధారణంగా రాతితో, లేదా ఇతర పదార్థాలతో చేయబడతాయి.
శివలింగంలో ఇవి ప్రాథమిక రూపంగా పరిగణించబడతాయి.

లింగోద్భవమూర్తులు : 

ఇవి లింగం నుంచి ఉద్భవించి నట్లుగా భావించబడే మూర్తులు.
ఇవి సాధారణంగా లింగం నుండి పొడుచుకువచ్చినట్లుగా లేదా ఏదైనా ఇతర రూపంలో ఉద్భవించినట్లుగా ఉంటాయి.

జంజాతస్యహి దృవోమృత్యుహు. పుట్టినవాడు దేవుడైనా గిట్టక తప్పదు. 
ఆత్మకు పుట్టుకలేదు. ఆత్మజ్ఞానముకలవారికి పుట్టుకేలేదు. పుట్టుకేలేనివానికి మరణమెక్కడిది .

శివోహం శివోహం శివోహం

 ఓం నమశ్శివాయ ||

|| నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ||

No comments:

Post a Comment