*నీతికథలు*
*ఒకసారి, ఒక గ్రామపంచాయతీలో బహిరంగన్యాయస్థానంలో ఒక సమస్యను పరిష్కరించడానికి పెద్దలు సమావేశమైయ్యారు. కొంత దూరంలో, ఒక సాధువు ఎప్పటినుంచో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని వుంటున్నాడు.*
*పెద్దల న్యాయస్థానం ఏ నిర్ణయానికి రాలేకపోవడం వలన, తమ సమస్య పరిష్కారం కోసం ఆ సాధువును సంప్రదించమని ఎవరో సూచించారు.*
*వారంతా సాధువు దగ్గరకు వెళ్లారు. అంతమందిని చూసి సాధువు వాళ్ళని ఏం కావాలని అడిగాడు.*
*"మహాత్మా, గ్రామంలో ఒకే ఒక బావి ఉంది. మేము ఆ బావిలో నీరు త్రాగలేకపోతున్నాము." అని గ్రామస్థులు సమాధానమిచ్చారు. *
*సాధువు, "ఎందుకు, ఏమి జరిగింది? మీరు దాని నుండి నీరు ఎందుకు త్రాగలేకపోతున్నారు?" అని అడిగాడు.*
*"మూడు కుక్కలు ఒకదానితో ఒకటి కొట్టుకుని బావిలో పడ్డాయి. అవి బయటకు రాలేక అందులో మునిగి చనిపోయాయి. ఇప్పుడు నీరు బాగా దుర్వాసన వస్తోంది, ఆ నీరు ఎలా తాగాలి?" అని గ్రామస్తులు అన్నారు.*
*సాధువు "ఒక పని చేయండి, పవిత్రమైన గంగానది జలాన్ని ఆ బావిలో పోయండి" అని చెప్పాడు.*
*అలా ఎనిమిది నుంచి పది బకెట్ల గంగాజలం బావిలో పోసినా సమస్య అలాగే ఉండిపోయింది.*
ప్రజలు మళ్లీ సాధువు వద్దకు వెళ్లారు.*
*సాధువు, "సరే, మీరందరూ సమావేశమై భగవంతుని నామాన్ని జపిస్తూ, ప్రార్ధన చేయండి," అన్నాడు.*
*ప్రజలు ‘అలాగే!’ అని, సాధువు సూచించినట్లు చేసారు, అయినప్పటికీ సమస్య అలాగే ఉంది.*
*ప్రజలు మళ్లీ సాధువు వద్దకు వెళ్లారు.*
*ఈసారి సాధువు "బావిలో కొన్ని సువాసన వచ్చే పదార్ధాలు వేయండి" అన్నాడు.*
*అది కూడా జరిగింది, కానీ! సమస్య ఇంకా కొనసాగింది.*
*ఇప్పుడు ఇంక సాధువు స్వయంగా బావి వద్దకు వచ్చాడు.*
*ప్రజలు, "చూడండి స్వామీ, పరిస్థితి అలాగే ఉంది, మేం ప్రతిదీ ప్రయత్నించి చూసాం, పవిత్ర గంగాజలం పోశాం, ప్రార్థనలు, కీర్తనలు చేసాం, ప్రసాదం పంచాము, బావిలో సువాసనగల పువ్వులు, పదార్ధాలు వేసాం,ఇవన్నీ!"*
*సాధువు అయోమయంగా చూస్తూ అడిగాడు, "అన్నీ చేసారు, కానీ ఈ బావిలో పడి, చనిపోయిన మూడు కుక్కలను తొలగించారా?"*
*గ్రామస్తులు, "అదేంటి, మీరు అలా చేయమని మాకు చెప్పలేదు కదా, మేం వాటిని బయటకు తీయలేదు, మిగిలినవన్నీ చేసాం, కానీ కుక్కలు ఇప్పటికీ బావిలోనే ఉన్నాయి!" అన్నారు.*
*సాధువు మొదట దిగ్భ్రాంతి చెందాడు, కాని ప్రశాంతంగా గ్రామస్తులకు ఇలా వివరించాడు… "నీటిలో పడి ఉన్న మూడు మృతదేహాలను బయటకు తీసే వరకు, ఎటువంటి బాహ్య చర్యలు ఎటువంటి ప్రభావం చూపవు, ముందుగా మీరు నీటి నుండి ఆ మురికిని బయటకు తీయాలి."*
*మన జీవిత కథ కూడా అలాంటిదే. పల్లెటూరు వంటి మన దేహంలో… ‘కామం, క్రోధం, లోభం, అసూయ’ అనే అనేక జంతువులు పోట్లాడుకుని, ‘మనస్సాక్షి’ అనే బావిలో చెదపురుగుల్లా చిక్కుకుపోయాయి. అవి మెల్లగా మన మనస్సాక్షిని లోపలి నుండి తినేస్తున్నాయి.*
*ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే... ఈ తెగులు నుంచి బయటపడేందుకు మనం ఏం చేస్తున్నాం?*
*మన జీవితాలను మెరుగుపరచు కోవడానికి బయటి నుండి చాలా కొత్త విషయాలను లోపలికి తీసుకుంటున్నాం, అయితే లోపల ఇప్పటికే కుళ్ళిపోయిన లేదా పేరుకుపోయిన వాటిని తొలగించడానికి మనం ఏమి చేస్తున్నాం? దీని గురించి ఒకసారి ఆలోచిద్దాం.*
🌹🌹🌹🌹
*మనం మనస్సాక్షిని శుభ్రంగా ఉంచుకుంటే, బయట కూడా ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది, మన అంతరంగాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే, బయట ప్రతిదీ కూడా అందంగా అవుతుంది. *
🙌సర్వేజనాః సుఖినోభవంతు 🙌
No comments:
Post a Comment