Sunday, June 29, 2025

 🙏 *రమణోదయం* 🙏

*జపం యొక్క నిజస్వరూపానివి నీవే. కనుక నీవు "నేనెవరు?" అని నీ సహజ స్థితిని విచారించి గ్రహిస్తే ఆహా! ఏమిటీ వింత! నీవు ఎంతో ప్రయత్నంతో చేస్తున్న జపం, ఇప్పుడు ఎటువంటి ప్రయత్నం లేకుండానే జరిగిపోతోందేయని తెలుసుకుంటావు.*

వివరణ: *భగవంతుని అన్ని నామాలలో "నేను" అన్న స్ఫురణ శబ్ద రూపంలేని మొట్టమొదటి నామం.అన్ని ప్రాణులలో ఏకమై యుండువాడు భగవంతుడే, అందరు తమని "నేను" అని అంటారు కాబట్టి, అదే భగవంతుని నిజమైన నామం. అందువల్ల నీవే ఆ జపం యొక్క నిజస్వరూపమని అన్నారు. తన సహజ స్థితిని విచారిస్తే ప్రయత్న రూప కర్తృత్వం నశించుటచేత "సహజ జపం"గా అప్రయత్నంగా జరుగుతూనే ఉంటుందని భగవాన్ ఉపదేశం.*

ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచన
నీ సహజ ప్రశాంతతను చెడగొడుతుంది.
ఏదైనా ఉండనీ..ఏదైనా పోనీ..
"ఉన్నస్థితి" లో ఉండు.

కలియుగంలో కేవలం నామ స్మరణ చేస్తే చాలు తరిస్తారని పెద్దలు ఎందుకు చెప్పారంటే..
అత్యంత సులభ సాధ్యమైన నామస్మరణ కూడా
చేయలేని దౌర్బల్యస్థితిలో
కలియుగ జనులు ఉంటారని!

(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.707)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
 *ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment