Saturday, December 23, 2023

గీతా జయంతి

 _*గీతా జయంతి*_ 
(మార్గశిర శుద్ధ ఏకాదశి - గీతాజయంతి సందర్భంగా...)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🙏 _*భగవద్గీత విశిష్టత*_ 🙏


🪷 *లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క ‘భగవద్గీత’ కు మాత్రమే ఉంది.*

🪷 _*ఏమిటా విశిష్టత?*_ ❓

🪷 అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి జన్మదినాన్ని *‘జయంతి’* గా జరుపుకుంటారు♪.

🪷 అలాగే,  'భగవద్గీత' వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల *‘గీతాజయంతి’* ని జరుపుకుంటారు♪.  ప్రపంచం లో ఏ ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు♪.

 🪷 _*ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం?*_ ❓

🪷 సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో......  

🪷 కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో........‌

🪷 ఆ అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ...... మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ *'భగవద్గీత'* ఉదయించింది♪.

🪷 _*ఏముంటుంది ఈ భగవద్గీత లో..?*_ ❓

✅ ఏది తెలిస్తే మానవుడికి ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో♪….....

✅  ఏది ఆత్మ - పరమాత్మ ల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో♪.......

✅👉 ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో♪.. అదే ఉంటుంది♪.

✅👉 నూనె రాస్తే రోగాలు పోతాయి♪... దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు♪.

✅👉 నన్ను నమ్మనివాణ్ణి చంపండి అనే ఉన్మాదం ఉండదు♪.

✅👉 నన్ను దేవుడిగా ఒప్పుకోని వాణ్ణి నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు♪.

 🙏 _*భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితం పై ఆసక్తి పోతుందా..?*_❓

✅ భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు..... గాండీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు♪.

✅ *భగవద్గీత కర్తవ్య విముఖుడైనవాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది♪.*

 🪷 _*భగవద్గీత శాస్త్రీయ గ్రంధమా..?*_❓

🪷 ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీత ని కోట్ చేసినవాళ్ళే♪....

🪷 భగవద్గీత ని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే♪..

❓ _*ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచంలో మొదటిస్థానం లో ఉండాలి కదా.... ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు♪…?*_ ❓

🪷 కలియుగం లో అజ్ఞానానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం♪. విదేశీయుల్లా కత్తి పట్టుకుని, రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు♪.

🪷 బ్రిటిష్ వాళ్లు, మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విధ్వంసం .. చరిత్రలో సజీవసాక్ష్యాలుగా నిలిచే ఉన్నాయి♪.  వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని♪..

🪷 *ఇస్కాన్ (ISKCON) వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని కృష్ణభక్తులుగా మార్చారు♪..*

🪷 *“ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగతో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం♪.”*

🙏 _*ఓం నమో భగవతే వాసుదేవాయ*_ 🙏
❀•┉┅━•••❀🔯❀•••━┅┉•❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:* 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఈ ముగ్గురు చాలా విలువైన వారు...

 🌱🍂నేటి మంచిమాట🍂🌱

*మన జీవితంలో ఈ ముగ్గురు చాలా విలువైన వారు...*
*1. అభినందించేవారు...* 
*2. అసూయపడేవారు...*
*3. తప్పు పట్టేవారు...*

*👉అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు...*
*👉అసూయపడేవారు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు...*
*👉తప్పుపట్టేవారు మనలో కొత్త ఆలోచనలకూ పురుడు పోస్తారు...*

*అసూయపడేవారు, తప్పుబట్టేవారు మనకు చెడు చేయాలి అనుకుంటూనే మంచిని చేసివెళ్తారు...*


🌱SAVE🌴THE🌳TREES
           *👏నేటి మోటివేషన్...👏*

చిట్టచివరికి ఆనందాన్ని సొంతం చేసేది మాత్రం....

 చెడు తాత్కాలిక సంతోషాన్ని కలగజేసినా చిట్టచివరికి ఆనందాన్ని సొంతం చేసేది మాత్రం ఆచరించిన ధర్మం, అనుసరించిన న్యాయమే. ప్రకృతి ఆహారం ఇవ్వకపోతే మనిషికి మనుగడ ఉండదు. మనిషి తన మేధాతో ఒక మెట్టు పైనున్నానని అనుకుంటాడు. కానీ నిజానికి ప్రకృతి ముందు తలవంచాల్సిందే. ప్రకృతి బీభత్సాలు సమస్త జీవ జాతిని బెంబేలెత్తిస్తాయి. ప్రకృతి చాలావరకు పరమశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు కోప్పడుతుంది. ధన్యవాదాలు...
" 🛐🙏🏿💐💐🤝🤝💞"

****ఆరోగ్యం ఆనందం సంపద* 🩺🏃‍♀️🧎‍♀️💰💎🛵🚘✈️🏘️ *విజయానికి స్వయం ఆధిపత్యానికి మూల స్తంభాలాంటి విజయ రహస్యాలు*

 *ఆరోగ్యం ఆనందం సంపద*
🩺🏃‍♀️🧎‍♀️💰💎🛵🚘✈️🏘️

*విజయానికి స్వయం ఆధిపత్యానికి మూల స్తంభాలాంటి విజయ రహస్యాలు* 11
💰. రోజూ ఎవరితో ఒకరితో పరిచయమో, స్నేహమో చేసుకొండి. మీకందుబాటులోమీ 
స్నేహితులందరి పోను నెంబర్లూ పెట్టుకోండి. ఆ నంబర్లు మారగానే మీ పుస్తకంలో మార్చుకోండి. తోటి వారితో మీ సత్సంబంధాలు మీ జీవితం ఫలప్రదంగా ఉందని చూపించే డి.ఎస్.పి. లాంటివన్నమాట. 

💰 ప్రాచీన భారతదేశపు సూక్తిని గుర్తుంచుకోండి. " నువ్వు నీ మనస్సుని జయిస్తే, నువ్వు
ప్రపంచాన్ని జయించినట్టి 

💰. ధనాగమన తృష్ణకన్నా జీవితం సంతోషంగా ఉండాలన్న కోరిక ఎక్కువగా ఉండాలి. మంచి కార్యాల వల్ల, మంచి ప్రయత్నాల వల్ల జీవితం మీద ఉత్సాహమనే చిగుళ్ళు తొడిగి,
మహావృక్షమవుతుంది. 

💰 అందరూ అనుకున్నట్లుగా ఒత్తిడి హానికరమైనదేం కాదు. నిజం చెప్పాలంటే అది మనం విజయ శిఖరాల మీద పని చేయటానికి తోడ్పడుతుంది. ఒత్తిడి వల్ల మనలో విడుదలయ్యే కెమికల్స్ మనకి తోడ్పడుతుంటాయి. ఎప్పుడది హానికరమైనది అంటే అతిగా ఒత్తిడి పడటమో లేక బొత్తిగా ఒత్తిడి నుంచి ఉపశమనం లేకపోవటమో అయినప్పుడు. ఒత్తిడి పడేటప్పుడు వడినా, వీలున్నప్పుడు ఖాళీగా ఉండి విశ్రాంతి తీసుకుంటే అప్పుడు బ్యాలెన్సు అవుతుంది. దానివల్ల మన ఆరోగ్యమూ బాగుంటుంది, మన పనిలో సమర్ధతా ఉంటుంది. మన తరంలో ఎందరో ప్రముఖ నాయకులు ఊపిరాడని పనులలోనూ, ఆఫీసు ఒత్తిడులలోనూ కూరుకుపోయి. ఉన్నారు. వాళ్ళెలా విజయం సాధించారు? వాళ్ళు వాళ్ళ సమయాన్ని బ్యాలెన్సు చేయటానికి కొన్ని కిటుకులు సాధన చేయటం వల్ల, ఒత్తిడి పడేటప్పుడు పడేవారు, మనసుని ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోగలిగినప్పుడు ఉంచుకునేవారు. ప్రెసిడెంట్ కెనడి తన వైట్ హౌస్ ఆఫీసులో రెగ్యులర్ గా కొంచెం కునుకు తీసేవారు. విన్స్టన్ చర్చిల్ కి ఇదే అలవాటు ఉండేది. ఆయన ఏమరుపాటు లేకుండ ఉండటానికి, ఏకాగ్రత సాధించటానికి, ప్రశాంతంగా ఉండటానికి ప్రతిరోజూ మధ్యాహ్నం పూట ఒక గంట సేపు పడుకునేవారు. ఈ అలవాటుని శరీరానికి విశ్రాంతి నిచ్చి మంచి ఆరోగ్యాన్ని సమకూర్చటానికే కాక, మనసుకి కూడా ప్రశాంతత చేకూర్చేలాగా మలచుకోవాలి. అన్ని అవలక్షణాలకి విరుగుడు గట్టి వ్యాయామం, చక్కటి ఆహారం, ఆహ్లాదకరమైన, తీరిగ్గా చేసే పనులు అని చాలా మంది అంటారు. కాని వీటితోపాటు సానుకూల ఆలోచనలు, ప్రశాంత మనసు కూడా జోడిస్తే జీవితం సంతోషంగా, దీర్ఘకాలం సాగుతుంది.. 

 💰రోజు మొత్తంలో మానసిక సెలవలు తీసుకోవటం అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ పొద్దున్న ఐదు నిముషాలు బెర్ముడాకి వెళ్ళిరండి. మధ్యాహ్నం హాయిగా మెడిటరేనియన్ సముద్రంలో ఈత కొడుతున్నట్లు ఊహించుకోండి. రోజంతా హడావిడిగా పనిచేసి, ఫలప్రదమైన ఫలితాలు సాధించి, సాయంకాలం తిరుగుముఖం పడుతుండగా ఆల్ఫ్ పర్వతాల మీద నుంచి స్కీయింగ్ చేస్తున్నట్లు ఊహించుకోండి. మీ ముఖ్యమైన మీటింగుల గురించో, పనుల గురించో ఎలా ప్రణాళికలు వేస్తారో అలాగే వీటిని కూడా మీ దినచర్యలో ఒక భాగంగా రెండు నెలల పాటు చొప్పించి చూడండి. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.

💰 విశ్రాంతి ఎంత మంచిదో, అలా జీవితంలో ఏదైనా మార్పు చేస్తే అది కూడా మంచిది. ఆ మార్పు పెద్దదా, చిన్నదా అన్నది అనవసరం. కాని అది మీ దినచర్యని, మీ మనస్థితిని మార్చేస్తుంది. ఉద్యోగం మారటం లాంటి పెద్దమార్పు అవచ్చు. రోజుకి మూడు సార్లు, ఒక్కొక్క ఏ నుంచి మీ దృష్టి మళ్ళించి, వాటి మీదే మీరు ఏకాగ్రత చూపి, అందులో లీనమయ్యేటట్లు చేసే వాటిని చూసుకోండి. కేవలం ఈ కారణం కోసమే చాలామంది కార్యనిర్వాహకులు కరాటే అతి దారుణంగా ఉంటుంది. అందులో నొప్పి ప్రేరణ ఇస్తుంది, ఎప్పటికీ!
లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. ఒక్క లిప్తకాలం పాటు ఏకాగ్రత చెడిందా, ఫలితం
ఈ దారుణంగా ఉంటుంది అందులో నె ప్పి ప్రేరణ ఇస్తుంది ఎప్పటికీ !

 💰    *ఆనందానికి*10 *ప్రాథమిక* *సూత్రాలని చూడండి*

1.ఫలప్రదమైన, ఉత్సాహభరితమైన, చురుకైన జీవితాన్ని సాగించండి. 

2 ప్రతిరోజూ, ప్రతి నిముషమూ అర్ధవంతమైన కార్యకలాపాలే చేయండి.

3 గందరగోళం లేకుండా జీవితం సాఫీగా సాగేందుకు చక్కగా ప్రణాళిక వేసుకుని,
 ఒక పథకం ప్రకారం జీవించండి..

4. వాస్తవమైన ఉన్నత లక్ష్యాలని ఏర్పరచుకోండి.

5 సానుకూల ఆలోచనలే చేయండి - ఒక్క ప్రతికూల ఆలోచనని కూడా భరించే

6 పనికిరాని చిన్న విషయాలపైన అనవసరమైన బెంగ పెట్టుకోకండి.

 7సరదాగా గడపటానికి సమయాన్ని కేటాయించుకోండి... 

8తోటివారిమీద అభిమానం చూపించి, వాళ్ళతో అపేక్షగా కలిసిపోయే స్వభావాన్ని

9 పుచ్చుకోవటం కన్నా ఇవ్వటంలోనే ఎక్కువ ఆనందం ఉందని గ్రహించండి. 

10.ప్రస్తుతంలోనే జీవించటం నేర్చుకోండి. గతం అనేది జీవితమనే బ్రిడ్జి కింద ప్రవహించే నీరు లాంటిది.. 

💰అణకువగా ఉండి, అతి సామాన్యమైన జీవనం గడపటానికి ప్రయత్నించండి. డాన్ రాసిన 'ఎ హిస్టరీ ఆఫ్ నాలెడ్జ్' చదవండి. ప్రపంచంలోని అన్ని
భావాల చరిత్ర అందులో లిఖించబడింది. ఈ ఒక్క పుస్తకమే విజ్ఞానానికి ఒక అద్భుత భాండాగారంఅని చెప్పవచ్చు. అది సంపాదించి, చదివి, ఆనం దించండి. 

💰 విలియమ్ , కోహెన్ రాసిన 'ది ఆర్ట్ ఆఫ్ ఎ లీడర్' పుస్తకం చదవండి. అటు మీకు ప్రేరణ ఇస్తుంది. ఇటు మీకు ఆచరించదగ్గ విషయాలెన్నో చెప్తుంది. 

సేకరణ

*డాక్టర్ ఎం అశోక వర్ధన్ రెడ్డి*

💎💎💎💎💎💎💎💎💎💎💎

అమోఘ కృష్ణస్తుతి

 *అమోఘ కృష్ణస్తుతి* 

🌹విష్ణుభక్తిని ప్రచారం చేసిన పన్నెండుమంది ఆళ్వార్లలో కులశేఖరుడు ఒకడు. రాజై ఉండీ తనను తాను సామాన్యుడిలా భావించుకొంటూ, కృష్ణుడి సేవలో తరించిన మహనీయుడు. అతడు రచించిన అమూల్య కృష్ణస్తుతి రత్నం ‘ముకుంద మాల’. ముకుందుడు అంటే కృష్ణుడు. కృష్ణుడిపై అచంచల భక్తితాత్పర్యంతో కులశేఖరుడు రచించిన శ్లోకాల దండ ఇది. ఈ స్తోత్రంలో మనిషి తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఏ మార్గాలను అనుసరించాలో చక్కగా ప్రబోధించిన తీరు కనిపిస్తుంది.

🌷‘ఓ ముకుందుడా! నీపై నా భక్తి విడువకుండా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. 
🌷నిన్ను ఎన్నడూ మరువకుండా ఉండే వరాన్ని ప్రసాదించు!’ అని కోరాడు కులశేఖరుడు. 
🌷రాజభోగాలను అనుభవించడానికి తగిన యుక్తవయస్సు, అపార సంపదలు, అధికారం ఉన్నప్పటికీ, వాటన్నింటినీ గడ్డిపోచలుగా భావించాడు. 
🌷కృష్ణుడి పాదారవిందాలను సేవించడమే తన జీవిత లక్ష్యం అని ప్రవచించాడు.
🌷 తాను భువిపై ఉన్నా, మరణించి దివికి వెళ్ళినా, నరకానికి పోయినా, కృష్ణభక్తిని మాత్రం వీడనని ప్రతిజ్ఞ చేసిన భాగవతోత్తముడాయన. 
🌷వృద్ధాప్యంలో మరణం ఆసన్నమైనప్పుడు శరీరంలో కఫ, వాత, పిత్తాలు ప్రకోపించిన సమయంలో నిన్ను తలుస్తానో లేదో, అందువల్ల ఇప్పుడే నా మనసు అనే రాజహంసను నీ పాదపద్మాల ముందు సమర్పిస్తాను అంటాడు ఈ భక్తశిఖామణి. 

🌷లౌకిక సుఖాలపైన, వస్తువులపైన విపరీతమైన ఆసక్తిని పెంచుకుంటే కృష్ణుణ్ని ధ్యానించడానికైనా సమయం ఉండకపోవచ్చు కనుక వ్యర్థ విషయాలపై ఆసక్తి పెంచుకోరాదని, అవేవీ మనిషిని కాపాడలేవని అంటాడు కులశేఖరుడు.

🌷మనిషి శరీరంలోని అన్ని అంగాలనూ కృష్ణ సేవలో వినియోగించాలని ప్రబోధించిన ఈ మహనీయుడు- ‘ఓ నాలుకా! నీవు కేశవుణ్ని కీర్తించు, ఓ మనసా! నీవు శ్రీధరుణ్ని తలచుకో, ఓ హస్తద్వంద్వమా... అచ్యుతుణ్ని అర్చించు, ఓ చెవులారా! మీరు కృష్ణుడి కథలు వినండి, ఓ కన్నులారా! మీరు హరినే దర్శించండి, ఓ పాదయుగళమా! నీవు కృష్ణుడి గుడికి చేరుకో, ఓ నాసికమా! నీవు శ్రీహరి పాదాల చెంత ఉన్న తులసీగంధాన్ని ఆఘ్రాణించు; ఓ శిరస్సూ! నీవు కృష్ణుడి పాదాలపై పడి నమస్కరించు’ అంటాడు.

‘🌷లోకంలో మనిషి పుట్టుక కష్టంతో కూడింది. 
🌷తల్లి పురిటి నొప్పులను అనుభవిస్తే కానీ పుట్టుక సాధ్యం కాదు. 
🌷మరణం కూడా కష్టమయమైనదే. 
🌷మరణకాలంలో మనిషి పడే వేదన దుర్భరం.
 🌷ఈ రెండూ మనిషికి వ్యాధుల వంటివే. 
🌷వీటికి చికిత్స కృష్ణుడి ధ్యానమే. 
🌷అదే అమృతౌషధం. 
🌷ఆ అమృతౌషధాన్ని మనిషి సేవించాలి. 
🌷అప్పుడే బాధలు తొలగిపోతాయి’ అంటాడు కులశేఖరుడు.

🌷‘తృష్ణ తరగని జలధార వంటిది.
 🌷కామం సుడిగాలి వంటిది. 
🌷మోహం కెరటం వంటిది. 
🌷భార్యాపుత్రులు సుడిగుండాలు, మొసళ్లవంటివారు. 
🌷సంసారం ఒక సముద్రమే. 
🌷ఈ సముద్రంలో మునుగుతూ, తేలుతూ మనిషి అగచాట్లు పడుతుంటాడు.
 🌷అతణ్ని కాపాడేవాడు కృష్ణుడే’ అంటాడు ఈ రాజకవి!

🌷మనిషి శరీరం అనుక్షణం పరిణామం చెందుతూ ఉంటుంది.
🌷 నిన్న ఉన్నట్లు ఈరోజు ఉండదు. 
🌷ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. 
🌷ఈ శరీరం ఎప్పటికైనా శిథిలమై రాలిపోయేదే. 
🌷రోగాలు, నొప్పులు, బాధలు వస్తూనే ఉంటాయి. 🌷అనారోగ్యాల పాలైనప్పుడు ఔషధాలను సేవించడం అవసరం.
🌷 ఔషధాలేవీ పనిచేయని దశలో మనిషికి భగవంతుడే దిక్కు. 
🌷కృష్ణుడే మనిషికి శాశ్వత బాధలను తొలగించే దివ్యరసాయనం వంటివాడు. 
🌷కనుక కృష్ణుణ్నే ఆశ్రయించాలి’ అని వేనోళ్ల ప్రవచించిన ఈ భక్తశిఖామణి వైష్ణవభక్తి సాహిత్యంలో చెరగని ముద్రవేశాడు.🙏🙏🙏

- ✍️డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

****ఒక నెలలో నన్ను నేను ఎలా మెరుగుపరుచుకోవాలి?* *21 ఆలోచనలు -:*. How can I improve myself within a month?* *21 ideas -:*

 *ఒక నెలలో నన్ను నేను ఎలా మెరుగుపరుచుకోవాలి?*

  *21 ఆలోచనలు -:*

     *1*.  మీ ప్రసంగాన్ని నిర్విషీకరణ చేయండి.  పరుష పదాల వాడకాన్ని తగ్గించండి.  మర్యాదగా ఉండు.
     *2*.  రోజూ చదవండి.  ఏది పట్టింపు లేదు.  మీకు ఆసక్తి ఉన్నదాన్ని ఎంచుకోండి.
     *3*.  మీ తల్లిదండ్రులతో ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడనని వాగ్దానం చేయండి.  వారు ఎప్పటికీ అర్హులు కాదు.
     *4.* మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించండి.  వారి ధర్మాలను అలవరచుకోండి.
     *5.* ప్రతిరోజూ కొంత సమయం ప్రకృతితో గడపండి.
 నెమ్మదిగా లోతైన శ్వాసతో కొన్ని నిమిషాలు ప్రాణాయామం చేయండి మరియు పట్టుకోండి మరియు నెమ్మదిగా ఊపిరి పీల్చుకోండి మరియు పట్టుకోండి.
     *6*.  విచ్చలవిడి జంతువులకు ఆహారం ఇవ్వండి.  అవును, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం మంచిది.
     *7*.  అహం లేదు.  అహం లేదు.  అహం లేదు.  కేవలం నేర్చుకోండి, నేర్చుకోండి మరియు నేర్చుకోండి.
     *8.* సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి సంకోచించకండి.  “ప్రశ్న అడిగేవాడు 5 నిమిషాలు మూర్ఖుడే.  అడగనివాడు ఎప్పటికీ మూర్ఖుడే”.
     *9.* మీరు ఏది చేసినా పూర్తి ప్రమేయంతో చేయండి.  అది ధ్యానం.
     *10*.మీకు ప్రతికూల ప్రకంపనలు కలిగించే వ్యక్తుల నుండి దూరం ఉంచండి కానీ ఎప్పుడూ పగ పెంచుకోకండి.
     *11*.  మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండి.  మీరు ఆపకపోతే, మీ స్వంత సామర్థ్యాన్ని మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు.
     *12*.  "ప్రయత్నించకపోవడమే జీవితంలో అతిపెద్ద వైఫల్యం".  దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
     *13.* "కాళ్లు లేని వ్యక్తిని చూసే వరకు బూట్లు లేవని ఏడ్చాను".  ఎప్పుడూ ఫిర్యాదు చేయవద్దు.
     *14.* మీ రోజును ప్లాన్ చేసుకోండి.  ఇది కొన్ని నిమిషాలు పడుతుంది కానీ మీ రోజులను ఆదా చేస్తుంది.
     *15*.  ప్రతిరోజూ, కొన్ని నిమిషాలు, మౌనంగా కూర్చోండి.  నా ఉద్దేశ్యం మీతో కూర్చోండి.  కేవలం మీరే.  మేజిక్ ప్రవహిస్తుంది.
     *16*.  ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది.  చెత్తతో చెత్త వేయవద్దు.
     *17*.  ఒక నెల పాటు, ఇంట్లో వండిన భోజనం తినండి.
     *18*.  మీ శరీరాన్ని ఎల్లవేళలా హైడ్రేట్ గా ఉంచుకోండి.  8-10 గ్లాసుల నీరు తాగడం ప్రాక్టీస్ చేయండి.
     *19*.  రోజూ కనీసం ఒక్కసారైనా పచ్చి కూరగాయల సలాడ్ తినడం అలవాటు చేసుకోండి.
     *20.* మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.  "ఆరోగ్యం ఉన్నవారికి ఆశ ఉంటుంది మరియు ఆశ ఉన్నవారికి ప్రతిదీ ఉంటుంది."
     *21.* జీవితం చిన్నది.  జీవితం సరళమైనది.  దానిని క్లిష్టతరం చేయవద్దు.  నవ్వడం మర్చిపోవద్దు........ 😊
 హ్యావ్ ఎ స్మైలీ డే !!😊
                                         *How can I improve myself within a month?*

 *21 ideas -:*

    *1*. Detoxify your speech. Reduce the use of cuss words. Be polite.
    *2*. Read everyday. Doesn’t matter what. Choose whatever interests you.
    *3*. Promise yourself that you will never talk rudely to your parents. They never deserve it.
    *4.* Observe people around you. Imbibe their virtues.
    *5.* Spend some time with nature everyday.
Do Pranayam for few minutes with slow deep breath and hold and slowly exhale and hold. 
    *6*. Feed the stray animals. Yes, it feels good to feed the hungry.
    *7*. No ego. No ego. No ego. Just learn, learn and learn.
    *8.* Do not hesitate to clarify a doubt. “He who asks a question remains fool for 5 minutes. He who does not ask remains a fool forever”.
    *9.* Whatever you do, do it with full involvement. That’s meditation.
    *10*.Keep distance from people who give you negative vibes but never hold grudges.
    *11*. Stop comparing yourself with others. If you won’t stop, you will never know your own potential.
    *12*. “The biggest failure in life is the failure to try”. Always remember this.
    *13.* “I cried as I had no shoes until I saw a man who had no feet”. Never complain.
    *14.* Plan your day. It will take a few minutes but will save your days.
    *15*. Everyday, for a few minutes, sit in silence. I mean sit with yourself. Just yourself. Magic will flow.
    *16*. In a healthy body resides a healthy mind. Do not litter it with junk.
    *17*. For one month, eat home cooked meals.
    *18*. Keep your body hydrated at all times. Practice drinking 8–10 glasses of water.
    *19*. Make a habit to eat at least one serving of raw vegetable salad on a daily basis.
    *20.* Take care of your health. “He who has health has hope and he who has hope has everything”.
    *21.* Life is short. Life is simple. Do not complicate it. Don’t forget to smile........ 😊
Have a smiley day !!😊

****వదలకపోతే గతి లేదు!* *దివ్యాత్మ స్వరూపులారా!*

 *వదలకపోతే గతి లేదు!*

*దివ్యాత్మ స్వరూపులారా!*

మనం చిన్నప్పటి నుండి తీసుకోవడమే నేర్చుకున్నాము గానీ, మనకున్నది ఇతరులకు ఇవ్వడం నేర్చుకున్నామా? అలా ఇవ్వడం నేర్చుకుని ఉంటే, ఇప్పుడు బాధ పెడుతున్న దానిని, కాదనుకున్న దానిని సులభంగా వదలుకోవచ్చు!

మనకు వదలుకోవడం చేతకాదనే చెప్పాలి. దోగాడటం చేతనైన పిల్లాడిని క్రింద వదిలితే ఏది కనిపిస్తే, దానిని చేతపట్టేసుకుంటాడు. పెద్దయ్యేకొద్దీ తల్లిదండ్రులు మనకు సంబంధించినవాటిని మరొకరికి ఇవ్వడమనేది అంగీకరించక అలానే నేర్పేవారు. మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే, అవతలివారి నుండి ఏదైనా పొందితేనో, ఉపయోగం అందుకుంటేనో తప్ప, సామాన్యంగా ఎదుటివారికి ఏదీ ఇవ్వజాలం. ఇదే (ఇవ్వడమనేది లేకుండా తీసుకోవడం) పిల్లలకు

కూడా అలవాటైపోతుంది.

ముందు శరీర అవసరాలకు ఇతరుల నుండి ఏమైనా పొందడమనే ప్రక్రియ సర్వసామాన్యంగా కొనసాగుతుంది. అదే సమయంలో ఇవ్వడమనేది లేకుండా కూడా పోతుంది. ఈ పొందడంలో స్వార్థం, లోభిత్వం, అసూయ, ద్వేషం తదితర అవకర గుణాలు పాదుకొని మహా శాఖోపశాఖలుగా పెరిగిపోతూంటాయి. వీటి మూలంగా దేహాభిమానం కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ ఉంటుంది. దీంతో ప్రతి జన్మలోనూ మనుష్యుల కోసం, వస్తువుల కోసం, భూమి కోసం, మిద్దెల కోసం, మగువల కోసం, డబ్బు కోసం, బంగారం కోసం, శారీరక సుఖాల కోసం, కీర్తి కోసం పరుగులు తీస్తూ, తపించిపోతూ, వాటిలో కొన్నింటిని పొందుతూ, మరి కొన్నిటి కోసం ఇంకా ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఏ జన్మలోని ఏ జీవితమైనా పరుగులు ఉరుకులతో, అశాంతితో, కొరతతో తనువు చాలిస్తూ, ఈ జననమరణ చక్రంలో తిరుగుతూ ఉండటమే జరుగుతుండేది. ఈ పొందడం లేదా తీసుకోవడమనేది రాత్రింబగళ్ళు ఆసక్తిని వృద్ధి చేసి దుఃఖానికే కారణమగును.

ఈ పొందడం లేదా తీసుకోవడమనే ఆసక్తియే కోరిక. ఈ కోరిక ఒకదాని నుండి మరొక దానిపైకి మరలుతూ మనిషిలో దుర్గుణాల కొండను పెంచుతూ తిర్యక్ జన్మలకు మూలమవుతోంది. దీని విచిత్రమెలాంటిదంటే- ఇల్లూ వాకిలీ భార్యా పిల్లలూ ఆస్తులూ... ఇలా అన్నింటినీ వదిలేసిన సర్వసంగ పరిత్యాగిగా పేరుగాంచినవాడిని సైతం భ్రాంతికి గురిచేస్తుంది. అన్నింటినీ వదిలేశాననుకున్నవాడు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఒక ఆశ్రమాన్నో మఠాన్నో నిర్మింపజూస్తాడు. నిర్మించిన తర్వాత దాని ఆశ్రమ/మఠ అభివృద్ధి కోసంగానైనా లేదా నిర్వహణ కోసంగా నైనా దాతల కోసం ఎదురు చూస్తుంటాడు. లేదా ఏదో ఒక వ్యాపారమో, వ్యాపకమో ఆరంభిస్తాడు. మరి డబ్బు కావాలి కదా! అదే సమయంలో శిష్యులను ప్రోగేసుకోవడం కూడా యధాలాపంగా జరిగిపోతుంది. మరి ఇక్కడ ఏమి పరిత్యజించినట్లు?

మొట్టమొదట సంసారం నందు విరక్తులై సన్యసించి, తిరిగి ఆశ్రమ/మఠ ఏర్పాటుకు, శిష్యసంగ్రహణమునకు, డబ్బు ఏర్పాటుకు ఆసక్తులవడమంటే- తమ లక్ష్యానికి తామే విఘాతం కలిగించుకొనుచున్నారని అర్థమవుతోంది కదూ!

నిజానికి ఈ ప్రపంచము, ఇందులో మనమూ అశాశ్వతులమైనప్పుడు మనం పరిగ్రహించినవేవైనా కూడా అవన్నీ అశాశ్వతమే కదా! ఈ మాత్రం అలోచన కూడా చేయలేని మనం ఆధ్యాత్మికవాదులమవుతామా?!

మరి మార్గమేమిటి? అన్నిటినీ వదిలేయడమే మార్గమని తెలుస్తున్నా కూడా వదలలేని అశక్తులుగానే ఉంటున్నాము. మాటలకు అన్నీ వదలమనీ, వేటి పట్ల కూడా ఆసక్తి వలదనీ కూడా సత్సంగాలలోనూ, సభావేదికలపైననూ చెవులు చిల్లులు పడేలా చెప్పగలం కానీ, ఆచరణలో ఒక్క నిమిషమైనా నిలువగలుగుతున్నామా?

అరణ్యములోని ఒక పక్షికి ఒకరోజు మంచి మాంసపు ముక్క దొరికింది. దానిని చూడటంతోనే ఆ పక్షికి అమితమైన సంతోషం కలిగింది. ఆ పక్షి తన భాగ్యానికి పొంగిపోతూ ఆ మాంసం ముక్కను నోట కరచుకొని ఎగిరిపోసాగింది. అది అక్కడే తినేస్తే ఆకలి తీరుండేది. కానీ అది లోభిత్వముతో దానిని పట్టుకొని ఆకాశంలో ఎగురుతోంది.

ఆ పక్షి మాంసం ముక్కను నోటకరచుకొని పోతుండటం అదే జాతి పక్షులు చూచి, దాని వెంటపడ్డాయి. కొన్ని పక్షులు దానిని ముక్కుతో పొడవసాగాయి. మరికొన్ని తమ రెక్కలతో దానిని కొట్టసాగాయి. ఇంకొన్ని తమ కాళ్ళ గోళ్ళతో దానిని రక్కసాగాయి. వాటి బారి నుండి తప్పించుకునేందుకు ఎక్కడెక్కడికో దూరంగా ఎగిరిపోసాగిందా పక్షి.ఆదిత్యయోగీ..

దొరికిన మాంసపుముక్కను తినకుండా అనవసరంగా పట్టుకుపోతున్నందుకు అది మిగిలిన పక్షుల నుండి ఎంతో బాధను ఎదుర్కోవవలసి వచ్చింది. తన జాతి పక్షులే తనను బాధించుట ఆ పక్షికి చాలా బాధ కలిగింది. దీనికంతటికీ కారణం- తాను నోట కరచుకొని పట్టుకుపోతున్న మాంసపుముక్కయే అని గ్రహించినదై, ఆ మాంసాన్ని నోటి నుండి వదలి క్రింద పడవేసింది. అప్పుడా పక్షులు అన్నీ ఈ పక్షి వైపు రాక, మాంసపుముక్క వైపు వెళ్ళి, దాని కోసం ఒకదానికొకటి కొట్టుకోసాగాయి. నోటి నుండి మాసంపుముక్కను జారవిడచిన పక్షి ఇబ్బంది నుండి బయటపడి హాయిగా ఒక చోట కూర్చొని పక్షుల వైఖరిని చూడసాగింది.ఆదిత్యయోగీ..

నిజానికి ఇందులోని ఆ మొదటిపక్షిలాంటి వాళ్ళం మనం. ఆ మాంసపుముక్క -ప్రపంచములో మనం పొందినవి. మిద్దెలు, మేడలు, ధనధాన్యాలు, వస్తువాహనాలు, డబ్బు, భార్యాపిల్లలు, కుటుంబము, బంధువులు తదితర విషయసుఖాలతో కూడిన, భిన్నంగా కానవస్తున్న ఈ జగత్తు అంతా-ఆ మాంసపుముక్కయే. జగత్తును పట్టుకొని ఉన్నంతసేపూ ఎటు నుంచైనా బాధ పొంచి ఉంటూనే ఉంటుంది. విషయసుఖాల కాంక్షతో జగత్తును పట్టుకొని ఉండుటకు కారణం - దేహాభిమానమే! అంటే మనం పట్టుకున్నది దేహాభిమానాన్ని! ఈ దేహంపై ఎనలేని మోహం పెట్టుకున్నందువల్లనే లోకంపై మోహం చావకుండా ఉన్నది. మోహం ఉన్నంతసేపూ బాధలు తప్పవు.

అందుకే మనం వదలాల్సింది మాంసపుముక్కలాంటి జగత్తు కంటే, జగత్తు పట్ల మోహానికి ఆధారమైన దేహాభిమానాన్ని వదలాలి! దేహాభిమానాన్ని వదిలేస్తే సమస్తాన్నీ వదిలేసినట్లే!

దేహాభిమానం వదిలేయడమనేది వివేకంతోనే సాధ్యమవుతుంది. సర్వమూ కాలముచే నశింపు జరుగుతుందనేది సత్యం. కాలం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. తండ్రులు, తాతలు, వారితోపాటు వారు సంపాదించుకొని, నాడు అపురూపంగా చూసుకున్న వస్తుజాలమూ, ప్రేమించిన మనుష్యాది జీవులు సమస్తమూ కాలగర్భములో కలిసిపోయిన మాట సత్యం! మన కళ్ళ ముందే ఇతరులెంతో మందితోపాటు కుటుంబీకులు కూడా మరణిస్తుండుట చూస్తున్నాము. ఇలా నిత్యమూ చూస్తున్న మనకు కలగాల్సింది వైరాగ్యమే; ప్రపంచాసక్తి కాదు! ఇది మృత్యులోకము అని తెలిసి కూడా ఏదో పొందాలనే ఆసక్తితో అశాంతితో బ్రతుకులీడుస్తుండటం మన దౌర్భాగ్యమని చెప్పవచ్చు.

వదలుకోవడం చేతగాక, వైరాగ్యం అలవడక అగచాట్లు పడుతున్న మన కోసం భగవంతుడు, ఆ దత్తాత్రేయస్వామి ఎన్నో దృష్టాంతాలతో మనకు కనువిప్పు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మనం ఆశిస్తూ, మన వినాశనానికి హేతువు అవుతున్న ఈ సమస్త ప్రపంచమును మరో కోణంలో గురువుగా ఆవిష్కరించారు. ప్రపంచంలోనే ఉండి చూస్తున్న ప్రతి దాని నుండీ, భగవత్ తత్త్వానికి దగ్గర చేర్చే విషయాన్ని స్వీకరించమని దత్తస్వామి బోధిస్తున్నారు.

మనకు ఎలాగూ స్వీకరించడమే తెలుసు కాబట్టి, ఆ స్వీకరణ ఏదో గురుమార్గం లేదా భగవత్మార్గం పట్టించే దాన్ని స్వీకరిస్తే (గ్రహిస్తే/తీసుకుంటే) మనకే మంచిది. భగవంతునికి దూరం చేసే విషయాన్ని పరిత్యజించడం అలవడాలి.

ప్రపంచం మనకు గురువై ఎలా నడిపిస్తుందనేందుకు అనేక దృష్టాంతాలు కలవు. శీతోష్ణ సుఖదుఃఖాది ద్వంద్వాలనుద ఓర్చుకుంటుంది భూమి. ఎంతమంది 'ఈ భూమి నాది నాది' అని ఎంతగా విభజించుకున్నా, | తగవులాడుకున్నా కూడా భూమి అందరికీ అనుకూలంగా ఉంటుంది.

అన్నింటికంటే నరదేహం ప్రశంసనీయ గురువుగా చెప్పవచ్చు. ఈ దేహమంత చెడ్డది లేదు, ఈ దేహమంత మంచిదీ లేదు. ముందుగా చెడు సంగతి చూద్దాం- గర్భంలో నెలల తరబడి కాలం గడిపి దేహం పుడుతుంది. పుట్టుకతోనే దేహాన్ని మరణం ఆశ్రయించి ఉంటుంది. అయినప్పటికీ ఆ విషయాన్ని విస్మరిస్తూ ఇష్టారాజ్యంగా కాలం గడిపేస్తాడు. సుఖాల వెంపర్లాటతో మనశ్శాంతి ఉండదు. ప్రారబ్ధానుసారం సుఖం వచ్చినా, అట్లే దుఃఖాలు కూడా వస్తుంటాయి. సంతోషాలతోపాటు మానావమానాలు, ఛీత్కారాలు, అపోహలు, నిందలు, అపవాదాలు ఇలాంటివెన్నో చవిచూడాల్సి వస్తుంది ఎంతటి మనిషియైనా. నా యంతటివాడు లేడని అహంకరిస్తూ బ్రతికినా, చివరకు వృద్ధాప్యం దాపురించినప్పుడు వ్యాధులతో, మానసిక చింతనలతో పరిస్థితి దుర్బరంగా తయారై ఉంటుంది. ఇలాంటివారిని చూసినప్పుడు స్పష్టమవుతున్నది - దేహాభిమానులై దేహాన్ని పోషించుకున్నవారందరూ దుఃఖాన్నే పెంచుకుంటూ నశించిపోతున్నారని. దేహాన్ని ఎంత శ్రద్ధతో రక్షించుకున్నప్పటికీ చివరకు దేహం మృతి చెందుతుంది. పూడ్చబడిన దేహము కుక్కలకు, నక్కలకు, క్రిమికీటకాదులకు ఆహారమై పోతుంది. లేదా చితిలో ఉంచి దహనం చేయబడిన దేహం బూడిదకుప్పగా మారుతుంది. దేహమునే గురువుగా పెట్టుకొనిన వైరాగ్యం త్వరగా కలుగును.

అయితే ఇదే నరదేహము చెడ్డదని విస్మరిస్తే మోక్షమసలే లేదు. కారణం - ఇతర జీవులకు ఆహార నిద్ర భయము మైథునములు మాత్రమే కలవు. కానీ వివేక వైరాగ్యాలను నరదేహము ద్వారానే పొందగలడు జీవుడు. అందుకనే నరదేహము యోగ్యమనేది. మన యొక్క గమ్యస్థానానికి వెళ్ళునప్పుడు ఏదైనా వాహనాన్ని ఉపయోగించి జాగ్రత్త వహించి ఎలా వెళ్తామో అలా -అంతటా స్వస్వరూప స్థానంలో (అంతా భగవత్ స్వరూపంగా గోచరించేంతవరకూ) నిలిచేంతవరకూ శరీరాన్ని పోషించుకుంటూనే, ఆసక్తి వహించకుండా, సాధనకు ఉపయోగించుకుంటూ జాగరూకతతో ఉండాలి.

దేహంతో జాగ్రత్త ఏమిటంటే- ఇది చెడ్డదని వదిలేస్తే మోక్షము లేదు. మంచిదని అభిమానిస్తే పతనమే. అందుకే దేహాన్ని మన స్వాధీనంలో ఉంచుకొని జాగరూకతతో సాధన సాగించవలెను.

ఇలా భూమి నుండి, కనిపిస్తున్న ఆకాశం నుండి, నరదేహాల నుండి, వస్తుజాలం నుండి, ఆఖరికి శత్రువుల నుండి కూడా పాఠాలు స్వీకరించి భగవత్తత్త్వాన్ని పట్టుకునేవాడే సాధకుడు అవుతాడు.

ఎప్పుడైతే సమస్తమునూ గురువుగా భావన చేసి, స్వీకరించాల్సిన దానిని మాత్రమే స్వీకరిస్తుంటే, యధాలాపంగానే దేహాభిమానం విడనాడబడి, ఈ ప్రపంచంలో ఉంటున్నా, దేనిని చూస్తున్నా, ప్రారబ్ధానుసారంగా సంక్రమించిన సుఖాలను | అనుభవిస్తున్నా. దేని కోసం ప్రయత్నం చేస్తున్నా, దేని ప్రభావమూ ఆ సాధకుని మీద పడదు.

అంటే ఇక్కడ వ్యక్తి దేనినీ కావాలనుకోవడం లేదు. దేనినీ వద్దనుకోవడం లేదు. తానున్న పరిస్థితిలో ఏదైనా కావాలని ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నం విఫలమైనా అతడు పట్టించుకోడు. అంటే ఇక్కడ పొందాలనుకోవడమనేది గాఢంగా లేదు. అదే వ్యక్తికి కష్టాలు వచ్చినా, దారిద్య్రం వచ్చినా వాటినీ తిరస్కరించేది ఉండదు. తామరాకుపై నీటిబొట్టులా ప్రపంచంతోనే ప్రపంచంలోనే ఉంటూనే దేనినీ అంటుకోకుండా ఉండటమే-వదలడంతో సమమవుతుంది. అట్టి వివేక వైరాగ్యాలు కేవలం పుస్తక పఠనతోనో, వ్యక్తుల మాటలతోనో రావు. దృఢసంకల్పం ఉండి అందుకు సమాయత్తమై ఉంటేనే, ప్రపంచం గురువుగా ఉండి చేసే బోధ మనసుకు ఎక్కేలా దత్తప్రభువు (భగవంతుడు) చేస్తారు!

నేను, నువ్వు, అంతా పరమాత్మయే అన్న ఎరుకను స్థిరపరచుకునేందుకు మనం సిద్ధమై యుంటే, విశ్వమంతా గురువుగా ఉండి చేసే బోధ మనం గ్రహించేందుకు దత్తకృప గురురూపకంగా సాక్షాత్కరించి తోడ్పాటునందించుననేది దత్తప్రభువు, ఋషులు మనకందించిన హామీ!..

గీతా మహాత్మ్యము / Gita Mahatmya 🍀* *(వరాహ పురాణాంతర్గతం)

 *🌹 📖. గీతా జయంతి శుభాకాంక్షలు అందరికి, Gita Jayanthi Good Wishes to All  📖🌹*

*🌻. గీతామృత మహాత్మ్య  శ్లోకము 🌻*

*గీకారం త్యాగరూపం స్యాత్ తకారమ్ తత్వబోధకమ్*
*గీతా వాక్య మిదమ్ తత్వం జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:*
*సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|*
*పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం  - గీతామృతమ్మహత్||*

*🍀. గీతా మహాత్మ్యము /  Gita Mahatmya 🍀*
*(వరాహ పురాణాంతర్గతం)*

01. భూదేవి విష్ణుభగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవిం చే వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?

02. ఓ భూదేవీ! ప్రారబ్ధము అనుభవిస్తున్ననూ ఎవరు నిరంతరము గీతాభ్యాస మందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచము నందు సుఖముగా ఉండును.

03.  తామరాకును నీరంటనట్లు గీతాధ్యానము చేయు వానిని మహాపాపములు కూడా కొంచమైనను అంటవు.

04. ఎచ్చట గీతా గ్రంధము ఉండునో మరియు ఎచ్చట గీతా పారాయణము జరుగుచుండునో అచ్చట ప్రయాగ మొదలగు సమస్త తీర్ధములు ఉండును.

05. ఎచ్చట గీతాపారాయ ణము జరుగుచుండునో అచటికి దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపికలు, గోపాలురు భగవత్స్పర్శ్యా స్యాసక్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు.

06. ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చి విచారణ, పఠనము, భోధన, శ్రవణము జరుగు చుండునో అచట నేను ఎల్లప్పుడు తప్పక నివసింతును.

07. నేను గీతనాశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమగు నివాస మందిరము మరియు గీతాజ్ఞానమును ఆశ్రయించియే మూడు లోకాలను నేను పాలించుచున్నాను.

08. గీత నా యొక్క పరమ విద్య అది బ్రహ్మస్వరూపము దీనిలో సందేహము లేదు, మరియు అది ప్రణవములో నాలగవ పాదమగు అర్ధమాత్రా స్వరూపము, నిత్యమైనది, నాశరహితమైనది, అనిర్వచ నీయమైనది.

09. సచ్చిదానంద స్వరూపు డగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానందమయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగచేయును.

10. ఏ నరుడు నిత్యమూ గీతయందలి పద్దెనిమిది అధ్యాయములను పఠించునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమ పదమును (మోక్షమును) పొందును.

11. గీతని మొత్తము పఠించలేని వారు అందులో సగమైనను పఠించవలెను దీనివలన అతడికి గోదాన ఫలము వలన కలుగు పుణ్యము లభించుననుటలో సందేహము లేదు.

12. గీతయొక్క మూడవ భాగము(ఆరుఅధ్యాయములు) పఠించినవానికి గంగా స్నాన ఫలము లభించును, ఆరవ భాగము (మూడు అధ్యాయములు)పఠించువారికి సోమయాగ ఫలము లభించును.

13. ఎవడు గీతయొక్క ఒక అధ్యాయము భక్తితో పఠించునో అతడు రుద్ర లోకమును పొంది రుద్ర గణములలో ఒకడుగా శాశ్వతముగా నివసించును.

14. ఓ భూదేవీ ఎవరు గీత నందలి ఒక అధ్యాయము నందలి నాల్గవ భాగమును నిత్యమూ పఠించునో అతడు ఉత్కృష్టమైన మానవ జన్మ ఒక మన్వంతర కాలము పొందును.

15. ఎవరు గీతనందలి పది శ్లోకములను కానీ, ఏడు శ్లోకములను కానీ, ఐదు శ్లోకములను కానీ, నాలుగు శ్లోకములను కానీ, మూడు శ్లోకములను కానీ, రెండు శ్లోకములను కానీ, ఒక శ్లోకమును కానీ, అర్ధ శ్లోకమును కానీ నిత్యము ఏవరు పటింతురో,

16. వారు చంద్రలోకములో పదివేల సంవత్సరములు సుఖముగా జీవించుననుటలో సందేహము లేదు మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమ మగు మానవ జన్మను పొందుట నిశ్చయము.

17. అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమమగు మోక్షమును పొందుననుటలో సంశయము లేదు. గీతా గీతా అనుచు ప్రాణమును వదలువాడు సత్గతిని పొందుననుటలో సందేహము లేదు.

18. మహా పాపాత్ముడైనను అతడు గీతార్ధమును తెలుసుకొనుటలో ఆసక్తుడై నచో అతడు విష్ణు లోకమును పొంది శ్రీమహా విష్ణు సన్నిధిలో ఆనందమును అనుభవించు చూ ఉండును.

19. ఎవడు గీతార్ధమును నిత్యము చింతన చేయుచుం డునో అతడు అనేక కర్మల నాచరించిననూ జీవన్ముక్తు డేనని చెప్పబడెను, మరియు దేహ పతనానంతరము పరమ పదమును (కైవల్యమును) పొందును.

20. ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాది రాజులు అనేకులు పాపరహితులై ముక్తిని పొందియున్నారు.

21. గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే (నిష్ఫలమే). అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమే నని చెప్ప బడినది.

22. గీతా మహత్యముతో గీతా పారాయణము చేయువారు పైన చెప్పబడిన ఫలములను పొంది, దుర్లభ మగు సద్గతిని పొందుతురు.

23. శౌనకాది ఋషులారా! ఈ ప్రకారముగా సనాతనమైన గీతా మహత్యమును మీకు తెలుపుచున్నాను. దీనిని గీతా పారాయణానంతరము ఎవరు పఠింతురో అతడు పైన చెప్పిన ఫలమును పొందును.

24. ఇట్లు వరాహ పురాణమునందలి గీతా మహత్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 

****వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి (పూర్తిగా చదవండి)....కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి – విశిష్టత , ఉపవాస విధానం.

 🙏🪷🙏🪷🙏
 వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి
(పూర్తిగా చదవండి)
🕉️🕉️🕉️🕉️🕉️
కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి – విశిష్టత , ఉపవాస విధానం.
☘️☘️☘️☘️☘️
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటారు.

శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోడానికి వైకుంఠానికి తరలివెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని అంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

*వైకుంఠ ఏకాదశి*

వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ , ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ , విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు *“వైకుంఠః”* (వైకుంఠుడు) అయ్యాడు. అదేకాక జీవులకు నియంత , జీవులకు సాక్షి , భూతముల స్వేచ్ఛావిహారాన్ని అణచేవాడు – అని అర్ధాలున్నాయి.

ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం , అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా భక్తుల విశ్వాసం.

విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా ,  వారి కోసం    శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ , తమ కథ విని , వైకుంఠ ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందు చేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ఏడాది కూడా తిరుమలలో స్వామిని దర్శించే భక్తులకు ముక్కోటి ఏకాదశి రోజునుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.

పద్మ పురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది.
 
ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని , అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక , రాజసిక గుణాలకు , అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని , ఇఛ్ఛని , జాగురూకతను , దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశినాడు ఉపవాసం ఉండి , ద్వాదశినాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమ నిష్ఠలతో పూజ చేసివారికి పుణ్యఫలముతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని , స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.

ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ , గీతా పారాయణం , గోవింద నామ స్మరణం , పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా.. ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు , వేంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు , హోమాలు , ప్రవచనాలు , ప్రసంగాలు ఉంటాయి.
 
*వైద్య పరంగా*

మన దేశంలో ఆధ్యాత్మికతకు , ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉన్నది. ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యమైనవి ఉపవాసం , జాగరణ. అటు తర్వాత జపం , ధ్యానం. జ్యోతిష్యం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిధి. ఆ రోజు చంద్రుడు , సూర్యుడు , భూమి మధ్య ఉండే దూరము , సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని , అరుగుదల మందగిస్తుందని , అందువల్ల ప్రతి ఏకాదశి నాడు ఉపవసించాలని జ్యోతిష్యం తెలియపరుస్తోంది. ఈ విషయంలో వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇదే చెప్తోంది. మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు. మన శరీరంలో కొంత భాగం మిగిలిపోతుంది. అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది. ఇది విషపదార్ధం. ఈనాటి శాస్త్రం దీనిని toxins అంటుంది. వీటివల్లనే మనిషికి 90% రోగాలు వస్తున్నాయి.

ఈ toxins ను ఆయుర్వేదంలో ఆమం అంటారు , దాని వలన కలిగే రోగాలను ఆమ రోగాలంటారు. ప్రతి 12 రోజులకొకసారి చేసే ఈ ఉపవాస సమయంలో మన శరీరంలో ఉన్న విషాలు బయటకుపోయి శరీరం శుభ్రపడుతుంది. అందువల్ల మనిషికి దీర్ఘకాలంలో రోగాలు రాకుండా ఉంటాయి. చిన్న వయసు నుంచి ఏకాదశి వ్రతం చేస్తున్న వారు 70ఏళ్ళ వయసులో కూడా యువకుల్లాగా ఉత్సాహంగా ఉండడం మనం గమనించవచ్చు. ఎటువంటి మోకాళ్ళ నొప్పులు వీరిని బాధించకపోవడం ప్రత్యక్షంగా కనపడుతోంది. అందుకని ఏకాదశి తిధి నాడు ఉపవసించాలని ఆయుర్వేదం చెప్తోంది.

ప్రధాన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి చాలా ప్రముఖమైనది.  వైకుంఠ ఏకాదశి నాడు భారతీయులు పాటించే నియమ నిష్ఠలు అటు ఆధ్యాత్మికత చింతనను పెంపొందించడమే కాకుండా , ఇటు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి. వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసం , జాగరణ , పూజాదికారాలు జరిపితే.. ఆ ఏడాదంతా మనశ్శాంతిగా , సమస్యలు లేకుండా , ఆరోగ్యంగా , ఆనందంగా బతుకుతారని ఆధ్యాత్మిక వాదులు విశ్వసిస్తారు. మహావిష్ణువుకు నివాసమైన వైకుంఠమంటే సాక్షాత్తూ స్వర్గమేనని , అయితే ఈ స్వర్గం మరణించిన తర్వాత కాకుండా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెబుతాయి.
 
వైకుంఠ ఏకాదశి రోజున దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు , ఆధ్యాత్మికవేత్తలు , ఆస్తికులు సముద్రాల్లోనూ , పుణ్యనదుల్లోనూ పవిత్ర స్నానం ఆచరించడమే కాకుండా , ఉపవాసాలు చేసి , జాగరణ ఉంటూ , నియమ నిష్ఠలతో పూజాదికాలు చేసి , తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 356 వైష్ణవ దేవాలయాల్లో దాదాపు ఒకే సమయంలో , ఒకే విధమైన పూజాదికాలు అత్యంత వైభవంగా జరగడం విశేషం.

మన శరీరంలో ఆరుచక్రాలు ఉంటాయి. మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి , మూలాధార చక్రం నుండి స్వాధిష్టాన , మణిపూరక , అనహత , విశుద్ధి , ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఏడవదైన సహస్రార చక్రంలో సహస్రకమలంలో పరమాత్మను దర్శించి , బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మను సచ్చిదానంద రూపమైన పరమాత్మలో ఐక్యం చేయడం. అటువంటి వారికి ఇక ఉత్తరజన్మ(మరుజన్మ) ఉండదు.

*తాత్వికపరంగా ముక్కోటి ఏకాదశి*

విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు , దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా , ప్రతి మానవ హృదయ గుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి , ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే , ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి , పూజ - జపం - ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు , చెవులు , మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు , చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం , ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని , జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

*శ్రీరంగంలో ముక్కోటి ఏకాదశి*

శ్రీరంగం లోని శ్రీ రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. దీనిలో మొదటి భాగాన్ని పాగల్ పట్టు (ఉదయం పూజ) అని రెండవ భాగాన్ని ఇర పట్టు (రాత్రి పూజ) అని పిలుస్తారు. విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని ఆరోజు వజ్రాలతో చేసిన వస్త్రాల్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణం లోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకొని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ఈ ద్వారం గుండా వెళ్ళిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం.

*తిరుమలలో*

శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా వైకుంఠద్వారా ప్రవేశం , తదనంతరం దైవదర్శనం అనుమతిస్తారు. ఈ ఏకాదశికి ముందురోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు. పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశినాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు అనగా ద్వాదశినాటి రాత్రి ఏకాంతసేవ వరకూ శ్రీవారి గర్భాలయానికి ఆనుకొనియున్న వైకుంఠ ద్వారాన్ని తెరచి వుంచుతారు. ఈ సమయంలో భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు.
🙏🙏🙏🙏

ఉత్తర ద్వార దర్శనం అంటే!
డిసెంబర్ 23 శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగ
🪷🪷🪷🪷🪷
శ్రీవైకుంఠ మహానగరం, నిత్య విభూతి, పరమ పదము, పరమ ధామము, పరమ వ్యోమ అనే పేర్లతో కీర్తించబడుతుంది. వైకుంఠము అనగా ఎటువంటి దివ్య శక్తులకు కూడా లొంగనిది, తన ప్రాభవాన్ని తగ్గించగల, తప్పించగల ఏ శక్తి దాని ముందర లేవు. ఈ పరమపదం శక్తి అన్ని లోకాల్లో, విభూతులలో, వైభవాలలో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఎటువంటి వారైనా చివరకు కోరుకొనేది పరమపదాన్నే. పరమపదమునకు మించిన ఉత్తమ స్థానం మరొకటి లేదు. పరమాత్మ తన పరిపూర్ణ పరివారంతో అక్కడ వేంచేసి ఉంటాడు. వైకుంఠ నగరంలో అనంతమైన మణిస్తంభములతో నిర్మించబడిన మహా మణిమండపమున మధ్యలో అన్నిటి కంటే కింద కూర్మనాథుడు ఉంటాడు. అతన్ని ఆధారం చేసుకొని మహా దిగ్గజములు ఈ బ్రహ్మాండాన్ని మోస్తుంటాయి. ఆ దిగ్గజముల మీద అద్భుతమైన మహాపద్మం ఉంటుంది. ఆ మహాపద్మం మీద అనంతమైన పాదములు గల మహా సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద వేయి పడగలతో ఆది శేషుడు విరాజిల్లుతూ ఉంటాడు. అతని పైన పరమాత్మ శయనించి ఉంటాడు.

వైకుంఠానికి వెళ్లినవారందరూ పరమాత్మ సేవ చేయగల అదృష్టాన్ని పొందలేరు. కొందరు మహాకూర్మాన్ని చూస్తారు, మరి కొందరు అష్టదిగ్గజాలను చూస్తారు, ఆపైన మరి కొందరు మహాపద్మాన్ని, మరి కొందరు పరమాత్మ సింహా సనాన్ని చూస్తారు. ఆపైన చేరుకు న్నవారు పరమాత్మను సేవించినా వారిలో కూడా నూటిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే పరమాత్మ కైంకర్యా న్ని నోచుకుంటారు. వైకుంఠాన్ని చేరిన ప్రతి వారు పరమాత్మను దర్శిం చలేరు. దర్శించిన ప్రతి వారు ఆయన కైంకర్యాన్ని చేయలేరు. పరమాత్మను సేవించడానికి కావాల్సిన అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానము కలవారు. మాత్రమే భగవంతుడిని దర్శించు కోగలరు, సేవించుకోగలరు. ఇటువంటి అనన్యమైన భక్తితో కూడుకున్న జ్ఞానమే ఉత్తర ద్వారం. ద్వారము అనగా మనం లక్ష్యాన్ని చేరడానికి సాధనము. మన లక్ష్యము భగవంతుడు ఉన్న లోకానికి వెళ్లడమా? చూడ డమా? భగవంతుడిని స్తోత్రం చేయడమా? భగవంతునికి సేవలు చేయడమా? భగవంతుడు ఉన్న లోకానికి వెళ్లడం దక్షిణ ద్వారం, భగవంతుడిని చూడడం తూర్పు ద్వారం, భగవంతుడిని కీర్తించడం పశ్చిమ ద్వారం, భగవంతుడిని సేవించడం అనగా కైంకర్యం చేయడం ఉత్తర ద్వారం. ఈ విషయాన్ని బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణాలలో చాలా వివరంగా అందించారు.

వైకుంఠం చేరుకోగలగాలి అని చాలా మంది కలలు కంటూ ఉంటారు, వారి లక్ష్యం వైకుంఠాన్ని చేరడం మాత్రమే. మరి కొందరు వైకుంఠం వెళ్లాలి పరమాత్మను సేవించాలి అని కోరుకుంటారు, వీరి లక్ష్యం పరమాత్మ దర్శనం. వైకుంఠంలో స్వామి ముందర నిలబడి ఆయనను స్తుతించాలి అని మరి కొందరు కోరతారు, వారి లక్ష్యం పరమాత్మ స్తుతి మాత్రమే. ఇలాంటి వారు కాకతాము అన్ని కైంకర్యాలు పరమాత్మకే చేయాలి అది కూడా పరమాత్మ చెప్పి చేయించుకోవాలి అని కోరుకొనే వారు వేల కోట్లలో ఒక్కరు మాత్రమే ఉంటారు. అటువంటి వారి గురించే ఆండాళ్లమ్మ అంటే గోదాదేవి తిరుప్పావులో ఉనక్కే నామ్ ఆట్ చెయ్ వోమ్ అని పలికింది. అనగా నీకే మేము అంతరంగ కైంకర్యములు చేయాలి అని. అలాగే మత్తనమ్ కామంగళ్ మాత్తు అని పలికింది అనగా ఇంతకంటే వేరే కోరికలు మాకు వద్దు అని ఆండాళ్లమ్మ కోరింది. ఆండాళ్లమ్మ వైకుంఠాన్ని కోరలేదు, స్వామి దర్శనాన్ని కోరలేదు, స్వామి స్తుతిని కోరలేదు, స్వామి కైంకర్యాన్ని కోరింది. నీవేమీ వద్దయ్యా నీ కైంకర్యం చాలు అనగలగాలి. అందుకే పరమాత్మ వైకుంఠం ఇస్తానంటే హనుమంతుడు తనకు వైకుం ఠం వద్దు నీ సేవ కావాలని కోరుకున్నాడు. భగవంతుని లోకంలో ఉండడం, భగవంతుని దగ్గర ఉండడం, భగవంతుని చూడడం, భగవంతుని స్తుతించడం ఇవేమి కోరవలసినవి కావు. పరమా క ఏకాంత సేవ చేయాలి అని గాఢంగా తపించగలగడమే ఉత్తర ద్వారం. మరి తూర్పు ద్వారం, పశ్చిమ ద్వారం, దక్షిణ ద్వారం వాటిలోనూ భక్తి ఉండి, అంతో ఇంతో జ్ఞానం ఉంది.

వైకుంఠం చేరితే చాలని, స్వామిని చూస్తే చాలని, స్వామిని స్తుతిస్తే చాలని అనుకుంటారు. ఇవన్నీ శాశ్వతం కాదు. వైకుంఠ లోకం వెళితే ఎప్పుడూ అక్కడే ఉండాలని నియమం లేదు. స్వామిని చూస్తే చాలు అనుకుంటే ఒక సారి చూస్తే సరిపోతుంది. స్వామిని స్తుతిస్తే చాలు అనుకుంటే ఒకసారి మనసారా స్తోత్రం చేస్తే సరిపోతుంది కానీ స్వామికి అంతరంగ కైంకర్యం అన్ని వేళలా చేయాలి అన్న కోరికలో స్వామి లోకం, స్వామి దర్శనం, స్వామి స్తుతి, స్వామి కైంకర్యం అన్నీ ఇమిడి ఉన్నాయి. వైకుంఠం చేరడం, స్వామి దర్శనం, స్వామి స్తుతి ఏ ఒక్కసారికి ఇచ్చినా సరిపోతుంది కానీ అంతరంగ కైంకర్యం అన్ని వేళలా ఉండేది. కానీ అంతరంగ కైంకర్యం అంటే స్వామి నిద్రపోతుంటే పాద సంవాహనం చేయడం, స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం, స్వామి కూర్చుంటానంటే సింహాసనం ఏర్పాటు చేయడం అని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. స్వామికి చలివేస్తే దుప్పటి కప్పడం కాక తానే దుప్పటై ఆయనని అతుక్కుని ఉండటం సేవ. దుప్పటి కప్పిన వారు కప్పి వెళ్లిపోతారు కానీ కప్పుకున్న దుప్పటి ఎప్పుడూ ఒంటిమీదనే ఉంటుంది. చందనం పూసినవారు వెళ్లిపోతారు కానీ చందనం ఒంటికే ఉంటుంది. పరుపు ఇచ్చిన వారు వెళ్లిపోతారు కానీ పరుపు స్వామికి శయ్యగా ఉండిపో తుంది. అలాగే పాదుకలు ఇచ్చినవారు వెళ్లిపోతారు కానీ పాదు. కలు పాదాలను అంటిపెట్టుకుని ఉంటాయి. మరి పాదుకలను సమకూర్చాలనా లేక పాదుకలు కావాలని కోరుకుంటామా?, చందనం పూయాలనా లేక చందనం అవ్వాలని కోరుకుంటా మా? ఏ పేరో ఏ సేవో ఏ సంబంధమో అవసరం లేదు ఎప్పుడు నీతోనే ఉండాలి, నీకు అవసరమైన ప్రతి కైంకర్యం నేనే కావాలి. అని కోరుకోవాలి. అందుకే యామున మిశ్రులు స్తోత్ర రత్నంలో 

*నివాస శయ్యా ఆసన పాదుక అంశుక ఉపధాన శీతాతప*
*వారణాదిభిః శరీర భేదైః తవ శేషతాం గతః*

అని చెప్పారు అనగా ఆదిశేషుడు నీవు ఉంటానంటే తాను ఇల్లు అయ్యాడు, పడుకుంటానంటే తాను పరుపు అయ్యాడు, కూర్చుంటానంటే తాను సింహాసనం అయ్యాడు, నడుస్తానంటే తాను పాదుకల య్యాడు, తలగడ కావాలంటే తాను తలగడ అయ్యాడు, కట్టుకుంటానంటే తానే వస్త్రం అయ్యాడు, చలికి దుప్పటి అయ్యాడు, ఎండకి గొడుగు అయ్యాడు. అందుకే అతనని ఆది శేషుడు అంటారు. అంటే మొదటి సేవకుడు. చలి వేస్తే దుప్పటి ఇచ్చినవాడు సేవకుడు కాదు తానే దుప్పటి కావాలి. ఇది వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం.
🪷🪷🪷🪷🪷

Friday, December 22, 2023

అర్థరాత్రితోనే రోజు ఎందుకు మొదలవుతుంది?*

 *✅తెలుసు కుందాం✅*


*🟥అర్థరాత్రితోనే రోజు ఎందుకు మొదలవుతుంది?*

🟢అర్థరాత్రి స్వాతంత్రం, అర్థరాత్రి నూతనసంవత్సరం, అర్థరాత్రి జన్మదినోత్సవాలు, ఇలా అర్థరాత్రితోనే మనరోజు ఎందుకు ప్రారంభమవుతుందీ అని ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? అదేమిటి పిచ్చి ప్రశ్న అని కొట్టెయ్యకుండా, అది ఇంగ్లీషువారి పద్ధతిలే అని దాటెయ్యకుండా ఆలోచిస్తే ఒక కొత్త విషయం బయటకు వస్తుంది! 

నిజానికి ఏ తెల్లవాడికైనా అర్థరాత్రి తోనే రోజు మొదలు పెట్టాలని ఎందుకు అనిపించివుంటుంది? విద్యుత్తు దీపాలు కూడా లేని నాడు, కనీసం గడియారాలు కూడా లేని నాడు, అర్థరాత్రికి ఎవడూ మేలుకుని వుండని నాడు, దానితో రోజు మొదలు పెట్టాలని ఎందుకు అనిపించివుంటుంది? 

వైదీకకాలంలో అంటే బౌద్ధమతానికి కూడా పూర్వకాలంలో ప్రపంచంలో మతం అన్న మాట కూడా లేని కాలంలో, ఒకే ఒక ధర్మం వుండేదట. అదే భారతీయ లేక వైదీక సనాతనధర్మం. అది భారత దేశానికే పరిమితం కాకుండా ప్రపంచమంతటా వ్యాపించి వుండేదిట. భారతదేశం ఈ వైదీకసంస్కృతికి ఒక రకంగా నాయకత్వం వహించేది అని చెప్పుకోవచ్చు. తర్వాత బౌద్ధ, జైన మతాలవంటివి పుట్టి అమిత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆదిశంకరుడు మళ్ళీ మన మతాలను ఉద్ధరించి సనాతనధర్మాన్ని పునఃస్థాపితం చేసాడు. ఆ తరువాత ఇంకా అనేక మతాలు విడివిడిగా జన్మించి, అలా ఒక్కొక్కరికి ఒక మతం వచ్చేసాక, ఇక ఈ వైదిక ధర్మాన్ని ఏమని పిలవాలి అని సతమతమవుతూ ఉన్నప్పుడు, అదే కాలంలో భారతీయులని హిందూ దేశస్తులని పర్షియన్లు పిలవడం మొదలు పెడితే, అదే పేరుని పెట్టి మన మతాన్ని కూడా పిలవడం మొదలు పెట్టారు. అలా మనకు హిందూమతస్తులని పేరు పడిపోయింది కానీ, వైదీక సనాతనధర్మానికి నిజంగా పేరు లేదు అని అందరికీ తెలిసిన విషయమే. ఈ సనాతనధర్మం వల్ల భారతదేశం ప్రపంచానికి ఒక సాంస్కృతికరాజధానిగా వుండేది. అలా ఆ కాలంలో అందరూ వైదీకకాలమానాన్ని అనుసరించేవారు. భారతీయ సంస్కృతిని గౌరవించి పాటించేవారు అని చెప్పుకోవచ్చు. 

ఇలా వైదీక పద్ధతిని అనుసరించడానికి ప్రపంచం కట్టుబడి వుండేదన్న విషయం అంగీకరిస్తే, దినారంభం గురించి ఆలోచించడానికి పునాది సిద్ధమైందన్నమాట. -- ఇందాక చెప్పుకున్నట్లు సూర్యోదయమైతేగానీ, భారత పంచాంగం ప్రకారం రోజు మొదలవ్వదు. సామాన్యంగా భారతదేశంలో ఉదయం 6 గంటలకు సూర్యోదయం అవుతుంది. అంటే యూరప్ దేశవాసులు మంచి నిద్రలలో ఉంటారన్నమాట. అంటే గడియారాలు గట్రా లేని కాలంలో ... " ఎప్పుడో అర్థరాత్రికి వైదీకదినం మొదలవుతుందిలే" ... అని అనుకునేవారు. అంటే మన పంచాంగ పట్ల, లేక భారతీయ సంస్కృతిపట్ల వున్న అభిమానంతో, భారత దేశంలో రోజు ఎప్పుడు మొదలు అయితే, అప్పుడే యూరోపియన్లు కూడా తమ రోజును అదే సమయానికి, …. అంటే అది అర్థరాత్రి అయినా అపరాత్రి అయినా, …. … అదే సమయానికి తమతమ రోజులను మొదలు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారన్న మాట. ఈ విధంగా ఇలా అర్థరాత్రికి వారి దినం మొదలు పెట్టుకునే సాంప్రదాయాన్ని అలవరుచుకున్నట్లుగా కనపడుతున్నది. మనపంచాంగం ప్రకారం స్థానికకాలమానంతో సంబంధంలేకుండా ఎక్కడైనా తిథులను ఇలాగే ఒకే సమయంలో అమలు పరుచుకోవడం కూడా సాంప్రదాయమే. దానినే వీరు దినారంభానికి కూడా వర్తించినట్ట్లు తెలుస్తోంది. 


Our Life

 . 
.                      *Our Life*
.                   *************

By happening birth our life begins. and
Goes on continuously up to death of end. 
It's our great incornation on this earth. 
Starting our  life here only by the birth. 

Giving happiness to my parents, relatives. 
So smart their faces by enjoying
                                                   primitives. 
We can't see any where this nice situation
Because of their full of effective
                                               participation. 

At our death we can't see here any thing. 
That our family members, relatives 
                                                      roaring. 
Between the birth and death we will live. 
With so many activities having perceive

This is common for all humans and 
                                                            others. 
What ever may be their positional traders. 
Being connection to each other so darling. 
This is to be relation, friendship forming. 

This is our life with so many formalities. 
Happeningly living in this nature realities
At the death take away from this universe. 
In which our permanent address covers. 

                 ************************
Written by 
      Rudhra Manikyam (✍️Kavi Ratna) 
                Jagithial (Dist) 

*******************************************
 ఈ రోజు(22 dec 2023) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన భారత దేశ గణిత శాస్త్ర వేత్త  - శ్రీనివాసరామానుజం- గారి జయంతి ని గణిత దినోత్సవము గా నిర్ణయించారు. ఆయన గొప్పతనాన్ని ఇంగ్లండ్ వారు గుర్తించి ఇప్పటికి ఈ రోజున ఆయన పేరు మీద సేవా పురస్కారాలు అందచేస్తున్నారు.  మొట్ట మొదటిసారిగా ఒక  శాస్త్రవేత్త పై సినిమాను - హాలీవుడ్ - వారు చిత్రీకరించి 2016- లో 72 దేశాలలో విడుదల చేయడం మన దేశానికి గర్వకారణము.  ఇటువంటి మహానుభావుల గొప్పతనాన్ని భావితరాలకు తెలియచేయడం మన ధర్మం. 🇮🇳 మేరా భారత్ మహాన్

ఈ ఇతివృత్తం అన్ని వేద గ్రంథాలలో పునరుద్ఘాటించబడింది:

 గతిర్భర్తా ప్రభు: సాక్షి నివాస: శరణం సుహృత్ |
ప్రభవ: ప్రలయ: స్థానం నిధనం బీజమవ్యయం 9, 18

 నేనే అన్ని జీవుల యొక్క సర్వోన్నత లక్ష్యం, మరియు నేను వాటి పోషణకర్త, యజమాని, సాక్షి, నివాసం, ఆశ్రయం మరియు స్నేహితుడు కూడా. నేను సృష్టికి మూలం, ముగింపు మరియు విశ్రాంతి స్థలం; నేను రిపోజిటరీ మరియు ఎటర్నల్ బీడ్.

ఆత్మ అనేది భగవంతుని యొక్క చిన్న భాగం కాబట్టి, దాని ప్రతి సంబంధమూ ఆయనతోనే ఉంటుంది. అయితే, శరీర స్పృహలో, శరీర బంధువులను మన తండ్రి, తల్లి, ప్రియమైన, బిడ్డ మరియు స్నేహితునిగా చూస్తాము. మనతో అటాచ్ అయ్యాము మరియు వాటిని పదే పదే మన మనస్సులోకి తెచ్చుకుంటాము, అందువల్ల భౌతిక భ్రమలో మరింత కట్టుబడి ఉంటాము. కానీ ఈ ప్రాపంచిక బంధువులు ఎవరూ పరిపూర్ణ మన ఆత్మ కోసం ఆరాటపడే ప్రేమను ఇవ్వలేరు. ఇది రెండు కారణాల వల్ల. మొదటిది, ఈ సంబంధాలు తాత్కాలికమైనవి మరియు అవి లేదా మనం ప్రపంచం నుండి బయలుదేరినప్పుడు విడిపోవడం అనివార్యం. రెండవది, వారు జీవించి ఉన్నంత వరకు, అనుబంధం స్వార్థం మీద ఆధారపడి ఉంటుంది మరియు స్వీయ-ఆసక్తిని సంతృప్తిపరిచే దాని ప్రత్యక్ష నిష్పత్తిలో హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఈ విధంగా, ప్రాపంచిక ప్రేమ యొక్క పరిధి మరియు తీవ్రత రోజు మొత్తంలో క్షణం నుండి మారుతూ ఉంటుంది. "నా భార్య చాలా బాగుంది....ఆమె అంత మంచిది కాదు...ఆమె బాగానే ఉంది....ఆమె భయంకరమైనది," ఇది ప్రపంచ నాటకంలో ప్రేమ యొక్క హెచ్చుతగ్గుల పరిధి. మరోవైపు, దేవుడు జీవితకాలం తర్వాత జీవితకాలం మనతో పాటు ఉన్న బంధువు. పుట్టినప్పటి నుండి, మనం వెళ్ళిన ప్రతి జీవితంలో, భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడు మరియు మన హృదయంలో కూర్చున్నాడు. అందువలన అతను మనకు శాశ్వతమైన బంధువు. అదనంగా, అతనికి మన నుండి ఎటువంటి స్వార్థం లేదు; అతను తనలో పరిపూర్ణుడు మరియు సంపూర్ణుడు. ఆయన మనలను నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే ఆయన మన నిత్య సంక్షేమాన్ని మాత్రమే కోరుకుంటాడు. ఆ విధంగా, భగవంతుడు మాత్రమే మన పరిపూర్ణ బంధువు, అతను శాశ్వతుడు మరియు నిస్వార్థుడు.
ఈ భావనను మరొక కోణం నుండి అర్థం, సముద్రం మరియు దాని నుండి ఉద్భవించే తరంగాల సారూప్యతను పరిగణించండి. సముద్రంలోని రెండు పొరుగు అలలు కొంత సమయం పాటు కలిసి ప్రవహిస్తాయి మరియు ఒకదానితో ఒకటి ఉల్లాసంగా ఆడుకుంటాయి, వాటి మధ్య చాలా లోతైన సంబంధం ఉందని అభిప్రాయాన్ని సృష్టిస్తుంది. అయితే, కొంత దూరం ప్రయాణించిన తర్వాత, ఒకరు సముద్రంలో మునిగిపోతారు, మరియు కొద్దిసేపటి తర్వాత, మరొకరు అదే చేస్తారు. వారి మధ్య ఏదైనా సంబంధం ఉందా? లేదు, వారిద్దరూ సముద్రం నుండి జన్మించారు మరియు వారి సంబంధం సముద్రంతోనే ఉంది. అలాగే భగవంతుడు సముద్రం లాంటివాడు మరియు మనం అతని నుండి ఉద్భవించిన అలల వంటివాళ్ళం. మనం మన శరీర సంబంధాల మధ్య అనుబంధాలను ఏర్పరుచుకుంటాము, మరణం తర్వాత అందరినీ విడిచిపెట్టి, మరొక జన్మలోకి ఒంటరిగా ప్రయాణిస్తాము. నిజమేమిటంటే, ఆత్మలు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండవు, కానీ అవి అన్నీ ఉద్భవించిన దేవునికి.
ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు మనలను శారీరక స్పృహ మరియు ప్రాపంచిక బంధువులతో దాని అనుబంధం కంటే పైకి తీసుకువెళతాడు. ఆత్మ యొక్క వేదిక, భగవంతుడు మాత్రమే మన సంబంధాలన్నీ; ఆయన మన తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, ప్రియమైన మరియు స్నేహితుడు. ఈ ఇతివృత్తం అన్ని వేద గ్రంథాలలో పునరుద్ఘాటించబడింది:

    *🚩హనుమాన్ దళ్🚩*
            *ఆంధ్రప్రదేశ్*


 *లెక్కల్లో లైఫ్..*
*కొందరికి లెక్కేలేని లైఫ్*
************************

కూడికలు.. తీసివేతలుగా..
వెతలు..వేతనాలుగా..
నిత్యజీవతంలో భాగమై..
తామే జీవితమై...
అందరికి అవసరమై..
గణితం లేక గమనం లేదని
లెక్కలు లేని జీవితం
లెక్కలోకి రాదని..
జగతిని శాసిస్తున్న గణితాన్ని..
ఆశగా శ్వాసగా ధ్యాసగా
అభ్యసించి ఆస్వాదించి
అద్భుతాలు సృష్టించిన
అనుపమాన గణితమేధావి 
శ్రీనివాస రామానుజన్..!

మహామహా 
మేధావులకైనా 
అర్థం కాని..
బ్రహ్మ పదార్థాలని వదిలేసిన
లెక్కల చిక్కులు 
రామానుజన్ కు కిక్కులు..
వాటిపైనే ఆయన దృక్కులు..
తేల్చేసాకే మేధావికి నిద్ర..
అలాంటి లెక్కలపైన
ఆయన శాశ్వత ముద్ర..!
జీవితమంతా 
లెక్కల్లో బ్రతికాడు..
చనిపోయి 
కొన్ని కష్టమైన 
లెక్కలను బ్రతికించాడు..!

రామానుజన్ జయంతి సందర్భంగా..
*గణిత దినోత్సవ శుభాకాంక్షలు*
💐💐💐💐💐💐💐

     *_సురేష్ కుమార్ ఇ_*
           9948546286
 Forwarded as received

    బ్రహ్మానందం  నెమ్మదిగా  ఇంటర్వ్యూ జరుగుతున్న రూమ్ డోర్ ని తట్టాడు.
 కొద్దిగా డోర్ తెరిచి...
     "మే ఐ కమిన్ సార్?" అన్నాడు 

   ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్న వారిలో ఒకరు..
   "ఎస్! కమిన్!" అన్నాడు

   లోపలికి అడుగు పెట్టిన బ్రహ్మానందం వారితో ఏదో చెప్పబోయాడు. 
    "ఫస్ట్ యూ సిట్!" అన్నారు వాళ్ళు

     ఇక గత్యంతరం లేక కూర్చున్నాడు బ్రహ్మానందం.

  బోర్డ్ సభ్యుల్లో ఒకరు...
     "ఈ గది గురించి నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు గంభీరంగా

     "చక్కని ఫర్నీషింగ్ తో చాలా బాగుంది సార్! మంచి అందమైన కార్పెట్, కిటికీలకు అత్యంత సుందరమైన కర్టెన్స్, బోర్డ్, ప్రొజెక్టర్, వైట్ స్క్రీన్ చాలా గొప్పగా, కళాత్మకంగా ఉంది సార్!"

     "ఓహ్! నైస్ అబ్సర్వేషన్!  కానీ పేపర్ ముక్కలు ఉండ చుట్టి ఓ పక్కన పడి ఉన్నాయి. అది గమనించలేదా? ఇంత అందమైన రూమ్ కి దిష్టి చుక్కలా లేదా?"

     "సార్! నేను రూమ్ లోకి అడుగుపెట్టినప్పుడే అది చూశాను. కానీ నేను ఆ విషయం చెబితే, ఆ ఉండలు పడేసిన వ్యక్తి ఫీల్ అవుతాడు కదా! అందుకే చెప్పలేదు. అది పడేసిన వ్యక్తి ఎడమ వైపు నుంచి రెండవ స్థానంలో కూర్చున్నాడు. అతని వద్ద ఉన్న ప్యాడ్ పైన పేపర్స్ చించినట్టు కనిపిస్తోంది. పక్కన మరో రెండు ఉండలు పడి ఉన్నాయి"

       "గుడ్! నీలో మంచి పరిశీలాత్మక శక్తి ఉంది. బయట ఉన్న స్వీపర్ ను ఓ సారి పిలిచి, క్లీన్ చేయమని చెప్పగలవా?"

     "ఎస్ సార్! అమర్ పేరు చెప్పండి!" 

     బోర్డ్ మెంబర్స్ ఎవరూ మాట్లాడలేదు. 

      "ఓకే సార్! మీకెవ్వరికీ ఆమె పేరు ఏంటో తెలియదనుకుంటా! ఎనీ వే! నేను కనుక్కుని, పిలుస్తాను!" 
అని రూమ్ బయటకు వెళ్ళాడు.
     అక్కడ ఉన్న హెల్పర్ బాయ్ ని అడిగి, పేరు తెలుసుకుని, ఆమెను పిలిచి రూమ్ క్లీన్ చేయమని చెప్పాడు. 

       ఆమె వచ్చి, క్లీన్ చేసి, వెళ్ళింది. 

మళ్ళీ ఇంటర్వ్యూ మొదలుపెట్టారు.

     "నువ్వు చాలా మంచి పని చేసావు. గుడ్! ఏ పని చేసేవారిని అయినా నువ్వు గౌరవిస్తావన్నమాట! ఈ ప్రశ్నకు జవాబు చెప్పు! ఇక్కడ ఉన్న మాలో ఎవరు ఏ కంపెనీ బాస్ నో చెప్పగలవా?"

     "ఎస్ సార్! మీలో ఆ ఇద్దరూ జస్ట్ వాచింగ్. చూస్తూ కూర్చున్నారు అంతే!   వారిలో ఒకరు ఫైనాన్స్ పర్సన్ అంటే శాలరీ బేరసారాలు చేసే వ్యక్తి. ఇక రెండో ఆయన హెచ్ ఆర్ అతను. ఆ చివర కూర్చున్న వ్యక్తి కేవలం ఓ చిన్న నవ్వు నవ్వడం, అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. అతనే అసలైన బాస్! మధ్యలో కూర్చున్న వ్యక్తి మీ అందరితో తెగ మాట్లాడుతూ వున్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అతనే బాస్ అని నేను కన్ఫ్యూజ్ అవ్వాలనేమో!" అని వివరించాడు బ్రహ్మానందం

   వెంటనే సంతోషంగా చప్పట్లు చరిచి..
     "అద్భుతంగా వివరించావు. మేము నీవంటి క్యాండిడేట్ కోసమే చూస్తున్నాము. యూ ఆర్ సెలెక్టెడ్! బయట వెయిట్ చేసి, నీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో!"

     "ఇంకా ప్రశ్నలు అడగరా సార్? సర్దార్ పటేల్ స్టాట్యూ హైట్ ఎంత? రాష్ట్రపతి అవ్వకమునుపు ఆమె ఎక్కడ ఎమ్మెల్యే గా చేసింది?  మొదలైన ప్రశ్నలు అడగరా?" 

     "ఇంకా ప్రశ్నలు అడిగే అవసరం లేదు. నీ పేరు ఒక్కటి కన్ఫర్మ్ చేసుకోవాలి. యూ ఆర్ మిస్టర్ గిరిధర్ ఫ్రమ్ హైదరాబాద్. కరెక్టే కదా!"

     "సారీ సార్! అతను బయట వెయిట్ చేస్తున్నాడు"

  "అయితే నువ్వు ఎవరు?"

     "సార్! నా పేరు ప్రకాష్. మీ కంపెనీ పక్కన క్యాంటీన్ లో మేనేజర్ గా చేస్తున్నాను. ఇవ్వాళ ఇంటర్వ్యూలు ఉన్నాయని, టీ, కాఫీలు చెప్పారు. అవి ఎన్ని కావాలి? ఇంకా స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా కావాలేమో కనుక్కుని రమ్మని నన్ను పంపించారు. నేను అదే చెప్పబోతుంటే విన్పించుకోకుండా కూర్చోమని, ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ చాలా బావుంది సార్! చాలా ఎంజాయ్ చేశాను. 

    ఇప్పుడు చెప్పండి! ఎన్ని కాఫీలు,టీలు కావాలి? ఎన్ని తీసుకురమ్మంటారు?" అని అడిగాడు అదే నమ్రతతో

  బోర్డ్ అంతా షాక్......
😃😂😂😂😂

****Man is haunted by endless worries of many kinds.

 *"Of what use is a mountain of bookish knowledge, if you cannot secure real happiness as a human being? Will not God take care if one places faith in the Divine? What is it that is achieved by ceaseless preoccupation with earning a living, forgetting the all-pervading Lord? Everybody clamours for peace saying, "I want peace." But can peace be found in the external world, which is only filled with pieces? Peace has to be found within oneself by getting rid of the ‘I’ and desire. Peace is being destroyed by the ego and by insatiable desires. Restrain your desires. You have to reduce desires and cultivate vairagya (detachment) so that you can have real peace of mind. Man is haunted by endless worries of many kinds. Only by turning one’s mind towards God can one get rid of the worries. While the Lord is ever by the side of man, he is searching for God all over the world. By exploring the external, you can never purify the internal."*

*~Divine Discourse, Dec 25, 1989.*

శాంత గుణం మనసును, శరీరాన్ని పవిత్రంగా, నిశ్చలగుణ తత్వంతో ఉండేలా చేస్తుంది. చుట్టూ ఉన్న పరిసరాలను ప్రశాంత తపోవాటికల్లా మారుస్తుంది!

 ✍️✍️
రసానుభూతులకు నిలయం మనోమందిరం. అనుభూతులు లేని జీవితం ఎడారి లాంటిది. మనిషి శాంతియుతంగా ప్రశాంత జీవనం గడపాలి. సమాజాన్ని శాంతి సౌఖ్యాలతో ఉంచేందుకు తనవంతు ధర్మాన్ని పాటించాలి.

సమదృష్టి, సమభావం ఈ రెండూ మనసులో శాంతిగుణం పాదుగొనేందుకు మూలాలు. ఇవి లేకుంటే మనసు ఎప్పుడూ కదనరంగాన్ని తలపిస్తుంది. అదుపుతప్పే కోరికలకు, తద్వారా వచ్చే కోపతాపాలకు గురవుతుంటుంది. అన్ని అరిష్టాలకు, దుష్ఫలితాలకు మూలం కామక్రోధాదులు. వాటిని అదుపుచేయగలిగేది ఒక్క శాంతగుణం మాత్రమే.

జేత వనంలో ధ్యానముద్రలోని బుద్ధభగవానుడి ప్రశాంత ముఖబింబం చూసినంత మాత్రాన శిష్యులు, వ్యధార్తులు, బాధాతప్త హృదయులు సాంత్వన పొందేవారు. ఆయనలోని ప్రేమ, కారుణ్య భావనలకు సమస్త జీవరాశి, ప్రకృతి పరవశించేవి.    ఆ భగవానుడు అడుగుపెట్టినచోట శాంతి   కిరణాలు వెల్లివిరిసేవి.

మంచుకొండల స్వభావం చల్లదనం. పూలకు పరిమళం సహజసిద్ధం. అలాగే ఉన్నత జీవన ప్రస్థానానికి, శాంతగుణం మనిషిని వీడని స్వభావంగా ఉండాలి. మనలోని శాంతస్వభావం- కరకుదనం, కఠినత్వంతో చరించే ఎదుటివారిలో సైతం మార్పు తెస్తుంది.

వేదోపనిషత్తులోనివి ‘శాంతిమంత్రాలు’. వేదమంత్రాలన్నీ చివరకు ఓం శాంతిః శాంతిః శాంతిః అని ముగుస్తాయి. బాహ్యాంతరాలు ఒక్కటై ఉండే స్థితి కోసం ప్రార్థించేదే శాంతిమంత్రం. బాహ్యాంతరాల సమన్వయమే జీవితం. శాంతి సుస్థిరతల ప్రాదుర్భావం అక్కడే. పరస్పర ద్వేషభావం, ఈర్ష్య అసూయలు లేకుండా ఉంటేనే శాంతి పరిఢవిల్లుతుంది. అది తెలిపేందుకే గురుశిష్యుల మధ్య శాంతిమంత్రం లోకానికే సందేశంగా ఉంది. ఇద్దరం శక్తి సంపన్నులమై అభ్యసన, అధ్యయనాలను ఫలవంతం చేసుకుందాం. పరస్పరం ద్వేషించుకోకుండా ఉందాం అంటూ అది శాంతియుత వాతావరణ సృష్టికి నాంది పలుకుతుంది.

మంచినే వినాలి. విన్నదాన్ని మననం చేసుకొని మనసులో నిక్షిప్తం చేసుకోవాలి. ఎల్లవేళలా తన ధ్యాసయందు ఉంచుకుంటే అది, అంతరంగ శాంతికి దోహదపడుతుందని యోగవాసిష్ఠం తెలుపుతోంది.

తనను ఆశ్రయించి ఉన్నవారికి పంచి ఇచ్చి, తాను మితంగా స్వీకరించేవాడు, ఎక్కువ పనిచేసి తక్కువగా నిద్రించేవాడు, అడిగినప్పుడు శత్రువుకైనా ఇచ్చేవాడు శాంతగుణ సంపన్నుడు, ఆత్మజ్ఞాన సంపన్నుడని విదురుడు ధృతరాష్ట్రుడితో అంటాడు. శాంత స్వభావం ఆయుర్దాయాన్ని పెంచుతుంది. శ్వాసక్రియ ఒడుదొడుకులు లేకుండా క్రమానుగతిలో ఉంటుంది. శ్రేష్ఠ కర్మలకే దోహదం చేస్తుంది. భయంలేని జీవితాన్నిస్తుంది.

శాంతగుణం హింసను ప్రేరేపించదు. సర్వ జనాభ్యుదయాన్ని కోరుతుంది. సర్వత్రా సమత్వ భావనను కలిగి ఉంటుంది. సంధి ప్రయత్నాలు చేసేవేళ, గర్వంలేనివాడు, సమర్థుడు, అన్నింటికీ మించి శాంతమూర్తిగా ఉండే వ్యక్తినే దూతగా నియమించాలని మహాభారతం చెబుతుంది.

ఏవైనా అప్రియాలు విన్నంతనే విచక్షణ కోల్పోయి ప్రతిస్పందించడం వివేకం కాదు. సహనాన్ని, ధర్మాన్ని పాటిస్తుంది శాంతగుణం. అయితే శాంత గుణానికీ హద్దు ఉంటుంది. శిశుపాలుడు తనను నిందిస్తున్నా, కృష్ణుడు నూరు తప్పులను కాచాడు. సహించాడు. ఆపై ధర్మాగ్రహం జ్వలించింది. దుష్టత్వాన్ని సంహరించింది.

శాంత గుణం మనసును, శరీరాన్ని పవిత్రంగా, నిశ్చలగుణ తత్వంతో ఉండేలా చేస్తుంది. చుట్టూ ఉన్న పరిసరాలను ప్రశాంత తపోవాటికల్లా మారుస్తుంది!

✍️✍️

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర.. *శ్రీ స్వామివారి సమాధి..ఒక పుణ్యక్షేత్రం..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..

*శ్రీ స్వామివారి సమాధి..ఒక పుణ్యక్షేత్రం..*

*(అరవై ఐదవ రోజు)*

శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందిన పిదప..శ్రీ స్వామివారి పార్థివదేహాన్ని ఆశ్రమం లోని ప్రధాన గది లో ఉన్న నేలమాళిగ లోనే సమాధి చేయడం జరిగిపోయింది..శాస్త్రోక్తంగా క్రతువు నిర్వహించారు..

1976 మే 7వతేదీ మధ్యాహ్నం నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు..విజయవాడ నుంచి శ్రీ చెక్కా కేశవులు గారు, వారి తోడల్లుడు మెంటా మస్తాన్ రావు గారు కూడా ఆరోజు మొగలిచెర్ల చేరుకున్నారు.. మీరాశెట్టి గారు అక్కడే వున్నారు..అందరూ కలిసి..శ్రీ స్వామివారి ఆశ్రమమును నిర్వహించే బాధ్యత శ్రీధరరావు గారికి అప్పజెప్పారు..వారూ సరే నన్నారు..ప్రస్తుతానికి యెవరినైనా ఒక మనిషిని కాపలాగా ఉంచుదాము అని ఆలోచన చేశారు..కానీ వారికి ఆ నిమిషంలో తెలీదు..ఇంకో రెండు మూడు రోజుల కల్లా భక్తులు వెల్లువలా వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకుంటారని..

"సంతానం కావాలంటే..మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద మ్రొక్కుకోండి..సంతానం కలుగుతుంది.."!

"గ్రహ బాధలున్నాయా?..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద వర పడండి.. తీరి పోతాయి!.."

"దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తున్నారా..ఆ స్వామి వద్ద నిద్ర చేయండి..క్షణంలో బాగు పడతారు!.." 

ఇలా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడసాగింది..అందుకు తగ్గట్టే దృష్టాంతరాలు కనబడ సాగాయి..

మే 9వ తేదీ ఆదివారం నాటి నుంచి శ్రీ స్వామివారి సమాధి దర్శించడానికి భక్తులు రావడం మొదలుపెట్టారు..వెంటనే శ్రీధరరావు గారు ముందుగా అక్కడొక పూజారిని ఏర్పాటు చేశారు.. శాస్త్రోక్తంగా పూజా విధానాలు ఏర్పడ్డాయి..క్రమంగా భక్తుల రాక పెరగసాగింది..అనతి కాలంలోనే..శ్రీ స్వామివారి ఆశ్రమం కాస్తా.."శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం"  గా రూపాంతరం చెందింది..మట్టి రోడ్డు వేసారు..బస్సులు నేరుగా మందిరం వద్దకే రాసాగాయి..విద్యుత్ సౌకర్యం వచ్చింది..ఒకటి రెండు దుకాణాలు వెలిశాయి..కొంతమందికి ప్రత్యక్ష..మరికొంతమందికి పరోక్ష ఉపాధి కల్పన జరిగింది..మెల్ల మెల్లగా మొగలిచెర్ల గ్రామం పేరు.. శ్రీ స్వామివారి మందిరం వలన అందరికీ తెలియసాగింది..

"ఇది దత్తుడి భూమి!..పుణ్యక్షేత్రంగా మారుతుంది!.." అని శ్రీ స్వామివారు పదే పదే చెప్పిన మాట శ్రీధరరావు ప్రభావతి గార్ల మనసులో వినబడుతూ ఉండేది..అందుకు తగ్గట్టు గానే..మొగలిచెర్ల గ్రామ శివార్ల లో ఉన్న తమ భూమి..అదికూడా ఒకప్పుడు  ఫకీరు మాన్యం గా పిలవబడ్డ బీడు భూమి..నేడు తమ కళ్ల ముందే..వేలాది మందికి స్వాంతన చేకూర్చే పుణ్య ప్రదేశంగా మారిపోయింది..ప్రస్తుతం అన్నదానమూ జరుగుతున్నది..ఎంతో మంది భక్తులు తమ తమ బాధలు తీరిపోయాయని చెప్పుకుంటూ వుంటారు..కొంతమంది భక్తుల అనుభవాలను ముందు ముందు రోజుల్లో తెలుసుకుందాము..

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరియు శ్రీ స్వామివారు సిద్ధిపొందిన వైశాఖ శుద్ధ సప్తమి తిథి నాడు శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవం ఘనంగా జరుగుతాయి..(ఈ సంవత్సరం ఏప్రిల్ 22 వ తేదీ నాడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన..)

ప్రతి చరిత్రకూ ముగింపు తప్పనిసరి..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర నేటితో సమాప్తి చేస్తున్నాను ..ఈ చరిత్ర చదివి ఎంతో మంది నన్ను ప్రోత్సహించారు...వారందరికీ పేరు పేరునా నా ధన్యవాదములు..

అందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే..

ఇది ఒక సాధకుని తపోభూమి..

ఇది ఒక అవధూత ఆశ్రమం..

అదే..మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..

శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్న భక్తుల అనుభవాలు..శ్రీ స్వామివారి లీలలు..రేపటి నుండి ధారావాహికంగా చదువుకుందాము..

*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*

https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx

సర్వం
శ్రీ దత్తకృప!

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

ద్వైధీ భావన* (2023 జాగృతి-వాకాటి పాండురంగారావు స్మారక దీపావళి కథల పోటీలో *ప్రధమ బహుమతి* పొందిన కథ రచయిత శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారు

 *ద్వైధీ భావన*
(2023  జాగృతి-వాకాటి పాండురంగారావు స్మారక 
 దీపావళి కథల పోటీలో *ప్రధమ బహుమతి* పొందిన కథ 
రచయిత 
శ్రీ మోచర్ల అనంత పద్మనాభరావు గారు 

9848607127
*****
*ద్వైధీభావన* -కథ 

‘అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్...’ అన్న సుమతీ శతకకారుడు పద్య చందాన ఉంటుందా ఊరు, గోదావరీ తీరాన.
ఆ ఊళ్లో ధర్మాసుపత్రనే పేరుతొ వైద్యశాల నడుపుతున్నాడు డాక్టర్ సచ్చిదానందమూర్తి. అక్కడ పేదలకు వైద్యం ఉచితం. డాక్టర్ మూర్తి ఒక వ్యసనాల పుట్ట. పేదలకు ఉచిత వైద్యం అతని మొదటి వ్యసనమైతే, పుస్తకపఠనం మరో వ్యసనం. స్నేహితుడు సుబ్బారావుతో ప్రతీ ఆదివారం సాయంత్రం తను చదివింది అవలోకనం చేయడం అతని ఇంకో వ్యసనం. ఆపద వేళల్లో మనిషి మరో మనిషికి సాయపడాలన్నది అతని తత్వమైతే, అలా ఆదుకునే మనస్తత్వం అతని మరో వ్యసనం. ఇలా చెప్పుకుంటూ పొతే అతని వ్యసనాలన్ని సమాజ శ్రేయస్సుకు సహాయ పడేవే.

ఇక సుబ్బారావు సంగతికొస్తే, వైద్యోనారాయణో హరి అంటూనే సచ్చిదానందమూర్తిని కూడా స్మరిస్తాడు. అతను చెప్పింది కాదనకుండా వింటాడు. అతనడిగింది అవుననేలా చెబుతాడు. దైవభక్తుడు, పరోపకారి. మంచి, చెడులను విశ్లేషించే కాలజ్ఞాని.

ఆరోజు ఆదివారం. స్నేహితుడు సుబ్బారావు రానే వచ్చాడు.
"సుబ్బారావ్! నేనసలే కొన్ని సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూంటే మరీ ఇంతాలస్యంగా వస్తే ఎలాగోయ్? అయ్యిందా నీ పంపిణీ కార్యక్రమం.” సుబ్బారావు ఆదివారం ఆసుపత్రి రోగులకు పళ్ళు, ఫలహారాలు, పంచిపెడ్తుంటాడు. అంతేకాదు కొంత సహాయం వస్త్ర రూపేణా, ధన రూపేణా కూడా తన పరిధిలో చేస్తుంటాడు.

“ఆలస్యమా! అబ్బే ఆలస్యానికి నాకూ పడదని నీకు తెల్సు. అయినా ఆషాడ పెళ్ళికొడుకులా ఆ తొందరేంటి చరకులవారు. ఇప్పుడు సమయం నాలుగేగా అయ్యింది.” మేలమాడాడు సుబ్బారావు.
“చరకుడు...! అబ్బో నీ చమత్కారాలకేం గాని, నా సందేహాల గురించి చర్చించేదేమైన ఉందా...లేదా?”
“అసలు నేనోచ్చేది నువ్వు చెప్పింది వినడానికే కదా?”
“అయితే విను.” డాక్టర్ మూర్తి మొదలెట్టాడు, “ఒక్కొక్కసారి కొన్ని పరస్పర విరుద్ధ సామ్యాలు నన్ను గందరగోళంలో పడేస్తాయి. అవి ఏమిటంటే  ‘వీడు చాలా సహజంగా మాట్లాడుతాడోయ్, వీడి మాటల్లో ఏదో తర్కముందోయ్, అసలు వీడి మాటలు మరీ వితర్కంగా ఉంటాయోయ్’, అని చాలామంది చాలా సందర్భాల్లో అంటూండడం మనం వింటుంటాం. అలాంటి ఈ తర్క, వితర్కల గురించి నువ్వేమైనా చెప్పగలవా?" అడిగాడు మూర్తి.
“తర్కమంటే ఊహ, వాదన, కారణం ఇలా ఎన్నో అర్ధాలున్నాయి. ఇంగ్లీషులో లాజిక్ అంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తర్కమంటే ది సైన్స్ ఆఫ్ రీజనింగ్. బాగా చెప్పాను కదూ.” మేధావిలా అన్నాడు సుబ్బారావు.
“నువ్వు మేధావివే. కర్ర విరగలేదు. సర్లే వదిలేయ్. సోది కోసం వెళ్తే అనే సామెతుంది చూశావూ...అలా మనం ఎదో కావాలని వెదుకుతుంటే, ఇంకోకటేదో దొరికి మనకి ఆసక్తిని కలిగిస్తుంది. అలా ఆసక్తిని కలిగించే కణాదుడనే ఓ మహానుభావుడి గురించి నాకివాళ తెల్సింది."అన్నాడు.
“కణాదుడా...! ఆయనెవరు?" ఆశ్చర్యంగా అన్నాడు సుబ్బారావు.
“నాకూ ఆయన గురించి మొదటిసారిగా తెల్సింది.  ముందు ఆయనో ఋషనుకున్నాను. కాని, ఆయన కీ.పూ.600 శతాబ్దం చెందిన ఒక శాస్త్రవేత్తట. ఆధునిక అణుశాస్త్ర విజ్ఞానానికి మూలపురుషుడుట. ఈ సకల చరాచర సృష్టి అణు నిర్మితమని ఆయనో సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడుట. ఆయన సిద్ధాంత ప్రకారం ఈ జగత్తులోని పదార్ధాలన్ని అణువులతోను, ఆ అణువులు విడగొట్టాడానికి వీలులేని సూక్ష్మాతి సూక్ష్మ అణువులతోను ఏర్పడతాయని చెప్పాడు. విభిన్న పరమాణువుల విలక్షణ కలయికవల్ల పంచభూతాలు ఏర్పడ్డాయని కూడా అభిప్రాయపడ్డాడు. దాన్ని వైశేషిక దర్శనమన్నాడు. ఆ దర్శనంలో ధర్మం గురించి కూడా ప్రస్తావనుంది. మనుషులకు ఇహ, పరలోక సుఖములు దేనివలన కల్గుతాయో దాన్నే ధర్మం అంటారని దానికి వేద ప్రమాణము కూడా ఉందని చెప్పాడు. ధర్మమార్గాన నిజాయితీతో పయనించే ప్రతి ఒక్కరు ఆ దేవుడి దూతలేనని, దేవానం మనుష్య రూపేణా అన్నాడు. ఏ జ్ఞానమైనా, ఏ విజ్ఞానమైనా సమాజశ్రేయస్సు కుపయోగాపడాలని, ఆపదలలో మానవులు ఒకరినొకరు ఆదుకోవాలన్నది కణాదుడు తీవ్రంగా కాంక్షించాడు. అణు సిద్ధాంతాన్ని ఎంతగా విశ్వసించాడంటే తన అంతిమ ఘడియల్లో ఆయన మిత్రులు కొంతమంది ఆయనను మోక్షప్రాప్తికై నారాయణ స్మరణ చేయమని కోరినా, తను నమ్మిన సిద్ధాంతమే తనకు మోక్షమని తలచి అంత్యదశలో కూడా అణువు, అణువు అని స్మరిస్తూనే మరణించాడట. అటువంటి మహావ్యక్తికి మన హిందూ ధర్మ పరంపరలో గౌరవనీయమైన ఋషిస్థానాన్ని కలిగించి ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని అంగీకరించడం గమనార్హం. మన ఉపనిషత్తులు, పురాణాలు ఈ ప్రపంచమంతా నారాయణమయమని చాటి చెప్పాయి. కానీ, కణాదుడు దానికి విరుద్ధంగా ప్రపంచమంతా అణుమయమని ప్రకటించాడు. ఇదీ సంగ్రహంగా కణాదుడు గురించి నేను తెల్సుకున్నది. అయినా ఇదంతా నీకెందుకు చెబ్తున్నాననే ధర్మసందేహం నీకు రావచ్చని నాకు తోస్తోంది. అవునా?" సుబ్బారావుని ఆసక్తిగా పరికిస్తూ అన్నాడు మూర్తి. 
 
“అవును. సందేహం వచ్చిన మాట నిజం. అది ధర్మమో, అధర్మమో తెలియదు. ఎందుకంటే ప్రస్తుతంలో నున్న నేను ఇహంలోను, పరంలోను సుఖాలను వెదుక్కోవటం లేదు కనుక."ధీటుగానే సమాధానమిచ్చాడు సుబ్బారావు.
“ఓహో! కణాదుడుని అప్పుడే బానే వంటబట్టించు కున్నావు. తెలివైనవాడివి. నీ పరిశీలనా శక్తికి ఓ చిన్న పరీక్ష. పైన నే చెప్పిన కణాదుడు విషయంలో రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలున్నాయి. ఇప్పుడు నీకొక కథ చెప్తాను. ఆ విరుద్ధ ప్రకటనలు ఆ కథలో ఎలా ఇమిడి ఉన్నాయో చెప్పాలి. లేకపోతే నీకు తెల్సు కదా ఏమౌతుందో......?"
డాక్టర్ మూర్తి సుబ్బారావుల పరిచయం విచిత్రంగా జరిగింది. ఆ పరిచయం పెరిగి పెద్దదై ఒకరికొకరు ఆప్తమిత్రులయ్యారు. డాక్టర్ మూర్తి కథను చెప్పాడానికుపక్రమించాడు

###

సమయం ఉదయం అయిదున్నర గంటలు. సూర్యభగవానుడు తూర్పున ఉదయిస్తూ సమస్త ప్రకృతిని పులకరింప చేస్తున్నాడు. గోదావరిలో మూడు మునకలేసిన సోమయాజులు, రెండు చేతుల్లోకి నీరు తీసుకుని ఓం సూర్యాయనమః అని జపిస్తూ సూర్యునికి అర్ఘ్యం అర్పించి తడి పంచెతో గట్టుమీదున్న శివలింగంపై పంచపాత్రతో తెచ్చుకున్న నీళ్ళను పోసి నమస్కరించాడు. 'ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ, గురు శుక్రు శనేభ్యశ్చ రాహువే కేతువే నమః!' అంటూ నవగ్రహ ప్రదక్షిణ పూర్తిచేసి ఇంటికి బయల్దేరాడు. ఇంట్లో యధాప్రకారం నిత్యపూజ కావించి ముందు గదిలోకొచ్చి అతని కోసం ఎదురుచూస్తున్న వారికి నమస్కరించి తన స్థానంలో కూర్చున్నాడు.
సోమయాజులంటే దేవీపట్నం చుట్టుపక్కల ప్రజలకు భక్తి, గౌరవము. భూత, భవిష్యత్ వర్తమాన కాలాలు, నవగ్రహాల కదలికలు ఆయన చెప్పుచేతల్లో ఉంటాయని వాళ్ళ నమ్మకం. ఆ నమ్మకంతోనే వారి జాతక సమస్యల పరిష్కారం కోసం సోమయాజులింటికి పొద్దున్నే చేరిపోతారు. జ్యోతిష్యం సోమయాజులు ప్రవృత్తి. వృత్తి రీత్యా అతనొక ప్రైవేట్ కంపెనీ లో గుమస్తా. ఏడుగంటల నుండి తొమ్మిది వరకు వచ్చిన వాళ్ళ సమస్యలను ఓపిగ్గా విని, వాటికి పరిష్కారాలు వివరించిన తర్వాతే ఉద్యోగానికి తయారవుతాడు. ఇది నిత్యం జరిగే తంతు. అందుకే ఆ రెండు గంటలు సోమయాజులు తీరికలేకుండా ఉంటాడు.
“మీ జాతకంలో దోషమంటూ ఏమీలేదు. కాకపోతే సూర్యానుగ్రహం కావాలి. గ్రహ శాంతి కోసం కొన్ని జపాలు, దానాలు చేయాలి. 'ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్.....' రోజు శుచిగా ఆదిత్యహృదయాన్ని పఠించండి. ఆపై భానుడి  
 లేలేత కిరణాలు మీ శరీరాన్ని సోకేలా సూర్యామస్కారాలు చేయండి." అంటూ ఒక కాగితం తీసుకుని ఒక శ్లోకం వ్రాసి చదివాడు.
“ఈ శ్లోకాన్ని రోజూ నిష్టగా చదవండి. ఏదో నేను చెప్పానని ఇదొక్కటి చేస్తే సరిపోదు. యధావిధిగా మందులు కూడా వాడాలి. ఎట్టి పరిస్థిల్లోనూ వైద్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఇది చాలా ముఖ్యం. 'వైద్యో నారాయణో హరి....... వైద్యుడు దేవుడుతో సమానం. అన్నీ దేవుడే చేయలేడు కనుక, మన ఆరోగ్యాలను సంరక్షించడానికి వైద్యులనిచ్చాడు. అందుకే వారిపై నమ్మకముంచండి. మీ ఆరోగ్యం తొందరలోనే కుదుటపడుతుంది. మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోండి, అప్పుడు మీ ఆరోగ్యం మీ చెప్పు చేతల్లో ఉంటుంది. శుభం." అని కాగితాన్ని అందించాడు.
అతను భక్తితో నమస్కరించి కొన్ని పండ్లతో బాటుగా కొంత సొమ్మును సోమయాజుల కివ్వబోయాడు.
"నేను సొమ్ము కాశపడి ఈ ప్రవృత్తిని చేపట్ట లేదు. మీరంతా నాకేదో తెల్సునని నమ్మి నా దగ్గరకు వస్తున్నారు. నేను అల్పుణ్ణి. నిజంగా నాకేం తెలుసో, ఏం తెలియదో ఆ నారాయణుడికే తెలుసు. డబ్బు తీసుకుని మీ నమ్మకాన్ని వమ్ము చేయలేను.” అంటూ కేవలం పళ్ళని తీసుకుని డబ్బుని సున్నితంగా తిరస్కరించాడు సోమయాజులు. వివిధ సమస్యలతో వచ్చినవారికి సందేహ నివృత్తిని, నివారణ చర్యలను చెప్పి ఉద్యోగ వేళయ్యిందని లేవబోతుంటే,
"నమస్కారమండీ...."మూడేళ్ళ కుర్రవాణ్ణి తీసుకుని ఓ వ్యక్తి వచ్చాడు. “పెళ్ళైన పదేళ్ళకు పుట్టాడండి మా బాబు. చురుకుతనం లేదు, పిలిస్తే పలకడు. మాట్లాడడు. ఆడుకోడు. చూపు సరిగ్గా నిలబడక, మెడను పక్కకి వాల్చి ఉంటాడు. మా పల్లెలో ఆచారిగారికి చూపించాం. ఆయన ఏవో కొన్ని పసరు మందులిచ్చి ఆలస్యంగా పుట్టిన కొంతమందిలో ఇలాంటి లక్షణాలు సాధారణమేనని, మరి కొన్నాళ్ళలలో మామూలు స్థితికి వస్తాడని చెప్పారు. రోజులు గడుస్తున్నాయి కానీ వాడిలో ఏ మార్పు రావడం లేదు. మాకు చాలా ఆందోళనగా ఉంది. మా బాబు జాతకంలో దోషం ఏమైనా ఉందానని మీరు పరిశీలించి చెబుతారేమోనని ఆశతో వచ్చానండి." దైన్యంగా పరిస్థితిని వివరించాడు.
ఆతను చెప్పింది విని, "మీ సమస్యను పరిష్కరించే సామర్ధ్యం నాకు లేదు. బాబుని మంచి మానసిక వైద్యునికి చూపించండి. తర్వాత ఆ నారాయణుడే చూసుకుంటాడు.” అనునయంగా మాట్లాడి అతను వెళ్ళిన తర్వాత ఆఫీసు కెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు.

###

 రాత్రి ఎనిమిదయ్యింది. బాగా వాన పడుతోంది. వెంకటానికి ఏక్సిడెంటయ్యిందని వసుమతి ఫోనుచేయడంతో కంగారుగా ఆఫీసునుండి హాస్పిటల్ కి పరిగెత్తాడు సోమయాజులు. ఎమర్జెన్సీ వార్డు దగ్గర వెక్కివెక్కి ఏడుస్తున్న వసుమతి దగ్గరకెళ్ళి ఆమెను ఓదారుస్తూ, “ఏం జరిగింది. వాడెలా ఉన్నాడు ?" ఆత్రంగా అడిగాడు.
భర్తను చూసి గొల్లుమంది వసుమతి. "కాలేజీ నుండి వస్తూంటే వర్షంవల్ల బైకు స్కిడ్డయ్యి వేగంగా రోడ్ డివైడర్ని గుద్దేసరికి తలకు గట్టి దెబ్బ తగిలిందిట. ఎడంచెయ్యి, కొన్ని పక్కటెముకలు కూడా విరిగాయిట. ఇంకా ఎక్కడెక్కడో దెబ్బలు తగిలాయో ఎక్సరేలు, స్కాన్లు తీస్తేగాని తెలియదట." ఏడుస్తున్న వసుమతి నొదలి వార్డులో కెళ్ళాడు.
“డాక్టర్ నా కొడుక్కి ఎలావుంది చెప్పండి డాక్టర్ ?" అక్కడున్న డాక్టర్ని అడిగాడు.
“వెరీ బ్యాడ్... మల్టిపుల్ ఫ్రాక్చర్స్. హెడ్ ఇంజురీ. అర్జంటుగా ఆపరేషన్ చెయ్యాలి. బ్లడ్ కావాలి. మీరు రెడీ అంటే మేం ఆపరేషన్ చేస్తాం. ఆపరేషన్ చేసినా నలభై ఎనిమిది గంటల వరకు ఏం చెప్పలేం. పేషంట్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. మీరే మాత్రం ఆలస్యం చేసినా ప్రమాదమే.....” ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్లు చూసి కొన్ని కాగితాలు చేతిలో పెట్టి రిసెప్షన్లో కనుక్కోమన్నాడు.
వసుమతి మళ్ళీ భోరుమంది. రిసెప్షన్లో ఆ కాగితాలు చూపిస్తే అడ్వాన్సుగా లక్ష రూపాయిలు కట్టండి. ఆ తరవాత ఆపరేషన్ కి ఏర్పాట్లు చేస్తామనేసరికి, ఏం చెయ్యాలో పాలుపోలేదు సోమయాజులకు. “ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలంటే మాటలా? ఇప్పుడేం చెయ్యాలి? ఇంత రాత్రి అంత డబ్బు ఎక్కడ్నించి తేవాలి?" మధనపడూతూ అక్కడున్న బెంచిపై కూలబడి కళ్ళు మూసుకున్నాడు. కొడుకు వెంకటావధాని జాతకం కళ్ళముందు కనబడింది. దాని ప్రకారం వాడు పూర్ణాయుష్కుడు. మరెందుకిలా జరుగుతోంది? గ్రహాలు, జాతకాలంటూ తను కాలహరణం చేస్తున్నాడు. తన కొడుకు చనిపోవల్సేందేనా? తను నమ్ముకున్న దైవం నారాయణుడే తన్నీ ఆపదనుంచి కాపడగలడు." చేతనా, అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతున్నాడు.
“సోమయాజులుగారు.....సోమయాజులుగారు" అన్న పిలుపుతో కళ్ళు విప్పి చూసాడు. తెల్లని కోటు, మెళ్ళో స్టెతస్కోప్ తో ఎదురుగా ఒక డాక్టర్.  
“మీరు దేవీపట్నం సోమయాజులుగారు కదూ? నన్ను గుర్తు పట్టారా? నేనండీ...డాక్టర్ మూర్తిని. మీకు గుర్తుందోలేదో చాలా కాలం క్రితం ఓ విపత్కర పరిస్థితిలో మిమ్మల్ని కలిసాను. ఈ హాస్పిటల్ మాదే. ఇది కట్టిన తర్వాత నా జీవితంలోనూ, కాపురంలోనూ ఊహించని పరిణామాలు సంభవించి నన్ను వత్తిడికి గురిచేశాయి. ఆ వత్తిడి తట్టుకోలేక మానసికంగా కృంగిపోయాను. ఆ దశలో నేను పిచ్చివాడినై పోతానేమో నా భార్య
 భయపడిపోయింది. అప్పడే మిమ్మల్ని కలవమని ఎవరో నా భార్యకు సలహా ఇచ్చారు. అణునిర్మాణం మానవ కణనిర్మాణం చదివిన నాకు జాతకాలు, గ్రహాలపై నమ్మకం లేదు. కానీ, నన్ను నమ్మిన వారి కోసం నా నమ్మకాలను పక్కన పెట్టి మీ దగ్గర కొచ్చాను. తర్క వితర్కాలకది సమయం కాదు. వాటి కతీతమైనది నా రుగ్మత, నా భార్య నమ్మకమూ. నా గ్రహాల కదలికలను పరిశీలించి కొన్ని సలహాలిచ్చారు. మీ సలహాలను కూడా ఆచరిస్తే పోయేదేమీ లేదని విశ్వసించి పాటించాను. ఏదేమైతేనేం ఇదిగో ఇలా ప్రశాంతంగా జీవిస్తున్నాను. ఇప్పటికైనా నన్ను గుర్తుపట్టేరా? అదిసరే మీరేమిటీ ఈ టైంలో ఇక్కడ? ఎవరికైనా...?" అంత పెద్ద డాక్టరు వినమ్రంగా అడిగేసరికి భోరుమంటూ సోమయాజులు జరిగింది చెప్పాడు.
“మీరేం బాధ పడకండి. మీలా గ్రహాల స్థితిగతుల్ని మార్చలేనేమో కాని, మీ అబ్బాయి ఆరోగ్యాన్ని మాత్రం బాగు చేయగలనని భరోసా ఇస్తున్నాను.” నమస్కరించి వెంకటావధానిని చూడడానికి వెళ్ళారా డాక్టర్.
డాక్టరుగారు ఎంత అభయమిచ్చినా రాత్రంతా హాస్పిటల్లో ఆందోళనతోనే గడిపారు వసుమతి, సోమయాజులు. తెలతెలవారుతుండగా కొడుకు త్వరలోనే కోలుకుంటాడని వార్త తెలిసి,
“జాతకాలు, గ్రహాలూ నమ్మని డాక్టర్ తన సలహాలని పాటించి ప్రతికూలతల నుంచి బయటపడడమేమిటి? గ్రహాల స్థితిగతులను బట్టి రుగ్మతలుంటాయని నమ్మిన తనను ఆ డాక్టరే దేవుడిలా వచ్చి ఆదుకోవడమేమిటి? ఆ నారాయణుడి లీల కాకపొతే.” అనుకున్నాడు సోమయాజులు.

###

“మరి కథ విన్నావుగా. కణాదుడు సర్వం అణుమయమన్నాడు. సోమయాజులు  సర్వం నారాయణమయమని నమ్మాడు. ఈ ద్వైధీభావనే నన్ను అయోమయానికి గురిచేస్తోంది. ఇక నీ పరిశీలన, విశ్లేషణ వింటే ఏమౌతానో?" కవ్వింతగా అన్నాడు మూర్తి.
“గ్రహాల స్థితిగతుల ననుసరించి మానవ రుగ్మతలుంటాయని విశ్వసించే సోమయాజులు, అదంతా మూఢ నమ్మకమని భావించిన డాక్టరు నీ కథలో రెండు విభిన్న ప్రవృతులు కల్గిన వ్యక్తులు.  ‘నేను అల్పుణ్ణి. నిజంగా నాకేం తెలుసో, ఏం తెలియదో ఆ దేవుడికి మాత్రమే తెలుసుననుకునే’ సోమయాజులకు కణాదుడు ప్రతిపాదించిన అణుసిద్ధాంతం బహుశా తెలియకపోవచ్చు. కాని ఆధునిక వైజ్ఞానికశాస్త్రానికి ప్రతినిధిగా, మానవ శరీరరుగ్మతలను పోగొట్టే డాక్టరుకు అణుసిద్ధాంతం, మానవశరీర కణనిర్మాణము తెలిసినా కూడా భార్య బలవంతంమీద సోమయాజులను ఆశ్రయించి స్వస్థత పొందాడు. మరి కణాదుడు ఏం చెప్పాడు? ఏ జ్ఞానమైనా, ఏ విజ్ఞానమైనా సమాజశ్రేయాస్సు కుపయోగాపడాలని, నిజాయితీగా ధర్మమార్గాన పయనించే ప్రతి ఒక్కరు ఆ దేవుడి దూతలేనని. అవునా? మీ కథలో సోమయాజులు, డాక్టరు ఇద్దరు నిస్వార్ధంతో, పరోపకార ధర్మంతో ప్రవర్తించారు, నియమబద్ధమైన తర్కాన్ని ప్రదర్శించారు. ప్రపంచం అణుమయమైనపుడు, సర్వవ్యాపక నారాయణతత్త్వం దానిని కూడా ప్రభావితం చేస్తుందన్నది అక్షరసత్యం. నారాయణవాదం లేని అణువాదం అర్థరహితమేమో అని నాకనిపిస్తుంది. ఈ ద్వైధీభావనను విస్మరించకుండా, సమాజశ్రేయస్సుకు పాటుపడే ప్రతిమనిషిలోని అణువణువు నారాయణమయమే అనుకుంటే సరిపోతుంది.” సుబ్బారావు నవ్వుతూ తన విశ్లేషణను ముగించాడు.
(అయిపోయింది)
#####

విద్యుత్ కథ* *లేక* *ఆవుకథ* . (కథ) రచన:

 .             *విద్యుత్ కథ*
                      *లేక* 
                 *ఆవుకథ* 
.              (కథ) 
రచన: 
 *నీలం సత్యనారాయణ* 

🌸💐☘️🌸💐☘️🌸💐☘️
" *అయ్యో* ! డామిట్ ! పాడు కరెంటు ఇప్పుడే పోవాలా?
ఆవు కథ పూర్తిగా చూడకుండానే కరెంటు పోయిందిగా" విసుగ్గా అన్నాడు టి.వి. నుండి తల తిప్పుతూ చంటి. 

"అలా కరెంటును *పాడు*  అనకూడదు రా అబ్బాయీ 
విద్యుత్తు ఆ పరమాత్మ ప్రసాదించిన ఒక వరం.. " బామ్మ మందలింపుగా అన్నది.

"మరి కరెంటు పోతే ఆవు కథను ఎలా చూడాలి?" అన్నది చిన్ని.
"ఆ ఆవు కథ పాతదే కదా ...  ఐనా మనం ఆ కథను దాదాపూ చూశాం కదా .. " అన్నది బామ్మ. 
"ఔననుకో..." అని ఏదో చెప్పబోయాడు చంటి. 
"మరి ఆ కథ వలన 
ఏమర్థమయింది మీకు" అడిగింది బామ్మ ..

"మనం ఏది చెప్ప వలసి వచ్చినా, దానిని ముందు మెన్షన్ చేసి, సంబంధం లేని విషయాన్ని దానికి అంటగడితే దానిని ఆవుకథ అంటాం. " అన్నది చిట్టి.

"యు ఆర్ కరెక్ట్... మాటలకే కాదు .. పనులకైనా ఆ  కథానీతి వర్తిస్తుంది... 
లేని సంబంధాన్ని సృష్టించు కొని మరీ కొన్ని పనులు చేయరాదు. 
అలా చేసి ఏ రూపంలోనూ *నియమాలను* *అతిక్రమించకూడదన్నమాట*  .."

"నువ్వుచెప్పేది అర్థంకావటం లేదు గానీ బామ్మా ...  విద్యుత్తు  ఆ దేవుడిచ్చిన దేమిటో అన్నావుగా...  అదేమిటో చెప్పు ." అన్నాడు చంటి.
 
" ఔను  కరెంటు అంటే విద్యుత్తు ఆ పరబ్రహ్మ ప్రసాదించిన ఒక వరము .... కొందరు ఆ పరబ్రహ్మే ఇందులో దాగి ఉన్నాడనీ భావిస్తారు. అంటే అది ఆ దేవుడి రూపం.  అది లేనిదే మనం చాలా పనులు చేయలేము. వెనుకటి రోజుల్లో సులభంగా చేయలేని పనులనెన్నింటినో  మనం ఈనాడు సులభంగా చేయగలుగుతున్నాం...   అందుకే విద్యుత్తు ఉన్న కాలం లో పుట్టిన వారు అదృష్టవంతులు అనిపిస్తుంది." అన్నది బామ్మ. 

ఐతే ఆ విద్యుత్ కథేమిటో  చెప్పు బామ్మా " అని అడిగాడు మరోసారి  చంటి ...
"ఔను .. కరెంటు వచ్చేవరకు ఆ కరెంటు కథను చెప్పు బామ్మా " అంటూ చిన్ని కూడా అడిగింది. 

 *బామ్మ ఇలా చెప్పటం ప్రారంభించింది:* 
"విద్యుత్ ఓ గొప్ప ఆవిష్కరణ. విద్యుత్ అనేది మనం ఈనాడు వాడుతున్న రూపములో కనిపించదు. అలాగే మనం  ఈ నాడు   వాడే విద్యుత్ ఉపకరణాలైన లైట్లూ ఫ్యానులూ కూడా, గీజర్లూ, వాషింగ్ మెషీన్లూ, ఒవెన్లూ, టి.వి, కంప్యూటర్, చిన్న పెద్ద ఫ్యాక్టరీలూ,  నీళ్ళు తోడే విద్యుత్ మోటార్లు, విద్యుత్ కార్లూ  మున్నగునవి  పురాణాలలోనూ
కావ్యాలలోనూ  కనీసం జానపద సినిమాలలోనూ కనపడవు..... అంటే  ఈ రూపంలో కనపడవు. 
ఆ రోజుల్లో 
ఆ యుగాల్లో కూడా కరెంటు ఉన్నదో లేదో, 
ఉన్నా విద్యుత్ పరికరాలున్నాయలేవో, 
ఉన్నా వాటిని వాడకుండా, మనుషులనూ పశు పక్ష్యాదులనే ఎందుకు  వాడుకున్నారో తరువాత మీ తాతయ్యనడగండేం... 
కానీ, 
నాకు తెలిసినంత వరకూ, 
విద్యుత్ అన్న పదం ఎప్పటి నుండో ఉన్నది.
అమరకోశం మొదటి కాండలోనే  దిగ్వర్గం లో ఇలా ఓ శ్లోకం ఉంటుంది:

 *శ్లో॥* *శప్పాశత హ్రదాహ్రాదిన్యైరావత్యః క్షణప్రభా౹* 
 *తటిత్సౌదామినీ విద్యుచ్చఞ్చలా చపలాపిచ॥* 

ఈ శ్లోకములో  శంప, శతహ్రదం, క్షణప్రభ, తటిత్తు, చపలా మున్నగు పదాలతో పాటూ సమానార్థకముగా *విద్యుత్తు* ను కూడా పేర్కొన్నారు
ఇందాక చెప్పుకున్నట్లు , 
పురాణ కాలంలోనూ, రాజుల కాలంలోనూ *మనం వాడే పద్ధతిలో*  విద్యుత్ లేకపోవటం వలన  
మనుషులే అధికముగా శ్రమపడేవారు.  జంతులులనూ, వర్కర్లనూ శ్రమపెట్టేవారు. 
ఇతర వస్తువులనూ  పదార్థాలను (అనగా నూనెదీపాలనూ, రత్నాలను కాంతికి వాడినట్లే ) ఇతర ప్రయోజనాలకు విద్యుత్ బదులు గా కొన్ని వస్తువులను వాడేవారు.  

ఈ నాటి దేవాలయాలలో సైతం ఆధునికముగా   వెలుతురుకై లైట్లకోసం ,  మాటలనూ  పాటలనూ సుదూరం వినిపించేందుకు మైకులకోసం వాడుతూంటే , కొన్ని గుళ్ళలో డ్రమ్స్, బెల్ ను కూడా మనుషులు కొట్టకుండా విద్యుత్ యంత్రాలే కొట్టే  ఆచారం నూ విద్యుత్ వినియోగం తో కొనసాగిస్తున్నారు...   అలాగే కొందరు దేవుళ్ళను అభిషేకించే సందర్భంలోనూ భక్తులు స్వయముగా తమ చేతులతో  నీళ్ళను, పాలనూ పోయకుండా విద్యుత్ యంత్రాలు పాలనూ నీళ్ళనూ పోసే  విధంగా  ఏర్పాటు చేసుకున్నారు.  వాటిని చక్కగా భక్తితో  వినియోగిస్తున్నారు.  అంటే సాంప్రదాయబద్ధమైన  పనులలోనూ, ఆధునికమైన పనులలోనూ విద్యుత్ ను వాడవచ్చు ... ఐతే  ప్రాచీన ఆచారార్థము వెలిగించు  దీపాలూ మున్నగునవి పరిమిత ప్రయోజనము  గలవి.    అందుకే  ఆ  నూనె దీపాలనూ, ఈ విద్యుద్దీపాలనూ కూడా వాడుతున్నారన్నమాట " 

"ఔను బామ్మా .. గుడిలో కరెంటు పోతే దాదాపూ చీకటిగానే ఉంటుంది. " అన్నది చిట్టి.

"అందుకే అక్కడ ఇన్వర్టర్స్ పెడతారు" అన్నాడు చంటి. 

"ఔను .. ఐతే అది చార్జి కావాలన్నా అంతకు ముందు విద్యుత్ ఉండాలి" అన్నది చిట్టి.

దానిని విన్న బామ్మ:
"అది సరే గానీ
మరి ఇండియాలో విద్యుత్ ఎప్పుడు వచ్చిందో తెలుసా?"
అని అడిగి, 
వాళ్ళ జవాబు కై ఎదురు చూడకుండా,
"ఇండియాలో విద్యుత్తు అప్పటి కలకత్తాలో 1879 లో   మొదటి సారి   P.W. Fleury & co వారు  వీథిలో సుమారు 36 ఎలక్ట్రిక్ బల్బులను ప్రదర్శించినప్పుడు వచ్చిందట... మరే ప్రాంతంలోనైనా ఆ సమయానికి వెనుకా ముందూ  వచ్చి ఉండనూ వచ్చు ... 

మొదటగా 1892 లో అనైకుంటా  ది ఇండియన్ ఎలక్ట్రిక్ కంపెనీ లిమిటెడ్ వారికి ముందుగా విద్యుత్తు తయారు చేసే అనుమతి లభించిందట.. ఆ సంస్థ పేరే తరువాత  
 ద కల్కటా ఎలక్ట్రిక్ సప్లై కార్పోరేషన్ లిమిటెడ్ గా మారిందట.  

ఆ నిర్వాహకులు విద్యుత్ ను అందరూ వాడుకో వచ్చని సూచించారట... 
ఐతే,
 అదో  పిశాచ రాక్షస మాయాజాలమనీ, 
 బ్రిటీషు ప్రభుత్వం కుట్ర అనీ భావించిన    *సాంప్రదాయవాదులూ* 
 *ధనవంతులైనవారూ* 
  నిరసించారట. ఉచితముగా విద్యుత్తునిచ్చినా వారు  తీసుకోలేదట  .....
కానీ  బీదవారూ, కూలీలు, హిందూ మతేతరులూ  మున్నగు వారు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారట ... 

1910లో ప్రైవేటు కంపెనీలు విద్యుత్ తయారు చేసుకోవటానికి ప్రభుత్వం అనుమతించింది. 
స్రాతంత్ర్యం వచ్చాక 1948 లో State Electricity Boards ఏర్పడ్డాయి. 
1976 లో మార్చిన విద్యుత్ చట్టాల వలన NHPC;  NTPC;  NPCL 
; NPCIL  లాంటి సంస్థలు వచ్చాయి.. 

ఆ విషయం అటుంచితే
రెండు వేల ఏళ్ళ క్రితమే భారత్ లో అగస్త్య్యుడు  విద్యుత్ ని గూర్చి చెప్పాడని కొందరంటే ... క్రీ.పూ.2750 లోనే ఈ జిప్ట్లో విద్యుత్ కు చెందిన ఆధారాలున్నాయని కొందరంటారు ...
ఐతే ఆనాటి పద్ధతులలో విద్యుత్ ఎలా చేయాలో తెలియక పోవటం వలన కాబోలు 
మైఖెల్ ఫారడే, బెంజమిన్ ఫ్రాంక్లిన్ మున్నగువారు 
ఎన్నో ప్రయత్నాలను చేయ వలసి వచ్చింది.  ఈ నాటి ఈ విద్యుత్ రూపం రావటానికి ఎన్నో ప్రయోగాలు చేశారు ... కెమికల్స్ తో  సెల్ లను  తయారు చేశారు ... ఆ తరువాత మాగ్నటిక్ ఫీల్డ్ను లో కాపర్ కాయిల్ ను రొటేట్ చేయటం ద్వారా విద్యుత్ ని తయారు చేశారు...   చేస్తున్నారు ... అలాగే ఫోటోవోల్టాయిక్ సెల్స్తోనూ ఆ తరువాతా తయారు చేస్తూన్నారు ... ఇంకా 
టర్బైన్లు, బాయిలర్లూ, గ్రిడ్లూ, స్టెప్ అప్ ,స్టెప్డౌన్ ట్రాన్స్ ఫార్మర్లు ... ఇలా ఎన్నో పరికరాలని, వ్యవస్థలని నిర్వహిస్తూ,  వివిధ రంగాలలో ఎంతో మంది నిరంతరం కృషి చేస్తే,  ఇప్పుడూ చేస్తూనే ఉంటే గానీ మనం ఇలా చక్కగా ఏ.సి గదుల్లో  టి వి  చూస్తున్నాం...
ఇంకా ఆధునికంగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి... ప్రయోగ శాలల్లో ముఖ్యంగా సూపర్ కండక్టివిటీ మీద బాగా ప్రయోగాలు చేస్తున్నారు.... "

"సూపర్ కండక్టివిటీ అంటే ఏమిటీ?" అడిగాడు చంటి.
"అంటే ఇప్పటి విద్యుత్ రవాణా లో అంటే ట్రాన్స్ పోర్ట్లో ఎంతో వృధా ఔతుందట... దానిని తగ్గించే  ప్రయోగాలన్నమాట " అన్నది బామ్మ. 

"కరెంటు పోతే సినిమాహాళ్ళలో జనరేటర్ లోంచి  కరెంటు ఎలా వస్తుంది బామ్మా" అడిగింది చిట్టి.
దానికి బామ్మ ఇలా చెప్పటం మొదలెట్టింది:
"కరెంటును పెట్రోలియం ప్రాడక్ట్స్ తోటీ తయారు చేయవచ్చు ... ఐతే ఖర్చెక్కువ ... ఖర్చు కొంత తక్కువైనా థర్మల్ విద్యుత్తును తయారు చేయాలంటే కూడా బొగ్గు మున్నగు వాటి వలన  ఖర్చు ఔతుంది . ...
నీళ్ళ ద్రారా హైడ్రో పవర్ తయారీకి టర్బైన్ల సమకూర్పు కోసం  ఖర్చు ఔతుంది... కొంచెం ఖర్చు తక్కువైనా నీళ్ళు అనసరం  .. అన్ని సమయాలలో నీరు సమృద్ధిగా ఉండక పోవచ్చు గదా ... అందుకే  సోలార్ విద్యుత్తైతే బాగుంటుంది ... 
ఐతే ఎండ ఉచితమేగానీ సోలార్ పానెల్స్ తయారీకి మాత్రం  కొంచెం ఖర్చు చేయవలసినదే.  
రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ద్వారా ఎటామిక్ ఎనర్జీని అదే  న్యూక్లియర్ ఎనర్జిని    కరెంటుగా తయారు చేయవచ్చు.. కానీ చాలాకాలం క్రిందట అప్పటి రష్యా లోని చెర్నో బెల్ లో పెద్ద ప్రమాదం జరిగి చాలామంది చనిపోయారు . పైగా ఖర్చెక్కువ"

అలా అంటూండగానే కరెంటు వచ్చింది. 
పిల్లలిద్దరూ అసంకల్పితముగా  తమ రెండు చేతులనూ పైకెత్తి నమస్కరించారు. 

లైట్లు వంక  ఎ.సి వంకా అపురూపంగా చూస్తున్నారు... 

అంతలో  కరెంటు రావటంతో  ఆన్ ఐన  టి.వి.లో 
ఓ ప్రవచన కారుడు ఇలా సెలవిస్తున్నాడు:
ఈ విశ్వం అంతా ఆ పరమాత్మ  సృష్టే. అన్ని జీవరాశులూ, అన్ని శక్తులూ అతనివే".
 కార్యక్రమం పూర్తయినట్లు మురళీ రవం రావటంతో 
టి. వి. ని చూసిన
లా అఫ్ కన్జర్వేషనాఫ్ ఎనర్జి అంటే ఏమిటో   తెలిసిన 
రిటైర్డు ఫిజిక్స్ లెక్చరర్ ఐన బామ్మకు  అందులో  గోమాత చెంతనే ఉన్న బాలకృష్ణుడి వర్ణచిత్రం కనిపించింది...  
🔵

( *తెలుగు కథల అభిమానులం* వాట్సపు సమూహార్థం 
19-12-2023 నాడు రాసిన ప్రత్యేక కథ సమాప్తం)

నేను పోతే.......?

 *నేను పోతే.......?*

'భోజ మహారాజు ఒకనాడు తన ఆస్థాన పండితులతో
"మోక్షానికి పోగలిగే వాడెవ్వడు?" అని ప్రశించాడట.

యజ్ఞయాగదులు చేస్తే మోక్షానికి పోవచ్చునని కొందరు,
' జ్ఞానం పొందితే పోవచ్చునని కొందరు,
భక్తితో పోవచ్చునని కొందరు, మంచివారితో స్నేహం చేస్తే పోవచ్చునని కొందరు ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పసాగారు.

అదే ఆస్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు లేచి "నేను పోతే పోవచ్చు" అని అన్నాడు.

ఆ మాట తక్కిన వారికి కోపం తెప్పించింది.
"మాకు లేనిది ఏమిటి? కాళిదాసుకు ఉన్నది ఏమిటి? అతనొక్కడే మోక్షానికి పోతానంటాడేంటి? అని చిరాకు పడ్డారు.
.
ఇతడేనా మోక్షానికి పోయేవాడు" అంటూ ఆరోపణలు కూడా మొదలయ్యాయి.

భోజుడు కాళిదాసు వంక ప్రశ్నార్థకంగా చూశాడు.

అప్పుడు కాళిదాసు లేచి "మహాప్రభూ! "నేను" "నేనే" అనే అహంకారం, గర్వం పోతే, ఎవడైనా సరే మోక్షానికి పోవచ్చు అన్నాను..

అంతేగాని నేను పోతానంటూ చెప్పడం నా ఉద్దేశ్యం కాదు" అని వివరించాడు.

'భోజ మహారాజుతో సహా సభాసధులందరూ కాళిదాసుని మెచ్చుకున్నారు.

మిత్రులారా...
 దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మనిషి ఎప్పుడైతే "నేను" "నేనే" అనే గర్వాన్ని,  అహంకారాన్ని వదిలేస్తాడో అప్పుడే భగవంతుడిని చూడగలడు,  భగవంతుడిని చేరుకోగలడు...
ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి నేను అన్ని పూజలు చేశాను, నేను ఇన్ని వ్రతాలు చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు దయచేసి అవి మానండి..
 అప్పుడే జీవితం బాగుంటుంది.🙏

అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల 7 అలవాట్లు

 *అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల 7 అలవాట్లు*

 ఇది స్టీఫెన్ R. కోవీ రాసిన అత్యధికంగా అమ్ముడైన స్వీయ-సహాయం మరియు వ్యక్తిగత అభివృద్ధి పుస్తకం.  ఇది వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ప్రభావానికి సమగ్ర విధానాన్ని అందిస్తుంది, సూత్రాలు మరియు పాత్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుంది.  ఇక్కడ ఏడు అలవాట్లు ఉన్నాయి:

 1. ప్రోయాక్టివ్‌గా ఉండండి: ఈ అలవాటు మీ చర్యలు మరియు ప్రవర్తనలపై నియంత్రణ తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది.  బాహ్య సంఘటనలకు ప్రతిస్పందించే బదులు, మీరు ప్రభావితం చేయగల లేదా మార్చగల వాటిపై దృష్టి పెట్టడం ద్వారా చురుకుగా ఉండండి.  ఇది బాధ్యత మరియు మీ ప్రతిస్పందనలను ఎంచుకోవడం.

 2. ఎండ్ ఇన్ మైండ్‌తో ప్రారంభించండి: మీ దీర్ఘకాలిక లక్ష్యాలు మరియు విలువల గురించి స్పష్టమైన అవగాహనతో ప్రారంభించండి.  మీ గమ్యాన్ని తెలుసుకోవడం వలన మీరు నిర్ణయాలు తీసుకోవడంలో మరియు మీ వ్యక్తిగత మిషన్‌కు అనుగుణంగా ప్రాధాన్యతలను సెట్ చేయడంలో సహాయపడుతుంది.

 3. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఉంచండి: ఎఫెక్టివ్ టైమ్ మేనేజ్‌మెంట్ కీలకం.  ఈ అలవాటు మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండే అతి ముఖ్యమైన పనులను గుర్తించి, ప్రాధాన్యతనివ్వమని సలహా ఇస్తుంది.  ఇది అధిక-ప్రభావ కార్యకలాపాలపై మీ సమయాన్ని మరియు శక్తిని కేంద్రీకరించడం.

 4. విన్-విన్ గురించి ఆలోచించండి: పరస్పర చర్యలు మరియు సంబంధాలలో పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను కోరుతూ కోవే నొక్కిచెప్పారు.  జీరో-సమ్ మైండ్‌సెట్‌కు బదులుగా, అన్ని పార్టీలు ప్రయోజనం పొందగల పరిస్థితులను సృష్టించడంపై దృష్టి పెట్టండి.

 5. అర్థం చేసుకోవడానికి మొదట వెతకండి, తర్వాత అర్థం చేసుకోవాలి: ప్రభావవంతమైన కమ్యూనికేషన్ సానుభూతి మరియు అవగాహనపై నిర్మించబడింది.  మీ స్వంత దృక్కోణాన్ని వ్యక్తపరిచే ముందు ఇతరులను చురుకుగా మరియు నిజాయితీగా వినండి.  ఈ అలవాటు మెరుగైన సంబంధాలను మరియు సమస్య పరిష్కారాన్ని ప్రోత్సహిస్తుంది.

 6.సినర్జైజ్: సహకారం మరియు జట్టుకృషి ఈ అలవాటు యొక్క ప్రధాన అంశం.  సినర్జీ అంటే ఒక సమూహం యొక్క ఉమ్మడి ప్రయత్నాలు వ్యక్తిగత ప్రయత్నాల మొత్తం కంటే ఎక్కువ సాధించగలవు.  ఇది మెరుగైన ఫలితాల కోసం వైవిధ్యానికి విలువ ఇవ్వడాన్ని మరియు వ్యత్యాసాలను ప్రభావితం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది.

 7.సాను పదును పెట్టండి: ఈ అలవాటు స్వీయ-పునరుద్ధరణ మరియు స్వీయ-సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.  సమతుల్యత మరియు దీర్ఘకాలిక ప్రభావాన్ని నిర్వహించడానికి మీ శారీరక, మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సులో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టండి.

 కోవే యొక్క విధానం వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో మరింత అర్థవంతమైన మరియు సమర్థవంతమైన ఎంపికలు చేయడంలో మీకు మార్గనిర్దేశం చేసే సూత్రాలు మరియు విలువలపై ఆధారపడి ఉంటుంది.  బలమైన నైతిక మరియు నైతిక పునాదిని కొనసాగిస్తూ వ్యక్తిగత ఎదుగుదల మరియు విజయాన్ని సాధించడానికి అలవాట్లు తరచుగా ఒక ఫ్రేమ్‌వర్క్‌గా ప్రదర్శించబడతాయి.  ఈ పుస్తకం వ్యక్తిగత అభివృద్ధి మరియు నాయకత్వ సాహిత్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.

 
*The 7 Habits of Highly Effective People*

This is a best-selling self-help and personal development book written by Stephen R. Covey. It offers a holistic approach to personal and professional effectiveness, emphasizing principles and character development. Here are the seven habits:

1. Be Proactive: This habit encourages taking control of your actions and behaviors. Instead of reacting to external events, be proactive by focusing on what you can influence or change. It's about responsibility and choosing your responses.

2. Begin with the End in Mind: Start with a clear understanding of your long-term goals and values. Knowing your destination helps you make decisions and set priorities that align with your personal mission.

3. Put First Things First: Effective time management is crucial. This habit advises identifying and prioritizing the most important tasks that align with your goals. It's about concentrating your time and energy on high-impact activities.

4. Think Win-Win: Covey emphasizes seeking mutually beneficial solutions in interactions and relationships. Instead of a zero-sum mindset, focus on creating situations where all parties can benefit.

5. Seek First to Understand, Then to Be Understood: Effective communication is built on empathy and understanding. Listen actively and genuinely to others before expressing your own viewpoint. This habit promotes better relationships and problem-solving.

6.Synergize: Collaboration and teamwork are at the core of this habit. Synergy means that the combined efforts of a group can achieve more than the sum of individual efforts. It encourages valuing diversity and leveraging differences for better results.

7.Sharpen the Saw: This habit emphasizes the importance of self-renewal and self-care. Regularly invest in your physical, mental, emotional, and spiritual well-being to maintain balance and long-term effectiveness.

Covey's approach is based on principles and values that can guide you in making more meaningful and effective choices in both personal and professional life. The habits are often presented as a framework for achieving personal growth and success while maintaining a strong moral and ethical foundation. The book has had a significant influence on personal development and leadership literature.