"సుఖము లేదా దుఃఖం ఏదీ శాశ్వతం కాదు.?*
*ఈ రోజు మనం ఎలా ఉన్నామో, రేపు కూడా అలాగే ఉంటామా?*
ఉండం ఎందుకంటే
ఈ లోకంలో
ఏదీ శాశ్వతం కాదు!*
*ఒక ఆధ్యాత్మికవేత్త దేశాటన చేయడానికి కాలినడకన బయల్దేరాడు. రాత్రి బాగా పొద్దుపోయాక ఒక గ్రామంలో తన నడక ఆపి ఆనంద్ అనే
ఒక వ్యక్తి ఇంట్లో బస చేశాడు.*
"ఆనంద్ ఆధ్యాత్మికవేత్తకు చాలా చక్కని ఆతిథ్యం అందించాడు. మరుసటి రోజు
ఉదయం ఆనంద్ ఆధ్యాత్మికవేత్తకు చాలా
కానుకలు ఇచ్చి వీడ్కోలు పలికాడు.*
"ఆధ్యాత్మికవేత్త ఆనంద్ కోసం ఇలా ప్రార్థించాడు. "నీవు నీ జీవితంలో ముందుకు సాగడానికి భగవంతుని సహాయం నీకు ఎల్లప్పుడూ ఉండు గాక."*
*ఆధ్యాత్మికవేత్త చెప్పిన మాటలు విన్న ఆనంద్ నవ్వుతూ, "ఆధ్యాత్మిక వేత్తా, ఇదేదీ శాశ్వతం కాదు" అన్నాడు.*
*అది విన్న ఆధ్యాత్మికవేత్త అవాక్కయి అయి ఆనంద్ వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆపై నెమ్మదిగా అక్కడి నుండి వెళ్లిపోయాడు.*
*రెండు సంవత్సరాల తరువాత, ఆధ్యాత్మికవేత్త ఆనంద్ ఇంటికి తిరిగి వచ్చి చూడగా, అతని సంపద అంతా పోయింది. అక్కడికి దగ్గర్లోనే ఒక భూస్వామి వద్ద ఆనంద్ పని చేస్తున్నాడని తెలుసుకున్నాడు.*
*ఆధ్యాత్మికవేత్త ఆనంద్ ని కలవడానికి వెళ్ళాడు.
సంపదలు కోల్పోయి తనకంటూ ఏమీ లేనప్పటికీ కూడా ఆనంద్ ముఖంలో
పూర్వం లాగే ఆనందం.*
*ఆనంద్ ఆధ్యాత్మికవేత్తకు సాదరంగా స్వాగతం పలికాడు. తన గుడిసెలో చిరిగిన చాప మీద అతన్ని కూర్చోబెట్టి, తినడానికి ఎండిన రొట్టెలు ఇచ్చాడు.*
*మరుసటి రోజు ఉదయం వెళ్ళేటప్పుడు, ఆధ్యాత్మికవేత్త కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "అయ్యో భగవంతుడా! ఎంత పని చేసావు?", అని బాధపడ్డాడు.*
*ఆనంద్ మళ్ళీ నవ్వుతూ ఇలా అన్నాడు, "అధ్యాత్మిక వేత్తా, ఎందుకు బాధపడుతున్నావు? భగవంతుడు మనలను ఉంచిన స్థితికి కృతజ్ఞతతో ఉండాలని, అందులోనే సంతోషంగా ఉండాలని గొప్ప, గొప్ప వారు చెప్పారు కదా. కాలం ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఇది కూడా శాశ్వతం కాదు కదా, స్వామీ."*
ఆనంద్ మాటలకు ఆధ్యాత్మికవేత్త ఆలోచనలో పడ్డాడు. "ఆనంద్ నేను రూపాన్ని బట్టి మాత్రమే ఆధ్యాత్మికవేత్తను. నువ్వే నిజమైన ఆధ్యాత్మికవేత్తవు."*
*రెండు సంవత్సరాల తరువాత, ఆధ్యాత్మిక వేత్త మళ్లీ తన తిరుగు ప్రయాణంలో ఆనంద్ ను కలిశాడు. ఆనంద్ ఇప్పుడు చాలా పెద్ద భూస్వామిగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.*
*ఆనంద్ పనిచేసిన భూస్వామికి సంతానం లేదని, మరణ సమయంలో తన ఆస్తినంతా ఆనంద్ కి ఇచ్చాడని తెలుసుకున్నాడు. ఆధ్యాత్మికవేత్త ఆనంద్ తో
ఇలా అన్నాడు "చాలా మంచిది నాయనా నీ దారిద్ర్య సమయం గడిచిపోయింది. భగవంతుడు నిన్ను ఆశీర్వదించి నీ కష్టాలు తొలగించాడు, నువ్వు ఇలాగే ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను."*
*అది విన్న ఆనంద్ గట్టిగా నవ్వుతూ, "ఆధ్యాత్మిక వేత్తా, నువ్వు ఇంకా ఇలానే చెబుతున్నావా ? " అన్నాడు.*
*ఆధ్యాత్మిక వేత్త, "ఇది కూడా ఉండదంటావా?"*
తన సందేహం వెలిబుచ్చాడు.
"ఆనంద్ ఇలా బదులిచ్చాడు, "అవును, ఇది కూడా పోతుంది" లేదా దీనిని తన స్వంతంగా భావించేవాడే స్వయంగా వెళ్లిపోతాడు.
ఏదీ శాశ్వతంగా ఉండదు.
ఈ లోకంలో శాశ్వతమైనది
ఏదైనా ఉన్నది అంటే అది
ఆ పరమాత్మ మరియు సమస్త జీవరాశుల్లోనూ చరాచరములన్నింటి యందును నిండి యున్న పరమాత్మలో భాగమైన చైతన్యపూరితమైన ఆత్మ మాత్రమే."*
*ఆనంద్ మాటలు శ్రద్ధగా విన్న ఆధ్యాత్మికత వేత్త అక్కడి నుంచి వెళ్లిపోయాడు.*
*ఏడాదిన్నర తర్వాత అదే గ్రామానికి తిరిగి వచ్చి చూడగా, ఆనంద్ నివసించే భవనం అక్కడ ఉంది, కానీ అది పాడుబడి, పావురాలు ఆక్రమించుకుని ఉండడం గమనించి, ఆనంద్ మృతి చెందినట్లు తెలుసుకున్నాడు.*
అతనికి ఏ లోకాలు ఆహ్వానం పలికాయో తెలియదు కానీ
ఈ లోకం నుండి నిష్క్రమించాడు.
ఎప్పటిలాగే ఆకాశం సూక్ష్మంగా శూన్యంగా ఉంది! తాను నీరు పోసి పెంచిన ఉద్యానవనంలోని వృక్షాలు
తమ ఆకులపై మంచు బిందువులు నిలుపుకొని రోదిస్తున్నాయి, అంతఃపురంలోని పూల పాన్పులు ఖాళీగా ఉన్నాయి.
రాత్రి సమయాల్లో రంగురంగుల దీపాల వెలుగుల్లో వెలిగిపోయే రాజభవనం లో నేడు దీపాలు
వెలిగించే వారే లేక కళావిహీనమైపోయింది.
నేడు పొదలతో నిండిన అతని సమాధి మాత్రమే అక్కడ ఉన్నది. ఎక్కడా అతని జాడే లేదు."*
*ఆధ్యాత్మికవేత్త ఇలా అంటున్నాడు, "ఓ మానవా! నువ్వు దేనిని చూసి గర్వపడుతున్నావు? ఎందుకు నాదీ నేను అని గొప్పలు చెప్పుకుంటావు?
నాది నాది అని, నా వాళ్ళు నా వాళ్ళు అని భ్రమ పడుతున్నావు?ఇక్కడ ఏదీ మిగలదు, నీ దుఃఖం, నీ సంతోషం రెండూ శాశ్వతంగా ఉండవు. నువ్వు కూడా అంతే.
ఉన్నన్ని నాళ్ళు నువ్వు ఈ లోకంలోకి ఎందుకు వచ్చావో తెలుసుకుని ఆ పనిని పూర్తి చేసే పనిలో ఉండు*
నేను సుఖపడుతున్నాను ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నారని కొంతకాలం,
మరికొంత కాలం నేను కష్టపడుతున్నాను ఇతరులు
ఆనందిస్తున్నారని నీవు అనుకుంటున్నావు. కానీ ఇది విను, ఎవరి సరదాలు నిలవవు, ఎవరి కష్టాలు నిలవవు. ఎవరి కష్టనష్టాలైనా
సుఖదుఃఖాలైనా శాశ్వతంగా వస్తూ పోతూ ఉంటాయి.’
నీవు కూడా అంతే ఈ లోకానికి వస్తూ పోతూ ఉంటావు.
ఆ పరమాత్మ తత్వాన్ని అనన్య భక్తితో శ్రద్ధతో తెలుసుకుని ఆచరించిన వాడు మాత్రమే
అఖండ ఆనంద ఆత్మ స్థితిలో ఎల్లకాలం నిలిచి ఉంటాడు.*
ఎట్టి స్థితిలో నైనా అంటే తాము అనుభవించే ఈ కష్టమైనా సుఖమైనా తాత్కాలికమని తెలుసుకున్న వారే నిజమైన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు.*
"వారికి సంపదలు వస్తే, వారు
ఆ సంపదలతో సంతోషంగా ఉంటారు.ఒకవేళ ప్రారబ్దమును అనుసరించి వారు సంపదలు కోల్పోయి నిరాశ్రయులైతే, వారు ఆ స్థితిలో కూడా సంతోషంగా ఉంటారు.
ఎందుకంటే వారికి సంపదలు శాశ్వతము కాదనే అవగాహన ఉన్నది కనుక"*
*ఆధ్యాత్మికవేత్త తన మనస్సులో ఇలా చెప్పుకోవడం ప్రారంభించాడు, "ఆనంద్! నీ సహవాసం ధన్యమైనది, నీ గురువు ధన్యులు. నేను నకిలీ ఆధ్యాత్మికవేత్తను, నీ జీవితమే నిజమైన ఆధ్యాత్మికతత్వం. ఇప్పుడు నేను నీ చిత్రం వద్ద పుష్పాలు సమర్పించి, ప్రార్థనలు చేయాలనుకుంటున్నాను."*
"ఆయాచితంగా అనుకోకుండా కలిసొచ్చే సంపద గానీ, కష్టపడి సంపాదించిన సంపద గానీ ఏదీ మనతో రాదు! మనం అనుభవించవలసిన కర్మ ఫలాలు , సంపాదించుకున్న జ్ఞానం మాత్రమే మనతో పాటు వస్తాయి.
*ఆనంద్ చిత్రపఠం కోసం ఆ స్వామి అవతలి గదిలోకి వెళ్ళినప్పుడు, దాని మీద ఇలా వ్రాసి ఉంది...*
*చివరికి ఇది కూడా శాశ్వతం కాదు."
"ఈ సమస్త విశ్వమంతటా నిండియున్న నిరాకారుడు.
అఖండానంద నిర్గుణ స్వరూపుడు అయిన ఒకే ఒక్క పరమాత్మ యొక్క చైతన్యం మాత్రమే శాశ్వతమైనది.*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు*
*🌹లోకాస్సమస్త సుఖినోభవంతు🌹*
No comments:
Post a Comment