Tuesday, June 3, 2025

****సాధన చతుష్టయం

 సాధన చతుష్టయం

వివేకం, వైరాగ్యం, ఇంద్రియ నిగ్రహం, మోక్షం....

 ఈ నాలుగింటిని సాధన చతుష్టయం అంటారు. 

వీటిని గుర్తెరిగి మనిషి  సాధన సాగిస్తే.. బ్రహ్మ విచారణ కలుగుతుంది. 

ఈసాధన తోనే మనిషి మాధవుడవుతాడు.

ఈ సాధనా క్రమంలో అవరోధాలు ఎన్నో వస్తుంటాయి. 

వాటిని ‘నౌకాగ్ర కాకవత’ పద్ధతిలో అధిగమించాలని చెబుతారు ప్రాజ్ఞులు. 

ఇంతకీ ‘నౌకాగ్ర కాకవత’ అంటే ఏమిటంటే...

పూర్వం ఒకానొక నౌకాశ్రమంలో.. ఒక నావ సముద్రయానానికి సిద్ధంగా ఉంది.

ఆ నావలో తెరచాప కట్టడానికి పొడవాటి కర్ర ఒకటి ఉంది.

దానిపై కాకి ఒకటి వాలింది. ఇంతలో నావ బయల్దేరింది. 

ఈ విషయాన్ని కాకి గుర్తించలేకపోయింది.

కాసేపటికి నావ సముద్రంలో నాలుగు మైళ్ల దూరం వెళ్లిపోయింది.

అప్పుడు కాకి దిక్కులు చూడటం మొదలుపెట్టింది.

ఎక్కడికి వెళ్లాలన్నా.. చుట్టూ సముద్రం. కనుచూపుమేరలో తీరం కనిపించడం లేదు.

ఆ  కాకి ఎగురుతోంది.. కొంత దూరం వెళ్లి.. మళ్లీ వచ్చి ఆ కర్రపై వాలుతోంది.

ఏం చేయాలో పాలుపోక.. ఆలానే ఉండి పోయింది ఆ కాకి . నావ అవతలి తీరం చేరే దాకా ఆ కర్ర మీదే కూర్చుండి పోయింది. 

ఇలా ఏమి చేయాలో పాలుపోక అయెామయ స్ధితి లో ఉండి సాధన ప్రారంభించింది. దీనినే   'నౌకాగ్ర కాకవత' అంటారు.
ఈనాడు మానవుడు భౌతికమైన నౌక మీద నా భార్య; నా పిల్లలు; నా సంసారం;  నా ఆస్థి  అంటూ కోర్కెలు; సమస్యలు అశాంతి  హింస అనే కొమ్మలపై వాలి ఆస్ధవ్యస్ధకు గురి అవుతున్నాడు.

ఇలా అస్ధవ్యస్ధతకు గరికాకుండా ఉండాలంటే పుట్టిన ప్రతీ మానవుడు ఆ కాకిలా  ఏదోఒక రోజన ; ఏదోఒక గంటలో ; ఏదోఒక ఘడియలో ఆనాపానసతి ధ్యానాన్ని ఆచరించక తప్పదు. బ్రహ్మ విచారణ చేయక తప్పదు. 

ఆలా  బ్రహ్మ విచారణ చేయాలంటే వివేకం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కావాలి.

వైరాగ్య చింతన ఏర్పడాలి. అప్పుడే మోక్షం వైపు అడుగులు పడతాయి.

ఇవి జరగాలంటే సాధనలో ఇబ్బంది కలిగించే అవకాశాలన్నింటినీ వదులుకోవాలి. 

శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే ఇంద్రియ సుఖాలు కలిగించే కొమ్మలపై వాలిపోయే అవకాశం లేకుండా చేసుకోవాలి.

క్రమం తప్పకుండా ఆనాపానసతి ధ్యానం చేయాలి.

 అప్పుడే.. ఇంద్రియ నిగ్రహం కలిగి.. మనసులో పరమాత్మ గురించి ఆలోచన మొదలవుతుంది.

అక్కడ్నుంచి వైరాగ్యం పుడుతుంది. చివరకు మోక్ష సాధనే లక్ష్యంగా ఆత్మ దర్శనమే గమ్యంగా నీ సాధనా ప్రయాణం సాగుతుంది.

No comments:

Post a Comment