🌷 అంతరాలోచన 🌷
నాతో సహా సకలము నాలో 'ఉన్నట్లు' ఉన్నది., కానీ లేనే లేదు అని గ్రహించినవారే కాలకాలుడు (శివుడు).
మనిషికి అస్సలు బొత్తిగా లేని మూడు అనుభవాలు:-
✳ జన్మానుభవం
✳ మరణానుభవం
✳ ఆత్మానుభవం
👉 నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యం
-- దాని పేరు ధ్యానం.
👉 మాటలోని ఎరుక, మాటలోని సత్యం
-- దానిపేరు జ్ఞానం.
👉 ఆత్మలోని శాంతం, ఆత్మలోని అభయం
-- దాని పేరు మోక్షం.
👉 చేతలోని న్యాయం, చేతలోని వినయం
-- దాని పేరు ధర్మం.
మనలో మనం పొందేది - భోగం.
ఇతరుల దగ్గర మనం పొందేది - వైభోగం.
ధ్యానమే భోగం, జ్ఞానమే వైభోగం.
దైవానుభవం అంటే తాను ఉండి, దైవాన్ని అనుభవించడం కాదు.
దైవమే తానై పోవడం. అప్పుడు 'అనుభవం' అంటూ ఏమీ ఉండదక్కడ.
సకల ప్రాణి కోటి తో అనురక్తి - దానిపేరే మైత్రి.
కార్యకారణ సంబంధం విజ్ఞానము - దానిపేరే బుద్ధి.
మైత్రి, బుద్ధి రెండూ కలిస్తే మైత్రేయ బుద్ధుళ్లు అవుతారు.
శిష్యుడు:- మాయ అంటే?
గురువు:- "ఉన్నది ఒక్కటే - అది నేనే" అన్న స్వస్థితిలో తనను ఉండనీయకుండా చలింప చేసే శక్తి ఏదైతే ఉన్నదో అదే "మాయ".
👉 తపస్సు(ధ్యానం) వలన నీ చుట్టూ ఆరా(దివ్య శక్తి) ఏర్పడుతుంది.
👉 ఆ ఆరాను దాటి ఏ దుష్టశక్తి(కరోనా లాంటి వైరస్సులు, చేతబడులు etc) నీ దరి చేరవు.
ఏ దుష్టశక్తి అయినా
➡ బహిర్ముఖుణ్ణే నాశనం చేస్తుంది.
➡ అంతర్ముఖుణ్ణి నమస్కరించి వైదొలగుతుంది.
నోరు - ప్రాపంచిక ద్వారం.
ముక్కు - ఆధ్యాత్మిక ద్వారం.
ఆత్మ జీవితంలో 'అనుభవాలే' ఉంటాయి;
విజయాలు, అపజయాలు అనేవి ఏమీ ఉండవు.
ఇది అర్థం అయినప్పుడు జీవితం అందంగా ఉంటుంది.
'నేను' అనే బిందువు నశిస్తే,
'మహా మూల చైతన్యం' అనే సాగరం లభిస్తుంది.
మెలకువ రాక మునుపు, నిద్రపోయిన తర్వాత ఉన్న స్వస్థితిని--
ఇప్పుడు మెలకువ లో పొందటమే 'స్వస్వరూపానుభవము' అంటే.
అందరిలో తాను ఒకడుగా ఉండుట - కర్మ.
అందరి గా తాను ఉండుట - భక్తి.
ఏమీ కాకుండా తాను ఉండుట - జ్ఞానం.
నేను అనేది మేనులో ఉన్నప్పుడు
- శివం
నేను అనేది మేను నుండి తొలగినప్పుడు
- శవం
No comments:
Post a Comment