_*సృష్టే సత్యా ఇహాశిషః*_
💐 _*ఈ జగతిలో నీ ఆశీస్సు సిద్ధించుగాక♪!*_
-- ఋగ్వేదం
🪷 శుభాన్ని ఆశించడమే ఆశీస్సు♪. భగవానుడు శుభాన్ని అనునిత్యం ఆశించే స్వభావం కల శుభస్వరూపుడు♪. ఆయన వలన శుభమే ఈ జగతిలో సిద్ధించాలని ఈ ప్రార్థన♪.
🪷 దీనికి ముందు వాక్యం - _*'యదగ్నే స్యామహం త్వం త్వం వా ఘా స్యా అహమ్ |*_
-- _*ఓ అగ్నీ! (అన్నిటికంటే మునుపే ఉన్న పరమేశ్వరా!) నేను నీవై, నీవు నేనై ఉన్నట్లయితే...'*_
🪷 ప్రార్ధించేవానికి పరమాత్ముని ఆశీస్సు సిద్ధించాలంటే కావలసినది తాదాత్మ్యస్థితి♪. అదే 'నేను నీవై, నీవు నేనై' ఉన్న స్థితి. భగవంతుని ఆశీస్సు కావాలనుకుంటే, మనం ఆయనతో తన్మయం కావాలి♪.
🪷 కేవలం ఉపనిషద్భాగాలలో (జ్ఞానకాండ) వేదాంతంగా పల్లవించిన తత్త్వవాక్యాలే కాక, వేదం తదితర భాగాలలో (సంహితలలో) కూడా తత్త్వాన్నే ప్రబోధిస్తుందనడానికి ఇది ఉదాహరణ♪.
🪷 అంటే వేదహృదయమే వేదాంతం (తత్త్వం)♪. అద్వైత భావన ఈ మంత్రంలో స్పష్టమౌతుంది♪. జీవబ్రహ్మైక్య స్థితియే మనం సాధించవలసిన సత్యం♪.
👉 మరియొక ఆలోచనలో----
🪷 సాధకుడు నిరంతర ఉపాసన, భావన మొదలైన భక్తిమార్గాల ద్వారా తనను తాను భగవదర్పణం చేసుకొని తన్మయస్థితిని పొందుతాడు. తత్ + మయం = తన్మయం. దానితో లీనావస్థ -‘మయం' కావడం♪. లయమైతేనే మయం. ఇక్కడ 'తత్' పరబ్రహ్మవాచకం♪.
🪷 *'తత్త్వమసి'* మహావాక్యంలో 'తత్' శబ్దానికి పరబ్రహ్మమనే అర్థం. పరబ్రహ్మతో మయత్వమే (లీనమే) - తన్మయం♪. అదే నిజమైన సత్యం♪. అదే ఆశీస్సు. సాధించవలసినది. ఆయన అనుగ్రహం చేతనే మనలో ద్వైతభ్రాంతి నివృత్తి చెంది మనకు కలగవలసిన స్థితి కలుగుతుంది♪.
🪷 _*ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసనా*_ - అని ఆచార్యులమాట ఈ విషయాన్నే బోధపరుస్తోంది♪.
🪷 'తన్మయస్థితిని పొందినవారికి భగవదనుగ్రహం (జ్ఞానం) లభిస్తుందనేది పై వేదమంత్ర ప్రధానార్థం. _*ఈశావాస్యమిదం సర్వం*_ అనే ఎఱుకయే కావలసినది. ఇదే తన్మయత్వం♪.
🪷 _*'సర్వమున్నతని దివ్య కళామయమంచు'*_ అని ప్రహ్లాదుడు చెప్పిన పలుకును ఇక్కడ స్మరించాలి♪. లోకంలో కూడా మన మనస్సు దేనిలో లీనమౌతుందో దానిని అనుసరించే ఈ జగమంతా సాక్షాత్కరిస్తుంది♪.
🪷 ప్రపంచాన్ని ప్రపంచదృష్టితో కాక, పరమేశ్వర 'మయం'గా దర్శించగలిగితే గొప్ప యోగం♪. విచారణతో లభించే జ్ఞానం, ఉపాసనతో సిద్ధించే పరమభక్తి... ఈ రెండూ విశ్వాన్ని విశ్వేశ్వరమయంగా దర్శింపజేస్తాయి. ఈ దర్శనమే తన్మయస్థితి♪. అదే 'నీవే నేను - నేనే నీవు' అనే అనుభూతి♪. దీనిని కలగజేయమని ప్రార్థించడమే గొప్ప ప్రార్థన♪.
🪷 _*నమశ్శంకరాయ చ మయస్కరాయ చ..*_ అనే మంత్రంలో 'మయ' స్థితిని కలిగించేది ఈశ్వరానుగ్రహమేనని విశదమౌతోంది♪. ఈ మయత్వమే కైవల్యం. అదే సత్యం. ఆశించవలసిన శుభం. ఈ సృష్టి అంతా ఆ కైవల్యస్థితిగా భాసించాలి♪. అదే మోక్షం. వేరే ఏ లోకంలోనూ లేదది. లోకమంతా లోకేశ్వరమయంగా దర్శనమివ్వాలంటే 'నేను' ఆయనతో తాదాత్మ్యం చెందాలి♪.
🪷 _*యోసావాదిత్యే పురుషః సో సావహమ్..*_ - ‘ఆదిత్యమండలంలోని పురుషుడెవడున్నాడో, అతడే నేను' అని యజుర్వేదమంత్రం కూడా ఈ అద్వయభావాన్ని ద్యోతకపరుస్తోంది♪. జీవేశ్వరుల అభేదాన్ని స్పష్టం చేసే వాక్యంగా దీనిని గ్రహించవచ్చు♪.
🪷 ఇది కల్పితమైన, ఊహాజనితమైన భావన కాదు. ఇది సత్యం. దీనిని సిద్ధింపజేసుకొనడమే ఈశ్వరాశీస్సు♪. ఈ జగతిలో జీవుడు సాధించవలసిన సత్యాశీస్సు ఇదే. లక్ష్యమిదే. సర్వమూ ఈశ్వరమయం అన్నప్పుడు 'నేను' అనే భావన కూడా ఈశ్వరమయమై 'సోహం' స్థితి సిద్ధమౌతుంది♪.
🪷 ఇటువంటి ఉదాత్త తత్త్వ చింతననే వేదం ఆద్యంతాలలో ప్రసరిస్తోంది♪.
🙏 _*శుభం భూయాత్*_ 💐
🌹🙏🌴🪔🪔🪔🪔🌴🙏🌹
No comments:
Post a Comment