ఈరోజు మంచి మాటలు .
నువ్వు బాగున్నప్పుడు, పువ్వులాంటి మాటలు విసిరినవారే,నువ్వు బాగోలేనప్పుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో,బాగున్నప్పుడు కూడా అలాగే ఉండు.ఈ రెండు సందర్భాల్లో అలాగే ఉండు.రెండు సందర్భాల్లో నీతో ఉన్న వారే నీ వారు.
కనిపించే మనిషిని మోసం చేస్తూ,కనిపించని దేవుణ్ణి మొక్కినంత మాత్రాన మంచి వాళ్ళం అయిపోము.ఎదుటివారు మనకు విలువ ఇచ్చినప్పుడు కాపాడుకోవాలి,ఎదుటి వాళ్ళ దగ్గర వీలైతే మంచిగా ఉండు, అంతే గాని మంచిగా నటించకు.
మంచి మనసుతో మంచి చేసేవారు ఏ గుడి గోపురాలు తిరగకపోయిన వారికి దేవుడి కృప ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు మంచే జరుగుతుంది.
బంధం విలువ తెలియని వారికి
నీ స్థానం ఎంత గొప్పదైన దిగజారి పోవాల్సిందే.మనసు విలువ తెలియని వారికి.నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండి పోవాల్సిందే.
నిన్ను నీతో తప్పఏ ఒక్కరితో పోల్చుకోకుఎందుకంటే
వాళ్లలా నువ్వుంటే మరి నువ్వు ఎందుకు?ఆశ మనిషిని బ్రతికిస్తుంది.పరిస్థితులు ఎలా ఉన్నా,నువ్వు నీలాగే ఉండడమే నువ్వు జీవితంలో సాధించ వలసిన గొప్ప విజయం.నువ్వు నువ్వుగానే ప్రపంచానికి తెలియడం,నువ్వు నువ్వుగానే ఎదగడం,నువ్వు నువ్వుగానే బతకడం,నువ్వు నువ్వుగానే నీ జీవితం అనే పుస్తకంలో మిగిలిపోవడం,నీ పేరు చిరస్థాయిగా ఉండటం.జీవితం అద్భుతమైన పుస్తకం దానిలో నీ ప్రతి పేజీ ఒక అద్భుతంలా రాసుకో.అప్పుడే నీకు నీవు అర్థం ఆవుతావు.నువ్వు ఓ
మహాద్భుతానివని.
తెల్లని కాగితము మీద ఎన్నో
రాతలు రాస్తుంటాము.కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునే లా చేస్తాయి. మన జీవితములో కూడా అంతే,
ఈ జీవన ప్రయాణంలో
ఎన్నో పరిచయాలు,ఎన్నో బంధాలు అవుతూ ఉంటాయి.
కొన్ని పరిచయాలు తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతుంటాయి.
కొన్ని పరిచయాలు మనసు పొరలు మధ్య మొగలిరేకుల్లా
నిలిచి పోతుంటాయి.వారి ప్రభావము మన జీవితాలపై
ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
అలాంటి వారు మనకు దూరమైనా,వారి జ్ఞాపకాలు మాత్రము చిరకాలము
మిగిలి పోతాయి.
శుభోదయం చెప్తూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment