Thursday, June 26, 2025

 🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀

🙏 ఐశ్వర్య కాళి....!!



🌿కాళీదేవి ఐశ్వర్యానికి అధిదేవత. ఐశ్వర్యం అంటే కేవలం సిరిసంపదలు మాత్రమే కాదు.

🌸 ఐశ్వర్యం అంటే అధికారం (రాజ్యాధికారం), వైభవం కూడా. ‘‘ఐశ్వర్య కాళి’’గా అమ్మవారిని ఆరాధిస్తే ఆమె వీటన్నింటినీ అనుగ్రహిస్తుంది.

🌿 అలా అమ్మవారిని అర్చించి, ఆమె కోసం తపస్సు చేసి విక్రమార్కుడు, భట్టి, నరకాసురుడు, తెనాలి రామకృష్ణ మొదలైనవారు ఐశ్వర్యాన్ని పొందారు. 

🌸ఉజ్జయినీ మహా కాళి శక్తిస్వరూపిణి. ఆమె ఐశ్వర్యకాళిగా భట్టి విక్రమార్కులను అనుగ్రహించింది.

🌸 విక్రమార్కుని జీవితకథలో అమ్మవారి అనుగ్రహానికి సంబంధించిన ఘట్టం కనిపిస్తున్నది. అదేంటంటే..

🌿 విక్రమార్కుని దగ్గరకు ఒక మంత్రగాడు వచ్చి ఉజ్జయిని కాళిని పూజించడానికి ఆయన సాయం కావాలని కోరతాడు.

🌸అందుకోసం శ్మశానం నుండి బేతాళుడు ఆవహించి ఉన్న శవాన్ని తీసుకురావాలని చెబుతాడు. 

🌿మహావీరుడైన విక్రమార్కుడు బేతాళుడు ఆవహించిన శవాన్ని తీసుకొని వస్తూ ఉండగా, బేతాళుడు అనేక కథలు చెప్పి ప్రశ్నలు అడగడం విక్రమార్కుడు జవాబులు చెప్పడం, మళ్లీ బేతాళుడు శ్మశానానికి వెళ్లిపోవటం తెలిసిన కథే. 

🌸చివరికి బేతాళుడు చెప్పిన ఒక కథకు విక్రమార్కుడు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. 

🌿అతడి బుద్ధిబలానికి మెచ్చిన బేతాళుడు.. ‘విక్రమార్కా ఆ మాంత్రికుడు నిన్ను బలి యివ్వడం కోసమే ఇదంతా చేస్తున్నాడు’ అని చెబుతాడు. 

🌸అప్పుడు విక్రమార్కుడు.. ఉజ్జయిని మహాకాళిని ప్రార్థించి, ఆమె అనుగ్రహంతో, మాంత్రికుని తన ఖడ్గంతో సంహరించగా

🌿 కాళీదేవి ఐశ్వర్యరూపిణిగా ప్రత్యక్షం అయి ‘‘నాయనా! దుష్టసంహారం చేశావు. ధర్మాన్ని రక్షించావు. ఏం కావాలో కోరుకో’’ అని అన్నది.

🌸 1000 సంవత్సరాలు రాజ్యపాలన, అష్టైశ్వర్యాలు కావాలని విక్రమార్కుడు వరం అడిగాడు. 

🌿ఆ తరువాత భట్టి కూడా 2000 సంవత్సరాల ఆయుర్దాయం, అష్టైశ్వర్యాలను వరంగా పొందాడు. 

🌸అమ్మవారిని ఎర్రతామరలతో విశేషించి ఎర్రకలువలతో (కాళీ సాధనలో కలువ పూలకు ప్రాధాన్యం) పూజిస్తే ఆమె ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది.

🌿 తామరగింజల మాలతో కాళీ మంత్ర జపం చేసి సిరిసంపదలను పొందవచ్చు.🙏

✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀

No comments:

Post a Comment