*హనుమంతుడిపరిపూర్ణ సంగీతం* (పురానీతి)
దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసి ప్రద్ధులు. తుంబురుడి వద్ద కళావతి అనేవీణ ఉండేది. నారదుడి వీణ మహతి. ఇద్దరూ ముల్లోక సంచారం చేసేవారు. ఇంద్రాది దేవతలను తమ గానంతో, వీణానాదంతో అలరించేవారు. మహావిష్ణువును స్తుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు. తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండటంతో ఇద్దరికీగర్వం పెరిగింది. ఎవరు గొప్ప అనేవిషయంలో ఇద్దరికీస్పర్థలు కూడా మొదలయ్యాయి.
ఎవరు గొప్పో సాక్షాత్తు మహా విష్ణువు వద్దేతేల్చుకోవాలనేపట్టుదలతో తుంబుర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికివెళ్లారు. పోటాపోటీగా గానం చేశారు. నారదుడు తనకు ఎంతటిభక్తుడైనా, విష్ణువు మాత్రం తుంబురుడిగానానికిపరవశుడై, అతడిపై పొగడ్తల వర్షం కురిపించారు. నారదుడు చిన్నబోయాడు. సంగీతంలో విద్వత్తు సాధించడానికిఏం చేయాలంటూ విష్ణువునే సలహా అడిగాడు. ‘గానబంధు’ అనేగుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు. ‘గానబంధు’ వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికిసిద్ధం కావాలంటూ తుంబురుడిని సవాలు చేసేందుకు అతడినివాసానికివెళ్లాడు.
అక్కడ గాయపడ్డ స్త్రీలు స్త్రీ విలపిస్తూ కనిపించారు. ఎవరు మీరని ప్రశ్నిం ప్ర చాడు నారదుడు. ‘నీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా’ అని బదులిచ్చారు వారు. ‘ఇక్కడికెందుకొచ్చారు?’ అని ప్రశ్నిం ప్ర చాడు నారదుడు. ‘తుంబురుడు గానం చేస్తేస్వస్థత పొందుదామని వచ్చాం ’ అని బదులిచ్చారు. ఆ సమాధానంతో చిన్నబోయిన నారదుడు ఈసారిసంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణుడిపెద్ద భార్య రుక్మిణీదేవిని ఆశ్రయిం శ్ర చాడు. ఆమెశిక్షణలో సంగీతంలో అపార విద్వత్తును సాధించాడు.
ఎవరు గొప్ప విద్వాంసులో సాక్షాత్తు మహావిష్ణువు వద్దేతేల్చుకుందామంటూ తుంబురుడిని సవాలు చేశాడు నారదుడు. ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు. ఇద్దరిగానాన్నీ విష్ణుమూర్తిసంతృప్తిగా ఆలకించాడు. అయితే, ఎవరు గొప్పో తాను తేల్చలేనన్నాడు. ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒక్కడేనని చెప్పాడు. దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబుర నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్లారు. హనుమంతుడు న్యాయనిర్ణేతగా రాగా, దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు. తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రము త్ర గ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడిగిసంగీతంలో లీనమైంది.
తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు. మహతి మీటుతూ గానాన్ని సాగించాడు. నారదుడి గమకాల గారడీలకు ప్రకృ ప్రతిలో చలనం మొదలైంది. తుంబురుడిగానానికిగడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగికెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి. నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి. ప్రకృ ప్రతిలో జీవకళ ఉట్టిపడసాగింది. దేవతలందరూ తన్మయత్వంతో తలలూపసాగారు. నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు.
హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందోనని ఆత్రం గా చూడసాగారు. ‘ఇద్దరూ సమ ఉజ్జీలుగానేఉన్నారు. ఇంకో పరీక్ష పెడతాను. మీ వీణలు ఇలా ఇవ్వండి’ అడిగాడు హనుమంతుడు. ఇద్దరూ తమ వీణలను అతడి చేతికి అందించారు. హనుమంతుడు రెండు వీణలనూ తీసుకుని, రెండింటిలోని చెరో మెట్టును ఊడదీసివారికిఇచ్చాడు. ‘ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి’ అన్నాడు. దీంతో తుంబుర నారదులిద్దరూ అసహనానికిగురయ్యారు.
‘వీణలో అన్ని మెట్లూ ఉంటేనేకదా వాయించగలం. చెరో మెట్టు తీసేసిఇప్పుడు వాయించమంటేఎలా?’ అని అడిగారు. హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకుని, దాన్ని చీల్చాడు. దానికి తీగలు తగిలించాడు. ఎలాంటిమెట్లులేని వీణను తయారు చేశాడు. ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలుపెట్టాడు. మంద్రం గా మొదలైన స్వరఝరిక్రమంగా ఉధృతి అందుకుంది.
ఆ గానానికివైకుంఠం నుంచి మహావిష్ణు వేపరుగున అక్కడికివచ్చినా, అతడిరాకను గుర్తించలేనంతగా అక్కడిదేవతలందరూ తన్మయులయ్యారు. హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత తుం బుర నారదులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించా రు. హనుమద్గానంతో తమ కళ్లు తెరుచుకున్నాయని అన్నారు. వారి మాటలతో బాహ్యస్పృహలోకివచ్చిన దేవతలు అక్కడకు వచ్చిన మహావిష్ణువును గమనించారు. ఆయన అభిప్రాయం కోరారు. తుంబుర నారదులిద్దరూ తన భక్తులే అయినా, ఇద్దరిలోనూ ఇంకా అహం పూర్తిగా నశించలేదని, అందుకేవారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేక పోయారని, అహాన్ని వీడటం వల్లనేహనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు విష్ణువు.
నీతి: అహం ఉన్నంత కాలం ఏ విద్యలోనూ పరిపూర్ణత లభించదు. అహం విడనాడితేనే పరిపూర్ణత సాధ్యం.
No comments:
Post a Comment