Tuesday, December 31, 2024

 మాట్లాడిన రాఘవేంద్ర స్వామి…

1800లో థామస్ మన్రో బళ్ళారికి కలెక్టర్‌గా ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఏదయినా ఆధ్యాత్మిక సంస్థ యజమాని మరణిస్తే ఆ చట్టం ప్రకారం ఆధ్యాత్మిక సంస్థలు విరాళంగా అందుకున్న భూములు, ఆస్థులు ఈస్ట్ ఇండియా పరమవుతాయి. 

ఆ చట్టంప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆస్థులు స్వాధీన పరుచు కోవటానికి మన్రో మఠానికి వెళ్ళారు. ఆయన చెప్పులు తీసి లోపలికి ప్రవేశించి బృందావనం దగ్గర నిలబడగానే బృందావనం పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో, ప్రకాశ వంతంగా చిరునవ్వుతో రాఘవేంద్రస్వామి దర్శనం ఇచ్చారు. స్వామి అతనితో స్పష్టంగా ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడారు. కాసేపు మాట్లాడిన పిమ్మట మన్రో అక్కడ నుండి వెళ్ళిపోయారు.అక్కడే ఉన్న మిగిలినవారికి బృందావనం సాధారణ కట్టడంగానే కనిపించింది. మన్రో ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కాలేదంట. తనకి భౌతికంగా కనిపించి తనతో మాట్లాడారు కాబట్టి స్వామి జీవించి ఉన్నట్టే అని భావించి చట్టం నుండి మంత్రాలయం మఠానికి మినహాయింపునిచ్చారు. ఈ గెజెట్ ఇప్పటికీ అందుబాటులో ఉందంట. ఆయన తన డైరీలో "వాట్ ఎ మేన్? ఆ కళ్ళలో కాంతి, మృదువుగా పలికినా శాసించే స్వరం, ధారాళమైన ఆంగ్లం మాట్లాడారు" అని వ్రాసుకున్నారంట.

ఇంకొక సంఘటన…..
గండి లోయలో వాయుదేవుడు ధ్యానంలో ఉండగా, సీతమ్మవారిని వెతుకుతూ శ్రీరాముడు అటుగా వచ్చాడు. వాయుదేవుడు తన ఆతిధ్యం స్వీకరించమని కోరగా తిరుగు ప్రయాణంలో వస్తానని మాట ఇచ్చాడు రామయ్య. లంకలో రాముని విజయ వార్త చెవినపడ్డ వాయుదేవుడు తిరుగు ప్రయాణంలో అటుగా వచ్చే రాముని విజయానికి గుర్తుగా లోయపైన ఒక బంగారు తోరణాన్ని అలంకరించాడు. ఆ తోరణం ఇప్పటికీ పవిత్రాత్మ కలిగిన వారికి కనిపిస్తూ ఉంటుంది. ఆ తోరణం కనిపించినవారికి మరుజన్మ ఉండదని ప్రశస్తి.

థామస్ మన్రో తన పదవీకాలం ముగుస్తుండగా చివరిసారి అన్ని ప్రాంతాలనూ దర్శించటానికి బయలుదేరినప్పుడు గండి క్షేత్రంలో లోయగుండా గుర్రాలపై సాగుతున్నాడు. హఠాత్తుగా తల ఎత్తి చూస్తే ఎత్తులో బంగారుతోరణం కనిపించింది. "ఇంత అందమైన బంగారు తోరణం అంత ఎత్తులో ఎవరు అలంకరించారు?" అని తన వెనుక వస్తున్న సేవకుల్ని అడిగారు. సేవకులు చుట్టూ చూసి తమకి ఏమీ కనిపించటం లేదని చెప్పారు. వారిలో ఒక ముసలి సేవకుడు మాత్రం అది కేవలం పవిత్రమైన ఆత్మ కలవారికే కనిపిస్తుందని చెప్పాడు. కానీ దానిని చూసిన వారు  కొద్దిరోజుల్లోనే మరణిస్తారని చెప్పాడు. మన్రో అప్పటికి మౌనంగా ఊరుకున్నారు. కానీ ఆరునెలలలోపే కలరాతో మరణించారు.

చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్‌ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కానుకగా ఇచ్చాడు. దీనినే మన్రో గంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు. ఒక ఆంగ్లేయునికి మన దేశంలో  ఇన్నివిధాలుగా దేవుని నిదర్శనాలు కనిపించినా ఈ సంఘటనలకు మనం సరైన ప్రచారం కల్పించటంలో విఫలమయ్యామేమో అనిపిస్తుంది. 

మనం కూడా చెప్పకపోతే ఈ తరానికి రాబోయే తరాలకు తెలిసేదెలా…...
 మాట్లాడిన రాఘవేంద్ర స్వామి…

1800లో థామస్ మన్రో బళ్ళారికి కలెక్టర్‌గా ఉండగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఏదయినా ఆధ్యాత్మిక సంస్థ యజమాని మరణిస్తే ఆ చట్టం ప్రకారం ఆధ్యాత్మిక సంస్థలు విరాళంగా అందుకున్న భూములు, ఆస్థులు ఈస్ట్ ఇండియా పరమవుతాయి. 

ఆ చట్టంప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ఆస్థులు స్వాధీన పరుచు కోవటానికి మన్రో మఠానికి వెళ్ళారు. ఆయన చెప్పులు తీసి లోపలికి ప్రవేశించి బృందావనం దగ్గర నిలబడగానే బృందావనం పారదర్శకంగా మారి లోపల కాషాయ వస్త్రాలతో, ప్రకాశ వంతంగా చిరునవ్వుతో రాఘవేంద్రస్వామి దర్శనం ఇచ్చారు. స్వామి అతనితో స్పష్టంగా ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడారు. కాసేపు మాట్లాడిన పిమ్మట మన్రో అక్కడ నుండి వెళ్ళిపోయారు.అక్కడే ఉన్న మిగిలినవారికి బృందావనం సాధారణ కట్టడంగానే కనిపించింది. మన్రో ఎవరితో మాట్లాడుతున్నారో అర్ధం కాలేదంట. తనకి భౌతికంగా కనిపించి తనతో మాట్లాడారు కాబట్టి స్వామి జీవించి ఉన్నట్టే అని భావించి చట్టం నుండి మంత్రాలయం మఠానికి మినహాయింపునిచ్చారు. ఈ గెజెట్ ఇప్పటికీ అందుబాటులో ఉందంట. ఆయన తన డైరీలో "వాట్ ఎ మేన్? ఆ కళ్ళలో కాంతి, మృదువుగా పలికినా శాసించే స్వరం, ధారాళమైన ఆంగ్లం మాట్లాడారు" అని వ్రాసుకున్నారంట.

ఇంకొక సంఘటన…..
గండి లోయలో వాయుదేవుడు ధ్యానంలో ఉండగా, సీతమ్మవారిని వెతుకుతూ శ్రీరాముడు అటుగా వచ్చాడు. వాయుదేవుడు తన ఆతిధ్యం స్వీకరించమని కోరగా తిరుగు ప్రయాణంలో వస్తానని మాట ఇచ్చాడు రామయ్య. లంకలో రాముని విజయ వార్త చెవినపడ్డ వాయుదేవుడు తిరుగు ప్రయాణంలో అటుగా వచ్చే రాముని విజయానికి గుర్తుగా లోయపైన ఒక బంగారు తోరణాన్ని అలంకరించాడు. ఆ తోరణం ఇప్పటికీ పవిత్రాత్మ కలిగిన వారికి కనిపిస్తూ ఉంటుంది. ఆ తోరణం కనిపించినవారికి మరుజన్మ ఉండదని ప్రశస్తి.

థామస్ మన్రో తన పదవీకాలం ముగుస్తుండగా చివరిసారి అన్ని ప్రాంతాలనూ దర్శించటానికి బయలుదేరినప్పుడు గండి క్షేత్రంలో లోయగుండా గుర్రాలపై సాగుతున్నాడు. హఠాత్తుగా తల ఎత్తి చూస్తే ఎత్తులో బంగారుతోరణం కనిపించింది. "ఇంత అందమైన బంగారు తోరణం అంత ఎత్తులో ఎవరు అలంకరించారు?" అని తన వెనుక వస్తున్న సేవకుల్ని అడిగారు. సేవకులు చుట్టూ చూసి తమకి ఏమీ కనిపించటం లేదని చెప్పారు. వారిలో ఒక ముసలి సేవకుడు మాత్రం అది కేవలం పవిత్రమైన ఆత్మ కలవారికే కనిపిస్తుందని చెప్పాడు. కానీ దానిని చూసిన వారు  కొద్దిరోజుల్లోనే మరణిస్తారని చెప్పాడు. మన్రో అప్పటికి మౌనంగా ఊరుకున్నారు. కానీ ఆరునెలలలోపే కలరాతో మరణించారు.

చిత్తూరు కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్‌ మన్రో పెద్ద వెండి గంగాళాన్ని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కానుకగా ఇచ్చాడు. దీనినే మన్రో గంగాళం అంటారు. నేటికీ స్వామివారికి దీనిలోనే నైవేద్యం పెడతారు. ఒక ఆంగ్లేయునికి మన దేశంలో  ఇన్నివిధాలుగా దేవుని నిదర్శనాలు కనిపించినా ఈ సంఘటనలకు మనం సరైన ప్రచారం కల్పించటంలో విఫలమయ్యామేమో అనిపిస్తుంది. 

మనం కూడా చెప్పకపోతే ఈ తరానికి రాబోయే తరాలకు తెలిసేదెలా…...
 అతిగా అడ్రినలిన్ ఉత్పత్తిని ప్రేరేపించే పని ఆరెస్సెస్ చెయ్యదు....

ఈ సంస్థది వందేళ్ల అత్యంత జాగరూకతతో కూడిన అనుభవం...

వేల సంవత్సరాల చరిత్రను సూక్ష్మ పరిశీలనతో అర్థం చేసుకున్న నైపుణ్యం....

ఈ జాతికి జీవ నాడి అయిన సనాతన ఆధ్యాత్మిక సాంస్కృతిక ఏకత్వం...రాజకీయ భౌగోళిక ఏకాత్మతగా కూడా పరిణమించడానికి ఏర్పడిన సంఘటనా రూపం ఇది...

అది ఈ ప్రపంచానికి అవసరం...నిజానికి విశ్వానికే అవసరం...

ఎక్కడ తగ్గాలో... ఎప్పుడు నెగ్గాలో...లభించిన విజయాన్ని ఎలా నిలుపుకోవాలో తెలిసిన వ్యవస్థీకృత రూపం ఈ ఆరెస్సెస్...

ముస్లిములకో... క్రైస్తవులకో వ్యతిరేకంగా ఏర్పడిన సంస్థ కాదు ఇది....

ఈ అడ్రినలైన్ హార్మోన్ ఉత్తేజితం చేసి యుద్ధం చేయించవచ్చు...కానీ...

అదే అతిగా శరీరంలోకి ప్రవేశిస్తే...నిద్ర లేమితో కృంగి పోవచ్చు..గుండె ఆగిపోవచ్చు.... 

పోరాడ వచ్చునన్నది ఎంత నిజమో...అస్త్ర సన్యాసం చేసి పారిపోనూ వచ్చునన్నది అంతే నిజం...

ఈ జాతి... ఈ దేశం అనేక పరివర్తనా సంధి కాలాలను చూసింది...

భయానక...భీతావహ రాక్షస దాడులను ఎదుర్కొంది...

శివాజీ కాలం నాటి పరిస్థితుల కంటే భిన్నమైనవి కావు..ఇప్పటి పరిస్థితులు...

కేవలం తాత్కాలిక ఉద్రేకాలకి లోనైన కొంత హిందూ సమాజం...మరింత తాత్కాలికమైన...స్వల్పకాలిక రాజకీయ విజయాలను మాత్రమే...చూసి మురిసిపోతోంది...

కొంత కాలం శివాజీ ...శ్రీ కృష్ణ దేవరాయలు వంటి వారు ఈ సమాజానికి ధర్మ స్థాపన అనుభూతిని కలిగించినప్పటికీ ...తిరిగి ఏమయ్యింది...

ఎంతలో ఎంత పతనాన్ని చవిచూసింది...

ఇంత సుదీర్ఘ సంఘర్షణల చరిత్ర కాలంలో...ఇప్ప్పుడు కనిపిస్తున్న హిందూ వాసనలు కలిగిన ప్రభుత్వం ఎంత చిన్న ఏర్పాటు...

దీన్ని చూసే...ఇంత తాత్కాలిక విజయాలను చూసే...వీరంగాలు వేస్తే...15 నిమిషాలు టైమిస్తే...లేపేస్తానని వాగిన వాడికీ..మనకీ తేడా ఏముంటుంది...

అయోధ్య ఉద్యమం ఎంతటి పెద్ద ఉద్యమం...దాని తర్వాత కూడా... దశాబ్దాల పాటు కోర్టు తీర్పులకు వేచి చూసే కదా ఆ భవ్య నిర్మాణం చేసుకున్నది....

ఆ సంయమనం...ఆ ఓపికా మాత్రమే లభించిన విజయాలను శాశ్వతం చేస్తుంది...

లేకపోతే...తెచ్చుకున్న కాస్త విశ్వాసం మట్టిలో కలిసిపోతుంది....

ఇప్పుడు హిందూ సమాజం జాగృతమయిన మాట నిజమే...

ఆరెస్సెస్ కంటే ఎక్కువ సమాచారం...ఆలోచన సాధారణ వ్యక్తి దగ్గర కూడా ఉంది...

సోషల్ మీడియా వల్ల మరింత లోతుగా విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి...

హిందువు తనను తాను తెలుసుకుంటున్నాడు...

కానీ...అత్యంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడితే...ఈ సమాచారంతో మెదడు ఉద్రేక పరుచుకున్న హిందువు...యుద్ధం చేస్తాడా...పారిపోతాడా  అన్నది జాగ్రత్తగా అంచనా వెయ్యవలసిన స్థితి...

అందుకే...ఇప్పుడు ఆరెస్సెస్ కృష్ణుడి తరహా లౌక్యం..యోజన...వ్యూహం పాటిస్తున్నది...

ఒక శివాజీ తీరులో వ్యవహారాలు సాగిస్తున్నది...

ఇది సగటు భారతీయుడ్ని మోసం చెయ్యడం కాదు...అర్థం చేసుకుని నడుస్తున్న తీరు...

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు గతంలో ప్రతి మసీదు క్రింద ఆలయం వెతకద్దు అని చేసిన సూచనను..ఈ నేపథ్యం లోనే అర్థం చేసుకోవాలి...

మోడీ గారు మనకి కలుగుతున్న ఉద్రేకాన్ని...బంగ్లాదేశ్ మీద చూపకుండా ఆగుతున్నది కూడా అలాగే అర్థం చేసుకోవాలి...

ప్రజల మధ్య వైషమ్యాలు కాదు...భౌతికంగా కొందరిని నిర్మూలించేస్తే సరిపోతుంది అనుకునే ఎడారి మనస్తత్వం కాదు మనది...

ఇప్పుడు వస్తున్న సాంస్కృతిక జాతీయవాద చైతన్యం నీటి బుడగ కారాదు...

అసలైన సంఘటనా శీలుర యొక్క ఆలోచన అనవసర భావోద్వేగాలకు దూరంగా ఉండాలి...

అలాంటి చైతన్యవంతమైన....ఉత్తమ సమాజాన్ని మనం నిర్మించుకోవాలి...

హృదయం రగిలినా...మెదడు ఆలోచన శాంతంగా చెయ్యాలి...

అటువంటి వ్యవస్థలోనే భారత్ విజయం సాధించగలుగుతుంది..

అదే ఆరెస్సెస్ ఇస్తున్న శిక్షణ....

భారత మాతకు జయమగు గాక!
 *మనిషి జీవితం క్షణకాలం* ..

*ఈ క్షణాన భూమి మీద ఉన్నాం,*
 *మరు క్షణాన భూమి కింద ఉంటాం.*
 *ఈ సత్యం అందరికీ తెలుసు* 
*కానీ ఆ భూమి మీద ఉన్న వాళ్ళు అనేక కుట్రలు,కుతంత్రాలు....*

 *తల్లితో కొడుకు పడడం లేదు,*
 *కొడుకుతో తల్లికి పడడం లేదు;*
 *అన్నదమ్ముల మధ్య ఆస్తితగాదాలు ;*
*అక్క చెల్లెల మధ్య పెట్టిపోతల ఇబ్బందులు;*
*భార్యాభర్తల మధ్య అన్యోన్యత కరువు;* 
*ప్రియుడు ప్రియురాలు మధ్య అపార్థాలు*
 *అత్తా కోడల మధ్య ఆధిపత్య పోరు......*

*మరి పుట్టేటప్పుడు ఏమి తీసుకురాలేదు,*
 *పోయేటప్పుడు ఏమీ తీసుకుపోము అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా..*
*మరి అన్ని తెలిసిన వాళ్ళు ఈ చిన్న చిన్న విషయాలకు ఎందుకు కొట్టుకు చస్తున్నారు."* 

*ప్రతీ విషయంలో *EGO* ఎందుకు వస్తుంది?
ఎదుటివారిని అర్థం చేసుకోలేనంత అగాధం మనుషుల మధ్య ఎందుకు ఏర్పడుతుంది....?
 ఈ రోజుల్లో రక్తసంబంధం లో రక్తం మిగిలింది కానీ సంబంధం తెగిపోయింది....*

 *దయచేసి మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు చూసిన మొఖం రేపు కనపడటం లేదు..*
*కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా కూర్చొని మాట్లాడుకుంటే ఏదో ఒక రోజున పరిష్కారం దొరుకుతుంది...*
 *మనుషుల్ని దూరం చేసుకుని ఆస్తులు* *కూడబెట్టుకోకండి*,
 *ఆస్తులు దూరమైన మనుషుల్ని దగ్గర పెట్టుకోండి*
 *నువ్వు చచ్చిన రోజున మోసుకెళ్లడానికైనా పనికొస్తారు 😌😌*
 🦚🪷🌻🌹💎🌈

 *🍁మనం ఎంత గొప్ప వాళ్ళయినా...ఏదో ఒక రోజుకి మనం ఉన్న ఇల్లు,స్థలము,మనకి కావాల్సిన వారందరిని వదిలేసి వెళ్లిపోవాల్సిందే.మనకంటూ సంబంధించింది ఏది మనతో రాదు.ఈ మనుషులు.ఈ ఆలోచన..ఈ జీవితం.అంతా...మాయ సంకల్పం.కోరికలు ఉరవడిలో కొట్టుకుపోయే మనసుకి ఆలోచించే సమయం అసలే దొరకట్లేదు.*

 *కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక అదేంటి అప్పుడే నా జీవితమంతా అయిపోయిందా అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకాలుగా మిగిలిన గుర్తులు మాత్రం ఉంటాయి.కొంతమంది స్వార్థపరులు మిగిల్చిన కన్నీరు మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం మనం పడిన కష్టం గుర్తుకు వచ్చిన ప్రతీ సారి గుండెను పిండేస్తూ ఉంటాయి.అవి మనకు తప్ప ఇంకెవరికి గుర్తుండదు.వారికి ఏదైతే అవసరమో దానికోసమే వాళ్ళ కోరుకున్నది జరిగేవరకు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటారు..దాన్ని ప్రేమ,ఆప్యాయత అనుకుని పొరపడితే...ఆఖరికి బాధపడేది,గాయపడేది శూన్యమై మిగిలిపోఏది మనమే.మన అనుకున్న వాళ్లు మనలని ఏదో ఉద్ధరిస్తారనుకోవటం మన పిచ్చి,మన పొరపాటు.. మనసు పిచ్చిది అది సాగరంలా పరుగులు పెడుతూనే ఉంటుంది.* 

 *కోరికలు కెరటాలై ఎగసిపడుతూనే ఉంటాయి ఆ సముద్రాన్నికి కూడా ఆనకట్ట ఉనట్టే నీ ఆలోచనలకు కూడా ఒక అనకట్టు వేసుకో అందులో మంచి ఏంటో,చెడేంటో అన్నది విచక్షనతో నిర్ణయం తీసుకుని అడుగులు వెయ్యి.నీ జీవిత పయనంలో ఎంతమందిని చూసావో...ఎంతమందితో మాట్లాడావో....ఎన్నో వేల  కోట్ల కిలోమీటర్లు  దాటుకుంటూ ప్రయాణం చేసావో..నీకు తెలియని,నువ్వు చూడని వసంతాలే మున్నాయ్.రుతువులు ఎన్ని మారినా..మారని మన తలరాతలు అలానే ఉన్నాయ్.మన జీవితంలో కొన్ని ఇవ్వాలి ,మరికొన్ని తీసుకోవాలి.స్వార్థం ఉండొచ్చు.కోరికలు ఉండొచ్చు. మోసంతో కూడిన ప్రవర్తన ఉండకూడదు.లైఫ్ ఎండింగ్ ఎలా ఉండాలి అంటే మన చావుని చూసి ఆ స్మశానం కూడా కన్నీరు పెట్టేలా ఉండాలి.* 

 *🌄శుభోదయం 🌞*

🦚🌻🌹💎🪷🌈
 *_ఆశావాదికి కష్టాలు కనిపించవు. కేవలం అవకాశాలే కనిపిస్తాయి. మొక్కకు భూమి కింద రాయి తగిలినా కూడా తడి తగిలే దాకా వేళ్లను విస్తరిస్తూనే ఉంటుంది. ఆశావాది కూడా అంతే..._*

*_సృష్టిలో అన్ని జీవుల కన్నా తెలివైన జీవి మనిషే. కానీ ఏ జీవి కూడా ఓడిపోవాలని అనుకోవు. పరిస్థితులు కలిసి రాకపోతే ఏ జీవీ ఆత్మహత్యలు చేసుకోవు. కానీ,_*

*_మన దౌర్భాగ్యం ఏంటంటే... మనిషి మాత్రం ఈ పనులన్నీ చేస్తాడు. ఓడిపోతే తీవ్ర నిరాశకు లోనవుతాడు కానీ ఇతర జంతువులు ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందుకే అవన్నీ ఆశావాదులే._*

*_అందుకే ఇతర జంతువుల్లో నిరాశ కనిపించదు. ఒకచోట పడితే మరోచోటకు వెళ్లి ప్రయత్నిస్తాయి. ఇతర జీవులు కానీ మనిషి ఓటమి ఎదురైతే చాలు తీవ్రంగా నిరాశ పడిపోతాడు._*

*_రేపు మరో అవకాశం వస్తుందనే విషయాన్ని మరిచిపోతాడు. అందుకే మనుషులంతా ఆశావాదులుగా మారాలి. ఆశావాదాన్ని ఆశ్రయించిన వారికి నిరాశ ఎదురవదు._*

*_ఈరోజు ఓటమి ఎదురైతే రేపు గెలుపు దక్కుతుందని ఆశపడండి. అదే మీ ఆయుష్షును పెంచుతుంది. ఆశీర్వాదం ఎంత బలీయమైనదంటే చివరి శ్వాస వరకు ప్రాణాన్ని నిలిపి ఉంచే శక్తి దానికి ఉంది...☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌸🌸🌸 🌷🙇🏻🌷 🌸🌸🌸
 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
             *లయాత్మక జీవనం*


*చిన్నారి బుడత నెలల వయసులో తప్పటడుగులతో నడక ప్రారంభిస్తాడు. ఆగిఆగి లయగా బిడ్డ అడుగులు భూమిపై పడుతుంటే కన్నతల్లి మురిసిపోతుంది. తనపై పడే ఆ చిట్టి అడుగుల కమనీయ స్పర్శకు నేలతల్లి సైతం పులకించిపోతుంది. సూర్యభగవానుడు తూర్పు కొండలనుంచి ఉన్నపళంగా ఆకాశంలో కానరాడు. కొండచరియలనుంచి అరుణకాంతులతో కూడిన ఉషోదయపు వెలుగుతో నెమ్మదిగా ఆవిర్భవిస్తాడు. ఆ తరవాత భానుడు లయాత్మకంగా కొండ అంచును దాటుతాడు. నేలపై సూర్యకిరణాలు విరాజమానమవుతూ కనువిందు చేస్తాయి. బింబ కదలికలు కనిపించవు గానీ మధ్యాహ్న సమయానికి ఆకాశం మధ్యలో ప్రకాశిస్తాడు భానుడు. ఆ తరవాత మెలమెల్లగా కిందికి వాలుతూ పడమర దిక్కున దిగంతంలో కలిసిపోతాడు.*

*చందమామ గమనమూ అంతే. లయాత్మకమైనది. భూమిలో విత్తనాలు నాటుతాం. ఎండ, గాలి, చెమ్మ తగిలాక మూడో రోజుకు దళాలతో మొక్క ఊపిరి పోసుకుంటుంది. ఆకృతి దాల్చి మనోహరంగా కనిపిస్తుంది. అలా మొక్క లయాత్మకంగా ఎదుగుతూ పెద్దదవుతుంది. సుదూరం నుంచి అలలా సాగి గాలిలో వినిపించే ఓ పల్లెపదం వీనులవిందు చేస్తుంది. ఆ మనోహర గీతం వినబడే దిక్కుపై దృక్కులు సారిస్తాం. అలాగే నాట్యరవళి పరవశానికి గురిచేస్తుంది. సంగీత నాట్యకళలు లయ ప్రాధాన్యంగా సాగుతాయి. సాహిత్యంలోని ఛందస్సులో లయ ఉంటుంది.*

*ఓ ఆనకట్ట కట్టాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఓ ఆకాశ హర్మ్యం నిర్మించాలన్నా అంతే. ఓ నిర్మాణాన్ని కూల్చడం గంటల్లో పని! విత్తనం, మొక్క, పువ్వు, పిందె, కాయ... ఇలా దశలు దాటు కుంటూ ఓ సమయానికి ఫలసాయం అందిస్తాయి వృక్షాలు. విధ్వంసక ఘటనలు ప్రకృతిలో మెరుపు వేగంతో జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, సుడిగాలులు, కార్చిచ్చులు... ఇలా మానవ వినాశానికి కారణమయ్యే ఉత్పాతాలు హెచ్చరిక లేకుండా విధ్వంసం సృష్టిస్తాయి.*

*లయాత్మకంగా మానవుడు జీవించాలని, ఆ దిశగా జీవనశైలి అలవరచుకోవాలని ప్రకృతి ఆకాంక్ష కాబోలు అనిపిస్తుంది. అటువంటి లయలో క్రమశిక్షణ దాగుంటుంది. లయ తప్పినప్పుడు ఊహకందని పరిణామాలు చోటుచేసుకుంటాయి. గుండె నిర్ణీత వేగంలో లయాత్మకంగా నడుస్తుంది. ఆ వేగం హెచ్చినా, తగ్గినా ముప్పే. అందుకే మనిషి లయాత్మక జీవనం సాగించాలని ప్రకృతి చెబుతుంది. గురువులు బోధిస్తారు. అది జీవనశైలిని ఏర్పరచుకోడానికి తోడ్పడుతుంది. యోగా, ధ్యానం వంటి అభ్యాసాలు సైతం లయాత్మకంగా చేయవలసి ఉంటుంది. వేగంగా సాగే నడక మంచిదంటారు. వేగంగా నడిచే నడకలోనూ ఓ లయ ఉంటుంది. అలా హృదయ కండరాలు బలపడతాయి. కొందరు హడావుడిపడుతూ వేగంగా పనులు చేయాలని చూస్తారు. కచ్చితత్వంతో వేగంగా పనిచేయగల సామర్థ్యం యంత్రాలకే పరిమితం. మానవుడు యంత్రంలా జీవించకూడదు. లయాత్మక జీవితం గడిపేవారు ఒత్తిడికి దూరంగా ఆరోగ్యంగా జీవిస్తారంటారు ఆరోగ్య నిపుణులు.*

*శిశువు జన్మించేముందు తొమ్మిది మాసాలు గర్భవాసం చేస్తుంది. ఒక పువ్వును భయపెట్టి, తొందరగా వికసింపజేయలేం. హృదయం ఆనంద మాధుర్యాన్ని ఆస్వాదించిన వేళ కళాకారుడిలో సృజన జాగృతమవుతుంది. భయభ్రాంతులకు గురైన వేళ అతడు కళాఖండాలను సృజించలేడు. ప్రాణుల సహజ ఆవిర్భావం, అంతర్ధానం సైతం లయను సంతరించుకునే జరుగుతాయి. లయతో అనుసంధానమై జీవయాత్ర చేసినప్పుడు మనుషులు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తారన్నది నిపుణుల మాట. మానవుల శారీరక, మానసిక వ్యవస్థలు లయాత్మక నడవడికి అనుగుణంగా నిర్మితమైనవే కాబట్టి అలా జీవిస్తే వారి జీవితాలు సార్థకమవుతాయి. ఆనందనందనాలవుతాయి.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*సర్వేజనాః సుఖినో భవంతు*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴
 *దేవుని దయ*

అమ్మ లక్ష్మీ దేవి స్వామి వక్షస్థలంపై ఎందుకు ఉంటుంది. మాములుగా దయ, జాలి అనేది మనిషికి ఎక్కడ ఉంటుంది అంటే అది హృదయంలో అని చెప్పొచ్చు. అయితే దయను ఒక రూపు కడితే అది మన అమ్మ లక్ష్మీదేవి. అందుకే అమ్మ స్థానం స్వామి యొక్క హృదయం వద్ద. అక్కడ ఆమె నిరంతరం ఉంటుంది. 

అందుకే అమ్మకు పేరు 'విష్ణువక్షస్థల స్థిత' అని. అందువల్లే మనం రక్షణ అనేది పొందగల్గుతున్నాం. దయ అనేది భగవంతునితో ఏమి చేయిస్తుంది అనేది ఈ శ్లోకంలో వివరిస్తున్నారు.

స్వస్తి శ్రీర్దిశతాదశేషజగతాం సర్గోపసర్గ స్థితీః స్వర్గం దుర్గతీం అపవర్గికపదం సర్వం చ కుర్వన్ హరిః | 

యస్యా వీక్ష్య ముఖం తదింగిత పరాధీనో విధత్తేఖిలం క్రీడేయుం ఖలు నాన్యథాస్య రసదా సాదైకరస్యాత్తయా ||

'అశేషజగతాం' సఖల ప్రాణికోటికి 'శ్రీః' లక్ష్మీ దేవి 'స్వస్తి దిశతాత్' శుభాన్ని కలిగించుగాక. 'హరిః' కర్మ భారాలను, దోశములని హరింపజేసి జీవులని తరింపజేసే హరి అని పిలవబడే సర్వేశ్వరుడు. ఏంచేస్తాడు ఆయన...

'సర్గ' రూపులేని జీవుల్లకి రూపకల్పన చేస్తాడు, 'ఉపసర్గ' ఆ వచ్చిన రూపాలతో ఎందరికో మరిన్ని రూపాలని కలిపిస్తాడు, తిరిగి వెనకను తీసుకుంటూ ఉంటాడు. 'స్థితీః' ఉన్న వాటిని రక్షిస్తుంటాడు. అంతే కాదు మన కర్మను బట్టి 'స్వర్గం దుర్గతీం' స్వర్గ నరకాలని ఇస్తాడు. లేదా కర్మ తొలగిపోతే 'అపవర్గికపదం' మోక్షాన్ని ఇస్తాడు.

'సర్వం చ కుర్వన్' ఇవన్నీ చేసేప్పుడు 'యస్యా వీక్ష్య ముఖం' అమ్మ ముఖం చూస్తూ ఉంటాడు. 'తదింగిత పరాధీనః' ఆమె ఇంగితానికి పరాధీనుడై ఉంటాడు. అంటే 'విధత్తేఖిలం' ఏది చేసినా అమ్మ ముఖం చూస్తూనే చేస్తాడు. ఆమె ముఖం ఆనందగా ఉంటే ఆయన చేసే సృష్టీ, స్థితీ, లయాలు ఆనందంగా సాగుతాయి.

మనిషి పుట్టడం, పెరగడం మరియూ మరణించడం అన్నీ ఆనంద దాయకంగా సాగాలనే కదా ఎవరైనా కోరుకొనేది. ఆమె ముఖంలో కొంచం ఉదాసీనంకానీ, కోపం కానీ కనిపిస్తే ఆయన చేసే కార్యాలన్ని భాదను కలిగించేలా ఉంటాయి. అంటే దయ అనేది ఎదుటివారికి ఆనందం కలిగించేలా ఉంటుంది. ఆయన చేసే ఇన్ని కార్యాలన్నీ ఆయనకు పెద్ద భారం కాదు, అవలీలగా చేస్తాడు 'క్రీడేయుం ఖలు' ఒక పిల్లవాడి ఆట మాదిరిగా ఇంత శ్రమచేస్తున్నాను అని అనుకోడు. ఎందుకు ఇలా చేస్తాడు...

'సాదైకరస్యాత్తయా' అమ్మతో ఏకరసత కావాలని అని అనుకుంటాడు. ఆమె ముఖంలో ఆనందమే తనకు ఆనందం. ఆవిడ ముఖంలో దుఖమే ఆయనకూ దుఖం. 'అన్యథాస్య రసదా నా' వారిరువురులో ఏకరసతే తప్ప మరొకటి ఉండనే ఉండదు. అట్లాంటి స్వరూపం వారిరువురిది. మన రక్షణ కోరుకునే వారు ఒక్కరున్నా చాలు కానీ ఇరువురు ఉన్నారంటే మనలో ఎంతో విశ్వాసం జనిస్తుంది. వేదం మనకు ఇదే విషయాన్ని తెలుపుతుంది.

సామాన్యంగా దేవునికి దయలేదు అని నిందించేవారికి ఇది ఎంతో స్పూర్తినిస్తుంది. దయ కలిగిన అట్లాంటి భగవంతునికి చెందినవాడిని అని ఒక్క సారి జ్ఞాపకం చేసుకుంటే మనం భగవంతుడిని నిందించే అవసరం ఏర్పడదు.        
 *క్షేత్రార్వాణం* 

అర్వాణం అంటే యోగ్యమైనది, తగినది, లాభదాయకమైనది. అని అర్ధం చెప్పవచ్చు. క్షేత్రార్వాణం అంటే నిర్మాణాలకు అనుకూలమైన క్షేత్రాన్ని యజమాని యొక్క వర్గుణకు లేదా నామరాశికి అశుభ ఫలితాలను ఇచ్చే దిక్కులను ఎన్నుకోవాలి.   

శ్లో:- క్షేత్రస్యాకచటాః క్రమాతపయశా వర్గాస్స్యురష్టౌ స్ధితాః
ప్రాగాదౌఖగరాడ్బిడాల మృగరాట్చ్వహ్యాఖునాగశ్శశః
స్యాద్వర్గాద్యది పంచామోరి రధదిగ్వర్గేషు యోని స్త్రీయమ్
దౌదౌదిక్షు విదిక్షు చైక మఖిలం మేషాది పూర్వాదితః 


  గృహం నిర్మించే భూమికి తూర్పు మొదలు ఈశాన్యం వరకు అ, క, చ, త, త, ప, య, శ అను ఎనిమిది ప్రధామాక్షర వర్గులగను వీటికి ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయువ్య, కుబేర, ఈశాన్య అష్టదిక్పాలకులు వర్గాధిపతులగును. గరుడ, మార్జాలం, సింహం, శునకం, సర్పం, మూషికం, గజం, శశములు వర్గ జంతువులుగాను ఏర్పడినవి. 

మాయామతం ఆధారంగా క్షేత్రాన్ని తూర్పు కొలతగా 9 సమభాగాలుగా చేసి అందు ఈశాన్యం 2 భాగాలు, ఆగ్నేయం 2 భాగాలు, వదలగా మధ్యగల ఐదు భాగాలు తూర్పు అవుతుంది. అదేవిధంగా దక్షిణ దిశను 9 భాగాలుగా చేసి అందు 2 భాగాలు ఆగ్నేయం, 2 భాగాలు నైరుతి వదలగా మిగిలిన 5 భాగాలు దక్షిణ దిశ అవుతుంది. పశ్చిమ దిశను 9 భాగాలుగా చేసి అందు 2 భాగాలు నైరుతికి, 2 భాగాలు వాయువ్యానికి వదలగా మిగిలిన 5 భాగాలు పడమర దిశ అవుతుంది. ఉత్తర దిశను 9 భాగాలుగా చేసి అందులో 2 భాగాలు వాయువ్యానికి, 2 భాగాలు ఈశాన్యానికి వదలగా మిగిలిన 5 భాగాలు ఉత్తరమవుతుంది. 

"స్వవర్గాత్ పంచ మోలిపః రిపు వర్గం పరిత్యజ్య శేష వర్గా శ్శుభ ప్రధాః" అనే శ్లోక ప్రమాణాన్ని అనుసరించి
గృహ యజమాని యొక్క నామ ప్రధామాక్షరము ఈ వర్గునందు ఉండునో, ఆ వర్గునకు పంచమ స్ధానం అనగా ఐదవ స్ధానం శత్రు వర్గు అగును. కావున ఆ శత్రు వర్గు గల స్ధానం వదలి గృహ నిర్మాణం చేయవలెను.   

“అ” వర్గు వారికి తూర్పు స్వవర్గు అవుతుంది. పశ్చిమం శత్రు వర్గు అవుతుంది.
“క” వర్గు వారికి ఆగ్నేయం స్వవర్గు అవుతుంది. వాయువ్యం శత్రు వర్గు అవుతుంది.
“చ” వర్గు వారికి దక్షిణం స్వవర్గు అవుతుంది. ఉత్తరం శత్రు వర్గు అవుతుంది.
“ట” వర్గు వారికి నైరుతి స్వవర్గు అవుతుంది. ఈశాన్యం శత్రు వర్గు అవుతుంది.
“త” వర్గు వారికి పశ్చిమం స్వవర్గు అవుతుంది. తూర్పు శత్రు వర్గు అవుతుంది.
“ప” వర్గు వారికి వాయువ్యం స్వవర్గు అవుతుంది. ఆగ్నేయం శత్రు వర్గు అవుతుంది.
“య” వర్గు వారికి ఉత్తరం స్వవర్గు అవుతుంది. దక్షిణం శత్రు వర్గు అవుతుంది.
“శ” వర్గు వారికి ఈశాన్యం స్వవర్గు అవుతుంది. నైఋతి శత్రు వర్గు అవుతుంది. 

శ్లో:- స్వవర్గే ధనలాభంచ ద్వితీయం తరవీసకం
తృతీయం వీసమీత్యాహూః చతుర్ధే వ్యాధి పీడన
పంచమంతురి పుస్ధానం షష్ఠంతు కలహ ప్రదం
సప్తమం సర్వ సౌభాగ్యం అష్టమం మరణధ్రవం 

అను ప్రమాణాన్ని అనుసరించి వర్గుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. 

స్వవర్గు ధనలాభాన్ని కలిగిస్తుంది.
ద్వితీయం స్వల్ప లాభాన్ని కలిగిస్తుంది.
తృతీయం శుభప్రదాన్ని కలిగిస్తుంది.
చతుర్ధం వ్యాధులను కలిగిస్తుంది.
పంచమం శత్రు క్షేత్రం అవుతుంది.
షష్ఠమం కలహ ప్రదం (మతాంతరంలో లక్ష్మీ ప్రదం)
సప్తమం సర్వ సౌభాగ్యాన్ని కలిగిస్తుంది.
అష్టమం మరణ ప్రదాన్ని కలిగిస్తుంది. 

గృహ నిర్మాణం చేయదలచిన క్షేత్రం ఏ  రాశి అవుతుందో చూసి గృహ యజమాని నామరాశికి గృహరాశి 1,5,9 స్ధానాలలో ఉంటే శుభప్రదం, 3,7,11 స్ధానాలలో ఉంటే ప్రశస్ధాలు కావు. 4,8,12 స్ధానాలలో ఉంటే  చెడ్డవి, 2,6,10  స్ధానాలలో ఉంటే మంచివి కావు. 

ఉదా:- రాజశేఖర్ అనే వ్యక్తికి వర్గురీత్యా “ర” అనే అక్షరం “య” వర్గులో ఉండటం వలన ఉత్తర దిక్కు ఈ పేరుకు స్వవర్గు అవుతుంది.
స్వవర్గు – ఉత్తరం
తృతీయ వర్గు -తూర్పు  
షష్ఠమ వర్గు – నైరుతి
సప్తమ వర్గు  - వాయువ్య వర్గులు పనికి వస్తాయి. 

పంచమ వర్గు అయిన దక్షిణం శత్రు వర్గు అవుతుంది. 

రాజశేఖర్ పేరు మీద నక్షత్రం చిత్త నక్షత్రం తులారాశి అవుతుంది. రాజశేఖర్ అనే వ్యక్తికి ఈశాన్య దిక్కున ఉన్న క్షేత్రం పనికి వస్తుందో లేదో గమనించాలి అంటే ముందుగా ఈశాన్య దిక్కు మీనరాశిని తెలియజేస్తుంది. పేరు మీద తులా రాశిని తెలియజేస్తుంది తులారాశి నుండి మీనరాశి షష్ఠమ స్ధానం అవుతుంది కాబట్టి 2,6,10 స్ధానాలు మంచివి కావు కాబట్టి రాజశేఖర్ అనే వ్యక్తికి ఈశాన్య దిక్కు మంచిది కాదు. 

1, 5, 9 లలో 1 వది అయిన అయిన తులారాశి పశ్చిమ దిక్కు.
5 వది అయిన కుంభరాశి ఉత్తర దిక్కు.
9 వది అయిన మిధునరాశి ఆగ్నేయ దిక్కు . రాజశేఖర్ అనే వ్యక్తికి పనికి వస్తాయి. ఈ విధంగా ఎవరికి వారు తమ నామ ప్రధామాక్షరాన్ని బట్టి క్షేత్రార్వాణం చేసుకోవాలి.         ✍️నామనసిధ్ధాంతి: 
 నేటి నుండి…
 *పుష్యమాసం ప్రారంభం*
             

చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం.

ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది. 

విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. 

ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్త్రీయ కోణం చూస్తే  ఈ రెండు పదార్ధాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. 

శని ధర్మదర్శి! న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరిచేవాడు అతడే. మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి, నియమ నిష్ఠలు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు.

అంతే గాక గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి.  

పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు శ్రీ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం.

అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి(సుబ్రహ్మణ్య షష్ఠి) ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది.  

ఇక శుక్ల పక్షంలో వచ్చే అష్టమిరోజు  పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం. 

పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ, ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి.

ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడ్ని ఆవునేతితోనూ, నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి. 

సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధాన్యరాశులనూ వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి,షట్తిలైకాదశి,కల్యాణైకాదశి అని పిలుస్తారు.

సున్నిపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు.

ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజు నది స్నానాదులు చేసుకుని దైవదర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి, పితృతర్పణాలు, ఆబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్న దానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది.

పుష్యమాసములో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్య కాంతి అద్భుతమగు యోగచైతన్యమును ప్రసాదింపగలదు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము. చెప్పలేనంత కాంతిని దర్శనము చేయించే మాసము పుష్యమాసము. ఉత్తరాయణ పుణ్యకాలములో  సూర్యుడు దక్షిణము నుండి ఉత్తరదిశగా పయనము సాగిస్తాడు. అనగా ఊర్ద్వముఖముగా ప్రయాణము.

మనలోని ప్రాణశక్తి బలమును కూర్చుకొను సమయము. సూర్యకిరణముల యందు ఒక ప్రత్యేకమైన హిరణ్మయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదనము గావించును. మనస్సును అంటిపెట్టుకున్న స్వభావము నందలి అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధిబలము, ప్రాణబలము పుష్టిగా లభించు మాసము పుష్యమాసము.   

**** *ధ్యాన 😌మార్గ*. ప్రేమ మూడు రకాలుగా ఉంటుంది...

 *ధ్యాన 😌మార్గ*
ప్రేమ మూడు రకాలుగా ఉంటుంది: నిస్వార్థం (సమర్థ), పరస్పరం (సమంజస), మరియు సాధారణ లేదా స్వార్థం (సాధారణ). నిస్వార్థమైన ప్రేమ అత్యున్నతమైనది. నిస్వార్థమైన ప్రేమికుడు ప్రియమైనవారి సంక్షేమాన్ని మాత్రమే కోరుకుంటాడు మరియు పర్యవసానంగా అతను నొప్పి మరియు కష్టాలను అనుభవిస్తున్నప్పటికీ పట్టించుకోడు. రెండవ రకమైన ప్రేమ పరస్పర ప్రేమ, ఇందులో ప్రేమికుడు తన ప్రియమైన వ్యక్తి యొక్క ఆనందాన్ని మాత్రమే కాకుండా, తన స్వంత ఆనందాన్ని కూడా కోరుకుంటాడు. స్వార్థపూరితమైన ప్రేమ అతి తక్కువ. ఇది మనిషిని తన స్వంత సంతోషాన్ని మాత్రమే చూసుకునేలా చేస్తుంది.
❤️🕉️❤️
నీవే స్త్రీవి, నీవే పురుషుడివి, నీవే బాలికవు, నీవే బాలుడవు. నీవే కర్ర
పుచ్చుకున్న ముదుసలివి, ఇప్పుడే పుట్టిన శిశువివి నీవే. లక్ష విధాలుగా నీవు
విశ్వంలో కానవస్తున్నావు. 
ముండక ఉపనిషత్తులో ఉన్నతమయిన ఆధ్యాత్మిక భావంతో బయటకు చూసినంతనే, అంతటా బ్రహ్మను చూశాడు. 'ఆనందరూపం అమృతం యల్ విభాతి' అనంతమైన ఆనంద రూపం, అమృత రూపం, చుట్టూ ఉన్న ప్రపంచమంతా వ్యాపించి ఉంది అన్నాడు.
❤️🕉️❤️
ఏ ఘనకార్యాన్ని మోసంతో సాధించలేం. అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి. కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి.
- Swami Vivekananda

ఎక్కువ తప్పులు చేసినవారు అధములు,
వారు నా వద్దకు రాలేరు. ఎల్లప్పుడూ వారు ఇంకా, ఇంకా చెడ్డ పనులు చేయడానికి యోచిస్తారు. మాయచే జ్ఞానం, అర్థం చేసుకునే గుణం పూర్తిగా వారి నుంచి అపహరించ బడింది. వారి యందు రాక్షస గుణాలు చోటుచేసుకొని వారికి రాక్షస స్వభావం అలవడింది. - వారు ఒకరకం మనుష్యులు వారు నన్ను పూజించరు.
       --భగవద్గీత.    

కృష్ణమాయ

 ॐ:
*కృష్ణమాయ*

కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌’... కృష్ణుడే పరమతత్త్వం... చరమ లక్ష్యం... ఆయన గురించి చదవడం, చెప్పడం, పాడడం, వినడం... అన్నీ అపురూపమైన అనుభవాలే. ‘నీలో లేని చోద్యాలు ఈ ప్రపంచంలో ఏం ఉంటాయి?’ అని అక్రూరుడన్నా... ‘అటువైపు కృష్ణుడున్నాడు... ఇటువైపు ఎవరున్నారు’ అని సంజయుడు హెచ్చరించినా... అవన్నీ పరమాత్మ విరాట్‌రూపాన్ని విశదీకరించే ఉదాహరణలే... క్రియ, బోధ కలగలిసిన అద్భుత తత్త్వం ఆయనది... యుగావసరాలకు అన్వయించుకోదగ్గ మహాగాథ శ్రీకృష్ణుడిది.
భక్తుల కోర్కెలు తీర్చే క్రమంలో భగవంతుడు రెండు రకాల విధానాలను అనుసరిస్తాడు. సర్వం తానే స్వయంగా నిర్వహించి, తనపై మనకున్న నమ్మకాన్ని పెంచుకోవడం మొదటి పద్ధతి. మన ప్రయత్నంలో రహస్యంగా సహకరించి, మనపై మనకు నమ్మకాన్ని పెంచి విజేతలుగా తీర్చిదిద్దడం రెండో పద్ధతి. ఇందులో మొదటి దాన్ని దైవికం అని, రెండోదాన్ని పౌరుషం అని శాస్త్రం నిర్వచించింది. పరమాత్మ ప్రతి అవతారంలో ఏదో ఒకమార్గాన్నే ఎంచుకున్నాడు. కానీ కృష్ణావతారంలో మాత్రం రెండు విధాలుగానూ మనకు ఆయన దర్శనమిస్తాడు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణల్లో భాగవతంలోని కృష్ణుడు ఎవరి సహాయాన్నీ కోరలేదు. స్వయంగా తానే అవతార లక్ష్యం దిశగా సాగిపోయాడు. భారతంలోని కృష్ణుడు మాత్రం రెండో పద్ధతి అనుసరించాడు. చేసిందంతా తానే అయినా ఘనతను మాత్రం పూర్తిగా పాండవుల పరం చేశాడు. వారిని విజేతలుగా నిలబెట్టాడు. భాగవత కృష్ణుడు విశేష రసజ్ఞ మనోజ్ఞ మూర్తి. భారత కృష్ణుడు అసాధారణ అలౌకిక ప్రజ్ఞానిధి. కృష్ణ కథలో ఈ రెండూ విభిన్న కోణాలు. ఈ రెండు రకాల పాత్రల స్వభావాలు విభిన్నమైనవి, అదే సయమంలో సర్వసమగ్రమైనవి.

అదే కృష్ణమాయ!
భాగవత కృష్ణుడి బాల్యచేష్టలు ముగ్ధమోహనాలు. అదే సమయంలో లోకకల్యాణాలు. పసిబాలుడు భయంకర రాక్షస మూకలను మట్టుబెట్టినప్పుడు జనం నివ్వెరపోవడం సహజం. అవతార పురుషుడిగా అనుమానించడం సాధారణం. అలాంటి వారిని చిలిపి చేష్టల ముసుగులో ముంచేసేవాడు. ఇది లోకం దృష్టికి సమ్మోహనకరంగా, అదే సమయంలో లోచూపునకు సంక్లిష్టభరితంగా కనిపించేది. గోపబాలురకు చెలికాడిగా, గోపికలకు వెన్నెల వేలుపుగా ఆటపాటలతో అలరించిన అపూర్వ ఘట్టాలను అనుశీలించేటప్పుడు మనం కూడా వారిలా మారిపోవడాన్నే కృష్ణమాయ అంటారు. రమణీయ రసానుభూతులు పంచడంతో పాటు రాక్షస సంహారం కూడా ఆయన చేశాడు. ఒక పురాణ పురుషుడి సర్వసమగ్ర వ్యక్తిత్వానికి ఇది గొప్ప ఉదాహరణ.

సుస్థిర పాలన కోసం...
భారత కృష్ణుడు ధీరోదాత్తుడు, రాజనీతిజ్ఞుడు, వ్యూహనిర్మాణ చతురుడు, స్ఫూర్తిప్రదాత, మహానేత. ఆయన అవతరించే సమయానికి లోకంలో పరిస్థితులు విషమంగా ఉన్నాయి. కంస, జరాసంధ, కాలయవన, నరక, శిశుపాల, దుర్యోధనాది స్వార్థ పరుల చేతుల్లో అధికారం, సంపద ఖైదీలయ్యాయి. ఇవన్నీ దుష్టుల చేతుల్లో ఉన్నప్పుడు సామాజిక పరిస్థితులు కూడా దయనీయంగా ఉంటాయి. ధర్మంలేని చోట భద్రత, నీతిలేని చోట మనశ్శాంతి ఉండవు. అలాంటి రాజుల చేతుల్లోనుంచి ప్రజలను రక్షించాలి. సువ్యవస్థను స్థాపించాలి. రాజ్యం చిన్నచిన్న ముక్కలుగా చీలిపోయి ఉంది. అరాచకం, అనైక్యత పెరిగిపోయాయి. ఆ దుస్థితిని, క్లిష్టతను పారదోలేందుకు కేంద్ర రాజ్య వ్యవస్థను ఊహించిన, నిర్దేశించిన అద్భుత రాజనీతిజ్ఞుడు శ్రీ కృష్ణుడు.ధర్మం తప్పిన రాజులందరినీ స్వయంగానో, పాండవుల చేతనో తుదముట్టించాడు. తాను రాజ్యాధికారం కోరుకోకుండా ధార్మిక చింతనాశీలురను పాలకులుగా ఎంచి, రూపొందించి సుపరిపాలనా కేంద్ర వ్యవస్థను నిర్మించాడు. ధర్మజుని నాయకునిగా తీర్చిదిద్దిన నాయక నిర్ణేత శ్రీకృష్ణుడు.

యుద్ధం కూడా యజ్ఞమే!
భగవద్గీత ఆవిర్భావం కూడా ఈ యుగావసరమే. అడవిలో ముక్కు మూసుకుని కూర్చున్న సర్వసంగపరిత్యాగి తన శిష్యులకు ఏకాంతంగా నూరిపోసిన ధర్మోపదేశం కాదిది.. పద్దెనిమిది అక్షౌహిణల మహాసైన్యం యుద్ధరంగంలో మోహరించి, కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్కంఠ స్థితి. తాత్కాలిక నిర్వేదానికి గురై ధర్మసంకటంలో పడిన మహాయోధుణ్ణి కార్మోన్ముఖుణ్ణి చేసేందుకు ప్రవచించిన ఉపదేశం. ఈ లోకానికంతటికీ వర్తించే ధీరవచనం. గీతాచార్యుడిగా శ్రీకృష్ణుడి వ్యక్తిత్వం శిఖరసమానమైంది. ఆయుధాన్ని పట్టనని ప్రకటించిన శ్రీకృష్ణుడు, భీమార్జునులను ఆయుధాలుగా మలుచుకుని కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని సాగించాడు. యుద్ధాన్ని క్రతువు అన్నాడు పరమాత్మ. క్రతువు అంటే యజ్ఞం. ‘న మమ’ అనుకోవడం యజ్ఞంలో ప్రధానాంశం. ‘నాది కాదు’ అని ఆ మాటకు అర్థం. ఏం చేసినా, ఏం పొందినా ‘న మమ’ అనే భావనతో ఉండడం యోగి లక్షణం. అహంకార, మమకారాలను ఆహుతి చేసే మహోన్నత పరిణిత త్యాగశీలతనే కృష్ణుడు కర్మయోగం పేరిట అర్జునుడికి బోధించాడు. అది ఎప్పటికీ, సర్వమానవాళికీ అనుసరణీయం.

స్నేహితుడి కోసం గీతాసారం
కృష్ణా! ఓ మాట అడుగుతాను. నిజం చెబుతావా...? మనం ఆపదలో ఉన్నప్పుడు అడగకపోయినా వచ్చి మనకు సాయం చేసేవాడే స్నేహితుడని నువ్వే చెప్పావు కదా. మరి పాండవులు అన్ని కష్టాల్లో కూరుకుపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు చెబితే ధర్మరాజు జూదం ఆడేవాడు కాదు కదా? లేదా నువ్వే ధర్మరాజు పక్షాన ఆడి అతడిని గెలిపించవచ్చుకదా.

మరి నువ్వెందుకు అలా చూస్తుండిపోయావు? అంటూ నేరుగా కృష్ణుడినే అడిగాడు ఉద్ధవుడు. మరొకరైతే కృష్ణుడిని ఈ ప్రశ్న అడగటానికి కూడా ధైర్యం చేసేవారు కాదు. కానీ, ఇక్కడ అడిగినవాడు ఉద్ధవుడు. కృష్ణుడికి పరమ ప్రాణమిత్రుడు. రూపంలో కూడా అచ్చం కృష్ణుడిలాగా ఉండేవాడు.ఎంతటి ప్రాణమిత్రుడంటే నిద్రలో కూడా కృష్ణుడి పేరునే కలవరించేవాడు. అంతటి మిత్రుడు అడిగేసరికి శ్రీకృష్ణుడు కూడా మొహమాటం లేకుండా సమాధానం చెప్పాడు. ఉద్ధవా! విజయం ఎప్పుడూ వివేకవంతుడినే వరిస్తుంది. దుర్యోధనుడు వివేకవంతుడు. అందుకు ఆటలో నైపుణ్యం ఉన్న శకునితో తన ఆట ఆడించాడు. ధర్మరాజు మాత్రం తానే ఆట ఆడాలని అనుకున్నాడు. పైగా నేను అటువైపు రాకూడదని కోరుకున్నాడు. అందుకే అతడు పిలిచేవరకు రాకూడదని నిశ్చయించుకున్నా. పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్లేవాడిని అన్నాడు. అంటే కృష్ణా! తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే గానీ రావా అంటూ మరోప్రశ్న వేశాడు ఉద్ధవుడు. మిత్రమా! జీవితంలో ప్రతిదీ కర్మానుసారమే జరుగుతుంది. నేను పక్కన ఉండి చూస్తుంటాను కానీ కర్మను మార్చలేను అన్నాడు కృష్ణుడు. అదేంటి కృష్ణా! నీ భక్తుల పక్కనే ఉంటూ వారు ఆపదలో ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అన్యాయం కదూ అన్నాడు ఉద్ధవుడు. కృష్ణుడు నవ్వుతూ... మిత్రమా! నేను పక్కన ఉన్నాననే భావన ఉంటే అసలు తప్పే చెయ్యరు కదా భక్తులు అన్నాడు. తత్త్వం బోధపడింది ఉద్ధవుడికి. ఇంకా ఎన్నో సందేహాలు అడిగాడు. అన్నిటికీ తృప్తిగా సమాధానాలు చెప్పాడు పరమాత్మ. అవతార పరిసమాప్తి కాలంలో ఉద్ధవుడి పేరు మీద లోకం తన మీద వేసే నిందలు, వేసే ప్రశ్నలన్నింటికీ పరమాత్మ సమాధానం చెప్పాడు. ఈ సమాధానాల సమాహారమే ‘ఉద్ధవగీత’గా ప్రసిద్ధిపొందింది.
ఆ అయిదు భావాలు...
శ్రీకృష్ణుడు లీలామానుష రూపుడు. మానవుడిగా, దైవంగా మార్చిమార్చి తన వైభవాన్ని ప్రదర్శించాడు. శాంత, దాస్య, వాత్సల్య, సఖ్య, మధుర భావాలను భక్తులు భగవంతుడిని చేరుకునే సులభ మార్గాలుగా భావించాలి. వాటిని స్వయంగా శ్రీకృష్ణుడి జీవితంలో కూడా మనం చూడొచ్చు.

శాంతం:
ఎంత ఉద్రిక్త పరిస్థితుల్లోనైనా నందనందనుడు శాంతంగా వ్యవహరించాడు. శిశుపాలుడు నిండు సభలో అవమానపరిచి అనరాని మాటలు అంటున్నా ప్రతిఘటించలేదు. ఉద్రేకపడలేదు. భీష్మాదులు శిశుపాలుడిని హెచ్చరిస్తున్నా తాను మాత్రం పౌరుషానికి పోలేదు. ఇచ్చిన మాట ప్రకారం నూరు తప్పులను శాంతంగానే కాచాడు.

దాస్యం:
పెద్దల వద్ద వినయ విధేయతలతో ఉండడమే దాస్యభావం. దేవాదిదేవుడైనా అగ్రజుల వద్ద అణకువగానే మెలిగాడు. గురువు సాందీపుని వద్ద బంటులా పనిచేశాడు. రేపల్లెలో గోవుల కాపరిగా ఆ మూగజీవాలనూ సేవించాడు. అందుకే దాస్యంలో ఆయనను మించిన దివ్యాంశుడు లేరంటారు.

వాత్సల్యం:
చిన్న వాళ్లతో ప్రేమగా, ఆదరంగా ఉండడం వాత్సల్యం. ధీరగంభీరుడైన దేవకీపుత్రుడు వాత్యల్యానికి కూడా మారుపేరు. తనను ఆశ్రయించిన వారిని ఆదుకోవడంలో ఆయనను మించిన కరుణామూర్తి మరొకరు కానరారు. ద్రౌపది ‘అన్నా! నీవే దిక్కు’ అన్నందుకు నిండు సభలో ఆమె గౌరవాన్ని కాపాడాడు. సుయోధనుడు రాజభోగాలను సిద్ధంచేసినా, విదురుని ప్రేమపూర్వక ఆహ్వానాన్నే మన్నించాడు.

సఖ్యం:
సన్నిహితులతో, స్నేహితులతో ప్రేమగా ఉండడం సఖ్యం. సఖ్యభావంతో సన్నిహితుల హృదయాల్లో నిలిచిపోయాడు ఈ హృషీకేశుడు. చిన్ననాటి స్నేహితుడు కుచేలుడు నిరుపేదైనా, సతీసమేతంగా అతని పాదాలు కడిగి ఆ జలాన్ని తన తలపై చల్లుకున్నాడు. ఆయన తెచ్చిన అటుకులనే మధురపదార్థాలుగా స్వీకరించాడు. ఇక అర్జునుడికి ఇష్టసఖుడిగా తుదివరకు వెన్నంటి కాపాడాడు.

మధురభావం:
తనను ఆరాధించే వాళ్లతో అంతే ఆరాధనతో ఏకమైపోవడం మధురభావం. గోపికలను మధురభావంతో ముంచెత్తి వాళ్లను అనేక లీలల్లో ఓలలాడించాడు. వారికి అలౌకికమైన ఆనందాన్ని అందిస్తూనే అంతిమంగా వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. మధురభావం పరమాత్మ ఏ ఇతర అవతారంలోనూ కనిపించదు.        
 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

61. యస్యతే స్వాదు సఖ్యం స్వాప్య ప్రణీతిః

భగవానుని స్నేహం స్వాదువు. అనన్య భక్తి స్వాద్వీ(ఋగ్వేదం)

భక్తి యొక్క గొప్పతనాన్ని వేదం పలుచోట్ల ప్రస్తావించింది. భగవానుని పట్ల ప్రేమభావననే 'భక్తి' అని నిర్వచించిన నారదమతం వైదిక హృదయం.

పై ఋగ్వేద మంత్రం చాలా మధురభావనని ప్రసరిస్తోంది. భక్తి
ఆనందకరం-మధురం. భగవానుని నామ, రూప, గుణ, లీలా మాధుర్యాలను ఆస్వాదిస్తున్న కొద్దీ ఆ మాధుర్యం వృద్ధిచెంది, సమస్త బంధనాలను తొలగిస్తుంది.

అందుకే భక్తులంతా భగవన్నామ గానంతో ప్రపంచపు విషయాల రుచులనే కాదని ఆ ఆనందంలో లీనమవుతారు.

“మధురాధిపతేరఖిలం మధురం” అని కీర్తించిన భక్తులు, “జిహ్వే కీర్తయ కేశవం మురరిపోః చేతో భజ శ్రీధరం...” అని ఇంద్రియాలు భగవదర్పణమైనప్పుడు మరేమీ
అక్కరలేదని కోరుకున్నారు.

భక్తికి భక్తియే ఫలం. భగవత్ప్రేమమయమైన భక్తిలో కామనలేవీ ఉండవు. నిరంతర
భగవద్భావనా మాధుర్యంలో లీనమవడమే. అదే గొప్ప సంపద.

“భక్తి బిచ్చమీయవే రామయ్యా” అని త్యాగయ్య కీర్తించారు. ఈ
భగవత్ప్రేమానుభవాన్నే “సాత్వికభక్తి” అంటారు. “ఆనందాంబుధివర్ధనం, ప్రతిపదం
పూర్ణామృతాస్వాదనమ్... శ్రీకృష్ణసంకీర్తనమ్”అని చైతన్యమహాప్రభువు, కృష్ణకీర్తనమే
అత్యంత మధురమన్నాడు. ఈ భగవానునికి మనతో ఉన్న సఖ్యం, ఆయనపట్ల మనకున్న అనన్యభక్తి... ఈ రెండూ మాధుర్యాలే. మొదటి మాధుర్యాన్ని గ్రహించాలంటే, రెండవ మాధుర్యం ఉండాలి. అంటే - మధురమైన భగవంతుని
కృపను చవిచూడాలంటే, అనన్య భక్తి అనే మాధుర్యం మనలో ఉండాలి.

"భగవానుని సఖ్యం మధురం, ఆహ్లాదకరం, ఆనందకరం. ఆయన పట్ల అనన్యభక్తి సమస్త సంపాదనలను నివారించి, పరమానందాన్ని కలిగిస్తుంది" అని మంత్రభావం.

శక్తి ఆనందమయం. “స్వయం ఫలరూపత్వాత్” అని నారదుని భక్తిసూత్రం. భక్తి లభించడమే ఫలం. భక్తి వల్ల ఏదో లభించడం కాదు. పరమాత్మ తప్ప ఏదీ పట్టని అనన్యభక్తిని ఈ మంత్రం ప్రస్తావించింది. నవ విధ భక్తులలో సఖ్యభక్తి గొప్పది.

'సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి" - నేను అందరికీ సుహృత్తు(మిత్రుడు)నని తెలిసినవాడు శాంతిని పొందుతున్నాడని గీతాచార్యుని వచనం.

'సఖ్యం' గురించి చెప్తూ 'విశ్వాసః సఖ్య లక్షణం' అని శివపురాణ వచనం.

స్నేహంలో ముఖ్యలక్షణం విశ్వాసం. ఈ మాటను నిర్వచిస్తూ భగవత్ప్రేమలో (సఖ్యంలో) అన్నీ మంచే జరుగుతాయని అనడం కాకుండా, భగవత్ప్రేమికునికి ఏది
జరిగితే అది మంచి అని అర్థాన్ని గ్రహించాలి. భగవానుని ప్రసాదాలే మన అనుభవాలు అని భావించగలిగినప్పుడు అన్నీ ఆనందాలే.

"పాలముంచు మరి నీట ముంచు నీ పాలబడితి నిక జాలము సేయకు" అని రామదాసు కీర్తన. భక్తునికి ఏ అనుభవమైనా అది భగవత్కృతమే. మరియొక చింతన ఉండదు. అందుకే అతడు నిశ్చింతగా ఉంటాడు.

సుఖదుఃఖాదులలో దేనికీ చలించని ద్వంద్వాతీత స్థితిలో- “నా స్వామి అన్నీ మేలే చేస్తాడు" అనే తృప్తితో ప్రతి సంఘటననీ నిస్సంకోచంగా ఆహ్వానిస్తాడు.

నిరంతర భగవత్యాస ఇతర ఏ సుఖదుఃఖాదులకు అంటని స్థితిలో ఉంచుతుంది.ఆ ధ్యాస తప్ప మరేదీ కోరనివాడు నిత్యానంది. ఆ ఆనందం భక్తునికే తెలుస్తుంది. “మూకాస్వాదనవత్” - మూగవాడు మధురఫలాన్ని ఆస్వాదించగలడు, కానీ అభివర్ణించలేడు. అలాగే భక్తుని ఆనందం మాటకి అందదు.

“ఈలాగున వివరింపలేను చాలా స్వానుభవైకవేద్యమే" అని త్యాగరాజు ఈ భావాన్నే పాడారు.

ప్రణీతి, ప్రణయ, ప్రేమ, ప్రీతి, భక్తి- ఇవన్నీ ఒకే అర్థాన్ని చెప్పే శబ్దాలు. ఆ
ప్రేమ లేనప్పుడు జ్ఞానం రాదు. “అనురాగము లేని మనసున సుజ్ఞానము రాద”ని తేల్చి చెప్పారు త్యాగయ్య. భాగవతధర్మం ప్రేమమయమైనది కనుక స్వాదుతత్త్వంగా వేదం తీర్మానించింది.  

Monday, December 30, 2024

 *‘వర్జ్యం' గురించి చెప్పుకుందాం ....!!*
 
🌿వర్జ్య కాలమును నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు.ప్రతి నక్షత్ర సమయంలో వర్జ్య కాలం ఉంటుంది.వర్జ్య కాలం అంటే విడువ తగిన కాలం.అశుభ సమయం.శుభకార్యాలు,ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు.

🌸ప్రతి నక్షత్రానికి వర్జ్యం 4 ఘడియలు లేదా 96 నిమిషాలు ఉంటుంది.
జన్మ జాతకంలో లగ్నం స్ఫుటం గాని,చంద్ర స్ఫుటం గాని,ఇతర గ్రహాలు గాని వర్జ్య కాలంలో ఉన్నట్లయితే ఆ గ్రహం యొక్క దశ,అంతర్దశలలో ఇబ్బందులు ఏర్పడతాయి.

🌿మనం ఏ శుభకార్యాన్ని ప్రారంభించాలనుకున్నా మంచి ముహూర్తం చూసుకుని ఆయా శుభకార్యాలకి శ్రీకారం చుడుతుంటాం. దైవకార్యాలకీ, శుభకార్యాలకీ కూడా మంచి ముహూర్తం చూసుకుంటాం. 

🌸ముహూర్తం ఏ మాత్రం కాస్త అటుఇటు అయినా ఆ శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడతాయేమోననే బలమైన విశ్వాసం వుండటంతో ముహూర్తాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటాం.

🌿ఈ నేపథ్యంలోనే 'వర్జ్యం' అనే పదం ఎక్కువగా వినిపిస్తూ వుంటుంది. 'వర్జ్యం' అంటేనే విడువదగినది అని అర్థం. వర్జ్యంలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించడంగానీ, శుభకార్యాలకి బయలుదేరడం కాని చేయకూడదు. 

🌸ఈ కారణంగానే పెద్దలు 
ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటారు.
వర్జ్యంలో దైవకార్యాలు గానీ, శుభకార్యాలుగాని చేయకూడదని అంటూ వుంటారు కాబట్టి, 
ఆ సమయంలో ఏం చేస్తే బావుంటుందనే సందేహం చాలా మందిలో తలెత్తుతూ వుంటుంది. 

🌿ఆ సమయంలో దైవారాధనకి సంబంధించిన అన్ని పనులతో పాటు, శక్తి కొద్ది దానం కూడా చేయవచ్చని శాస్త్రం చెబుతోంది.

🌸ఈ సమయంలో దానాలు చేయడం వల్ల చాలాదోషాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

🌿వర్జ్యం వున్నప్పుడు దైవనామస్మరణ .. పారాయణం .. స్తోత్ర పఠనం .. సంకీర్తన .. భజనలు మొదలైనవి చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. 

🌸అంతే కాకుండా దేవుడి సేవకి సంబంధించిన వివిధ రకాల ఏర్పాట్లను చేసుకోవచ్చని అంటోంది. ఈ విధంగా చేయడం వలన వర్జ్యం కారణంగా కలిగే దోషాలు ఏమైనా వుంటే అవి తొలగిపోతాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి...      

అమావాస్య తిథి గురించి కొంచెం వివరణ..*

 *అమావాస్య తిథి గురించి కొంచెం వివరణ..*

🌸ఉగ్ర భూతాలు, పిశాచాలు, బ్రహ్మ రాక్షసులు, భూత గణాలు, అసురి శక్తులు , తమో గుణ, రజో గుణ శక్తులు ఇవ్వన్ని లోకాన్ని పిడించేవి.

🌿వీటి ద్వారా లోకం లో ఉన్న జీవ గణాలు చాలా ఇబ్బందులు పడ్డారు. గమనిక:- శివ భూత గణాలు వేరు. అవి కైలాసం లో ఉంటాయి. 

🌸వీటి బాధలు పడలేక ప్రజలు సిద్ధ సాధువులను, యోగులకు ఆశ్రయించారు. వీటిని యోగులు కూడా కట్టడి చేయలేకపోయారు. 

🌿అప్పుడు అందరూ కలిసి శివుణ్ణి 
ప్రార్థన చేశారు. హే భగవాన్ మీరు ఈ ఉగ్రభూతాలను కట్టడి చేయాలి. మమ్మల్ని కాపాడాలి. అని ప్రార్థన చేశారు. 

🌸అప్పుడు హా ప్రార్థనను, వారి కోరికను శివుడు ప్రసన్నంగా స్వీకరించాడు. అందరికి 
అభయం ఇచ్చాడు. ప్రియ భక్తులార మీకు అభయం ఇస్తున్నాను. 

🌿ఈ భూతాలను సిద్ధ సాధువులు, యోగులు, దేవతలు కట్టిడి చేయలేరు. కాబట్టి ఇక నుండి 
నేనే స్మశానం లో ఉంటాను. వాటిని నా అదుపులో ఉంచుకుంటాను అని అన్నాడు.

🌸అప్పటి నుండి ఈ సర్వ భూతాలు, అన్ని తమో, రజో శక్తులు , బ్రహ్మ రాక్షస శక్తులను
శివుడి కి భయపడి అణిగి మణిగి ఉన్నాయి.

🌿అప్పుడు భూతాలు, పిశాచలూ
అన్ని తమో గుణ రజో గుణ శక్తులు, బ్రహ్మ రాక్షస శక్తులు శివుణ్ణి ఈ విదంగా ప్రార్థన చేశాయి.

🌸యే భగవాన్ మమ్మల్ని మీరు స్మశానంలో కట్టడి చేశారు. మేము కూడ మిమ్మల్ని పూజించాలి అని కోరాయి. 

🌿అప్పుడు శివుడు సరే అని మీరు 
ప్రతి అమావాస్య తిథి నాడు నా ఆలయంలో మీరు దర్శనం , పూజలు చేసుకోండి. ఆ తిథి నాడు నా ఆలయంలో ఉండండి అని వరం ఇచ్చాడు.

🌸అలాగే నా భక్తులని మీరు ఏమీ చేయవద్దు అని హా భూతాలను హెచ్చరించాడు. నా సాధారణ భక్తులకు మీరు కనపడవద్దు అని వారికి చెప్పాడు.

🌿వాటికి అన్ని భూతాలు ఒప్పుకున్నాయి. ప్రతి అమావాస్య తిథి నాడు అన్ని భూతాలు శివ ఆలయం లో ఆరాధన చేస్తాయి. కొన్ని బ్రహ్మ రాక్షస భూతాలు శివ ఆలయంలోని వెనుక భాగంలో గురక పెట్టి నిద్రపోతాయి.

🌸కాబట్టి ఆలయ వెనుక భాగాన్ని ముట్టవద్దు. తాక వద్దు. ఇక పౌర్ణమి తిథి నాడు శివుడు దేవతలకి, యోగులకు, సత్వ గుణ శక్తులకి అవకాశం ఇచ్చాడు. 

🌿ఈ అమావాస్య తిథి మరియు పౌర్ణమి తిథి నాడు శివ ఆరాధన చేసి నిరుపేదలకు వస్త్రదానం, అన్నదానం, ధన దానం రహస్యంగా చేయడం ద్వారా ఈ పిచాచ, భూత, రజోగుణ, తమో గుణ శక్తుల పీడలు పోతాయి.          
 Vedantha panchadasi:     ప్రత్యూషే వా మగ్నో మందే తమస్యయమ్ ౹
లోకోభాతి యథా తద్వదస్పష్టం జగదీక్ష్యతే ౹౹201౹౹

201. ఉదయసంధ్య సాయంసంధ్యల యందూ, మందాంధ కారము నందూ ఈ లోకము అస్పష్టముగ కన్పించినట్లే హిరణ్యగర్భావస్థయందు సృష్టి అస్పష్టముగ గోచరించును.

సర్వతో లాంఛితో మష్యా యథా స్యాద్ఘట్టితః పటః ౹
సూక్ష్మాకారైస్త థేశస్య వపుః సర్వత్ర లాంఛితమ్ ౹౹202౹౹

202. గంజితో బిగువెక్కిన వస్త్రముపై చిత్రపు రేఖలు రంగుతో దిద్దినట్లే హిరణ్యగర్భుని యందు సూక్ష్మశరీరములు రేఖామాత్రముగ కనిపించును.

నస్యం వా శాకజాతం వా సర్వతోంకురితం యథా ౹ 
కోమలం తద్వదేవైష పేలవో జగదఙ్కురః ౹౹203౹౹

203. ధాన్యపు లేక చిన్న మొక్కల యొక్క అంకురము ఎట్లు సుకుమారముగ ఉండునో అట్లే ఈ జగదంకురము పేలవముగ ఉండును.
వ్యాఖ్య:- అపంచీకృత మహాభూతములచే ఏర్పడిన సూక్ష్మశరీరములు మాయయగు ఈశ్వరుని శరీరము నందు రేఖల వలె అంకురములవలె ప్రారంభదశయందు ఉండును.

వస్త్రంలో దారం(సూత్ర) అనుస్యూతంగా ఉన్నట్లే,జగత్తులో హిరణ్యగర్భ స్వరూపం "అనుస్యూతాత్మ"గా ఉంది.ఆ సూత్రాత్మే సూక్ష్మ శరీరంగా స్థూల,సూక్ష్మ శరీరధారులందరిలోనూ అహంభావాన్ని-నేను అనే భావాన్ని-పొంది ఉన్నందున అన్ని జీవులకు అది సమిష్టి రూపం.

సాయంకాల సమయంలోను,ప్రాతఃకాలంలోను ఈ విశ్వమంతా మసక చీకటిలో వ్యక్తావ్యక్తంగా-కనిపించీ కనిపించనట్లుగా ఉన్నట్లే హిరణ్య గర్భావస్థలో కూడా ఈ సృష్టి స్పష్టంగా కనిపించదు.

మాయయైన ఈశ్వరుని కున్నట్టి లాంఛితత్వం లాంఛితవస్త్ర దృష్టాంతమే.
మాయ అనేది అనిర్వచనీయ స్వరూపం కలది.
అచిన్త్య రచనాశక్తికి బీజం(కారణం)మాయయే!

ఈ విధమైన కారణం సుషుప్తికాలంలో మాత్రమే ఆ మాయా బీజం యొక్క అనుభవం కలుగుతుంది.

గంజిపెట్టిన వస్త్రంమీద రంగులతో వేరువేరు రేఖలతో ఆకృతులు రచింపబడినట్లుగానే మాయావియైన ఈశ్వరుని దేహం అంతటా అపంచీకృత భూతాలతో నిర్మితమైన లింగశరీరాలతో లాంఛితమై ఉంటుంది.

హిరణ్యగర్భ స్వరూపం మన బుద్ధియందు చొరటానికిగాను వేరొక దృష్టాంతం,
ధాన్యపు మొక్కలుగాని, కూరగాయలు మొక్కలుగాని అన్నివైపులనుండి కోమలమైన చిగురుటాకుల రూపంలో ఉత్పన్నమైనట్లుగానే ఈ హిరణ్యగర్భుని యొక్క అంకురాలు మృదువుగా,కోమలంగా ఉంటాయి.

మాయాధిపతియైన ఈశ్వరుడు జగత్కారణమంటున్నా కానీ సురేశ్వరాచార్యులు పరమాత్మనే జగత్కారణంగా పేర్కొన్నారు.

శ్రుతియందు ఉపక్రమం మొదలుకొని సత్యజ్ఞానాది లక్షణాలుగల బ్రహ్మము ఈ జగత్తకు కారణమని స్పష్టంగా తెలుస్తుంది.అలాగే మాయకు వశమైన చిదాభాసం సత్యంలాగా గోచరిస్తోంది.అన్యోన్యాధ్యాసం కారణంగా సంభవమవటంవల్ల కాదనటానికి వీలులేదు.

ఈశ్వరుడైన పరమాత్మ సమస్త పదార్థాలయందు ఉంటూ శాశిస్తూ,నియమిస్తూ వుంటాడని బృహదారణ్యక శ్రుతిలోని
"యః పృథివ్యాం తిష్ఠన్ పథివీమన్తరో యమయతి" పృథివి లోపల ఉంటూ శాశిస్తూ ఉంటాడని అంతర్యామిగా నియమిస్తూ ఉంటాడని గ్రహించాలి.

శ్రుతివాక్యాల్లో ప్రయోగింపబడిన"యమయతి"
అనే శబ్దానికి ఇదే అర్థం.
సర్వస్వమూ"సర్వేశ్వరాధీనమే"

 ఆతపాభాతలోకో వా పటో వా వర్ణపూరితః ౹
సస్యం వా ఫలితం యద్వత్తథా స్పష్టవపుర్విరాట్ ౹౹204౹౹

204.పట్టపగలున ఈ లోకము కన్పించినట్లు,పూర్తిగా రంగులు దిద్దిన వర్ణచిత్రము వలె,పంటకు వచ్చిన ధాన్యము వలె విరాట్టు దశయందు జగత్తు పరిపూర్ణమై కన్పించును.స్థూల శరీరములన్నీ స్పష్టముగ ఈ దశయందు ఏర్పడును.

విశ్వరూపాధ్యాయ ఏష ఉక్తః సూక్తేఽ పి పౌరుషే ౹
ధాత్రాదిస్తంబ పర్యంతానేతస్యావయవాన్విదుః
౹౹205౹౹

205. ఈ విషయము,
అనగా విరాట్టు,
భగవద్గీతయందలి విశ్వరూప దర్శనాధ్యాయములో,పురుష సూక్తములో వర్ణింపబడినది....
బ్రహ్మ మొదలు గడ్డిపోచవరకు ప్రపంచమునందలి అన్ని వస్తువులు విరాడాంశములే.

ఈశ సూత్ర విరాడ్ వేధో విష్ణు రుద్రేంద్ర వహ్నాయః ౹
విఘ్నభైరవమైరాల మారికా యక్షరాక్షసాః ౹౹206౹౹

206.విరాడ్రూపములైన ఈశ్వరుడు హిరణ్యగర్భుడు విరాట్టు బ్రహ్మ విష్ణువు శివుడు ఇంద్రుడు అగ్ని గణేశుడు భైరవుడు మైరాలుడు మారికుడు యక్షులు రాక్షసులు.

విప్రక్షత్రియవిట్ శూద్రా గవాశ్వమృగ పక్షిణః ౹
అశ్వత్థపటచూతాద్యా యవవ్రీహితృణాదయః ౹౹207౹౹

207. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఆవులు గుఱ్ఱములు జంతువులు పక్షులు రావి మర్రి మామిడి మొదలైన చెట్లు యవలు వడ్లు గడ్డి మొదలగునవి.

జలపాషాణ మృత్కష్ఠవాప్యాకుద్దాలకాదయః ౹
ఈశ్వరాః సర్వ ఏవైతే పూజితా ఫలదాయినః ౹౹208౹౹

208. జలము రాళ్ళు మట్టి కర్ర ఉలి గడ్డపార మొదలైనవన్నీ ఈశ్వర రూపములే.ఈశ్వరుడని భావించి పూజించినచో అన్నీ ఫలము నిచ్చునవే.

యథా యథాపాసతే తం ఫలమీయుస్తథా తథా ౹
ఫలోత్కర్షాపకవ్షా తు పూజ్యపూజానుసారతః ౹౹209౹౹

209. ఎట్లేట్లు పూజింతురో,ఏయే రూపమున పూజింతురో అట్లే ఫలమును పొందుదురు. ఫలమునందలి హెచ్చుతగ్గులు పూజ్యవిషయపు శ్రేష్ఠతపైనను పూజా విధానముపైనను ఆధారపడును.
చూ.భగవద్గీత 4.11.

ముక్తిస్తు బ్రహ్మతత్త్వస్య జ్ఞానాదేవ న చాన్యథా ౹
స్వప్రబోధం వినానైవ స్వస్వప్నో హీయతే యథా ౹౹210౹౹

210. కాని బ్రహ్మతత్త్వము తెలిసికొనిన మాత్రమే ముక్తి లభించును.వేరు దారి లేదు.తన స్వప్నములు తాను మేలుకొననిదే అంతము కావు కదా.
వ్యాఖ్య:- సూర్యోదయమైన పిమ్మట,బంగారు కిరణాల కాంతితో ప్రపంచమంతా ఆభాసితమైనట్లుగా
చిత్ర చిత్ర వర్ణాలతో రంజితమైన వస్త్రంలాగా రంగులు దిద్దిన వర్ణచిత్రము వలె గుత్తులతో ఫలించిన వృక్షాలు లేదా సస్యంలా పంటకు వచ్చిన ధాన్యము వలె ఈ విరాట్ దశయందు విరాట్ పురుషుని విశాల దేహం కూడా స్పష్టంగా పరిపూర్ణంగా కన్పించును. స్థూలశరీరములన్నీ ఈ దశయందు 
స్పష్టముగా ఏర్పడును.

మనం దారపుపోగుల్ని అటూ ఇటూ కదలించినా,చుట్టచుట్టినా వస్త్రంకూడా అట్లాగే కదులుతుంది. చుట్ట అవుతుంది.అంటే,వస్త్రానికి ఏ మాత్రమూ స్వాతంత్ర్యము అనేది లేదన్నమాట.

అంటే,నూలుపోగులను అపేక్షించకుండా ఉండే స్వాతంత్ర్యము వస్త్రానికి లేదు.

అట్లాగే ఈ అంతర్యామియైన పరమేశ్వరుడు ఎక్కడ ఎప్పుడు ఏవిధమైన వాసనలతో ఏవిధమైన ఘటపటాది వికారాన్ని పొందుతాడో ఆ విధమైన 
కార్యమే-రూపమే మనకు కనిపిస్తుంది.

ఈ అంతర్యామి తత్త్వం యజుర్వేదాంతర్గతమైన పురుష సూక్తంలోనూ  భగవద్గీయందలి విశ్వరూపాధ్యాయంలోనూ విరాట్పురుషుని యొక్క రూపం వర్ణింపబడినది.

వీటినిబట్టి బ్రహ్మ మొదలు స్తంబపర్యంతమ(స్తంబము= సూక్ష్మతమైన ఒక కీటకం)అన్నీ కూడా విరాట్పురుషుని అవయవములే ! అని గమనించాలి.

ఈశ్వరుడు,సూత్రాత్మ,
విరాట్పురుషుడు,చతుర్ముఖబ్రహ్మ,విష్ణువు,శివుడు,ఇంద్రుడు,అగ్ని,
గణపతి,భైరవుడు,మైరాలుడు
(యముడు),మారిక(మహామారి అనే క్షుద్ర దేవత), యక్షులు, రాక్షసులు,బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రులు,ఆవులు,గుఱ్ఱాలు,
మృగాలు,పక్షులు,రావి,మఱ్ఱి,
మామిడి మొదలైన వృక్షాలు,
యవ వ్రీహి తృణ ధాన్యాలు, నీరు,రాళ్ళు,మట్టి,కట్టెలు,
బాడిస(కఱ్ఱలు చెక్కే సాధనము), కుద్దాల(గడ్డపార)మొదలైనవన్నీ ఈశ్వరాంగాలే!

౼"తే యథాయథోపాసతే తదేవ భవతి"...అనే శ్రుతిని అనుసరించి అన్నింటా ఏభావంతో ఈశ్వరుని పూజిస్తే ఆవిధమైన ఫలితమే కలుగుతుంది.

పరమాత్మను ఏ ఏ విధముగా ఉపాసిస్తే ఆయా విధమైన ఫలితాన్నే పొందుతారు.
అయితే ఫలం విషయంలో ఉత్కర్షాకర్షలు - ఎక్కువ తక్కువలు ఎట్లా వస్తునన్నాయి?

ఫలంలో ఆ విధమైన హెచ్చుతగ్గులు పూజా విధానమునుబట్టి, ఉపాసననుబట్టి, శ్రేష్ఠతపైన ఆధారపడి ఫలప్రాప్తి ఉంటుందని భావం.

అయితే మోక్షమనేది మాత్రం జ్ఞానంలేనిదే లభించదు.

మోక్షమనేది బ్రహ్మతత్త్వజ్ఞానం లేనిదే లభించదు,
ఇతరేతర ఏ సాధనాలవలన లభించదు.

మేల్కొంటే తప్ప కల్పితమైన తనస్వప్నం అనేది ఎట్లా తొలగిపోదో,
అట్లాగే ప్రత్యగభిన్నమైన బ్రహ్మతత్త్వజ్ఞానం లేనిదే జీవగతమైనట్టి,అజ్ఞాన కల్పితమైనట్టి సంసార నివృత్తి కలగదు.              

**** *హిందువులు ఎందుకు పేదలుగా మారుతున్నారు

 *హిందువులు ఎందుకు పేదలుగా మారుతున్నారు* 

 
1) శర్మ గారు తన కొడుకుని సైన్స్ మ్యాథ్స్‌లో చేర్పించారు...
2) అతనికి ట్యూషన్లు
  3 సంవత్సరాలకు నెలకు ₹3000/- ప్రకారం .
3) అతనికి కోచింగ్ ఇప్పించాడు ఇంటర్ లో ₹ 50000.
4) అతను ఒక సంవత్సరం పాటు ITI నుండి IIT వరకు పరీక్షలకు కోచింగ్ కోసం  సుమారు 2 లక్షలు ఖర్చు చేశాడు.
5) ఆ తర్వాత తన కొడుకును ఓ ప్రైవేట్ కాలేజీ లో బీటెక్‌లో చేర్పించి donation రూ. 5 లక్షలు.
6) గ్రాడ్యుయేషన్‌లో 4 సంవత్సరాలు గడిపిన తర్వాత, ఖర్చు రూ. 10 లక్షలు.
7) ఆ అబ్బాయి MTech చేస్తూ మరో 2 సంవత్సరాలు 
8) శర్మ జీ కి అదనపు భారం రూ. 5 లక్షలు.
9) ఇంజనీర్ అయ్యాక కూడా అబ్బాయికి జాబ్ ఆఫర్ రాలేదు.
10) ఒక సంవత్సరం కష్టపడి తే అబ్బాయికి 40 వేల స్టార్టింగ్ ఆఫర్ వచ్చింది.
11) అబ్బాయికి ఉద్యోగం వచ్చినప్పుడు శర్మ గారు పొరుగున లడ్డూలు పంచారు 😊

మరోవైపు...

శర్మ గారు ఇల్లు కట్టినప్పుడు, 
సలీం కాంట్రాక్టర్ 35 లక్షలు అంచనా వేశారు.

1. నిషాత్, ఫ్యాబ్రికేటర్ 40 వేలకు గేటు తయారు చేశారు.
2. ఆసిఫ్ కార్పెంటర్ నుండి చెక్క పనిని 6 లక్షలకు పొందారు.
3. డానిష్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ పనిని  2 లక్షలకు పొందారు.
4. ఇస్లాం భాయ్ నుండి ప్లంబింగ్ పనిని 80 వేలకు పొందారు.
5. ఫైజల్  2 లక్షలకు పెయింటింగ్‌ పని  పొందారు.
6. 65 వేలకు ఇర్ఫాన్ POP పని చేసారు.
7. 1.5 లక్షలతో హఫీజ్ మాడ్యులర్ కిచెన్‌ని చేశారు.
8. 3000కి ఇస్మాయిల్ భాయ్ wastage తొలగించారు.
9. అమీర్ గ్యారేజీ  కారు యొక్క డెంట్‌నుతీయ్టానికి  రూ. 15000.

శర్మాజీ భార్య తన బ్లౌజ్‌కు కూలీ మక్బూల్ దర్జీ రూ. 1000

జావేద్ హబీబ్ నుండి అతని కుమార్తె తన జుట్టుకు రూ. 8000.
👇
ఇప్పుడు...

శర్మ జీ కుమారుడు, రూ. 30 లక్షలు, ఖర్చుతో రూ. ఇంజనీరింగ్ ఉద్యోగం సంపాదించి నెలకు₹40000/-ఆదాయం పొందుతున్నాడు. 

మరియు💥

సలీం భాయ్, కాంట్రాక్టు చేసిన తర్వాత, తన కొడుకు కోసం రెండు భవన నిర్మాణ దుకాణాలు తెరిచాడు.
ఇప్పుడు మెట్రిక్యులేషన్ ఫెయిల్ అయ్యి రూ. నెలకు 1.5 లక్షలు.

1. నిషాత్ ఫాబ్రికేటర్ 🔨 రూ. తన ఇద్దరు సోదరులతో కలిసి నెలకు 90000 నుండి 120000 వరకు.
2. ఆసిఫ్ రూ. వడ్రంగి 🪚 నుండి రోజుకు 2000 నుండి 3000 మరియు ఒక మంచి డాబ ఇల్లు ఉంది. 🏠 
3. డానిష్ ఎలక్ట్రికల్ పని ద్వారా నెలకు 70 నుండి 80 వేల రూపాయలు సంపాదిస్తాడు.
4. ఇస్లాం తన ముగ్గురు ప్లంబర్లకు రోజూ 500 రూపాయలు చెల్లించడం ద్వారా నెలకు 70 వేల రూపాయలు సంపాదిస్తాడు. 
5. ఫైజల్ సంవత్సరానికి 10 నుండి 12 లక్షల రూపాయలు సంపాదిస్తాడు మరియు గ్రామంలో సాగు కోసం  10 ఎకరాల భూమిని పొందుతాడు. అతని కొడుకు దుబాయ్‌లో నెలకు 50 వేలు సంపాదిస్తున్నాడు.
6. హఫీజ్ భాయ్ మాడ్యులర్ కిచెన్ నుండి 20% లాభం తీసుకుంటాడు. 
7. జంక్ డీలర్ కొడుకులు ఇస్మాయిల్ జంక్ షాప్ వద్ద కూర్చొని స్విఫ్ట్ కార్లు నడుపుతారు మరియు 3 బైక్‌లు కలిగి ఉంటారు. 🏍️ 
8. మక్బూల్ భాయ్ బ్లౌజ్‌లను 👚 ఇతర కళాకారులచే కుట్టించబడ్డాడు, ఒక్కో బ్లౌజ్‌కు 300 రూపాయలు మరియు శర్మ జీ భార్య నుండి 1000 రూపాయలు తీసుకుంటాడు.

9. జావేద్ హబీబ్ సలోన్ యజమాని సఫియా, రూ. రూ. సంపాదించే వారిచే కెరాటిన్ చేయించుకుంటుంది. 5000 మరియు ఛార్జీలు రూ. శర్మాజీ కుమార్తె నుండి 8000. 
10. ⁠5 సంవత్సరాలలో ఆమె 3 సెలూన్లను తెరిచింది.

*శర్మ జీ తన పిల్లల కోసం డబ్బు సంపాదించడం లేదు కానీ డానిష్, ఆసిఫ్, ఇస్మాయిల్, మక్బూల్ మరియు హఫీజ్ మరియు అతని కొడుకు కూడా అలాగే చేస్తారు...!* 😱 

_ముగింపు:_💥
_రిజర్వేషన్ మరియు ఉద్యోగం అంటూ ప్రలోభపెట్టి హిందువులను బ్రెయిన్ వాష్ చేసారు._

_12వ తరగతి పాసైన హిందువు కూడా ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు.
_మరోవైపు నిరక్షరాస్యులైన ముస్లింలు నెమ్మదిగా అన్ని వ్యాపారాలను స్వాధీనం చేసుకున్నారు._👺👹💩
 నమస్తే...*ఆరు ప్రఖ్యాత అబద్ధాలు*

*కాంగ్రెస్, కమ్యూనిస్టు , సెక్యులరిస్టు పార్టీలు, వాటిని, వాటి నాయకులను సమర్థిస్తూ, పని గట్టుకొని భారతీయ లేదా హిందూ సంస్కృతిని, జాతీయవాదాన్ని, దేవీ దేవతలను కించపరిచే మేధావులను, మీడియా సంస్థలను ఇంగ్లీషులో Liberal Eco System అని పిలుస్తారు.*

*2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి వీరు తెగ బాధ పడిపోతున్నారు. ఆయన్ని, ఆయన ప్రభుత్వాన్ని, ఆయన పార్టీని దేశంలోనూ, విదేశాల్లోనూ బద్నామ్ చేయడానికి వీరు చేయని కుట్రలేదు. వీళ్ళ కుట్రలు, ఉద్దేశ్యాలు, వీళ్ళ చివరి లక్ష్యం తెలియని వారు, ఫేస్బుక్ వాట్సప్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో ఆధారాలు లేని పోస్టులు, కామెంట్లు పెడుతుంటారు.*

*పైన చెప్పుకొన్న ఈ వర్గపు మనుషులు నరేంద్రమోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పిన ఆరు ప్రఖ్యాత అపద్దాలను ఇక్కడ తెలుసుకొందాం.*

*మొదటి అబద్ధం*

*రఫాల్ వివాదం*

*ఫ్రాన్స్ తో మోదీ ప్రభుత్వం  చేసకొన్న రఫాల్ యుద్ధ విమానాల ఒప్పందం లో అవినీతి జరిగిందని, ప్రధాని తనకు  అనుకూలంగా వుండే వాళ్ళతో  జత కట్టి పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారని, పార్లమెంటు లో రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్షాలు నానా గొడవ  చేసారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొంది. స్వయంగా  నేనే కమిటీ వేసి నిగ్గుతేలుస్తాను అంది. మాకేమీ అభ్యంతరం  లేదు అన్నది  ప్రభుత్వం.*

*సుప్రీంకోర్టు చివరకు  ఏమన్నది ?*

*రఫాల్ ఒప్పందం పారదర్శకంగా వుంది, ఎక్కడా  అవినీతి జరిగినట్టు  సాక్ష్యాలు లేవు. ఒక సారి కాదు, రెండు మార్లు అలా చెప్పింది. చెంప  దెబ్బ తిన్న రాహుల్ గాంధీ  సుప్రీం కోర్టుకు లిఖిత పూర్వకంగా  క్షమాపణ చెప్పాడు.*

*కాంగ్రెస్ -కమ్యూనిస్ట్  గుంపు సైలెంట్ అయిపోయింది*

*రెండవ  అపద్దం*

*పెగాసస్ వివాదం*

*నరేంద్రమోది  ప్రభుత్వం నా ఫోన్ ను, అలాగే ప్రతిపక్షాల ఫోన్లను పెగాసస్  spyware  ద్వారా tap చేస్తోందని  రాహుల్ గాంధీ , ఆయన  పార్టీ, ఇతర ప్రతి పక్షాలు  పార్లమెంట్ ను స్థంబింప చేసాయి , విదేశాల్లో కూడా ఇదే విషప్రచారం చేసారు. వేలాదిమంది  చేత  సోషియల్ మీడియా లో చెప్పించారు.మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొంది.తమ*  
*ఫోన్లలో పెగాసస్ వుంది అని ఎవరు అంటున్నారో వాళ్ళు తమ ఫోన్లను  తమకు  ఇవ్వాలని కోర్టు అడిగింది. కేకలేసిన వేలాది మంది  లో కేవలం 29 మంది  మాత్రమే ఫోన్లు ఇచ్చారు. సుప్రీం కోర్టు  వాటిని దర్యాప్తు చేయిస్తే వాటిలో పెగాసస్  spyware  లేదు అని తేల్చింది.*

*మరోసారి  సెక్యులర్ గుంపు నిశ్శబ్దం లోకి జారుకొంది.*

*మూడవ  అపద్ధం*

*చైనా , పాకిస్తాన్ లు మన  భూమిని  ఆక్రమించుకొన్నాయి*

*నరేంద్రమోది ప్రభుత్వం  తన  చేతకానితనంతో చైనాకు ,  పాకిస్తాన్ కు మన భూభాగాన్ని తాకట్టు పెట్టింది అని మిద్దెలెక్కి అరిచారు.*
*కానీ స్వయంగా  2012 లో అప్పటి UPA - Congress   ప్రభుత్వం రాజ్యసభలో  పాకిస్తాన్ 78 వేల  చదరపు  కి. మీ భూబాగాన్ని , చైనా  38 వేల  చదరపు  కి. మీ.  భారత భూభాగాన్ని ని తమ  ఆ ధీనం లో వుంచుకొన్నాయని ఒప్పుకొన్నది.  2012 లో ప్రధాని  ఎవరు? ప్రభుత్వం ఎవరిది ?*
*ఆ భూభాగమంతా  1948 నుండి 1962 వరకూ  కాంగ్రెస్ హయాంలో పోగొట్టుకొన్నదే. అంతే కాదు, పాకిస్తాన్ తనది  కాని POK లో 5180 కి. మీ భూమిని  దుష్ట చైనా కు ఇచ్చుకొంది . ఇదంతా  2014 కు ముందు చరిత్ర. ఇపుడు చైనా   పాకిస్తాన్ లు అలాంటి  సాహసం చేస్తే వాళ్లకు  దిమ్మ తిరిగి పోయే జవాబు  ఇస్తున్నారు మన వీర  సైనికులు.*

*లౌకిక వీరులు తెర వెనక  దాగారు.*

*నాల్గవ అపద్దం*

*బీబీసీ వివాదం*

*గుజరాత్ అల్లర్ల విషయం లో బీబీసీఅపద్ధాలు , , అర్ధసత్యాలతో వండిన  డాక్యుమెంటరీ ని అడ్డం పెట్టుకొని గొడవ చేశారు.తప్పుడు కథనాలు  అల్లారని ప్రభుత్వం దాన్ని ఆపేస్తే, బీబీసీ ని 24 క్యారెట్ల బంగారం గా చూపించే  ప్రయత్నం చేసారు. విషయం ఎంతవరకు  వెళ్లిందంటే అమెరికా కూడా ఒక దశ లో మన కేంద్ర ప్రభుత్వం పై  కొంచెం అసహనం ప్రదర్శించింది కూడా. మొదటినుండి  అనుమానం తో వున్న ప్రభుత్వం బీబీసీ మీద  నిఘా  పెడితే, అది 40 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిందని  తేలింది. స్వయంగా బీబీసీ నే ఈ తప్పును అంగీకరించింది.*

*గ్యాంగ్ సెలైంట్ అయ్యింది.*

*అయిదవ  అపద్దం*

*ద్రవ్యోల్బణం పై  దుష్ప్రచారం*

*నరేంద్ర మోదీ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోయిందని , ధరలు విపరీతంగా పెరిగాయని  అంటున్నారు. కొన్ని వస్తువుల ధరలు  పెరిగాయి. కానీ అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ , చైనా  లాంటి దేశాల్లో పెరిగిన ధరలతో్  పోలిస్తే మన దేశంలో   ధరల పెరుగుదల  5శాతాన్ని మించలేదు. ఆదేశాల్లో 40, 50 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయికి ధరలు  చేరుకొన్నాయి. ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎంతటి  ఆర్థిక ఇబ్బందుల్లో వుందంటే ఉద్యోగులకు జీతాలు సరిగ్గా ఇవ్వలేని స్థితిలో వుంది.  అమెరికా లోని ప్రఖ్యాత  నగరం  న్యూయార్క్ నుండి పౌరులు  ఇతర  ప్రాంతాలకు వలస వెళుతున్నారు.*
*అంతే కాదు, భారత్  ఆర్థికంగా  చాలా  బలంగా  వుందని , రాబోయే రోజుల్లో ప్రపంచ మూడవ  ఆర్థిక శక్తి గా  ఎదగబోతోందని  ప్రపంచ  బ్యాంక్, ఐ ఎం ఎఫ్ లు అంచనా వేస్తున్నాయి. ఇతర  ప్రతిష్టాత్మక సంస్థలు కోవిడ్ సమయంలో, ఆ తరువాత  భారత్ తన ఆర్థిక విధానాలను చక్కగా  రూపొందించుకొని , ఆచి తూచి  అడుగులు వేసిందని  మెచ్చుకొంటున్నాయి.*
*ద్రవ్యోల్బణం  గురించి కాంగ్రెస్ మౌనంగా  వుంటేనే మంచిది. ఎందుకంటే  ద గ్రేట్  మన్మోహన్ సింగ్ గారు ప్రధాని గా వున్న సమయం లో ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్ లో వుండింది. ఆహార  ద్రవ్యోల్బణం  (food inflation ) 18 శాతానికి  చేరిన  సంగతి  తెలియనిదా ?*

*సెక్యులర్ దుకాణం వారు ఇది చెప్పరు.*

*ఆరవ  అపద్ధం*

*నిరుద్యోగం*

*నరేంద్ర మోదీ పాలనలో నిరుద్యోగం  పెరుగుతోందని  ఈ మనుషులు  ఆరోపిస్తారు.*
*నిజానికి 2017నుండి 2023 వరకూ కేవలం  MSME విభాగంలోనే 6.5 కోట్ల మందికి ఉపాధి  లభించింది.*
*ముద్ర యోజన ద్వారా  40 కోట్లమంది  రుణాలు  పొందారు. ఆశ్చర్యం ఏమిటంటే  40 కోట్ల మంది  ముద్ర యోజన లబ్ధిదారుల్లో 27 కోట్ల మంది  మహిళలే. Digital economy  ద్వారా 2014 నుండి 2023 వరకూ  6.15కోట్ల మంది కి ఉపాధి  లభించింది. PM Employment Generation లో భాగంగా  పర్యాటకం  , ఖాదీ, ఆవాస్  మొదలైన  రంగాల్లో  అనేకమందికి ఉపాధి  లభించింది.*

*సెక్యులర్ వాదులు ముఖం  చాటేసారు.*

*ఒక  దాని తరువాత  ఈ బూటకపు సెక్యులర్ వాదుల  ఆరోపణలు  కుప్పకూలిపోతున్నాయి.*
*కానీ ఈ మనుషులు ఇలాంటివి వండుతూనే  వుంటారు. జాతీయవాదులు , దేశభక్తులు  వాటిని తిప్పిగొడుతూనేవుండాలి.* 

*వాళ్ళు చెడును  ఆపనపుడు మనం  మంచిని  ఎందుకు ఆపాలి?
*జై భారత్ 
-Dr.P.V.మల్లికార్జున రావు,
కాజీపేట.
 ఒకసారి సముద్రుడికి పెద్ద సందేహం వచ్చింది. గంగానదిని అడిగాడు, నువ్వు నా దగ్గరకు పెద్ద పెద్ద చెట్లను మొసుకొస్తుంటావు కదా, గడ్డి పరకల్ని ఎందుకు తీసుకురావు అని. అప్పుడు గంగానది ఇలా సమాధానం చెప్పింది. చెట్లు వంగవు. అవి కఠినంగా ఉంటాయి. అందుకే వాటిని వేళ్ళతో సహా పెళ్ళగిస్తూ ఉంటాను. గడ్డిపరకలు వేరు. వాటికి ఆణుకువ తెలుసు. నేను మహోధృతంగా ప్రవహిస్తున్నప్పుడు నా వేగానికి, బలానికీ అవి వినయంగా తలవంచుతాయి. అప్పుడు నా వేగమూ, శక్తీ ఓడిపోతాయి. నా వరద తగ్గిన వెంటనే గడ్డిపరకలు మళ్ళీ తలెత్తుతాయి.అలాగే ఇతరులతో సర్దుకోవడం చేతకాక అహంకారంతో, అతిశయంతో మిడిసిపడేవారు తమకంటే బలమైన శక్తులకు ఓడిపోయి నశిస్తారు. వినయంతో, ఇతరులతో సామరస్యభావనతో జీవించేవారు ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుంటూ పదికాలాల పాటు జీవిస్తారని చెబుతుంది మహాభారతంలోని ఈ ఉదాహరణ…🕉️🚩
ఆగష్టు 9, 1973 లో కృష్ణా, ఎన్టీఆర్ నటించిన *దేముడు చేసిన మనుషులు* అనే సినిమా విడుదల అయ్యింది. 
*Phase-1: దొంగతనం*
దానిలో జగ్గయ్య హిందూ దేవాలయాల్లోని పంచలోహ విగ్రహాలు దొంగతనం చేయించి విదేశాలకు అమ్ముతుంటాడు, పంచలోహ విగ్రహాల అమ్మకం 1947 కి ముందే మొదలయ్యి 90 ల నాటికి పంచ లోహవిగ్రహాలు అయిపోయి రాతి విగ్రహాలు అమ్మారు అలా విగ్రహాల కత నడిచింది దాదాపు గా చాలా అయిపోయాయి.

హిందువులు పట్టించుకోలేదు.

*Phase-2: లీజ్*
 తర్వాత దేవాలయల భూములు లీజ్ మొదలైంది, లీజ్ వాస్తావానికి లక్ష ఐతే చూపించేది 10వేలు.

 హిందువులు పట్టించుకోలేదు.

*Phase-3:కబ్జా/అమ్మకం*
 ఇది పెద్ద లాభదాయకంగా లేకపోవడం తో భూముల కబ్జా,  అమ్మకం మొదలైంది.

 హిందువులు పట్టించుకోలా.

*Phase-4:విద్వంసం*
భూములన్నీ అయిపోక  ముందే హుండీలు బద్దలు కొట్టి దోచుకోవడం, గుప్తనిధులకోసం గర్భ గుడులు తవ్విన వేల సందర్భాలు జరిగాయి.

హిందువులు పట్టించుకోలా.

*Phase-5:తాకట్టు*
 రాష్ట్రం లోని అన్ని దేవాలయాల్లో కలిపి మొత్తం 500000 (5 లక్షల కేజీ ల ) బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి మసీదులు, చర్చి లకి ముల్లా లు పాస్టర్లకి జీతాలకి వాడింది.

 హిందువులు పట్టించుకోలా.

*Phase-5:అమ్మకం*
తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లోని బంగారాన్ని అమ్మడానికి ప్రణాళికలు వేస్తోంది.

 హిందువులు పట్టించుకోలా

 *హిందువులలో ఉన్న ఈ పట్టించుకోని లక్షణం ముస్లింలచే హిందువుల హత్యలకు కారణం అయ్యింది.
* 20 లక్షల మంది హిందూ అమ్మాయిల్ని ముస్లింల సెక్స్ కోర్కెలకు బలి చేసింది.
* హిందూ ఉత్సవాలపై రాళ్ళ దాడికి కారణం అయ్యింది, హిందువులు మతాచారాలు పాటించడానికి కూడా భయపడే స్థితికి తెచ్చింది.
* పాకిస్తాన్, బాంగ్లాదేశ్, మయన్మార్ ల నుండి 15 కోట్ల మంది రాక్షసుల్ని రప్పించింది, 88%గా ఉన్న హిందూ జనాభాని 66%నికి లాక్కొచ్చింది.
* కాంగ్రెస్ చేత వక్ఫ్ చట్టాన్ని రప్పించి హిందువుల భూముల్ని, ఇళ్లను, అపార్ట్మెంట్ లను ఇంకా చెప్పాలంటే ఊర్లకు ఊర్లను  ముస్లింలకు ఉచితంగా కట్టబెట్టింది.   
* పార్లమెంట్ లో పాస్ కాక చట్టం రూపం పొందని పీసీటీవీ బిల్లు ని విజయవంతం గా అమలు జరిపింది ఫలితంగా బెంగాల్ లో వేలమంది హిందువుల్ని చంపినా కేసుల్లేవు. వందలాది హిందూ ఆడపిల్లల్ని సామూహిక రేప్ చేసినా కేసుల్లేవు.
* తమిళనాడు లో ప్రభుత్వ స్కూల్స్ లో ప్రభుత్వ టీచర్స్ హిందూ విద్యార్థుల్ని మతం మార్చుతున్నా పట్టించుకునే దమ్ము, ఆలోచన లేకుండా పోయింది.
* సగం కర్ణాటక బడ్జెట్ ముస్లిం, క్రైస్తవులకు, కాంగ్రెస్ కు పంచుతున్నా అడిగే దిక్కులేదు.
* హిందువుల్ని ఊచకోత కోసిన టిప్పు సుల్తాన్ ప్రభుత్వానికి దేముడు అయ్యాడు.
* దాదాపు లక్ష ఎకరాల హిందూ రైతుల భూములు వక్ఫ్ కు పోయాయి. 
* పంజాబ్ మొత్తం డ్రగ్స్ తో నిండిపోయింది, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ల నుండి వచ్చే డ్రగ్స్ దేశం మొత్తం విస్తరించాయి.
* తెలంగాణా లోని భైన్సాలో ముస్లింలు హిందువులపై దాడులు చేస్తే హిందువులు జైలు పాలయ్యారు.
* చెంగిచర్లలో హిందువులపై ముస్లింలు దాడి చేస్తే హిందువులు జైలు పాలయ్యారు.
* ముత్యాలమ్మ గుడిలో అమ్మవారిని ముస్లిం కాలితో తంతే అడిగినందుకు హిందువులు జైలు పాలయ్యారు. 
ఇంత జరుగుతున్నా హిందువులలో చైతన్యం రాకపోవడానికి కారణం *హిందువులు తిండికి తిమ్మరాజులు - పనికి పోతరాజులు అవడమే*.

$ ప్రతి విషయం లో నాకేంటి అని ప్రశ్నించడమే.
$ కొత్తగా ఇప్పుడిప్పుడే ప్రచారం పెంచుకుంటున్న సోషల్ మీడియా ని డబ్బులు అడిగే వేదికగా మార్చుతున్నారు. 
$ హిందువులారా ఇప్పటికి ఏమీ పట్టించుకోక పొతే హిందూ జాతి ఒకప్పుడు భారత దేశంలో ఉండేదిట అని భవిష్యత్తు తరాలు పుస్తకాల్లో చదవాల్సి ఉంటుంది.
$ పనికిమాలిన తనానికి పర్యాయ పదంగా స్థిరపడాల్సి వస్తుంది. 

ఇక మీ ఇష్టం. 
అయినా...
సర్వే హిందూ సుఖినోభవంతు.🚩🙏
 *దయచేసి ఎవరూ తొందరపాటుతో అపార్ధం చేసుకోవద్దు. జనవరి ఫస్ట్ పండుగ మనది కాదు, క్రిస్టియన్స్ వారు చేసుకుంటారు* 

*జనవరి నెల ఒకటో తేదీన నూతన సంవత్సర శుభాకాంక్షలు పెట్టవద్దు. మా నుండి ఆశించవద్దు.*

*హిందూ బంధువులారా మనకు సనాతన ధర్మంలో హిందువులకు నూతన సంవత్సరాది పండుగ యుగాది.*

*జనవరి ఒకటవ తేదీ హిందువులకు నూతన సంవత్సరం కాదు. దయచేసి హిందూ బంధువులు కేకులు కోయడం కానీ, డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రివేళ నూతనసంవత్సర వేడుకలలో పాల్గొనడం గానీ చేయకండి. కేకులు కోయడం, ఆ కేకుల మధ్యలో కొవ్వొత్తులు వెలిగించి, ఆర్పడం అనేది హిందువులకు పనికిరాదు.*

*హిందువులు ముఖ్యంగా గమనించిన వలసిన విషయం ఏమనగా హిందూమతంలో బ్రహ్మ ముహూర్తం అనగా తెల్లవారు జామున సుమారు 3.30గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ సమయం నుండి మనము మంచి సమయంగా హిందూధర్మంలో భావిస్తాం. రాత్రి 11గంటల సమయం నుంచి తెల్లవారుజామున మూడున్నర గంటల వరకు నిషిద్ధసమయముగ బావిస్తాం ఆ సమయం భూత ప్రేత పిశాచాలు తిరిగే సమయం గమనించండి.* 

*హిందువులు వారి పిల్లలకు సనాతన ధర్మం యొక్క విలువలను తెలపండి. కొవ్వొత్తులు ఎక్కడ వెలిగిస్తారో బాగా గమనించండి. మళ్లీ చెబుతున్నా. మనకు నూతన సంవత్సరం ఉగాది పండుగతో మొదలవుతుంది. హిందువులకు జనవరి 1 వద్దు. ఉగాది ముద్దు. దయచేసి హిందూ బంధువులు అర్ధరాత్రి వేడుకలలో పాల్గొనవద్దు. మన  పూర్వీకులు రాత్రిపూట ప్రయాణాలు చేసి ఇంటికి వస్తే 12 దాటితే భోజనం రాత్రి భోజనం గాని అల్పాహారం అని బయట ఎక్కడ చేసి రాకపోయినా పన్నెండు దాటింది ఇప్పుడు తినవద్దు అని వారించే వారు అది ఎందుకో అర్థం చేసుకోండి కాబట్టి 12 గంటలకు సంబరాలు చేసుకుని కేకులు కట్ చేసి తినడం బిర్యానీలు తినడం కూల్ డ్రింక్స్ తాగడం హిందూ సంప్రదాయానికి విరుద్ధం దీపాలు ఆర్పడం వినాశనానికి దారి కూల్ డ్రింక్స్ కేకులు ఆరోగ్యానికి హానికరం హిందూ బంధువులందరూ మన సాంప్రదాయాలను కాపాడతామని ప్రతిజ్ఞ చేద్దాం.*
🙏🙏⛳ 🔔🕉️🔔 ⛳🙏🙏
 




☝️ పై చిత్ర సారాంశం..!

 నీ శరీర ప్రతి కదలికలో నిక్షిప్తమై ఉన్న ఆ నిరాకార శివస్వరూపమే అని  ఎప్పుడు గుర్తించకుండా  నీ జీవితం సాగుతున్నప్పుడు.. ❓

Ex..
👉 నీవు ఉపయోగిస్తున్న మొబైలు తనంతట తానుగా ఎవరితోటైనా మాట్లాడిందా ❓

👉 తనంతటతానుగా ఎక్కడికైనా ప్రయాణం చేసిందా ❓

👉 తనంతటతానుగా ఎక్కడైనా మెసేజ్ టైప్ చేసిందా ❓

👉 తనంతట తానుగా ఏ పనైనా ఎక్కడైనా చేసిందా❓

👉 నీ మొబైలు ఏదీ చేయలేదు అని  నీకు మాత్రమే తెలుసు ❓

👉 ఈ ఒక్క విషయాన్ని మీ మనసుతో నీవు గుర్తించుకుంటే..❓

👉 నేను ఈ శరీరాన్ని కానే కాదు  ఈ సమస్త గణాలకి అధిపతిని  నేనే అని నీ అనుభవ పూర్వకంగా గుర్తించేంతవరకు  ఎన్ని జన్మలెత్తినా❓
👉 ఈ భూమ్మీద నీవు ఆనందపడే ఎన్ని ఘనకార్యాలు చేసిన..నీ అన్ని జన్మలలోను  నిన్ను నీవు మోసం చేసుకుంటూ జీవిస్తున్నట్లే❓

🪔 ఇక నీ గురించి నీవు ఎలా
       గుర్తుంచుకుంటావో ❓

🧜‍♂️నీ జన్మ... 👈
🧜‍♂️ నీ ఇష్టం... 👈
 🙏जय श्री राम 🌹 सुप्रभातम् 🙏

प्रियं वा यदि वा द्वेष्यं शुभं वा यदि वाऽशुभम्।
अपृष्टोऽपि हितं ब्रूयाद्यस्य नेच्छेत्पराभवम्॥

ప్రియం వా యది వా ద్వేషం 
శుభం వా యది వాsశుభమ్
అపృష్టోsపి హితం బ్రూయాత్
యస్య నేచ్చేత్పరాభవమ్ 

If you do not want your friend to be ruined, offer him beneficial advice, even if not asked for. Let him feel it pleasant or unpleasant, auspicious or inauspicious.

अगर यह सोचते हो कि अपने मित्र का नाश न हो, तो उसे उसके हित की बात अवश्य बताए, चाहे उसने भले ही पुछा भी न हो। चाहें उसे वह सुखदायक लगे या खेदजनक अथवा शुभ लगे या अशुभ!

మీ స్నేహితుడు నాశనం కాకూడదనుకుంటే, అడగకపోయినా అతనికి ప్రయోజనకరమైన సలహా ఇవ్వండి. అతను దానిని ఆహ్లాదకరమైన లేదా అసహ్యకరమైన, శుభకరమైన లేదా అశుభకరమైనదిగా భావించనివ్వండి.
 🦚🌻🌹💎💜🌈

 *🔅నాణేనికి బొమ్మా బొరుసులు ఉన్నట్లే,ప్రతి మనిషిలోనూ మంచీ,చెడూ ఉంటాయి.మనం ఎటు పక్క నుంచి చూస్తే ఆ కోణమే కనిపిస్తుంది.వెతికి చూస్తే పూర్తిగా చెడ్డవాడిలోనూ ఏ మూలో కాస్తంతైనా మంచితనం కనిపిస్తుంది.* 

 *మంచివారిలోనూ ఏదో ఓ చిన్న తప్పు దొరుకుతుంది. ఎదుటివారితో మనకున్న సంబంధ బాంధవ్యాల పాత్రా మన జడ్జిమెంట్లో ఉంటుంది. వాళ్ళు మనవాళ్ళు అనుకున్నప్పుడు ఏం చేసినా వెనకేసుకొస్తాం.అదే మనకు గిట్టని వ్యక్తి ఎవరైనా ఎవరెస్టు శిఖరం ఎక్కారే అనుకోండి. అతన్ని మనసారా అభినందించ డానికి కూడా నోరు పెగలదు.* 
 *ఆ ఇందులో గొప్పేముంది మాస్టారూ!* 

 *ఈరోజుల్లో ఆర్నెల్లు ట్రైనింగ్ తీసుకుంటే నేనూ,మీరూ ఎవరైనా ఎక్కేయగలం ఆ మాత్రానికి ఎందుకీ గొప్పల అంటూ ఆ పర్వతాన్ని ఎక్కి ఆకాశమంత విజయాన్ని కూడా అరక్షణంలోనే ఆవగింజంత చేసి మాట్లాడడానికీ వెనకాడం!ఇదంతా మన మనసు చేసే మాయ.మన మనసు దేంతో నిండి ఉంటుందో..మన చూపు,ఆలోచనలు,పనులు కూడా అలాగే ఉంటాయి. అవి ఈర్ష్య,ద్వేషం, అసూయ, పగ,ప్రతీకారమా లేక ప్రేమ,దయ, జాలి,కరుణా అనేది మన ఆలోచనను బట్టే ఉంటుంది.* 

 *మనం ఇచ్చే కమాండ్లోనే కంప్యూటర్ పనిచేసినట్లు..మన మనసుకు మనం వేసే మేతతోనే దాని చేతలు ఆధారపడి ఉంటాయి.స్వచ్ఛమైనపాలలాంటి మనసులో విషం చుక్క వేసి విరగ్గొట్టు కుంటామో...చెంచా పెరుగు వేసి చక్కగా తోడు పెట్టుకుంటామో...అంతా మన చేతుల్లోనే ఉంది!* 

 *🌄శుభోదయం 💥*

🦚🌻🪷💎🌹💜🌈
 డిసెంబర్ 13 , 1705 సంవత్సరం.
ఈ భూమ్మీదే అత్యంత విలువైన భూమి కొనుగోలు లావాదేవీ జరిగిన రోజు.
నాలుగు గజాలు కేవలం నాలుగు గజాల భూమిని 7800 తులాల బంగారంతో కొన్న రోజు. ఈ రోజు ధరతో లెక్కిస్తే 4 గజాలు 180 కోట్లు.
ఒక్కో గజం 45 కోట్లు.
ఒక్కొక్క తులం బరువు బంగారు నాణేన్ని భూమిమీద పరుచుకుంటూ తన దగ్గర ఉన్న సంపద మొత్తాన్ని వెచ్చించి ఒక ' ముగ్గురు మహావీర సిక్కు వీరుల ' మృతదేహాలను ఖననం కోసం ఒక హిందూ వ్యాపారి ముస్లిం మతోన్మాదుల దగ్గర నాలుగు గజాల భూమిని కొన్న రోజు.
గురు గోవింద్ సింగ్ కుమారులు 9 సంవత్సరాల ఫతే సింగ్..6 సంవత్సరాల జొరావర్ సింగ్ లను ఇస్లాం లోకి మారని కారణంగా సజీవంగా సమాధి చేసి ఊపిరి ఆడకుండా చంపేసిన దుర్మార్గ జీహాడీ ఔరంగజేబ్ కు ఎదురుతిరిగిన ఒక హిందూ వ్యాపారి తోడర్ మల్ సవాల్ చేసిన రోజు.
తన మనవల భయంకర మరణాలకు తల్లడిల్లిన నాయనమ్మ మాతా గుజరీ గుండె ఆగి మరణించారు.
ఇంకా కక్ష తీరని నరరూప రాక్షసుడు ఔరంగజేబ్ ఆ ముగ్గురి పార్ధివదేహాలకు అంత్యక్రియలు జరగకుండా మృత దేహాలను అలా వదిలేశాడు.
ఆ చిన్నారుల మృత దేహాలనూ. వృద్దమాత గుర్జరీ దేవి మృతదేహాలను అలా కుళ్లిన స్తితిలో చూడలేక తల్లడిల్లిన నాటి ప్రజలు ఆ పవిత్రదేహాలను ఖననం చేయడానికి ప్రయత్నిస్తే వాటిని ఖననం చేయాలంటే ఎవరైనా ముస్లిం దగ్గర మాత్రమే స్థలం కొనాలని జీహాడీ ఔరంగజేబ్ రాజశాసనం చేశాడు.
స్థానిక జీహాడీ పాలకుడు వజీర్ ఖాన్ దగ్గర స్థలం కొనడానికి నాటి ప్రజలు ప్రయత్నం చేస్తే ' మృత దేహాలను ఖననం చేయడానికి ఎంత స్థలం ' కావాలో అంతమేరకు బంగారం పరిచి ఆ స్థలం తీసుకోవచ్చని దుర్మార్గమైన ప్రతిపాదన చేశాడు.
నాటి సమాజంలో అంత డబ్బులేక తీవ్ర వేదనకు గురయ్యారు.
ఈ పరిస్తితిలో పాటియాలా లో వ్యాపారం చేసుకునే ఒక మధ్య తరగతి వ్యాపారి తోడర్ మల్ ఈ బృహత్ కార్యాన్ని పూర్తి చేయడానికి ముందుకొచ్చారు.
తన ఆస్తి మొత్తం బంగారం నాణేలుగా మార్చారు..కట్టు బట్టలతో మిగిలిన రాజా తోడర్ మల్ స్థానిక నవాబు వజీర్ ఖాన్ దగ్గరకెళ్ళి ఆ నాణేలను నేలమీద పరిచారు. సరిగ్గా నాలుగు గజాలకు సరిపోను బంగారంతో ఆ నాలుగు గజాలు కొని..ఆ అమరవీరులకు అంత్య క్రియలు నిర్వహించారు.
ఆ కట్టడాన్ని ' జహజ్ హవేలి ' అంటారు.
ఇంత త్యాగం చేసిన హిందువులను నేడు తమకు శత్రువులుగా భావిస్తున్న సిక్కు సమాజం మీద జాలి.
నిజానికి నాడు ప్రతి హిందూ కుటుంబంలో పెద్ద కొడుకు ' సిక్కు ' అవుతాడు.
నేడు ఆ సాంప్రదాయం కుట్రపూరితంగా కాలంలో కప్పెట్టబడింది.
హిందూ సమాజంలోని పెద్దకొడుకు సిక్కులను అదే హిందూ సమాజంలోని చిన్న కొడుకులమీదకు నాటికి నేటికీ హిందూ  సమాజానికి సహజ శత్రువులైన వ్యక్తులు రెచ్చగొడుతున్నారు.
సమాధులు నిజాలే మాట్లాడతాయి. ఒకసారి జహజ్ హవేలి గోడలకు చెవులు ఆనించి వినండి. మాతా గుజరీ. అమరవీరులు ఫతే సింగ్. జొరావర్ సింగ్ ల గొంతులు నిజమైన త్యాగాలను మీకు గుర్తు చేస్తాయి.
హరహర మహాదేవ్. బోలో సో నిహాల్ సత్ శ్రీ అకాల్ ..🙏
 రమణ మహర్షి (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950)
నేను శరీరం ,మనస్సు ,బుద్ది ,ప్రాణం ఇవేమీ  కాదు .
మనస్సు మొట్ట మొదట నేను అనే ఆలోచన చేసింది. అదే అహం .
ఆ తర్వాత , ఎన్నో రకాల  ఆలోచనల తో ఈ ప్రపంచాన్ని నిర్మిస్తుంది .
చింతలతో , ఆశా నిరాశల నడుమ ఊగిసలాడే మనస్సుతో ,కాసేపు సంతోషం ఆ వెంటే దుఖం ,ఇంతలోనే నిర్వేదం ,అంతలోనే ఉత్సాహం - ఈ ద్వందాలకు అంతమే లేదా?
కష్టాలొచ్చినపుడు ఇంకొకరిపై ఆధారపడి లేదా దేవుని పై భారం వేయటం
తాత్కాలిక వైరాగ్యపు ఆలోచనలతో సోమరితనంతో  పలాయన వాదాలు చేయటం
సమస్యలను దాటవేసి 'నా కర్మ ' అని అనుకోవటం - మనందరికీ మామూలే !
నీ సమస్యలకు సమాధానం నువ్వే వెదుక్కోవాలని
కష్టాలు ,సుఖాలు మన మనస్సులోని కండిషనల్ ప్రోగ్రాంస్ అని
  శక్తి వంచన ,ఆత్మ వంచన లేకుండా కష్ట పడాలని
ఎవరి పై ఆధారపడరాదని ,భావ దాస్యం చేయరాదని
తెలుసుకొని నమ్మి ఆచరించడమే - మన పని, మన గమ్యం.
మనిషి తను ఆనందపడుతూ వీలైతే తోటి వారిని ఆనందంగా ఉంచుతూ , జీవన ప్రయాణం చేయడమే గమ్యం .
శక్తి కొద్దీ సత్కర్మలు, స్వకర్మలు చేయాలి.
మనస్సుని ఉత్సాహంగా ,సంతోషంగా ఉంచుకోవాలి .
*ఈరోజు సోమవతి అమావాస్య అంటే ఆ రోజు ఏం చేయాలి?*

🍃🌹సోమవారమూ, అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలు విందాం…

🍃🌹దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే! తన అల్లుడైన శివుని అవమా నించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు. అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని కూడా అవమానించాడు.ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించివేసుకుంది.

🍃🌹సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన జటాజూటం తో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథగణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడిచేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చినవారందరినీ చావచితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగినశాస్తిని అనుభవించాడు.

🍃🌹నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేక పోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళా శంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారంనాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ. ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవు తాడని అభయమిచ్చాడు.

🍃🌹శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి... తన బాధల నుంచి విముక్తు డయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.

🍃🌹సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే... సంపూర్ణ ఆయురారోగ్యాలు సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ, రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట. ఏదీ కుదరకపోతే కనీసం శివపంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు.                        సేకరణ భగవంతుని అనుగ్రహంతో 🙏🕉️🙏
 *🌺☘శ్రీ రమణుల బోధ:  శ్రీ గురుదేవాయ నమః!🪷✍️ భగవాన్ రమణ మహర్షి.*🪷✍️ *శుద్ధ మనస్సు మన ప్రాణ స్వరూపం. మనసు దేహంతో కలిసి ఉండటం లౌకికం. మనసు మనలోని ప్రాణంతో కలిసి ఉండటం సమాధి. తాను దర్శించిన ఆత్మ భావనతో లౌకిక జీవితాన్ని గడపటం సహజ సమాధి.బాహ్యంలో నామ మాత్రంగా జీవిస్తూ, అంతరంలో నిరంతరం నామజపంతో సాగడమే మన ముందున్న సాధన! భగవాన్ రమణ మహర్షి.*🪷✍️
🙏🪷🪷🪷Andal Divya thiruvadigale sharanam🪷🪷Harihi Om🪷👏
 *అదృష్టం* అంటే *ఆస్తులు* ఉండటం ఒక్కటే కాదు, *కడుపారా* తినగల్గటం *కంటినిండా* నిద్రపోగల్గడం, *కష్టపడి* పని చేసుకో గల్గడం *కష్టసుఖాలు* పంచుకొనే వ్యక్తులు కల్గివుండటం,

 *ఈ ప్రపంచం* *చెడ్డవారి* వల్ల చెడిపోలేదు,*చెడుని* ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న *మంచివారి* వల్ల చెడిపోయింది 

.  *దైర్యంగా* అడగలేని *పిరికివారి * వల్ల, *మనకెందుకులే* అనుకునే *స్వార్థపరుల* వల్ల చెడిపోయింది .

       *అవసరం అవకాశం* లేనప్పుడు *నువ్వు ఎలా ఉన్నావో* అవసరం అవకాశం వచ్చినప్పుడు *కూడా* అలా మారకుండా ఉండటమే *నిజమైన వ్యక్తిత్వం* 

.  ఎవరో నిన్ను *బాధ* పెట్టారని, వాళ్ళు *తిరిగి బాధ* పడాలని ఎప్పుడూ *కోరుకోకు* తెలియక బాధ పెడితే వారిని *క్షమించు* తెలిసి బాధ పెడితే *ఆ తీర్పు కాలానికి* అప్పగించు .

        మనిషి చుట్టు *మంచి చెడు కష్టం నష్టం ప్రేమ స్నేహం* అన్నీ ఉంటాయి దేన్ని *వదిలేస్తాం* దేన్ని *తీసుకుంటాం* అన్నదాన్ని బట్టి మన *సంతోషం* ఆధారపడి ఉంటుంది ,   

.      నవ్వించే *వందమంది* స్నేహితులు లేకపోయినా పర్లేదు కాని కష్ట కాలంలో *నీ కన్నీళ్ళు* తుడిచే మనసెరిగిన నేస్తం *ఒక్కరు* ఉన్నా చాలు .
         
       బాదలు అనేవి ఆకాశంలో *చందమామ* లాoటిది , ఒక రోజు *ఎక్కువగా* ఉండవచ్చు ఒక రోజు *తక్కువగా* ఉండవచ్చు మరోక రోజు *కనపడకపోవచ్చు* అందుకే మనం *సంతోషంగా* ఉండాలి *బాదలున్నాయని* బాదపడుతూ *కాలం వృదా* చేసుకోరాదు .

🌹🙏🪔🌴🪔🙏🌹
 *_డబ్బు వస్తే మన చుట్టూ చేరేవాళ్లు చాలామంది ఉంటారు... కానీ జబ్బు వస్తే చూసేవాళ్ళు చాలా తక్కువ..._* 

*_ఖర్చు పెట్టినంత సులువుగా డబ్బు సంపాదించలేము, అలానే వదులుకున్నంత సులువుగా ఆత్మీయులను సంపాదించలేము..._* 

*_సంపాదన ఉన్నప్పుడే డబ్బులు జాగర్త చేసుకోవాలి. అలానే ఆత్మీయులను కూడ నలుగురిని సంపా దించుకోవాలి._*

*_అందుబాటలో ఉన్నపుడు అశ్రద్ధ చేసి, కరిగిపోయిన తర్వాత  కాలం విలువ, తరిగిపోయిన తర్వాత డబ్బు విలువ_*

*_తెగిపోయిన తర్వాత బంధం విలువ, పొగుట్టుకున్న తర్వాత  ఆరోగ్యం విలువ తెల్సుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు._*

*_కథ కన్నా జీవితంలోనే ఎక్కువ నాటకం ఉంటుంది. అందుకే రచయిత తిప్పలేని మలుపుల్ని విధి మరింత అద్భుతంగా తిప్పుతుంది.☝️_*
 *ఒక్క రాయితో.. అపర కోటీశ్వరుడు..*

*ఎలాగో తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..* 

జీవితంలో కొన్నిసార్లు ఊహించని, ఆశ్చర్యకరమైన ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేం. ఉదాహరణకు ఓ నిరుపేద రాత్రికి రాత్రి లాటరీ తగిలి కోటీశ్వరుడు కావడం వంటి ఎన్నో ఘటనలు చూస్తున్నాం. ఇలాంటి ఘటనే ఒకటి ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి విషయంలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా.. ఓ రాయిలో బంగారం ఉంటుందని అతగాడు ఎంతో కష్టపడి దానిని పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. చివరకు చేతకాక పరిశోధకుల దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తే బంగారం లేదు కానీ.. అంతకుమించే సాధించానని తెలియడంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధుల్లేవు. ప్రపంచంలో కోట్లలో ఒక్కరికే మాత్రమే కనిపించే రాయిని కనుగొని బంపర్ ఆఫర్ అందుకున్నాడు. బంగారం కంటే వందల రెట్ల విలువైన రాయితో రాత్రికి రాత్రే వందల కోట్లకు అధిపతి అయిపోయాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇతగాడి గురించే చర్చ. ఇంతకీ ఏం జరిగిదంటే..

ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ హోల్‌కు విలువైన రత్నాలు, అరుదైన రాళ్లను సేకరించడం హాబీ. అందుకోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు వెనుకాడడు. అలా 2015లో పార్క్‌లో వెళుతుండగా ఎర్రటి రంగుగల ఓ బరువైన రాయిని కనుగొన్నాడు. దాని లోపల బంగారం ఉంటుందనే ఉద్దేశంతో రాయిని పగలగొట్టేందుకు ఏళ్ల తరబడి శతవిధాలా ప్రయత్నించాడు. బరువైన సుత్తి, యాసిడ్ సహా ఎన్ని సాధనాలు వాడినా రాయిలో కాస్త కూడా పగుళ్లు రాలేదు. ఏళ్ల తరబడి విఫల ప్రయత్నాలు చేశాక చివరికి ఆ రాయిని మెల్‌బోర్న్ మ్యూజియమ్‌కి తీసుకెళ్లి చూపించాడు. అక్కడ ఆ రాయిని పరిశోధించిన పురాతత్వ శాస్త్రవేత్తలు డేవిడ్ హోల్ బంగారం కంటే వేల రెట్లు విలువైందని గుర్తించారు. ప్రపంచంలో అత్యంత అరుదైన ఈ రాయి విలువ వేల మిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు నిపుణులు.

డేవిడ్ హోల్‌ కనిపెట్టిన అరుదైన రాయి ఒక ఉల్క. దాని పేరు మేరీబోరో. 17 కిలోల బరువున్న ఈ రాయి 4.6 బిలియన్ సంవత్సరాలు క్రితం నాటిది. నికెల్, ఐరన్ మూలకాల మిశ్రమైన ఈ రాయి అంగారకుడు(మార్స్), బృహస్పతి(జూపిటర్) మధ్య ఉన్న ఉల్క బెల్ట్ ద్వారా 100 నుంచి 1000 సంవత్సరాల మధ్య భూమికి చేరి ఉంటుందని మెల్‌బోర్న్ పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.

ఈ ఉల్క ద్వారా సౌరవ్యవస్థలో అంతుచిక్కని రహస్యాలను అధ్యయనం చేయవచ్చు. డేవిడ్ హోల్ ఆవిష్కరణ ఓ నిజమైన సంపద అని, దీని విలువ ట్రిలియన్ డాలర్లు అయినా ఉండవచ్చని లెక్కగడుతున్నారు. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఈ ఉల్కతో సహా ఇప్పటివరకూ 17 అరుదైన ఉల్కలను గుర్తించారు పరిశోధకులు..
 


🙏 *రమణోదయం* 🙏

*మనోవాసనలు నశిస్తే అపరోక్షమయిన  విశుద్ధ అనుభవ జ్ఞానం కలుగుతుంది. దానివల్లనే జీవుని వేదన (మోక్షానికి) తీరుతుందే తప్ప,  ఆత్మని గురించిన గ్రంథ విద్య చేత ఎన్నడూ తీరదు. శరీరతాపం ఎండమావి (మృగతృష్ణ)తో చల్లబడేటట్లయితే, ప్రాణుల మోక్షేచ్ఛ కూడా పరోక్ష (గ్రంథ) జ్ఞానంతో తీరవచ్చు.*

మౌనంగా ఉండు.
నీతో నీవు గడపడం నేర్చుకో.
నీతో నీవు గడపడమే నిజంగా ధ్యానం!

🌹🙏 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.529)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
                 
🪷🙏🏻🪷🙏🏻🪷
 🍁 *తల్లికి సరైన నిర్వచనం* 🍁
~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఒకామె వీసా అప్లికేషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడి అధికారి అప్లికేషన్ ఫారం పూర్తి చేస్తూ .....
Q .... మీరేం పని చేస్తూ ఉంటారు ? అని అడిగాడు .
A ..... "తల్లిని" అన్నది
అధికారి కొంచెం అయోమయంగా, "ఇక్కడ ‘తల్లి’ అన్న ఆప్షన్ లేదు మేడమ్. 
Q .... మీ వృత్తి ఏమిటి ? అని అడిగాడు. 
A .... "పిల్లల అభివృద్ది అనే అంశం పై నేను రీసెర్చ్ స్కాలర్ని" అని సమాధానం ఇచ్చింది.
అధికారి మరింత అయోమయంతో ....
Q .... "మీరు ఈ రీసెర్చ్ ఎక్కడ చేస్తున్నారు ?" అని ప్రశ్నించారు. 
A .... "మా ఇంట్లో" అన్నది తల్లి. అధికారి మరింత అయోమయంతో చూసారు .
👉 "ఈ రీసెర్చ్ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. రోజుకి పద్నాలుగు గంటలు పని చేసినా పూర్తి అవ్వదు. 
👉 దీనికి నాకు మార్గ దర్శకులు నా భర్త.  సీనియర్ రీసెర్చ్ గైడ్, స్కాలర్స్ మా అమ్మ. ..!   మా తాతమ్మ, అమ్మమ్మ, నానమ్మ. వీళ్ళందరూ నా యూనివర్సిటీ  డైరెక్టర్లు. 
👉 మా అత్తగారు అప్పుడప్పుడు నా పేపర్స్ దిద్దుతూ ఉంటుంది.
👉 ఇప్పటికే నాకు రెండు డిగ్రీలు వచ్చాయి. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి" అంటూ ముగించింది. 
*అధికారి ఆమెతో పాటూ గుమ్మం వరకు వచ్చి, కరచాలనం చేసి సాగనంపుతూ ....*
👉 "తల్లికి ఇంతకన్నా గొప్ప నిర్వచనం నా జీవితంలో నేనెప్పుడూ వినలేదు మేడమ్. థాంక్స్" అన్నాడు 
మాతృదేవోభవ...
🙏🙏🙏
 🔱 అంతర్యామి 🔱

# ప్రేమను పంచిన మహర్షి

🍁పదహారేళ్లకే పరమ వైరాగ్యంతో అరుణాచలం చేరుకున్న పారమార్ధిక పిపాసి రమణ మహర్షి. పవిత్ర పర్వతంపై దాదాపు ఇరవై ఏళ్లు ధ్యానాది కఠిన సాధనల్లో నిమగ్నమయ్యారు. అర్ధ శతాబ్దం అరుణగిరి ఒడినే తన ఆధ్యాత్మిక క్షేత్రంగా చేసుకొని భక్తులను అనుగ్రహించారు. రమణులు ఎవరికీ ఏ బోధలూ చేయడానికి ఇష్టపడేవారు కాదు. తానొక ఉన్నత స్థానంలో ఉన్నానన్న అహంకారం కానీ, ఎవరినో ఉద్ధరించాలన్న తాపత్రయం కానీ మహర్షిలో కనిపించేవి కావు. ఆయన మహత్తర ఆయుధం మౌనమే! అయితే దర్శించిన ప్రతి ఒక్కరిపైనా వారి సాన్నిధ్య ప్రభావం ప్రసరించేది. మహర్షి శాంతచిత్తం, నిశ్చల సముద్రం లాంటి మనసు, కరుణార్ద్రమైన చూపులు, అన్ని జీవరాశులపై కురిపించే దయ మరువలేనివి.

# నిరంతరం ఆత్మానందంలో ఓలలాడుతూ, మౌనదీక్షలో ఉండే రమణులు, భక్తులపై కురిపించే ప్రేమ మాత్రం వర్ణనాతీతం. ఆశ్రితులు తమ కుటుంబాల్లోని కష్టనష్టాల గురించి చెబుతూ ఉంటే ఓపిగ్గా వినేవారు. గృహస్థులు తమ బాధలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే కదిలిపోయేవారు. 'ఎదుటివారిపై శ్రద్ద చూపడం ఆధ్యాత్మిక జీవనానికి ప్రథమ సోపానం' అనేవారు మహర్షి. ప్రతి ఒక్కరికీ ఆ మహానుభావుడి సాన్నిధ్యంలో.. తమకూ ఓ విలువ ఉందన్న స్ఫురణ కలిగేది.

# రమణులు ఒంటరిగా మౌనముద్రలో ఉన్నా, అచ్చుప్రతులు దిద్దుతున్నా, పత్రికలు చదువుతున్నా కూరగాయలు తరుగుతున్నా- సదా సంతోష భరితులై, ఆత్మనిష్ఠులై ఉండేవారు. ఎవరైనా ఆత్మన్యూనతతో కుంగిపోతుంటే 'తాను దుర్బలుడనని అనుకోవడమే మనిషి చేసే పెద్ద తప్పు. వాస్తవానికి ప్రతి వ్యక్తీ దైవిక సంపన్నుడే. బలాఢ్యుడే! అతడి ఆలోచనలు, అలవాట్లు, కోరికలు, భావాలు- ఇవే దుర్భలమైనవి. ఇవి మనిషి సహజ లక్షణాలు కావు' అని ఆత్మవిశ్వాసాన్ని నింపేవారు. ఉపవాసాలు అవసరమా? అని ఓ శిష్యుడు ప్రశ్నించినప్పుడు 'ఇంద్రియ సంబంధమైన వ్యాపకాలన్నింటినీ ఆపేస్తే మనసు ఏకాగ్రమవుతుంది. అటువంటి మనసు • భగవంతుడి మీద లగ్నమైతే అదే అసలైన ఉపవాసం. వాంఛలే మనసుకు ఆహారం. వాటిని నిలిపేస్తే చాలు. మనసుకు ఆహారం లేకుండా చేయగలిగినవారు, దేహానికి ఆహారాన్ని నిరాకరించనక్కర లేదు. మనసుకు ఉపవాసం లేనివారి కోసమే ఆ శారీరక ఉపవాసం' అనేవారు.

# అనుకున్నవి జరగడం లేదని ఆందోళన పడుతున్న ఓ భక్తుడితో 'మనుషుల్ని ఓ మహాశక్తి నడిపిస్తూ ఉంది. జరిగేది జరిగే తీరుతుంది. జరగనిది జరగనే జరగదు' అని ఉపదేశించారు.

# శరీరాన్ని ఎంత తక్కువ ప్రేమిస్తే ఆత్మకు అంత చేరువవుతామనే వారు రమణులు. దేహభ్రాంతి మనిషి ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతిబంధకమన్నారు. 'కూలీ బరువును మోసినట్లే జ్ఞాని ఈ దేహాన్ని మోస్తాడు. ఎప్పుడెప్పుడు గమ్యస్థానం వస్తుందని ఎదురుచూస్తాడే కానీ, ఏవో ప్రయత్నాలు చేసి ఆ భారాన్ని ఇంకా మోయాలనుకోడు' అని చెప్పేవారు. స్వయంగా ఆ మౌనర్షి కూడా తన జన్మలక్ష్యం పూర్తికాగానే శరీరాన్ని చిరునవ్వుతో త్యజించారు.🙏

✍️- బి. సైదులు
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

5:56

AP Jai Shri Rama Jaya Ra... POST

* Introspection

# Sage who spread love

* Sage Ramana Maharishi reached Arunachalam with great dispassion at the age of sixteen. For nearly twenty years on the holy mountain, the meditator engaged in austere practices. He blessed the devotees by making Arunagiri Odin as his spiritual field for half a century. Ramana did not like to preach to anyone. Arrogance that he is in a high position, and the desire to elevate someone, are not seen in the sage. His greatest weapon is silence! But their closeness radiated to everyone who visited. Maharshi's calmness, mind like a still ocean, compassionate gaze and grace showered on all living beings are unforgettable.

# The love showered on the devotees and Ramanas, who are constantly swaying in self-enjoyment and in silence, is indescribable. He would listen patiently if the dependents talked about the hardships in their families. Householders used to be moved when they told their sorrows and shed tears. Maharishi said that 'caring for others is the first step to spiritual life'. Everyone feels that they have value in the presence of that great person.

# Ramanu was alone in silence, correcting copies, reading magazines or chopping vegetables - he was always happy and self-confident. If someone is suffering from self-deprecation, 'The biggest mistake a man makes is to think he is weak. In fact, everyone is divine wealth. Strong! His thoughts, habits, desires, feelings - these are bad. These are not the natural characteristics of man'. Are fasts necessary? When asked by a disciple, 'If you stop all the distractions of the senses, the mind will become concentrated. If such a mind •

is fixed on God, it is the real fast. Desires are food for the mind. Just stop them. Those who can do without food for the mind, need not deny food to the body. They say that physical fasting is for those who do not fast in mind.

# With a devotee who is worried that things are not happening, 'Mankind is being guided by a great power. What happens will happen. He advised that what does not happen will not happen.

# The less we love the body, the closer we get to the soul, they say. Illusion of the body is an obstacle to the spiritual elevation of man. 'A wise man carries this body like a laborer carries his weight. They used to say that one waits for the destination to come, but after making some efforts one does not want to carry that burden. Even that Maunarshi himself renounced his body with a smile when his goal of birth was fulfilled.🙏

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 🎻🌹🙏రమణ మహర్షి జయంతి

🌹డిసెంబర్ 30 వతేది నాడు రమణ మహర్షి జయంతి జరుపుకుంటాము

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 

🌸యోగి పుంగవులు, అవధూతలు, జ్ఞానులు వంటి ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు మన వేద భూమి. అటువంటి వారిలో దేహాత్మ భావనను జయించిన వారి కోవకు చెందిన వారు రమణ మహర్షి.

🌿 అరుణాలచలం పేరు వినగానే తన జన్మకు విడిది అదేనని పులకించి, భవ బంధములు తెంచుకుని వెంటనే అరుణాచలేశ్వరుని సన్నిధికి చేరిన మహనీయుడు. ఈ సమస్తమూ ఆత్మ స్వరూపమని తెలుసుకున్నారు.

🌸 అందువల్లనే రమణాశ్రమంలోని జీవులన్నీ ఆయన తో ఎంతో స్నేహంగా సంభాషించేవి. ఆయన పాదస్పర్శతో ఆ దివ్య క్షేత్రం ప్రకాశం మరింత పెరిగింది. పదకొండు సంవత్సరాల మౌన దీఓతో ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన మహర్షిని నదీనాం సాగరో గతిః అన్నట్టు మరొక పండితుడైన శ్రీకావ్యకంఠ గణపతి ముని వెతుక్కుంటూ వచ్చారు.

🌿 ఆంధ్రప్రాంతం నుంచి అరుణాచలం వచ్చి వేంకటరామన్ అనే పూర్వ నామధేయుణ్ణి ఆయన మొట్టమొదట 'రమణ మహర్షి' అని సంబోధించారు. మౌన దీక్షను వీడి మొదట కావ్య కంఠ గణపతి మునితో సంభాషించేరు రమణ మహర్షి. సాధనతో పూర్ణత్వం సిద్దించదని, 'నేను' అనే దానిని తెలుసుకుంటే పూర్ణత్వంతో పనిలేదని ఉద్బోధించారు.

🌸మానవుని అంతిమ లక్ష్యం ఆనందంగా ఉండడం. అలాగే జీవరాశులన్నీ ఆనందంగా బతకాలని తపన పడతాయి. పక్షులు తమ అనురాగాన్ని పంచుకుంటాయి. 

🌿శునకాలు తమ చెలగాటాలతో ఆనందాన్ని పంచుకుంటాయి. క్రిమికీటకాలు కూడా పరస్పరం తమ సుఖమయజీవన లాలిత్యాన్ని రుచి చూస్తాయి. కాని మానవుని కున్న గొప్ప వరం చింతన. శాశ్వతమైన నిత్యానందాన్ని పొందడానికి నిరంతరం చింతన చేయాలి.

🌸సకర్మలు కూడా శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు. అప్పుడే పుట్టిన శిశువు తన యదార్థ స్థితిలో నుంచి నిత్యానందంలో రమిస్తుంది. ఆకలి వేసినపుడు రోదిస్తుంది. 

🌿తల్లిపాలతో ఆకలి తీరగానే తిరిగి ఆనంతలోకంలో విహరిస్తుం ది. కానీ అన్నం రుచి చూసిన తక్షణం అజ్ఞానపు పొర ఆవహించి భ్రమలో బతకడం ప్రారంభిస్తుంది. షడ్వికారములతో యాత్ర చేసిన జీవుడు తుదకు మరొక యోని కోసం ఎదురు చూడక తప్పని పరిస్థితి. 

🌸జనన మరణ చక్రం అనివార్యం. దీనికి కారణం అజ్ఞానం. దీనినిఛేదించే మార్గం ఆత్మతత్త్వ విచారణ. ఇది కర్మల వల్ల సాధించలేమని రమణ మహర్షి తమ ఉపదేశసారంలో ఉద్ఘాటించారు.

🌿కలియుగంలో ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేసే జ్ఞాని అరుదు. ‘కర్మలు చేయడం వరకే నీ వంతు, ఫలితం నా చేతుల్లో ఉంది' అన్న గీతాచార్యుని శాసనం అజ్ఞానంలో ఉన్నవారు గ్రహించడం కష్టం. 

🌸ప్రకృతి నియమాన్ని ఉల్లంఘించి ఎవరూ మనుగడ సాగించలేరు. జనన మరణ చక్రాన్ని పరమాత్మ తన అధీనంలో ఉంచుకొని ఉన్నాడు అనేది భ్రమ. ఆత్మజ్ఞానం పొందలేక కర్మలతో ఫలితాలను ఆశించి తిరిగి ఆ చక్రంలో పడేది జీవుడు మాత్రమే!

🌿మానవ దేహంలోని అంతర్గత అవయవాలు వాటంతట ఆవే పనిచేస్తున్నాయి. కాని అవి నా వల్లనే పనిచేస్తున్నాయి అనే అహమే 'నేను'. ఈ నేనును కర్తగా భావించి ఎన్నో సకర్మలు, అకర్మలు చేయబడుతున్నాయి. 

🌸మనం నివసించే ఆ భూగోళం గంటకు వెయ్యి మైళ్ల వేగంతో పరిభ్రమిస్తూ, సూర్యుని చుట్టూ తిరుగుతోంది. కాని మనం ఈ భూమి మీద ఎంతో స్థిరంగా ఉన్నట్టు భ్రమిస్తున్నాము. ఇదే నేను అనే అహం, అజ్ఞానం.

🌿ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయడం అల్ప మానవునికి సాధ్యం కాదు. మరి కర్మలను త్యాగం చేసి, సోమరిగా ఉండవచ్చా? ఉండకూడదని శ్రుతి గట్టిగా చెబుతోంది. తమ విధ్యుక్త ధర్మాలను, విధులను ఒక్క క్షణమైనా విడువకూడదని హెచ్చరిస్తోంది మన సనా తనం. ఇటువంటి క్లిష్టమైన సందేహాలకు చక్కటి పరిష్కారాలు తెలియజేశారు రమణులు. అవి:

🌸సకర్మలు చేస్తూ చిత్తశుద్ధితో ఫలితాలను ఈశ్వరునికి అర్పించాలి.

🌿 నిత్యం మనో వాక్కాయ కర్మలతో పరమాత్మను ధ్యానం చేయుట ఉత్తమ మార్గం.

🌸 మౌనమే తపస్సుగా మనసుతో చేసే జప ధ్యానం ఉత్తమమైనది.

🌿 అన్నిటా ఏకాగ్రత చాలా ముఖ్యమైనది. ధ్యానంలో ఎటువంటి ఇతర ఆలోచనలు పనికిరావు. నీవు చేసే నామ చింతన ఒక్కటే ధ్యాతవ్యం కావాలి.

🌸 ఆడంబర పూజ కంటె మౌన జప ధ్యానమే శ్రేష్ఠమైనది. 

🌿 అణువు నుంచి బ్రహ్మాండం వరకు నిండి ఉన్న ఆ పరమాత్మను ఆత్మతో మౌన ధ్యానం చేయటం ఉత్తమోత్తమం.

🌸 అద్వైత భావనతో ‘అహం బ్రహ్మాస్మి'గా ధ్యానం చేయటం సరైనది.

🌿 ధ్యానం శూన్యభావనతో చేయడం కంటె ఆ పరమాత్మయే 'నేను'గా భావించుట సరైన ధ్యాన మార్గం.

🌸నేను' అనేది ఆత్మ చైతన్యం. ఆది దేహం కాదు.

🌿 ఈ చైతన్యం పొందేందుకు ప్రాణాయామం ఒక మార్గం. ఇది గురు ముఖతః మాత్రమే సాధన చేయాలి.

🌸ప్రాణాయామం కూడ కర్మే. కాని దీని మూలములైన చిత్తము,
ప్రాణము ఒకే మూల శక్తి నుంచి ఉద్భవించాయి.

🌿 లయము చెందిన మనసు తిరిగి కర్మను కోరదు.

🌸 ప్రాణాయామం తాత్కాలిక ఉపశమనం. అద్వైత ఆత్మ చింతనలో మనసనేది నాశనమవుతుంది.

🌿 మనసు నశించిన వాడే ఉత్కృష్టమైన యోగి. అటువంటి యోగికి ఫలితాన్ని ఆశించి చేసే కర్మ అసలు ఏదీ ఉండదు.

🌸 మనస్సును దృశ్యాదృశ్యముల నుంచి మరలిసే ఆత్మచైతన్యానుభూతి కలుగుతుంది. నేను అని తలచే మూలమే మనస్సు. ఆ నేను ఆత్మలో లీనమవడమే ఆత్మ సాక్షాత్కారం

🌿నేను అనే అహంకారం నుంచే అనేక తలంపులు పుడుతున్నాయి. అవే మనో వికల్పములు. ఆ నేను అనే అహం ఎక్కడ జనిస్తుందో, ఎక్కడ పడిపోతుందో గమనించేదే ఆత్మ.

🌸అజ్ఞానానికి మూలం నేను అనే మూల తలంపు. ఆ తలంపు మనసుతో బాటు నాశనమయితే మిగిలేది పరిపూర్ణమైన ఆత్మ. 

🌿 నిత్యమూ గాఢ నిద్ర నుంచి మేల్కొలిపేది నేను అనే అహం కాదు. నేనుకు అతీతమైన ఆత్మ చైతన్యమని తెలుసుకోవాలి.

🌸 దేహం ఒక ఉపాధి మాత్రమే అని గ్రహించాలి. ఇది నశించిపోయేది. నేను అనేది అహం నుంచి వెలువడితే అదే ఆత్మ. స్వరూపం. అపుడు నేనుగా భాసించేది ఆత్మ చైతన్యం.

🌿దేహాత్మ భావన వల్ల పరమాత్మ, జీవాత్మలు వేరు అనే భేదం ఉత్పన్నమవుతోంది. అజ్ఞానం పొర తొలగినపుడు అంతటా వ్యాపించి ఉన్నది పరమాత్మేనని అవగతమవుతుంది.

🌸భేద భావంతో కలిగిన ఆత్మ ఆజ్ఞానం తొలగినపుడు స్వాత్మానుభవం కలుగుతుంది. అదియే 'తత్త్వమసి'.

🌿 ఆత్మ ద్వైతం కాదు. అద్వైతమనే తలంపు కలిగిన వెంటనే నేను ఆత్మయందు స్థితి కలిగి నిలిచిపోవును. అజ్ఞానం వల్ల ఏర్పడిన నేను అనే తలంపును ఆత్మ చైతన్యమని తెలుసుకున్న తరువాత వేరొక జ్ఞానం అవసరం లేదు.

🌸 ఆత్మ వ్యయరహితం, జనన మరణాలు లేనిది, అనంతమైన సచ్చిదానందాన్ని కలిగి ఉన్నది.

🌿 బంధ మోక్షాలకు అతీతమైనది ఆత్మ. నేను ఆత్మగా వెలుగొందుతుంది.

🌸 నేను అనేది లేకుండా తనకు తానుగా విచారిస్తే సర్వ

🌿సందేహాలు తొలగి ఆత్మతత్త్వము బోధపడుతుంది. అదే తపస్సు.  శాశ్వతానంద తత్త్వము. ఫలాపేక్షరహిత కర్మయోగం. అదియే పూర్ణత్వమని రమణ మహర్షి మానవాళికి తెలిపారు. ఇదియే ఆయన అనుభవ సారము...🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿