Thursday, April 30, 2020

త్రిమతాలు

🌹 త్రిమతాలు 🌹

జీవాత్మ పరమాత్మ ని గూర్చిన విచారణలో మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి.వాటిని త్రిమతాలు అంటారు.

అద్వైతం
ద్వైతం
విశిష్టాద్వైతం

♥♥ అద్వైతం♥♥
ఇది ఆదిశంకరులుగా ప్రసిద్ధులైన శంకర
భగవత్పాదులు ప్రతిపాదించిన
సిద్ధాంతము.మూడింటిలోను మొదటిది. హిందూమతముపై
అత్యంత ప్రభావము కలిగిన ఆలోచనామార్గములలో ఇది ఒకటి.
బ్రహ్మమొకటే సత్యము. మిగిలినదంతా మిధ్య. జీవాత్మకు,
పరమాత్మకు (బ్రహ్మమునకు) భేదము లేదు. అలాగే
అందరి లోని ఆత్మ బ్రహ్మ మయమే. మాయవలన అజ్ఙానము,
దానివలన భేదభావము కలుగుచున్నవి. త్రాడును చూచి
పాము అనుకొన్నవానికి భయము కలుగును. అది తాడు అని
తెలియగానే భయము తొలగిపోవును. అలాగే జ్ఞానము వల్ల
మాయను అధిగమించి, మోక్షము పొందుట సాధ్యము.

♥♥విశిష్టాద్వైతం♥♥
ఇది రామానుజాచార్యులు ప్రతిపాదించిన మార్గము.
నిత్యానపాయినియై, నారాయణునితో సదా కలసి ఉండే లక్ష్మీదేవికి
వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీవైష్ణవమని
అంటారు. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా
త్రోసిపుచ్చిన మార్గమిది.
జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు -
మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది.
'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే
ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో
జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా
శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల
సంసారబంధమున చిక్కుకొందురు.
భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన,
భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి
విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు.
అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.

♥♥ద్వైతం♥♥
ఇది మధ్వాచార్యులు (ఆనందతీర్ధులు) ప్రతిపాదించిన
తత్వము. మూడింటిలో చివరిది. పై
రెండు సిద్ధాంతములనూ క్షుణ్ణముగా
అధ్యయనం చేసిన తరువాత ప్రతిపాదింపబడినది.
జీవుడు, జగత్తు, దేవుడు - ఈ మూడూ వేరు వేరనీ,
వాటి మధ్య భేదం ఎప్పుడూ ఉంటుందని
ప్రతిపాదించింది. సకల కల్యాణ గుణ సచ్చిదానంద
మూర్తియైన శ్రీమహావిష్ణువే సమస్తమునకు ఆధారము.
వారివారి గుణకర్మలననుసరించి జీవులు తమోయోగ్యులు,
నిత్య సంసారులు,
ముక్తియోగ్యులు అను మూడు విధములు.
దేవునకు, జీవునకు గల సంబంధము యజమానికి,
దాసునకు మధ్య గల సంబంధము వంటిది.

★వీటితో పాటు ద్వైతాద్వైతము ను నింబాల్కుడు,శుద్దాద్వైతము ను వల్లభుడు ప్రతిపాదించారు★

"ఆది శంకరుల అద్వైత సిద్ధాంతమే సత్యమూ,పరమోన్నత స్థాయి సిద్ధాంతం" 🙏

పిల్లల నుండి మీరు నేర్చుకోండి

🤘 పిల్లల పెంపకం ప్రతీ తల్లిదండ్రుల జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం. పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రుల జీవితం అంతా పిల్లల చుట్టే తిరుగుతూ ఉంటుందంటే అతిశయోక్తి కాదేమో. ఒక సందర్భంలో పిల్లల పెంపకం గురించి సద్గురు కొన్ని సూత్రాలను తెలియజేసారు. ఈ సూత్రాలలో ఒక సూత్రాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లల నుండి మీరు నేర్చుకోండి

💁‍♂️చాలామంది తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే, వారు భోధించడం మొదలు పెట్టాలనుకుంటారు. నిజానికి, పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు, అది మనం వారికి భోధించాల్సిన సమయం కాదు, వారి నుండి మనం నేర్చుకోవాల్సిన సమయం. ఎందుకంటే మీరు మిమల్ని, మీ పిల్లల్ని పరిశీలించి చూస్తే, ఎవరు ఎక్కువ అనందంగా ఉంటారు ? మీ పిల్లలే కదా? అందుకని, అది వారి నుండి మనం నేర్చుకునే సమయమే కానిీ, మనం వారికి నెర్పే సమయం కాదు.

జీవితం విషయానికి వచ్చేసరికి, మీ పిల్లవాడికే మీకంటే ఎక్కువ తెలుసు

మీరు మీ పిల్లలకి నేర్పగలిగేది ఏదైనా ఉందంటే అది ఎలా బ్రతకాలి అనేది మాత్రమే. అది కూడా కొంత వరకే. కాని జీవితం విషయానికి వచ్చేసరికి, మీ పిల్లవాడికే మీకంటే ఎక్కువ తెలుసు. పిల్లవాడు తనంతట తానే జీవితాన్నిఅనుభవంతో తెలుసుకుంటాడు. తనే జీవ చైతన్యమని అతడికి బాగా తెలుసు. మీరు మీ మనస్సు మీద బలవంతంగా ఆపాదించిన నిర్బంధాలన్నీ తొలగించి చూస్తే, మీ ప్రాణ శక్తికి కూడా ఎలా ఉండాలో తెలుస్తుంది.మీరు కూడా అంత హాయిగా ఉంటారు. కాని మీ మనసుకే ఆ నిర్బంధాలని వదిలి ఎలా ఉండాలో తెలీదు. పెద్దవారే లేనిపోనివి ఊహించుకొని కష్టాలని అనుభవిస్తారు. పిల్లలు అలా చేయరు. కాబట్టి మీరు వారికి శిక్షణ ఇవ్వనవసరం లేదు . మీరే వారికి శిష్యులై వారిలా స్వచ్చంగా, ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. 👍

Wednesday, April 29, 2020

నో.. రోనా! కరోనా - ఆందోళన నో.. రోనా!

[29/04, 06:16] +91 94935 70292: నో.. రోనా!
కరోనా - ఆందోళన
నో.. రోనా!
మన జీవితం అనుబంధాల సమాహారం. ఇల్లయినా, ఆఫీసయినా బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలే మనకు ఆధారం. ఆనందాలను ఆస్వాదించటానికైనా, బాధలను పంచుకోవటానికైనా.. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో పురోగమించటానికైనా మనిషికో తోడు అవసరం. అలాంటి బంధాలు, అనుబంధాలనే దెబ్బతీస్తోంది కరోనా వైరస్‌. ఇంట్లోనే ఉండిపోవటమో, స్వీయ నిర్బంధమో, తప్పనిసరి నిర్బంధమో.. ఏదో ఒకటి తప్పటం లేదు. వైరస్‌ వ్యాప్తిని కట్టడించటానికివి అత్యవసరమే అయినా మనసులపై పెద్ద దెబ్బే కొడుతున్నాయి. ఇప్పుడు కరోనా ఇన్‌ఫెక్షన్‌ కన్నా దాని భయమే ఎక్కువగా కలవరపెడుతోంది. ఇది ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలకూ దారితీస్తోంది. ఇటీవలి కాలంలో మానసిక సమస్యల బారినపడుతున్నవారి సంఖ్య 20% వరకూ పెరిగినట్టు ఇండియన్‌ సైక్రియాట్రీ సొసైటీ సర్వేలో తేలటమే దీనికి నిదర్శనం. ఈ నేపథ్యంలో కరోనా భయాలు, ఆందోళన, నివారణ మార్గాలపై సమగ్ర కథనం ఈవారం మీకోసం.
నో.. రోనా!
కరోనా దెబ్బకు బడులు, ఆఫీసులన్నీ మూతపడ్డాయి. సినిమాలు, హోటళ్లు బందయ్యాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. విజ్ఞానం, వినోదం, ఆదాయం అందించే సమస్త వ్యవస్థలన్నీ అతలాకుతలమైపోయాయి. మొత్తంగా మన జీవనశైలే అస్తవ్యస్తమైపోయింది. దేశవ్యాప్త దిగ్బంధంతో రోజంతా ఇంట్లోనే ఉండిపోవటం, బయటకు వచ్చినా కొన్ని ప్రాంతాల్లో, కొంత సమయానికే పరిమితం కావటం. ఏమాత్రం అనుమానం వచ్చినా స్వీయ నిర్బంధం. తప్పనిసరైతే ప్రత్యేక పర్యవేక్షణ (క్వారంటైన్‌). జబ్బు నిర్ధరణ అయితే విడిగా చికిత్స (ఐసోలేషన్‌). మందూ మాకూ, టీకాలు లేని జబ్బును ఎదుర్కోవటానికి ఇంతకు మించిన మార్గమేదీ కనబడని ఇలాంటి విపత్కర పరిస్థితి ఇంకెంత కాలముంటుందోననే అనిశ్చితి ఒకవైపు.. ఎప్పుడెవరిని జబ్బు కాటేస్తుందోననే భయం మరోవైపు ఎవర్నీ కుదురుగా ఉండనీయటం లేదు. ఏ పనిచేస్తున్నా మనసంతా దాని మీదే. మున్ముందు భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళనే. వ్యాపారాలు కుదేలు కావటం, ఉద్యోగాలు ఉంటాయో ఉండవోననే ఊగిసలాటకు తోడు ఆదాయాలు, పొదుపు మొత్తాలు తగ్గిపోవటం వంటివన్నీ మానసికంగా విపరీత ప్రభావం చూపేవే. ఇవి తీవ్ర భయాందోళనలకు దారితీస్తాయనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అప్పటికే మానసిక సమస్యలతో బాధపడేవారికైతే మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవటానికి, మానసిక నిబ్బరం కోల్పోకుండా ఉండటానికి వ్యక్తులుగా, సమాజంగా మనమంతా తగు జాగరూకతతో వ్యవహరించటం ఎంతైనా అవసరం.
అటు భయం ఇటు అనిశ్చితి
కరోనా ఆందోళనకు కారణమవుతున్న అంశాలను రెండు రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి- భయం. దీంతో కొంత లాభముంది, కొంత నష్టముంది. నాకూ వస్తుందేమోనన్న భయం ఉన్నప్పుడు ప్రభుత్వం, నిపుణులు చెప్పిన జాగ్రత్తలను కచ్చితంగా పాటించటానికి తోడ్పడుతుంది. ఇలా మేలే చేస్తుంది. అదే భయం మితిమీరితే ఆందోళనకు (ఆంగ్జయిటీ) దారితీస్తుంది. నాకేమైనా అయిపోతుందేమో, ఏదైనా అయితే ఏం చెయ్యాలి? ఎవరిని సంప్రదించాలి? బయటకు వెళ్లటానికేమో వీల్లేదాయె? ఇంట్లో ఉండిపోతే ఇంకేమైనా అవుతుందేమో? వంటి ఆలోచనలు ఆందోళన మరింత పెరిగేలా చేస్తాయి. ఇది అక్కడితోనే ఆగిపోకపోవచ్చు. తర్వాతి దశలోకి.. అంటే ఉన్నట్టుండి తీవ్ర భయాందోళనలు చెలరేగే (పానిక్‌) స్థితిలోకీ నెట్టేయొచ్చు. ఇది అప్పుడప్పుడు దఫదఫాలుగా దాడి చేస్తుండొచ్చు. రెండోది- అనిశ్చితి. ఎప్పుడేం జరుగుతుందో? ఎక్కడికి దారితీస్తుందో? అనే అనిశ్చిత స్థితి మానసికంగా బాగా కుంగదీస్తుంది. ప్రస్తుతం కరోనాకు టీకా లేదు. కచ్చితమైన, ప్రామాణికమైన చికిత్సా లేదు. ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. ఇదే చాలామందిలో భయాందోళనలు రేపుతోంది. మరోవైపు- కుటుంబంలో ఎవరికైనా ఇన్‌ఫెక్షన్‌ వస్తే అది తమ తప్పే అయినట్టు ఇరుగుపొరుగు వెలి వేసినట్టు చూడటం, ఎదురుపడ్డప్పుడు పక్కకు జరగటం, మాట్లాడకపోవటం వంటివీ మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇక ఆత్మీయులు మరణిస్తే ఆ బాధ వర్ణనాతీతం. కరోనాతో ముడిపడిన ఇలాంటి అంశాలన్నీ రకరకాల మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి.
కుంగుబాటు: ఆందోళన ఎక్కువైతే కుంగుబాటు (డిప్రెషన్‌) బారినపడే అవకాశముంది. అప్పటికే కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నవారిలో అవి మరింత తీవ్రమవ్వచ్చు.
నిద్రలేమి: నిద్ర పట్టకపోవటం, పట్టినా వెంటనే మెలకువ రావటం పెద్ద సమస్య. ఇదిలాగే కొనసాగితే మున్ముందు ఇతరత్రా సమస్యలకూ దారితీస్తుంది.
దురలవాట్లు: మానసికంగా బలహీనంగా ఉన్నవారు మద్యపానం, సిగరెట్లు కాల్చటం, మత్తుమందులు తీసుకోవటం వంటి దురలవాట్లకు లోనయ్యే అవకాశముంది. అప్పటికే ఇలాంటి అలవాట్లు గలవారిలో మరింత పెరిగిపోవచ్చు. ఇవి మానసిక సమస్యలను ఇంకాస్త ఎక్కువ చేస్తాయి.
వేదనానంతర సమస్య: కరోనా తగ్గిన తర్వాతా దీని ప్రభావం కొనసాగొచ్చు (పోస్ట్‌ ట్రామాటిక్‌ డిజార్డర్‌). దీంతో కోపం, చిరాకు, నలుగురితో కలవలేకపోవటం, గతాన్ని తలచుకొని కుమిలిపోవటం, తీవ్ర ఆందోళన, ఎవరినీ నమ్మకపోవటం, నిద్ర పట్టకపోవటం వంటివి ఇబ్బంది పెట్టొచ్చు.
నిందించుకోవటం: జబ్బు బారినపడితే ఏదో తప్పు చేశామనే భావనతోనూ కొందరు కుమిలిపోతుండొచ్చు. కొవిడ్‌-19తో మరణిస్తే ప్రస్తుతం ఆయా ఆచారాల పరంగా దహన సంస్కారాలు చేసే వీలు లేదు. దీంతోనూ కుటుంబసభ్యుల్లో ఏదో వెలితి, తమను తాము నిందించుకోవటం వంటి ధోరణులు తలెత్తొచ్చు. ఆత్మీయులను కోల్పోయిన బాధకు ఇవీ తోడైతే నిబ్బరం కోల్పోయి కుంగుబాటులోకీ వెళ్లే ప్రమాదముంది.
నివారణ మార్గముంది
మన చుట్టూ ఉన్నవారంతా భయాందోళనలకు గురవుతున్నప్పుడు మానసిక స్థైర్యం ఒకింత సడలటం సహజమే. అలాగని అధైర్య పడటం తగదు. తగు జాగ్రత్తలు తీసుకుంటే మనో నిబ్బరం కోల్పోకుండా చూసుకోవచ్చు. మనం కర్ర పట్టుకొని భయాలను పూర్తిగా తరమలేకపోవచ్చు గానీ మనసును కుదురుగా, ప్రశాంతగా ఉంచే మార్గాలను నేర్చుకోవచ్చు. చిన్న పనితో ఆరంభించినా పెద్ద ఫలితమే కనిపిస్తుంది.
ఎప్పటి మాదిరిగానే: ఇంటికే పరిమితమైనప్పుడు దినచర్య అస్తవ్యస్తమవుతుంది. శ్రద్ధ తగ్గుతుంది. వీటికి తావివ్వకుండా చూసుకోవాలి. ఇంటి నుంచి ఆఫీసు పని చేసేవారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు గానీ మిగతావారు రోజువారీ పనుల్లో తేడా లేకుండా చూసుకోవాలి. ఇంట్లోనే ఉంటున్నాం కదా అని బద్ధకం తగదు. ఆఫీసుకు వెళ్లే రోజుల్లో మాదిరిగా ఉండటానికే ప్రయత్నించాలి. ఉదాహరణకు ఆఫీసులో ఉండే సమయంలో ఏవైనా పనులు కల్పించుకొని చేయాలి. అంతకుముందు మిగిలిపోయిన పనులను పూర్తి చేయొచ్చు. పుస్తకాలు చదువుకోవచ్చు. కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లో ఆడుకునే ఆటలు ఆడుకోవచ్చు. చాలాకాలంగా మాట్లాడటానికి వీలుపడని వారికి ఫోన్‌ చేయొచ్చు. ఈ మెయిళ్లు చేయొచ్చు. కళలు, సంగీతం వంటి అభిరుచులను అలవరచుకోవచ్చు. ఒకవేళ ఆపేస్తే తిరిగి ప్రారంభించొచ్చు. మొత్తంగా ఏదో ఒక పనిలో నిమగ్నమవటం ముఖ్యమని తెలుసుకోవాలి.
అదేపనిగా వద్దు: సమాచారాన్ని తెలుసుకోవటం మంచిదే గానీ రోజంతా కరోనాకు సంబంధించిన అంశాల్లోనే మునిగిపోవటం తగదు. ప్రభుత్వం కూడా కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందుబాటులో ఉండేలా చూడాలి. లేకపోతే తీవ్ర భయాందోళలను తలెత్తుతాయి. వదంతులు పెరిగిపోతాయి. ఇవి మరింత చేటు చేస్తాయి.
కంటి నిండా నిద్ర: రోజు మాదిరిగానే వేళకు పడుకోవటం, లేవటం చాలా మంచిది. దీంతో నిద్రలేమి వంటి సమస్యల బారినపడకుండా చూసుకోవచ్చు. రాత్రిపూట కంటి నిండా నిద్రపోతే ఆందోళన తగ్గుతుంది.
వేళకు భోజనం: ఇంట్లో ఉంటున్నాం కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినటం మంచిది కాదు. వేళకు భోజనం చేయాలి. సమతులాహారం తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌ మానెయ్యాలి.
ప్రాణాయామం: గాఢంగా శ్వాస తీసుకోవటం (ప్రాణాయామం), ధ్యానం మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తాయి. అలాగే ఇంట్లోనే తేలికైన వ్యాయామాలు చేస్తుండాలి. ఇవి ఒత్తిడి తగ్గటానికి తోడ్పడతాయి. ఆందోళనకు, కుంగుబాటుకు లోనుకాకుండా చూస్తాయి.
కుమిలిపోవద్దు: ఆసుపత్రుల్లోనో, వేరే ఎక్కడైనా విడిగా (క్వారంటైన్‌) ఉంటున్నవాళ్లు అదేపనిగా కుమిలిపోవటం తగదు. ఇది మన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోవటానికి తీసుకుంటున్న ముందు జాగ్రత్తే తప్ప మరోటి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీలైనప్పుడల్లా కుటుంబసభ్యులకు, బంధువులకు, మిత్రులకు ఫోన్‌ చేసి మాట్లాడాలి. ఇప్పుడు వీడియోలో చూస్తూ మాట్లాడుకునే సదుపాయాలూ అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రిలో, ప్రత్యేక గదుల్లో ఉన్నప్పుడూ ప్రాణాయామం, ధ్యానం, తేలికపాటి వ్యాయామాలు చేస్తుండాలి. వీటితో మనసు తేలికపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. కుంగుబాటుకు లోనవ్వకుండా చూసుకోవచ్చు. అలాగే క్వారంటైన్‌లో ఉన్నవారికి అక్కడి డాక్టర్లు, నర్సుల వంటి వైద్య సిబ్బంది క్వారంటైన్‌ అంటే ఏంటి? ఎన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది? బయటకు వెళ్లాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నింటినీ పూర్తిగా విడమరచి చెప్పాలి. లేకపోతే ఏమవుతుందో ఏమో, ఇలా ఇంకెన్నాళ్లో అనే దిగులు మొదలవుతుంది. ఇలాంటి అనిశ్చితి మనిషిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తుంది.
వైద్యులూ జాగ్రత్త: డాక్టర్లు, నర్సుల వంటి వైద్య సిబ్బంది సైతం ఆందోళనకు గురికావొచ్చు. చికిత్స చేస్తున్నప్పుడు పొరపాటున తమకు ఇన్‌ఫెక్షన్‌ వస్తే? తమ మూలంగా ఇంట్లో వాళ్లకు వస్తే? ఇలాంటి ఆలోచనలు ఆందోళనకు గురిచేస్తుంటాయి. మరోవైపు తాము చికిత్స చేస్తున్నవారిలో ఎవరైనా హఠాత్తుగా మరణించొచ్చు. కొన్నిసార్లు వార్డుల్లో మరణాల సంఖ్య పెరుగుతుండొచ్చు. ఇవన్నీ తీవ్ర భయాందోళనలకు దారితీసేవే. మనో నిబ్బరాన్ని దెబ్బతీసేవే. అందువల్ల ప్రభుత్వం, ఆసుపత్రి యాజమాన్యాలు వైద్య సిబ్బంది నిర్లిప్త ధోరణిలోకి జారిపోకుండా, కుంగుబాటుకు లోనవ్వకుండా చూసుకోవాలి. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి చికిత్స, సేవలు చేసేవారికి అక్కడే వసతి కల్పించటం.. షిష్టు వేళలు సుదీర్ఘంగా లేకుండా చూడటం.. తగినంత విశ్రాంతి తీసుకునేలా, నిద్ర పోయేలా ఏర్పాట్లు చేయాలి.
మనకు మనమే బాసట
జీవితం అనుభవాలు, ఘటనల ప్రవాహం. ఒక్క దాంతో ఆగిపోయేది కాదు. కరోనా సైతం అలాంటిదే. ఇదీ ఒకరోజు పోయేదే. ఇలాంటి భరోసాను మనకు మనమే కల్పించుకోవటం ఎంతైనా అవసరం.
నిజాలు తెలుసుకోండి: ప్రస్తుత పరిస్థితుల్లో స్పష్టమైన, పారదర్శకమైన సమాచారం చాలా ముఖ్యం. లేకపోతే తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఎవరికి ఏది తోస్తే అది పంపించటం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అరకొర విషయాలు, అవాస్తవాలతో బయాందోళనలు మరింత పెరుగుతాయి. కాబట్టి వదంతులను నమ్మకుండా, నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. విశ్వసనీయమైన సంస్థలు అందించే సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. నూటికి 90% మందిలో సమస్య మామూలుగానే తగ్గిపోతోందని, కొందరిలో పూర్తిగా నయమైపోతోందని, కొందరిలోనే ప్రాణాంతకంగా పరిణమిస్తోందనే సంగతిని గుర్తించగలిగితే ఆందోళన దానంతటదే తగ్గుతుంది.
ఇదొక్కటే కాదు: మన జీవితాలను కుదిపేసింది ప్రస్తుత సంక్షోభం ఒక్కటేనా? ఇంతకుముందు ఇలాంటి విపత్కర పరిణామాలను ఎన్ని ఎదుర్కోలేదు? ఆత్మీయుల మరణం కావొచ్చు. కోరుకున్న ఉద్యోగం దొరక్కపోవటం కావొచ్చు. ఉన్నట్టుండి ఉద్యోగం పోవటం కావొచ్చు. ఇలా ఏదో ఒక అనూహ్య పరిణామాన్ని చూసినవాళ్లమే. అవి ఎల్లకాలం అలాగే ఉండిపోయాయా? అప్పటికప్పుడు భావోద్వేగాలకు గురికావటం, అంతా అయిపోయిందని అనుకుంటున్న తరుణాలూ కాలగతిలో కలిసిపోవటం, మామూలు మనిషి కావటం, మన పనుల్లో మనం మునిగిపోవటం చూస్తున్నదే. కొవిడ్‌-19 రోజులూ అలాగే గడిచిపోతాయి. కాకపోతే ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? అనేవి తెలుసుకొని, మసలు కోవాలి. అప్రమత్తంగా ఉండటం ఎంత అవసరమో అతిగా భయపడకపోవటం, నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా ఉండకపోవటమూ అంతే అవసరం.
గుర్తించటమెలా?
ఆందోళన, ఉన్నట్టుండి భయభ్రాంతులకు గురవటం వంటి సమస్యలను కొన్ని లక్షణాలతో గుర్తించొచ్చు.
మాటిమాటికీ కొవిడ్‌-19 సమాచారం తెలుసుకోవాలని అనుకోవటం
గతంలో జరిగిన సంఘటనలను పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం
అతిగా తినటం వంటి విపరీత అలవాట్లు చేసుకోవటం
జరగకూడనిదేదో జరగొచ్చనే భయంతో సరిగా నిద్రపోకపోవటం
అన్ని విషయాలకూ తానే బాధ్యుడనని నిందించుకోవటం
దేని మీదా ఏకాగ్రత కుదరకపోవటం, కుంగిపోవటం
[29/04, 06:21] +91 94935 70292: నో...రోనా!-భాగము2
ఇలా ఏదో ఒక అనూహ్య పరిణామాన్ని చూసినవాళ్లమే. అవి ఎల్లకాలం అలాగే ఉండిపోయాయా? అప్పటికప్పుడు భావోద్వేగాలకు గురికావటం, అంతా అయిపోయిందని అనుకుంటున్న తరుణాలూ కాలగతిలో కలిసిపోవటం, మామూలు మనిషి కావటం, మన పనుల్లో మనం మునిగిపోవటం చూస్తున్నదే. కొవిడ్‌-19 రోజులూ అలాగే గడిచిపోతాయి. కాకపోతే ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు? అనేవి తెలుసుకొని, మసలు కోవాలి. అప్రమత్తంగా ఉండటం ఎంత అవసరమో అతిగా భయపడకపోవటం, నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా ఉండకపోవటమూ అంతే అవసరం.
గుర్తించటమెలా?
ఆందోళన, ఉన్నట్టుండి భయభ్రాంతులకు గురవటం వంటి సమస్యలను కొన్ని లక్షణాలతో గుర్తించొచ్చు.
మాటిమాటికీ కొవిడ్‌-19 సమాచారం తెలుసుకోవాలని అనుకోవటం
గతంలో జరిగిన సంఘటనలను పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం
అతిగా తినటం వంటి విపరీత అలవాట్లు చేసుకోవటం
జరగకూడనిదేదో జరగొచ్చనే భయంతో సరిగా నిద్రపోకపోవటం
అన్ని విషయాలకూ తానే బాధ్యుడనని నిందించుకోవటం
దేని మీదా ఏకాగ్రత కుదరకపోవటం, కుంగిపోవటం

హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం

🕉🇮🇳🚩🕉🇮🇳🚩🕉🚩
హరిద్వార్ ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం

. ఇది ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. హిందువుల పుణ్యక్షేత్రం. ద్వారం అంటే లోపలకు ప్రవేశించే దారి. హరి అంటే విష్ణువు హరిద్వార్ అంటే హరిని చేరే దారి. ఇది హరిద్వార్ జిల్లాలో ఉన్న ఒక మున్సిపాలిటీ. క్రీ.శ.1888 డిసెంబర్ 28 హరిద్వార్‌కు జిల్లా స్థాయి ఇవ్వబడింది. క్రీ.శ.2000 సెప్టెంబరు 9 హరిద్వార్ ఉత్తరఖాండ్ లో ఒక భాగమైంది. ఉత్తరాఖండ్ ఇండియన్ రిపబ్లిక్‌లో 27వ రాష్ట్రం. ఆధ్యాత్మిక క్షేత్రం నేపథ్యంలోనే ఇది ప్రస్తుతం రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా కూడా అభివృద్ధి పథంలో ఉంది. హరిద్వార్ అమృతం చిందిన నాలుగు క్షేత్రాలలో ఒకటి. మిగిలిన మూడు అలహాబాద్ లోని ప్రయాగ, ఉజ్జయిని, గోదావరి జన్మ స్థలమైన నాసిక్. సాగరమథనం తరువాత గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకొని వచ్చే సమయంలో అమృతం నాలుగు ప్రదేశాలలో చిందినట్లు పురాణ కథనం. ప్రస్తుతం ఇవి పుణ్యక్షేత్రాలుగా మారాయి.


కుంభమేళా

12 సంవత్సరాల కాలానికి ఒక సారి ఈ క్షేత్రాలలో కుంభమేళా జరుగుతుంది. 3 సంవత్సరముల వ్యవధిలో ఒక్కొక్క క్షేత్రంలో కుంభమేళా జరపడం ఆనవాయితీ. ప్రయాగలో జరిగే మహాకుంభమేళాకు భక్తులు, యాత్రీకులు ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడ కూడి వేడుక జరపడం ఆనవాయితీ. ఈ సమయంలో భక్తులు గంగా తీరంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు. కుంభమేళా సందర్భంగా హరిద్వార్‌ సమీపంలోని జ్వాలాపూర్‌లో జరిగే భారీ ఊరేగింపులో పాల్గొనేందుకు విచ్చేసిన హిందూ మత నాయకులూ, సాధు, సంత్‌లకు సంప్రదాయం ప్రకారం అంజుమన్‌ కామ్‌ గంధన్‌ పంచాయత్‌కు చెందిన ముస్లిం పెద్దలు సాదర స్వాగతం పలుకుతారు. హిందూ స్వాములకు ముస్లిం పెద్దలు భక్తి పూర్వకంగా దక్షిణలు సమర్పించి వారి ఆశీస్సులు పొందుతారు. అందుకు ప్రతిగా హిందూ స్వాములు ముస్లిం పెద్దలను ఆలింగనం చేసుకుని వారిని ఆశీర్వదిస్తారు. ముస్లింలకు ప్రసాదాలు అందజేస్తారు. కుంభమేళాలో పెష్వాయ్‌ సందర్భంగా హిందూ మత నాయకులను ఇలా సత్కరించడం, అలాగే, ముస్లింల ఉత్సవాలకూ, పండుగలకూ ఇక్కడి హిందూ నాయకులు శుభాకాంక్షలు తెలపడం, సత్కరించడం సంప్రదాయంగా వస్తోంది. తరతరాలుగా ఈ ప్రాంతంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది.

పురాణ కాలం నుండి ప్రస్తుత కాలం వరకు హరిద్వార్

హరిద్వార్ ప్రకృతి ఆరాధకుల స్వర్గసీమ. హరిద్వార్ భారతీయ సంప్రదాయానికి, నాగరికతకు ప్రతి బింబం. పురాణాలలో ఇది కపిస్థాన్ గానూ, మాయాపురి, గంగాపురిగా వర్ణించబడింది. ఉత్తరఖాండ్‌లో ఉన్న ఈ నగరం చార్ ధామ్ అని పిలవబడే గంగోత్రి, యమునోత్రి, కేదారినాథ్, బదరీనాథ్ లకు ప్రవేశ ద్వారం. శైవులు దీనిని హరద్వార్ గానూ వైష్ణవులు దీనిని హరిద్వార్ గానూ పిలుస్తుంటారు. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు అని అర్ధం.
క్రీ.పూ 1700 నుండి 1300 మధ్య జీవించిన ప్రజలు టెర్రాకోట్టా (బంకమన్నుతో తయారుచేసిన వస్తువులను భట్టీలలో కాల్చి ఉపయోగించే) సంస్కృతి (అనగా, సిరామిక్ వస్తువులను ఉపయోగించేవారు) కలిగివున్నారని పూరాతత్వ పరిశోధనలు ఋజువుచేస్తున్నాయి. క్రీ.శ 629లో భారత దేశంలో పర్యటించిన చైనా హ్యూయన్ త్సాంగ్ రచనల్లో దీని వర్ణన ఉండటం వ్రాత పూర్వకంగా మొదటి సాక్ష్యంగా గుర్తించ బడింది. హ్యూయన్ త్సాంగ్ పర్యటించిన కాలం మహారాజు హర్షవర్ధనుడి (590-647) పరిపాలనా కాలంగానూ హ్యూయ త్సాంగ్ చే ఇది మొ-యు-లోగా సూచించ బడింది. మొ-యు-లో అంటే మాయాపురి సరిహద్దు అని హరిద్వార్ దక్షిణ భాగమని ఊహిస్తున్నారు. మొ-యు-లో ఉత్తర భాగంలో గంగాద్వార్ (గంగా ముఖద్వారం) కోవెల ఉన్నట్లు అతనిచే సూచింపబడింది.
16వ శతాబ్దంలో అక్బర్ పరిపాలనలో అబుల్ ఫజల్ చే వ్రాయబడిన ఆయిన-ఎ-అక్బరీ గ్రంథంలో హరిద్వార్ మాయాపురిగా సూచింపబడింది. జహంగీర్ చక్రవర్తి (1596-1627) పరిపాలనా కాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శించిన ఆంగ్లేయ యాత్రికుడు థోమస్ కోర్యాట్ హరిద్వార్‌ని 'హరద్వారా' శివుని రాజధానిగా సూచించాడు.
కపిల ముని ఇక్కడ ఆశ్రమం నిర్మించుకుని నివసించడం వలన ఇది కపిస్థాన్ గా కూడా పిలువబడినట్లు పురాణ కథనం. సత్య యుగంలో శ్రీ రామచంద్రుని పూర్వీకుడూ సూర్య వంశరాజు అయిన సరుని కుమారులలో ఒకడైన భగీరథుడు కపిల ముని శాపగ్రస్తులైన తన పితృదేవతలకు 60,000 మందికి ముక్తిని ప్రసాదించగోరి స్వర్గంనుండి గంగా దేవిని ఇక్కడకు రప్పించినట్లు హిందూ పురాణాల వర్ణన. ఈ కారణంగా హిందువులు మరణించిన తమ పితరుల ముక్తి కోసం వారి చితాభస్మం ఇక్కడకు తీసుకు వచ్చి గంగానదిలో కలపడం ఆనవాయితీ. విష్ణుమూర్తి తన పాదముద్రలను ఇక్కడ హరికి పురిలో వదిలి వెళుతున్నానని చెప్పినట్లు పురాణ కథనం. సదా ఈ పాదముద్రలు గంగానదిచే తడపబడటం విశేషం.

1399 జనవరి 13 న టర్కీ రాజు 'తిమూర్‌ లాంగ్' (1336-1405) దండయాత్రలో హరిద్వార్ తిమూర్ లాంగ్ వశమైంది.


సిక్కు గురువు 'గురునానక్' (1469-1539) హరిద్వార్ లోని 'కుష్వన్ ఘాట్' లో స్నానం చేసిన సందర్భం వార మతగ్రంథాలైన 'జన్మసఖి'లో చోటుచేసుకుంది. హరిద్వార్ పురాతన సంస్కృతికి, సంప్రదాయాలతో సుసంపన్న మైన ఆధ్యాత్మిక నగరం. ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన హరిద్వార్‌లో ఇప్పటికీ చాలా హవేలీలు, మఠాలు పురాతన చిత్రాలు, శిల్ప సంపదతో విలసిల్లుతున్నాయి.
హరిద్వార్ పురాణ కాలంనుండి ప్రస్తుత కాలం వరకు తన పుతారన్త్వాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని నిలుపుకుంటూ అభివృద్ధి పధంలో పయనిస్తున్న భారతీయ నగరాలలో ఒకటి.హరిద్వార్ బౌద్ధుల కాలందాటి, ఆగ్లేయుల పరిపాలన చవిచూసి ప్రస్తుత ఆధునిక కాలంలో కూడా భక్తులను ఆధ్యాత్మికంగా ఆకర్షిస్తూ కొనసాగుతున్న ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రాలలో ఒకటి.

హరిద్వార్ గంగానది కొండలను దాటీ మైదానంలో ప్రవేశించే మొదటి ప్రదేశం.గంగా జలాలు ఎక్కువగా స్వచ్ఛంగా ఉంటాయి.వానాకాలం తప్పితే మిగతారోజులలో ఈ జలాలు శీతలంగానే ఉంటాయి.గంగా నది ఇక్కడి నుండి అనేక పాయలుగా విడిపోయి ప్రవహించడం వలన నదీ ద్వీపాల అనేక నదీద్వీపాలు ఏర్పడ్డాయి.ఈ నదీ ద్వీపాలు సమృద్దిగా నీరు లభించడం వలన ఏత్తైన వృక్షాలతో సుందరంగా ఉంటాయి.వర్షాలాలంలో మాత్రం రాణీ పుర్ రావ్, పాత్రి రావ్, రావీ రావ్, హరిణై రావ్, బేగమ్ నది మొదలైన కొన్ని జలపాతాలనుండి నీరు ప్రవహించి చిన చిన్న సెలఏర్లు నదిలో కలుస్తూ ఉంటాయి.జిల్లాలో చాలా భాగం అటవీ ప్రాంతం.జిల్లా సరిహద్దులలో ఉన్న 'రాజాజీ నేషనల్ పార్క్' అటవీ జీవితం, సాహస జీవితం గడపాలనుకొనే వారికి గమ్యస్థానం.
హరిద్వార్ నగరం వైశాల్యం 2360 కిమీ. ఉత్తరాఖండ్ నైరుతీ భాగంలో ఉంది. హరిద్వార్ సముద్రమట్టానికి 249.7 మీటర్ల ఎత్తులో ఈశాన్యంలో శివాలిక్ కొండలు దక్షిణంలో గంగానదుల మధ్యభాగంలో ఉంది

చూడవలసిన ప్రదేశాలు

హరి కీ పౌరీ

హరిద్వార్ లోని స్నానఘట్టము
మహారాజు విక్రమాదిత్యుడు తన సోదరుడు భర్తృహరి మరణానంతరం అతని జ్ఞాపకార్ధంగా గంగా నది తీరంలో స్నానఘట్టం కట్టించాడని ప్రతీతి. భర్తృహరి ఈ ప్రదేశంలో పవిత్ర గంగానది తీరాన తపసు చేసి ఇక్కడే తనువు చాలించిన కారణంగా అతని పేరుతో ఈ నిర్మాణాన్ని చేపట్టినట్లు ఇక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. తరువాతి కాలంలో 'హరి కా పురి'గా నామాంతరం చెందిది.ఈ పవిత్ర స్నాన ఘట్టం బ్రహ్మ కుండ్‌గా కూడా పిలుస్తారు.సాయంకాల సమయంలో గంగాదేవి హారతి ఇచ్చే ఆచారం ఉంది.తరువాత భక్తులు పితృదేవతా ప్రీత్యర్ధం నదీ జలాలలో తేలిపోయే దీపాలను వదులుతుంటారు ఈ దృశ్యం మనోహరంగా ఉండి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.1800 తరువాత కాలలంలో ఇక్కడి స్నాన ఘట్టాలను పునరుద్ధరించి అభివృద్ధి చేసారు.

చండీ దేవి

చంఢీదేవి కోవెలకు తీసుకు వెళ్ళే కేబుల్ కార్ల నిలయం
చండీ దేవి ఆలయం కాశ్మీర్ రాజు సుచత్ సింగ్ చే1929లో గంగానది అవతలి తీరంలో నీల పర్వత శిఖరం పైన నిర్మించబడింది. ఇది చండీ ఘాట్‌కు 3 కిలో మీటర్ల దూరంలో నీల్ పర్వత శిఖరంపైన ఉంది. రాక్షసరాజులైన సుంభ-నిశుంభుల సైన్యాధిపతి చండ-ముండ ఈ ప్రదేశంలో చంఢీ దేవిచే సంహరించ బడినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆ కారణంగా ఆ ప్రదేశం చంఢీ ఘాట్ పిలువబడుతుంది. ఈ దేవిని ఆదిశంకరాచార్యులు కీ.పూ 8 వ శతాబ్దంలో ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. ఈ దేవాలయాన్ని ఉదయం 8.30 నుండి సాయంత్రం 6 గంటలవరకు కాలిబాటన లేక రోప్ వే ద్వారా చేరవచ్చు. ఆలయ నిర్వహణ ఫోన్ నంబర్ 01334-220324.

మంశా దేవి కోవెల

మంశాదేవి కోవెల బిల్వ ప్రర్వత శిఖరంపైన ఉంది. మంశాదేవి అంటే మనసులోని కోరికలను తీర్చేదేవి అని అర్ధం. ఇది భక్తుల ఆకర్షణీయ కోవెలలలో ఒకటి. ఈ కోవెలను చూడటానికి కేబులు కారులో ప్రయాణం చేయడం ద్వారా ఊరంటినీ చూడటం భక్తులకు ఆనందమైన అనుభవం.ఈ కోవెలలో రెండు ప్రధాన ఆలయంలో 5 చేతులు మూడు ముఖాలు కలిగిన విగ్రహం ఒకటి, 8 చేతులు కలిగిన విగ్రహం ఒకటి మొత్తం రెండు విగ్రహాలు ఉన్నాయి.

మాయాదేవి కోవెల

11వ శతాబ్దంలో నిర్మించినట్లు అంచనా. ఇది ఆదిశక్తి ఆలయం. ఇది సిద్ధ పీఠాలలో ఒకటి. ఈ ప్రదేశంలోసతీదేవి హృదయం నాభి పడినట్లు పురాణ కథనం. హరిద్వార్ లో భైరవ ఆలయం నారాయణీ శిలా ఆలయంతో ఇది కూడా పురాతన ఆలయాలలో ఒకటి.

దక్షమహాదేవ్ కోవెల

హరిద్వార్‌కి దక్షిణంలో ఉన్న కంకాళ్ అనే ఊరిలో సతీదేవి తండ్రి అయిన దక్షుడి ఆలయం ఉంది. పురాణాల ఆధారంగా సతీ దేవి తండ్రి దక్షుడు తలపెట్టిన యాగానికి త్రిమూర్తులలో ఒకడు తన అల్లుడూ అయిన మహాశివునికి ఆహ్వానం పంపలేదు. సటీదేవి పుట్టింటి మీద మమకారాన్ని వదులుకోలేక తన తండ్రిని భర్త అయిన శివుని ఎందుకు పిలవలేదని అడగటానికి పిలవక పోయినా యగ్జానికి వెళుతుంది. అఖ్ఖడ తన భర్త అయిన శివునిను పిలవకుండా యాగం చేయడం అపరాధమని తన తండ్రిని హెచ్చరిస్తుంది. దురహంకార పూరితుడైన దక్షుడు తన కుమార్తెను అవమానించి అల్లుడైన శివుని దూషిస్తాడు. అది భరించలేని సతీదేవి అదే యజ్ఞకుండంలో దూకి ప్రాణ త్యాగంచేస్తుంది. సతీదేవి ప్రాణత్యాగం తెలుసుకున్న శివుడు తన ఆగ్రహంతో వీరభద్రుని సృష్టించి దక్షుణ్ణి సంహరించమని పంపిస్తాడు. వీరభద్రుని చేతిలో మరణించిన దక్షుణ్ణి దేవతలు, దక్షిణి భార్య కోరిక పై తిరిగి దక్షుని శరీరానికి మేక తలను అతికించి బ్రతికిస్తాడు. ఈ పురాణ సన్నివేశానికి గుర్తుగా ఇక్కడ దక్ష మహాదేవ్ కోవెల నిర్మించారు.

నీల్ ధారా పక్షుల శరణాలయం

ఈ పక్షులశరణాలయం భీమగోడా ఆనకట్ట దగ్గర ఉంది. నీల్ ధారా సమీపంలో గంగానది పై నిర్మించిన ఆనకట్ట పేరే భీమ్‌గోడా రిజర్వాయర్. ఇది ప్రకృతి ఆరాధకులకు ముఖ్యంగా పక్షులంటే ఆసక్తి కనబరిచేవారికి ఇది స్వర్గ సీమ. శీతాకాలంలో ఇక్కాడకు వలస వచ్చే విడేశీ పక్షులకు ఇది నివాసం.

సతీకుండ్

కంఖాళ్ లో'సతీకుండ్'పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన ప్రడేశాలలో ఇది ఒకటి.ఇది సతీ దేవి ఆత్మాహుతి చేసుకున్న యజ్ఞగుండం.

భీమ్‌గోడా సరసు

హరికి పురి నుండి ఇది ఒక కిలోమీటర్ దూరంలో ఉంది.ఇది పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలలో ఇది ఒకటి.పాండవులు హిమాలయాలలో ప్రయాణిస్తూ హరిద్వార్‌కి వచ్చినప్పుడు రాజకుమారుడు భీమసేనుడు దాహం తీర్చుకోవడానికి మోకాలితో కొట్టడం ద్వారా రాతినుండి రప్పించినప్పుడు ఈ సరసు ఏర్పడిందని పురాణ కథనం.

జైరామ్ ఆశ్రమ్

పాలరాతిలో చెక్కిన పాలసముద్ర మథనం దృశ్యాల ప్రదర్శన ఇక్కడికి విచ్చేసే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి.

సప్తఋషి ఆశ్రమ్ , సప్తఋషి కుండ్

హరిద్వార్‌లోని అత్యంత మనోహర దృశ్య కావ్యం ఇది. సప్తఋషులైన అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరధ్వాజుడు, గౌతములకు అనుకూలంగా ఇక్కడ గంగా నది ఏడు భాగాలుగా చీలి ప్రవహిస్తుంది.

పరాడ్ శివలింగం

కంఖాళ్ లో హరిహర ఆశ్రమంలో ఉన్న ఈ బ్రహ్మాండ శివలింగం 150 కిలోల బరువు ఉంటుంది.రుద్రాక్ష చెట్టు ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

దూధాధారి బర్ఫానీ కోవెల

ఇది దూధాధారి బర్ఫానీ ఆశ్రమంలో ఒకభాగమైన పాలరాతి కోవెల. ప్రత్యేకంగా రాముడు, సీతా, హనుమంతుని గుడులు యాత్రీకులకు ప్రత్యేక ఆకర్షణ.

సురేశ్వరీ ఆలయం
ఇది రాజాజీ నేషనల్ పార్క్‌లో ఉన్న ఈ సురేశ్వరీ దేవత గుడి. ఇక్కడి ప్రశాంత వాతావరణం యాత్రీకుల మనసు దోచుకుంటూ విస్తారంగా భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది.ఇది హరిద్వార్‌కి సరిహద్దులలో ఉంది ఇక్కడికి పోవాలంటే అటవీశాఖ అనుమతి పొందవలసి ఉంటుంది.

పవన్ ధాం

ఆధునిక కాలంలో నిర్మించిన అద్దాల మండపం. ఇప్పుడు ఇది యాత్రీకుల ప్రత్యేక ఆకర్షణ.

భారత మాత మందిర్

ఇది అనేక అంతస్తులతో నిర్మించిన గుడి. భారత మాతకు భక్తి భావంతో సమర్పించిన గుడి ఇందులో ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క శకానికి చెందిన భారత దేశ చరిత్ర చిత్రించారు. రామాయణం మొదలైన పురాణ కాలం నూడి ప్రస్తుత కాలం వరకు చరిత్ర చోటు చేసుకోవడం ఇక్కడి ప్రత్యేకత.

ఆనందమయి మాత ఆశ్రమ్

ఆనందమయి మా ఆశ్రమ్ హరిద్వార్ ఐదు ఉపనగరాలలో ఒకటైన కంఖాళ్‌లో ఉంది. శ్రీ ఆనందమయి (1896-1982) మా యొక్క సమాధి ఉన్న గుడి ఇది. ఈమె భారత దేశంలో ప్రముఖ సన్యాసిని.

పిరన్ కాలియార్
సుఫీ సన్యాసి చిష్టి ఆర్డర్ (ఈయనకు సరకార్ కబీద్ పాక్ అనే ఇంకొక పేరు ఉంది) కొరకు 13వ శతాబ్దంలో ఇబ్రహీమ్ లోడీ నిర్మించిన దర్గా.రూర్కేకి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలియార్ గ్రామంలో దర్గా ఆఫ్ హజారత్ అలాదీన్ కాలియార్ పేరుతో నిర్మించిన ఈ దర్గాకు రంజాను మాసంలో నెలబాలుడిని దర్శించడానికి భారత దేశంలోని అనేక భక్తులను ఆకర్షిస్తుంది.


ఉత్సవాలు

మతపరంగా ముఖ్యత్వం ఉన్న నగరం కనుక ఇక్కడ సంవత్సరం అంతా ఉత్సవాలు జరుగుతుంటాయి. వీటిలో ముఖ్యమైనవి సోమవతి అమావాస్య మేళా, గుఘల్‌మేళా దీనిలో 20-25 లక్షల భక్తులు పాల్గొంటారు. 12 సంవత్సరాలకు ఒక సారి జరిగే కుంభమేళా. గురు గ్రహం కుంభరాశిలో ప్రవేశించే సమయంలో 12 రోజుల పాటు జరిగే ఉత్సవం ఇది. 629 క్రీ.శ. చైనా పర్యాటకుడు హ్యూయన్ త్సాంగ్ (602-664) వ్రాసిన గ్రంథంలో ఈ ఉత్సవాన్ని గురించిన వర్ణన మొదటి వ్రాతపూర్వక ఋజువు. 1988 లో జరిగిన కుంభ మేళాలో 1 కోటి మంది భక్తులు, కుంభమేళా సమయంలో గంగా స్నానమాచరించటానికి ఇక్కడకు వచ్చి చేరినట్లు అంచనా.

ముఖ్య ప్రదేశాలు
దేవగురువైన బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు కుంభమేళా ఉత్సవం ప్రారంభమవుతుంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకొకసారి జరుగుతుంది. ఇదికాక ప్రతి 6 సంవత్సరాలకొకసఅరి అర్థమేళా జరుగుతుంది. ఈసారి అర్థమేళా, కుంభమేళా రెండూ 2010లో ఇక్కడ జరగనున్నాయి.

మంశాదేవి, చండీదేవి, మాయాదేవి అనే ముగ్గురమ్మలు హరిద్వార్ లో వెలిసిన శక్తి రూపాలు. మంశా పహాడ్ మీద మంశాదేవి, నీలపర్వతం మీద చండీదేవి ఆలయాలున్నాయి.

ఇక్కడ కంఖాల్ దేవాలయాల సముదాయంలో బృహదీశ్వరాలయం, దక్షమహాదేవాలయం, సతీకుండ్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసాడని చెబుతారు.

ప్రాచీన భారతదేశంలోని ఆశ్రమాలు విద్యవిధానం ఇక్కడ కనిపిస్తాయి. శివానందాశ్రమం, స్వర్గాశ్రమ్, పరమార్థ్ నికేతన్, గీతాభవన్ వీటిలో ముఖ్యమైనవి. గీతాభవన్ లో ఉచిత ఆయుర్వేద వైద్య కేంద్రం ఉంది.

ఇక్కడ భారతమాత మందిరం ఉంది. ఈ మందిరాన్ని 1983లో ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు.

చీలాడమ్ ఇది చక్కని విహార కేంద్రం.ఇక్కడ కృత్రిమ సరస్సు ఒకటి నిర్మించారు.ఏనుగులు, ఇతర అడవి జంతువులను ఇక్కడ చూసే వీలుంది.

శివాలిక్ పర్వతపాద ప్రాంతంలోని జంతువుల సంరక్షణకోసం ఏర్పాటుచేసింది రాజాజీ నేషనల్ పార్కు. సుమారు 820 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న కేంద్రంలో 150 ఆసియా ఏనుగులు, 23 రకాల క్షీరదాలు, 315 పక్షిజాతులు చూడవచ్చును.

ప్రయాణ వసతులు సవరించు
ఢిల్లీ మనాపాస్ ను కలుపుతూ నిర్మించిన 58వ జాతీయ రహదారిలో ప్రయాణించి హరిద్వార్‌ను చేరవచ్చు. హరిద్వార్‌లోని రైల్వే స్టేషను నుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలను చేరటం సులువే. సమీపంలో ఉన్న విమానాశ్రయం డెహరాడూన్‌లోని 'జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ '. అయినప్పటికీ ఢిల్లీ లోని ఇందిరాగాంధీ విమానాశ్రయం ద్వారా వెళ్ళడమే సౌకర్యంగా ఉంటుంది.

చంద్రమౌళి న్యాయవాది నోటరీ న్యాయవాద పరిషత్తు పశ్చిమ గోదావరి జిల్లా🙏🏻🙏🏻

🙏🏻🕉🚩🇮🇳🚩🕉🙏🏻🕉🇮🇳

మధుర కృష్ణ దేవాలయం

🕉🚩🕉🚩🕉🚩🕉🚩

🕉🚩 మధుర కృష్ణ దేవాలయం🕉🚩
మథుర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది దాదాపు ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో దక్షిణంలో ఉంది. ఇది మథుర జిల్లాకు ముఖ్యపట్టణం. ప్రాచీనకాలంలో ఇది ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. పాత కాలంలోఒంటెల మీద జరిగే వస్తురవాణా మార్గాలలో ఇది ప్రముఖ కేంద్రం. ఈ నగరంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు కనుక ఇది శ్రీకృష్ణ జన్మభూమిగా ఖ్యాతి గాంచింది. భూగర్భ చెరసాలలో జన్మించిన శ్రీ కృష్ణుని జన్మస్థలంలో ప్రాచీనకాలంలో కేశవ్‌దేవ్ ఆలయం నిర్మించ బడింది. శ్రీకృష్ణిని మేనమామచే పాలించబడుతున్న సూరసేన సామ్రాజ్యానికి మథుర రాజధాని.
మథుర బుద్ధ విగ్రహాలు తయారయ్యే ప్రాచీన రెండు నగరాలలో ఒకటి. రెండవ నగరం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న గాంధారం. రెండు నగరాలలో ఒకటిగానే క్రీ.శ మొదటి శతాబ్దంలో బుద్ధిని శిలలు చెక్కడం ఆరంభించినట్లు అంచనా. గాంధారం తయారైన శిలలు ఇండో గ్రీకు సిల్ప శైలిలోనూ మధురలో తయారైన సిలలు హిందూ దేవతల శిల్ప శైలిలోనూ ఉన్నాయి.
షెర్లాక్ హోమ్స్ రచించిన 'ది సైన్ ఆఫ్ ఫోర్' నవలలో మథురా నగర వర్ణన ఉంది.

చరిత్ర
మథురకు పురాణ కాలంనుండి చరిత్ర ఉంది. మథురా నగరం రామాయణ మహాకావ్యంలో వర్ణించబడింది. ఇక్ష్వాకు రాజకుమారుడూ దశరథ చక్రవర్తి కుమారుడూ రామాయణ మహాకావ్య నాయకుడు శ్రీరామచంద్రుని తమ్ముడైన శత్రుఘ్నుడు ఇక్కడ లవణాసురుని సంహరించినట్లు పురాణ కథనం. తరువాత ఆ దట్టమైన అరణ్యప్రదేశం మధువనంగానూ మథుపురంగానూ మథురగానూ నామాంతరం చెందినట్లు పురాణ కథనం. నిశిత పరిశోధనలు లవణాసురుడు శివభక్తుడూ శివునినుండి త్రిసూలాన్ని వరంగా పొందిన మధువు సంతతివాడనీ ఆకారణంగా ఈ నగరానికి మథుర అనే పేరు వచ్చినట్లు చెప్తున్నాయి. యాదవరాజైన మథు పేరుమీద ఈ నగరానికి ఈ పేరు వచ్చినట్లూ పురాణాల కథనం. ఇలా ఈ నగర పేరుకి సంబంధించి పలు కారణాలు పురాణాలలో ప్రస్తావించబడినాయి.
క్రీ.పూ 6 వశతాబ్దంలో సూరశేనుని సామ్రాజ్యానికి మథుర రాజధానిగా ఉండేది.క్రీ .పూ 4నుండి 2 వ శతాబ్దం వరకు ఈ నగరం మౌర్యుల పాలనలో ఉంది.క్రీ.పూ 2వ శతాబ్దంలో సుంగ సామ్రాజ్యంలో ఈ నగరం భాగమైంది.క్రీ.పూ 180నుండి 100 మధ్య ఈ నగరం ఇండో-గ్రీక్ స్వాధీనంలో ఉన్నట్లు అంచనా. ఆర్కియాలజిస్టులు ఆధారాలను అనుసరించి రచయిత బౌకర్ రచనల ఆధారంగా క్రీ.పూ 100 నుండి ఇక్కడ అధికంగా జైన మతస్థులు నివసించినట్లు విశ్వసిస్తున్నారు. మథుర కళా శైలి, సంస్కృతి కుషాలుల పరిపాలనలో బౌద్ధమతంతో ప్రభావితమైయ్యాయి.మథుర వారి రాజధానులలో ఒకటి. రెండవది పెషావర్ (పురుషపుర్). వాసుదేవ్ మనహాయించి కుషాలుల రాజులు కడ్ఫిసెస్, హువిష్క, వాసుదేవ్. కషాలులందరూ బౌద్ధ మతావలంబీకులు .
క్రీ .పూ 3 వశతాబధంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు మెగస్తనీస్ రచనలలో మథురానగర ప్రస్తావన ఉంది. ఆయన మథురా నగరాన్ని మెథొరాగా పేర్కొన్నాడు.
క్రీ.పూ. 1నుండి 3 వ శతాబ్దం వరకు మథుర కుషాల సామ్రాజ్య రాజధానులలో ఒకటిగా ఉంది.మథుర మ్యూజియం (పురాతన వస్తు ప్రదర్శనశాల) లో ఆసియాలోనే అధికంగా ఎర్రరాతి శిల్పాలు ఉన్నాయి. వీటిలో అధికంగా బుద్ధిని శిలారూపాలు చోటు చేసుకున్నాయి.
గజనీ మహమ్మద్ మథురా నగరాన్ని స్వాధీనపరచుకున్న తరువాత నగరంలోని అనేక ఆలయాలు పడగొట్టబడ్డాయి. 1018లో ఈ నగరంలోని ఆలయాలు సికిందర్ పరిపాలనలో మరికొంత విధ్వంసాన్ని చవిచూసాయి. ఔరంగజేబు పరిపాలనలో కేశవ్‌దేవ్ ఆలయంలోని కొంతభాగం విధ్వంసం అయింది. ఔరంగజేబు చక్రవర్తి అదే ప్రదేశంలో జామీ మసీద్ (శుక్రవార మసీదు) నిర్మించాడు. ఆలయంలోని అనేక రాళ్ళను మసీదు నిర్మాణంలో ఉపయోగించినట్లు అంచనా. ముఘల్ చక్రవర్తుల నుండి భరత్‌పూర్ రాజుల వశమై చివరకు మరాఠీయుల స్వంతమైంది. ప్రస్తుత కృష్ణుని ఆలయం 1815 లో గోకుల్దాస్ పరీఖ్ చే నిర్మించబడింది దీనిని ఇప్పుడు ద్వారకేశ్ ఆలయంగా పిలుస్తున్నారు.

సాహిత్యంలో మధుర

మధుడు అనే రాక్షసుడు మధురను పరిపాలించాడు. అతను గొప్ప శివభక్తుడు, శివుణ్ణి ప్రార్థించి భయంకరమైన అజేయమైన త్రిశూలాన్ని పొందాడు. మధువుకు రావణుడు స్వయానా బావమరిది అవుతాడు. ఈ ప్రాంతానికి అతని వల్లనే మధువనము, మధుపురి, మధుర, మథుర అనే పేర్లు వచ్చాయి. మధుని మరణానంతరం శూలం పారంపర్యంగా లవణుడు పొందాడు. దానితో మునులను, ప్రజలను హింసించడం ప్రారంభించగా, ప్రజలు చ్యవనమహర్షికి, ఆయన రామచంద్రునికి మొరపెట్టుకున్నారు. రాముడు అప్పటికే రావణాసుర సంహారం, వనవాసం పూర్తిచేసుకుని అయోధ్యను పరిపాలిస్తున్నాడు. రాముడు లవణాసురునిపై యుద్ధానికి తమ్ముడు శత్రుఘ్నుని పంపుతాడు. శూలం లేనప్పుడు లవణాసురుని చంపి మధురను శత్రుఘ్నుడు వశం చేసుకున్నాడు. శత్రుఘ్నుని అనంతరం ఆయన కొడుకు శూరసేనుడు, పరంపరాగతంగా వారి వారసులు ఆ ప్రాంతాన్ని పరిపాలించారు.శత్రుఘ్నుని కొడుకు శూరసేనుని పేరుమీదుగానే ఈ ప్రాంతానికి శూరసేన దేశమనే పేరు వచ్చిందని డా.వల్లూరి విశ్వేశ్వర సుబ్రహ్మణ్యశాస్త్రి భావించారు.

పురాణాల్లో మధుర సవరించు
పురాణాల ప్రకారం చంద్రవంశానికి చెందిన రాజు పురూరవుడు, అప్సరస ఊర్వశిల పుత్రుడైన ఆయువు యమునాతీరంలో మథురానగరాన్ని నిర్మించాడని కథ ఉంది.

భారత భాగవతాల్లో మధుర

మహాభారత, భాగవతాల్లో శూరసేన దేశం ప్రసక్తి పలుమార్లు కనిపిస్తుంది. ఆ శూరసేన దేశానికి మథుర రాజధాని. మహాభారతగాథకు కేంద్రబిందువైన కురుభూములకు ఈ శూరసేన దేశం దక్షిణంగా ఉంటుంది. శత్రుఘ్నుని వంశీకుల తర్వాత యదువంశీకుల అధీనంలోకి వచ్చింది. మధురను నిర్మించినట్టుగా పురాణాల్లో చెప్పబడిన ఆయువు కుమారుడు నహుషుడు. ఆయన కొడుకు యయాతికి, ఆయన భార్య దేవయానికి జన్మించిన వాడు యదువు. ఆ యదువు వారసులైన యదువంశీకుల అధీనంలోకి భారత భాగవతాల కాలంలో మధుర అధీనంలోకి వచ్చింది. యయాతి కొడుకు యదువు, అతని కుమారుడు క్రోష్ఠుడు. వారికి 42 తరాల తర్వాత వసుదేవుడు జన్మించాడు. అతని కుమారుడు శ్రీకృష్ణుడు. ఆయన ఉగ్రసేనుడి కుమారుడు, తనకు మేనమామ అయిన కంసుని సంహరించాడు. కృష్ణుని అన్న బలరాముడు మధుర పరిపాలకుడయ్యాడు. కృష్ణుడు పశ్చిమదిక్కుకు వెళ్ళి ద్వారకను నిర్మించేంతవరకూ యదువంశీకులకు మధురే కేంద్రంగా ఉండేది. జరాసంధుని దాడుల్లో దెబ్బతిన్న మధురను తిరిగి కృష్ణుని మునిమనుమడు వజ్రనాభుని కాలంలో పునర్నించబడింది.
🕉🚩🕉🚩🕉🕉🕉🚩🕉🚩

కాశీ మహా పుణ్య క్షేత్రం

🕉🚩🕉🚩🕉🚩🕉🚩 కాశీ మహా పుణ్య క్షేత్రం

కాశీ లేదా వారాణసి భారతదేశం అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం ఉంది. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అయింది. కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలోఅత్యంత పురాతనమైనది అని భావిస్తున్నారు

గంగానది, హిందూమతము, హిందూస్తానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ, సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షీ ప్రేమ్‌చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారాణసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానది ఆవలివైపున రామనగరం ఉంది. వారాణసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది.

విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత దేవాలయం, భారతమాత మందిరం - ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేధ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారాణసిని "మందిరాల నగరం", "దేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు.అమెరికన్ రచయిత మార్క్ ట్వేన్ ఇలా వ్రాశాడు - "బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైనది. సంప్రదాయంకంటే పురాతనమైనది. గాధలకంటే ముందుది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి.


వారాణసిలో ఒక స్నాన ఘట్టం
వారాణసి సవరించు

వారాణసి నగరానికి, గంగానదికి అవినాభావ సంబంధం ఉంది.
గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి.మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది.కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.

"వారాణసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాశేవారు. అది తరువాత బవారస్‌గా మారింది.'వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

చరిత్ర

1890 కాలపు బెనారస్ చిత్రం.
సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది.

వారాణసి నగరం సుమారు 3,000 సంవత్సరాల నుండి ఉన్నదని అధ్యయనకారులు భావిస్తున్నారు.[11] విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలవంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చాంగ్ (Xuanzang)ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు.


1922లో వారణాసి (బెనారస్).
18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో "రామ్‌నగర్" రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచారు. కాని ఆ రాష్ట్రానికి వారాణసి నగరంపైన మాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్ నగర్ కోటలోనే నివసిస్తున్నాడు.

పురాణకథనాలు

కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపూరాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు.అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పూరాతతత్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యౌల మత, తత్వశాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు. పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల అవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. అధర్వణవేదం సుమారుగా వేదకాల ప్రజలిక్కడ నివసించారని భాస్తున్న సమయానికి సరొపోతున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారాని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి. 8వ శతాబ్దంలో 23వ జైనగురువు, ఆరంభకాల తీర్ధగురువు అయిన పర్ష్వ జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.

గౌతమబుద్ధుడు (జననం 567 క్రీ.పూ)నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. క్రీ.పూ 528 బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. గౌతమబుద్ధుడు కాశీలోని సారనాధ్ వద్ద " ధర్మచక్రం కదిలింది (టర్నింగ్ ది వీల్ ఆఫ్ లా ) " మొదటిసారిగా గంభీరఉపన్యాసం ప్రజలకు అందించాడు. చైనా యాత్రికుడు హూయంత్సాంగ్ క్రీ.శ 635లో వారణాశిని దర్శించాడు. కాశీ పశ్చిమతీరంలో ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన వారణాశి మతం, కళలకు కేంద్రంగా ఉండేదని హూయంత్సాంగ్ వర్ణించాడు. 7వ శతాబ్దంలో హూయంత్సాంగ్ వారణాశిలో నివసించాడు. హూయంత్సాంగ్ వారణాశిని " పోలనైస్ " అని పేర్కొన్నాడు. 30 సన్యాదులకు సంబంధించిన 30 ఆలయాలను కూడా ఆయన వర్ణించాడు. 8వ శతాబ్దంలో శంకరాచార్యుడు శివారధన విధానాలను సాధికారంగా ఆరంభించిన తరువాత వారణాశి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందింది.

మౌర్యుల కాలంలో తక్షశిల, పాటలీపుత్ర మద్య ఉన్న రహదారితో కాశీపట్టణం అనుసంధానించబడి ఉంది. 1194లో వారణాశి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వశం చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్ధాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్గన్ దండయాత్ర తరువాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి. ఫెరోజ్ షాహ్ కాలంలో 1376లో వారణాశిలోని మరికొన్ని ఆలయాలు ధ్వశం చేయబడ్డాయి. ఆఫ్గన్ రాజు సికిందర్ లోడి హిదువుల ఆణిచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ధ్వశం చేయించాడు. ముస్లిం పాలన కాలంలోనే మరికవైపు వారణాశి మేధావులకు, తాత్వికులకు కేంద్రంగా మారింది. మద్యకాలంలో వారణాశి మతసంప్రదాయాలకు, విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమకాలంలో వారణాశిలో 1389లో రామభక్తుడైన కబీరుదాసు జన్మించాడు. కబీరరుదాసు రచించిన భక్తిరసపూరిత కీర్తనలు 15 వ శతాబ్దంలో భారతదేశంలో కీర్తించబడ్డాయి. అలాగే 15 వ శతాబ్దంలో సంఘసంస్కర్త, యోగి, కవి, యాత్రికుడు, మతగురువు అయిన రవిదాసు వారణాశిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ళపరిశ్రమలో పనిచేసాడు. అలాగే భారతదేశం, దక్షిణాసియా అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, బోధకులు వారణాశిని సందర్శించారు. 1507లో గురునానక్ దేవ్ శివరాత్రి సందర్భంగా వారణాశిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కుమత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది.

స్వాతంత్రానికి ముందు చరిత్ర
16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి ఆక్బర్ పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి, విష్ణుమూర్తికి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తైన అంపూర్ణాదేవి నమందిరం నిర్మించాడు. అలాగే పూనా రాజు పాలనలో శివా - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది. 16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది. 1665లో ఫ్రెంచి యాత్రికుడైన " జీన్ బాప్టిస్ట్ ట్రావర్నియర్ " ఈ నగరాన్ని సందర్శించి వారణాశిలోని గంగాతీరంలో ఉన్న " బిందు మహాదేవాలయం " సౌందర్యాన్ని వర్ణించాడు. చక్రవర్తి షేర్ షాహ్ సూరి కాలంలో వారణాశి రహదారి పునరుద్దరినబడి కొలకత్తా నుండి పెషావర్ వరకు పొడిగించబడింది. తరువాత బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రహదారి ప్రఖ్యాతమైన " గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా " అవతరుంచింది. 1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులు నిర్మించబడ్డాయి. నగరం తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ ఔరంగజేబు మరణానంతరం భారాదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు తలెత్తి వర్ద్ధిల్ల సాగాయి. ప్రస్తుతం వారణాశిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు, మరాఠా రాజులచేత నిర్మించబడ్డాయి. ప్రస్తుతం వారణాసిలోని పలు నిర్మాణాలు 18వ శతాబ్ధానికి చెంది ఉన్నాయి. బెనారస్ రాజు లేక కాశీ నరేష్ తో సహా ఈ రాజులు బ్రిటిష్ పాలనా సమయంలో (క్రీ.శ 1775-1945) కూడా కొనసాగారు. 1737లో మొగల్ చక్రవర్తుల ఆధ్వర్యంలో " బెనారస్ రాజ్యం ( కింగ్డం అఫ్ బెనారస్) " పేరుతో సాధికారంగా ఏర్పాటు చేయబడి 1947 వరకు కొనసాగింది. 18వ శతాబ్దంలో మహమ్మద్ షాహ్ ఆధ్వర్యంలో గంగాతీరంలో ఉన్న మాన్ మందిరం ఘాట్ వద్ద ఒక " అబ్జర్వేటరీ " కేంద్రాన్ని నిర్మించబడింది. ఇది జ్యీతిషశాస్త్ర విషయాల పరిశీలనకు అనుకూలమైంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బ్రిటిష్ గవర్నర్లైన వారెన్ హేస్టింగ్, వారణాశిలో సంస్కృత కళాశాలను స్థాపించిన జూనాథాన్ డంకన్ కాలంలో వారణాశి పర్యాటకం మరింత వర్ధిల్లింది. 1867లో వరణాశిలో పురపాలక సంఘస్థాపన జరిగిన తరువాత వారణాశి నగరంలో మరింత అభివృద్ధి కొనసాగింది.

ప్రత్యేక సంఘటనలు
1897లో మార్క్ ట్వైన్, వారణాశి గురించి వర్ణిస్తూ " బెనారస్ చరిత్రకంటే పురాతనమైనది. సంప్రదాయాలకంటే పాతది, పురాణాలకంటే పురాతనమైనది అలాగే అన్నింటికంటే అత్యంత పురాతనమైనది. 1910లో బ్రిటిష్ ప్రభుత్వం వారణాశిని భారతీయ భూభాగంగా చేసి రామనగరాన్ని రాజధానిగా చేసి తన న్యాయపరిధి నుండి తొలగించింది. అయినప్పటికీ తరువాత కూడా గంగాతీరంలో వారణాశి భుభాగంలో ఉన్న రామనగర్ కోటలో కాశిరాజు నివసిస్తూ ఉన్నాడు. ప్రస్థుతం రామనగర్ కోటలో కాశిరాజులకు చెందిన వస్తుసంగ్రహాలతో మ్యూజియం నిర్వహించబడుతుంది. 18వ శతాబ్దం నుండి ఈ కోటలో కాశీరాజులు నివసిస్తూ వచ్చారని ప్రాంతీయ వాసులు వివరిస్తున్నారు. రాజు మతపరంగా అధ్యక్ష స్థానంలో ఉంటాడు అలాగే ప్రజలు రాజుని శివుని అవతారంగా భావిస్తారు. రాజు స్వయంగా అన్ని మతసంప్రదాయాల సంప్రదాయాలకు ఆధిపత్యం వహిస్తుంటాడు.

1857 లో వారణాశిలో బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన భారతీయ సైనికులు స్వాతంత్ర సమరయోధుల మీద జరిగిపిన దమనకాండలో సామూహిక హత్యలు జరిగాయి. వారణాశిలో అనీబిసెంట్ దియోసాఫీ సిద్ధాంతం ప్రతిపాదించడమేగాక " సెంట్రల్ హిందూ కాలేజ్ " స్థాపన కూడా చేసింది. తరువాత సెంట్రల్ హిందూ కాలేజ్ 1916 నుండి " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " గా మారింది. ఇది మతాతీతంగా విద్యాసేవలు అందిస్తుంది. అనీబిసెంట్ సెంట్రల్ హిందూ కాలేజ్ ని అన్ని మతాలకు చెందిన మనుషులు కేంద్రీకృతమై సహోదరత్వంతో కృషిచేసి భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో స్థాపించింది. అలాగే భారతీయ సమూహాలలో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగించడం అనీబిసెంట్ లక్ష్యాలలో భాగమే. వారణాశి 1948 అక్టోబరు 15 న యూనియన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వబడింది. 2000 లో విభూతి నారాయణన్ సింగ్ మరణం తరువాత ఆయన కుమారుడైన అనంత్ నారాయణ్ సింగ్ రాజయ్యాడు. రాజు కాశీరాజు సంప్రదాయాల ఆచరణ బాధ్యతను వసహిస్తాడు.


వారాణసి నగరం రెండు సంగమ స్థానాల మధ్య ఉన్నట్లుగా చెప్పబడుతుంది. (1) గంగ, వరుణ నదుల సంగమం (2) గంగ, అస్సి నదుల సంగమం. అస్సి నది చాలా చిన్నది (కాలువ వంటిది) ఈ రెండు సంగమాల మధ్య దూరం సుమారు 2.5 కిలోమీటర్లు. ఈ రెండు సంగమ స్థానాల మధ్య (5 కిలోమీటర్ల) యాత్ర "పంచ క్రోశి యాత్ర" పవిత్రమైనదిగా భావిస్తారు. యాత్రానంతరం సాక్షి వినాయకుని మందిరాన్ని దర్శిస్తారు.


నగరంలో వాతావరణ (గాలి) కాలుష్యం ఇప్పటికి అంత తీవ్రమైన సమస్య కాదు. కాని నీటి కాలుష్యం మాత్రం బాగా ఎక్కువగా ఉంది. ఇందువలనా, నది పైభాగంలో కడుతున్న ఆనకట్టల వలనా గంగానదిలో నీటి మట్టం తగ్గుతున్నది. నది మధ్యలో మట్టి మేటలు బయటపడుతున్నాయి.

ఆర్ధికరంగం
వారాణసిలో ఉన్న ఒక పెద్ద పరిశ్రమ రైల్వే డీసెల్ ఇంజన్ల తయారీ కర్మాగారం (Diesel Locomotive Works - DLW). [కాన్పూర్‌]కు చెందిన నిహాల్ చంద్ కిషోరీ లాల్ కుటుంబం 1857లో స్థాపించిన ఆక్సిజన్ కర్మాగారం ఇక్కడి మొదటి పెద్ద పరిశ్రమ కావచ్చును.

ముఖ్యంగా పట్టు వస్త్రాల నేత ఇక్కడ పెద్ద కుటీర పరిశ్రమ. ఇంకా తివాచీల నేత, చేతి కళల వస్తువుల తయారీ ఉన్నాయి. బనారసీ పాన్, బనారసీ కోవా ప్రసిద్ధాలు. లార్డ్ మెకాలే వారాణసి ఎంతో సంపన్నమైన నగరమని, ఇక్కడ తయారయ్యే నాణ్యమైన సన్నని పట్టు వస్త్రాలు ప్రపంచంలో వివిధ సంపన్న గృహాలను అలంకరిస్తున్నాయని వ్రాశాడు. మొదటినుండి యాత్రా స్థలం అవ్వడం వలన, వారాణసి దేశం అన్ని ప్రాంతాలనుండి జనులను ఆకర్షించేది. కనుక ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందింది.

సాధారణంగా నేతపని కుటీరపరిశ్రమగా ఉంటుంది. నేవారిలో అధికంగా మోమిన్ అంసారీ ముస్లిములు ఉన్నారు. వారణాశి పలుచని పట్టువస్త్రాలు, బనారస్ పట్టు చీరలు భారతదేశం అంతటా పఖ్యాతి వహిస్తున్నాయి.

పర్యాటకులు సాధారణంగా దేశీయంగా అక్టోబరు, మార్చి మద్యలో యాత్రీకుల రాక అత్యధికంగా ఉంటుంది.
సంస్కృతి
వారాణసికి హిందూమతంలో ఉన్న ప్రాధాన్యత వలన ఇక్కడి గంగానది, స్నానఘట్టాలు, దేవాలయాలు, హిందూ మత సంస్థలు సంస్కృతీ చిహ్నాలుగా ప్రముఖంగా ప్రస్తావించబడుతాయి. ఇంతే కాకుండా పట్టు చీరల నేత,, హిందూ-ముస్లిమ్ సహ జీవనం (, మత కలహాలు కూడా), హిందూస్తానీ సంగీతం, ఘరానా, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు నగర జీవనంలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు. గంగానది తీరాన, పాత నగరంలో ఇండ్లు, ఆలయాలు, దుకాణాలు ఇరుకు ఇరుకుగా ఉంటాయి. అధిక జనాభా నగరంలో ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నారు.

గంగానది

గంగానదికి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది వడ్డున ఉన్నాయి. అనేక స్నాన ఘట్టాలు గంగానది వడ్డున ఉన్నాయి. గంగానదిలో స్నానం కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం. ఈ మత పరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.

స్నాన ఘట్టాలు

వారణాశిళొని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నాఘట్టాలలో రాతిపలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో సుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధీలు (సింధియాలు), హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లు నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్‌లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు "శివాలా ఘాట్", "కాళీ ఘాట్"లకు స్వంతదారు కాశీ మహారాజు. ఎక్కువ ఘాట్‌లు స్నానానికి, దహనకాండలకు వాడుతారు. కొన్న ఘాట్‌లు పురాణ గాథలతో ముడివడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంశించబడుతున్నాయి. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడివడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పనచగంగ ఘట్టం, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి.

తులసీ ఘాట్ వద్ద తులసీదాసు తులసీ రామాయణాన్ని రచించాడని విశ్వసిస్తున్నారు.

దశాశ్వమేధ ఘాట్

కాశీ విశ్వనాధ మందిరం ప్రక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాశిలో ఉన్న స్నాన ఘట్టాలలో అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఇది యాత్రికులతోను, పూజారులతోను, అమ్మకందారులతోను ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వెనుక ప్రక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉండడంతో ఇది ఫొటోలు తీసికొనేవారికి చాలా ప్రియమైన స్థలం. బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాథ. ప్రతి రోజూ సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు. ఇక్కడ శూలకంథేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వరాహేశ్వరుడు, అభయవినాయక ఆలయాలతో గంగా, బండిదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిరోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడడానికి యాత్రీకులు ఇక్కడి ఇక్కడ ఉన్న పడవలను మాత్రమే ఎక్కాలి. వారు ఒకసారి ఘాట్లన్నింటిని చూపించి తిరిగి ఘాటు వద్దకు బోట్లను తీసుకువచ్చి నదిలో నిలిపి వేస్తారు. యాత్రీకులు అక్కడి నుండి హారతి చూడవచ్చు. సాధారణంగా హారతి ముగిసిన తరువాత నది నిర్మానుష్యం ఔతుంది. బోటులో ఉండగానే చిన్న చిన్న వ్యాపారులు తమవస్తువులను విక్రయించడం యాత్రీకులను ఆకర్షించే విషయాలలో ఒకటి.

మణి కర్ణికా ఘాట్

మణి కర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది. మరొక కథ ప్రకారం పార్వతీదేవి తన చెవిపోగు (మణికర్ణిక)ను ఇక్కడ దాచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశద్రిమ్మరి కాడని పార్వతి ఆలోచన అట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. పురాణ కథనాల ప్రకారం ఈ మణికర్ణికా ఘాట్ యజమానే హరిశ్చంద్రుడిని కొని, హరిశ్చంద్ర ఘాట్‌లో కాటిపనికి నియమించాడు. మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్రఘాట్‌లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి. మణికర్ణికాఘాటుకు మహాశ్మశానమని మరొక పేరుకూడా ఉంది. ఈ ఘాట్ గురించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది. ప్రస్తుత ఘాట్ 1032 లో నిర్మించబడింది. 4వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఈ ఘాట్ ప్రస్తావన ఉంది. ఈ ఘాట్ వద్ద ఉన్న తారకేశ్వరాలయంలో నుండి పరమశివుడు మరణిస్తున్న వారి చెవిలో తారకనామం ఉపదేశిస్తుంటాడని విశ్వసించబడుతుంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశమిదే అని ప్రజల విశ్వాసం.

;సిండియా ఘాట్

150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఘాట్ బరువుకు ఇక్కడి శివాలయం కొంతవరకు నీట మునిగి ఉంటుంది. ఇది అగ్ని దేవుని జన్మ స్థలమని పురాణ కథనం. మగ సంతానం కావాలని కోరేవారు ఇక్కడ వీరేశ్వరుని అర్చిస్తారు. సిండియా ఘాట్‌కు ఉత్తరాన మణికర్ణికా ఘాట్ ఉంది. వెనుక ప్రక్క సిద్ధక్షేత్రంలో అనేక ముఖ్యమైన అలయాలున్నాయి.

మన మందిర్ ఘాట్

1770లో జైపూర్ రాజు మహారాజా జైసింగ్ ఈ మన మందిర్ ఘాట్‌ను, దాని వద్ద యాత్రా మందిరాన్ని నిర్మింపజేశాడు. యాత్రా మందిరం రాజస్థాన్-ఢిల్లీ శైలిలో చక్కని అలంకృత గవాక్షాలతో ఉంటుంది. ఇక్కడ భక్తులు సోమేశ్వరుని అర్చిస్తారు. అంబర్ రాజు మాన్‌సింగ్ మానస-సరోవర్ ఘాట్‌ను, దర్భంగా మహారాజు దర్భంగా ఘాట్‌ను నిర్మింపజేశారు.

లలితా ఘాట్

ఇది నేపాల్ రాజుచే నిర్మింపజేయబడింది. ఇక్కడ నేపాలీ శైలిలో చెక్కతో నిర్మించిన గంగా కేశవ మందిరం ఉంది. ఈ విష్ణ్వాలయంలో పాశుపతేశ్వరస్వామి విగ్రహం ఉంది.

అస్సీ ఘాట్


ఇది చాలా సుందరమైనది. అన్ని ఘాట్‌లకు చివర ఉంది. ఇది ఫొటోగ్రాఫర్లు, చిత్రకారులు, వాద్య బృందకారులతో కోలాహలంగా ఉంటుంది.

ఇంకా
జైన భక్తులు బచరాజ్ ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడ నది వడ్డున మూడు జైనాలయాలున్నాయి. తులసీ ఘాట్ వద్ద గోస్వామి తులసీ దాస్ రామచరిత మానస్ కావ్యాన్ని రచించాడు.

పవిత్ర క్షేత్రం 🕉

వారాణసి హిందువులందరికి పరమ పావన క్షేత్రం. ప్రతి యేటా లక్షమంది పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగాస్నానం, దైవ దర్శనం చేసుకొంటారు. ఇక్కడ విశ్వేశ్వరాలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువైయున్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు. గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు.

బౌద్ధులకు కూడా వారాణసి పవిత్ర స్థలం. కుశీనగరం, కాశీ, బోధిగయ, లుంబిని, కాశీ - ఈ ఐదు ముఖ్యమైన యాత్రాస్థలాలలని బుద్ధుడు బోధించాడు. వారాణసి సమీపంలోనే సారనాధ్ బౌద్ధ క్షేత్రం ఉంది. అక్కడ బుద్ధుడు తన మొదటి బోధననుపదేశించాడు. అక్కడి ధమేక స్తూపం అశోకునికంటే ముందు కాలానిది. ఇంకా అక్కడ చౌఖండి స్తూపం ఉన్న స్థఅనంలో బుద్ధుడు తన మొదటి శిష్యుని కలిశాడట.

జైనుల 23వ తీర్ధంకరుడైన పార్శ్వనాధుని జన్మ స్థలం అయినందున వారాణసి జైనులకు కూడా పవిత్ర స్థలమే.

వారాణసిలో ఇస్లామిక్ సంస్కృతి కూడా గాఢంగా పెనవేసుకొని ఉంది. హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలు అప్పుడప్పుడూ సంభవింఛాయి.

ఆలయాలు

వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారణాశిలో అనేక (దాదాపు 23,000) ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మంధిరం, హనుమాన్ మందిరం, దుర్గా మందిరం ( ఈ మందిర సమీపంలో నివసిస్తున్న అనేక ఉన్న కోతుల కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతుంది).

విశ్వనాధ మందిరం🚩
కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టింపించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు", "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయసమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ iఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందరిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఈ విషయం హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే విభేదాలలో ఒకటి

ఈ మందిరం అధికారిక వెబ్‌సైటు కాశీ విశ్వనాధ 2007 జూలై 23న ప్రాంభమైంది. ఈ వెబ్‌సైటులో మందిరంలోని సదుపాయాలు, పూజా వివరాలు వంటి సమాచారం లభిస్తుంది

అన్నపూర్ణామందిరం🚩
కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం.ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం,దేవాలయం వారిచే నిర్వహించ బడుచున్నది.

🚩 విశాలాక్షిమందిరం
కాశీ విశ్వనాధ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మంధిరం ఉంది.విశ్వనాధుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించడం ఆచారం.ఈ దేవాలయ పూజలు రెండు వేలల నాట్టు కోట్టై నగర సత్తరం వారిచే నిర్వహించబడుచున్నది.

శాంక్తా మందిరం🚩


సింధియా ఘాట్ వద్ద శాంక్త మందిరం ఉంది. శాంక్తామందిరంలో పెద్ద సింహంశిల ఉంది. అలాగే ఈ ఆలయంలో నగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి.

దుర్గా మందిరం 🚩
వారణాశిలో రెండు దుర్గామందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గామందిరం ఒకటి. రెండవది "కోతుల గుడి"గా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత " నాగర"శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును "దుర్గా కుండ్" అంటారు. ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగమార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు.

సంకట మోచన్ హనుమాన్ మందిరం🚩🚩
కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా, కొత్త విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసినదీతీరంలో ఉంది. ప్రస్తుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర్య సమరవేత్త, " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " వ్యవస్థాపకుడూ అయిన మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. మద్యయుగానికి చెందిన సన్యాసి, రామాయణ ( తులసి రామాయణం) సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయంలో హనుమంతునికి ప్రధానమైన మంగళ, శనివారాలలో హనుమతునికి విశేష పూజలు నిర్వహించబడతాయి కనుక ఈ రెండు రోజులలో ఆలయానికి వేలాది భక్తులు వస్తుంటారు. కష్టాలనుండి భక్తులను కడతేర్చే దేవునిగా ఇక్కడ కొలువైయున్న హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. 2006 మార్చి 7 న ఈ మందిరంలో ఉగ్రవాదులు హనుమంతునికి హారతి ఇస్తున్న సమయంలో బాంబులు పేల్చారు. అప్పుడు ఆలయంలోంవివాహబృదం పూజలు నిర్వహిస్తున్న కారణంగా అధికసంఖ్యలో భక్తులు గాయాలపాలయ్యారు. అయినప్పటికీ మరునాడు ఆలయంలో పూజాదికాలు నిర్వహిచి హనుమాన్ చాలిసా, సుందరా కాండ పారాయణం నిర్వహించి తులసీదాసు విరచిత హనుమాన్ చాలిసా, సుందరా కాండ పుస్తకాలు ఉచితంగా అందించబడ్డాయి. తీవ్రవాదుల దాడి తరువాత ఆలయంలో పోలీస్ రక్షణ ఏర్పాటు చేయబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని ఆరాధ్యాఇవాలైన సీతారాముల ఆలయం ఉంది.

తులసీ మానస మందిరం

ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత మానస్ కావ్యం వ్రాయబడింది. రామాయణం పెక్కు చిత్రాల ద్వారా కూడా చూపబడింది.పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయం కుడ్యాలు మీద తులసీ రామాయణం లిఖింబడి ఉంది. ఈ ఆలయ దృశ్యాలు శిల్పాలరూపంలో ప్రదర్శించబడుతున్నాయి. అలాగే రామాయణ కావ్యసంబంధిత తామ్రఫలకాలు కొన్ని కూడా ఇక్కడ బధ్రపరచబడి ఉన్నాయి.

భారతమాత ఆలయం

భారతదేశం యొక్క జాతీయ మానవీకరణ అంకితం భారత మాతా ఆలయం, 1936 లో మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడింది. . ఇది పాలరాతితో చెక్కిన భారతదేశం చిత్రపటణ్ ఉంది. బాబు శివ ప్రసాద్ గుప్తా, దుర్గా ప్రసాద్ ఖత్రీ, ప్రముఖ, పురాతన వస్తువులను అధ్యయన శాఖ, జాతీయ నేతలు, దాని నిర్మాణం కోసం విరాళంగా నిధులను అందించారు.

బిర్లా మందిరం

కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టిన ఆధునిక మందిరం ఇది. బిర్లా కుటుంబంచే ఈ విశ్వనాధ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడింది.ఈ ఆలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఆవరణలో బిర్లాకుంటునబం చేత నిర్మ్ంచబడింది. ఈ ఆలయానికి ప్రణాళిక వేసింది పండిట్ మదన్ మోహన్ మాలవ్యా అన్నది మరొక ప్రత్యేకత.

కాలభైరవ మందిరం
కాలభైరవుడు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణకథనం వివరిస్తుంది. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్ధిస్తారు. ఈ ఆలయం విశ్వేశ్వర్ గంజ్ ప్రధాన తపాలాఫీసు సమీపంలో ఉంది. ఈ అలయం నుండి దారానగర్ పోయే మార్గంలో మృత్యుంజయ (శివుడు) మందిరం ఉంది. ఆలయసమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. బావిలోకి పలు అంతర్గత ప్రవాహాలనుండి నీరు ఊరుతుందని ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తున్నారు.

కవళీ మాత
కవళిమాత ఒకప్పుడు కాశిలో నివసిస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె సదావిశ్వేరుని భక్తిశ్రద్ధాసక్తులతో ఆరాధించేది. శివారాధనకు ముందుగా గంగానదిలో స్నానం ఆచరించేది. గంగాస్నానం తరువాత విశ్వేశ్వర దర్శనం అయిన తరువాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది. ఒకరోజు ఆమె స్నాంచేసి గట్టుకు రాగానే ఒక హరిజనుడు ఆమెను స్పృజించాడు. హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది. అలా ఆమె స్నానం చెయ్యడం తిరిగి హరిజనుడు స్పృజించడం తిరిగి గంగాస్నానానికి పోవడం చేస్తుండగా రాత్రి అయింది. ఆమె ఆరోజంతా భోజనం చేయలేదు. కాశీ అన్నపూర్ణా మాత క్షేత్రం కనుక ఆక్షేత్ర సరిహద్దులలో ఎవరూ భోజనం చేయకుండా ఉండకూడదు కనుక అన్నపూర్ణాదేవి స్వయంగా కవళీకి ప్రత్యక్షమై తనక్షేత్రంలో ఎవరూ పస్తులు ఉండదు కనుక భోజనం చెయ్యమని చెప్పింది. కవళీ మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చెయ్యనని చెప్పింది. అన్నపూర్ణా మాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించింది. కవళీ కాశీ సరిహద్దులు దాటి వెళ్ళిన ఆమె విశ్వేశ్వర దర్శనం చెయ్యలేక పోయినందుకు చింతిస్తూ శివుని గురించి తపసు చేసింది. ఆమెకు శివిడు ప్రత్యక్షం కాగానే ఆమె " ఈశ్వరా ! నాభక్తిలో లోపమేమిటి. నన్నిలా కాశీనుండి పంపిన తరువాత నేనిక నీదర్శనం ఎలాచేయగలను. " అని ఆవేదనపడింది. ఈశ్వరుడు " కవళీ ! నీ భక్తి తిరుగులేనిది అయినప్పటికీ హరిజనుడు స్పృజించాడని తిరిగి స్నానం చేయడం అపరాధమే. నాకు హరిజనులు, పురజనులే కాదు. సకల ప్రాణులూ ఒకటే. ఎవరైనా నన్ను స్పృజించి నమస్కరించడానికి అర్హులే. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికే ఈ దండన లభించింది. అయినప్పటికీ నీభక్తికి, తపసుకు మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు " అని చెప్పి అదృశ్యం అయ్యాడు. అప్పటి నుండి కవళీ " కవళీ మాత " అయింది. కనుక భక్తులు కాశీ విశ్వేరదర్శనం చేసుకున్న ఫలితం కవళీ మాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని ఆమెతో " ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాము. కాశీ ఫలితం నాకు ఇవ్వు " అని ప్రార్థించిన భక్తులకు కాశీ పోయిన ఫలితం దక్కుతుందని విశ్వశించబడుతుంది. కనుక కాశీవిశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు.

మసీదులు
వారణాశిలో ఉన్న మసీదులలో ప్రధానమైనవాటిలో విశ్వేశ్వరాలయ సమీపంలో ఉన్న గ్యానవాపి మసీదు ఒకటి, తరువాత అలాంగిరి మసీదు, ది గంజ్ షహీదాన్ మసీదు, చుఖాంబా మసీదు మొదలైనవి. 10లక్షల ముస్లిములలో నలుగవ వంతు ముస్లిములు వారణాసిలో న నగరంలో ఉన్నచుఖాంబా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఢిల్లీ సుల్తానుల పరిపాలన ఆరంభమైన తరువాత వారణాశిలో ప్రారంభమైన ముస్లిముల రాక ఇప్పటికీ పలు తరాలుగా కొనసాగుతూ ఉంది. పెరుగుతున్న ఆ ముసల్మానుల సంఖ్య హిందూ సంస్ర్కతికి ఆటంకంగా మారింది

ముఖ్య శివ లింగాలు

వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు

విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
కాశేశ్వరుడు - త్రిలోచన్
శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
శుక్రేశ్వరుడు - కాళికా గలీ

ఉత్సవాలు

మహాశివరాత్రి పర్వదినంలో శివరాత్రి ఊరేగింపు మృత్యుంజయ ఆలయం నుండి విశ్వనాథ ఆలయం వరకు కొనసాగుతుంది.
తులసీ ఘాట్ వద్ద ద్రుపదునికి అంకితం ఇవ్వబడిన ఉత్సవాలు ఐదు రోజులపాటు నిర్వహించబడుతుంది. ఇది ఫిబ్రవరి- మార్చి మాసాల మద్య నిర్వహించబడతాయి.
సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి (మార్చి-ఏప్రిల్) హనుమంతునికి ప్రత్యేక పూజలు, హారతి, ఊరేగింపు నిర్వహించబడతాయి. 1923 నుండి హనుమాన్ సంగీత సమారోహ్ పేరిట ఐదు రోజులపాటు సాస్కృతిక సంగీతం, నృత్య ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రదర్శనకు దేశం అంతటి నుండి ప్రముఖ కళాకారులు ప్రదర్శనలివ్వడానికి ఆహ్వానించబడుతుంటారు.
రామనగర్ రామలీలా వద్ద రామచరితమానసలో వర్ణించినట్లు రామాయణం ప్రదర్శించబడుతుంది. రామనగర్‌లో 31 రోజులు ప్రదర్శించే ఈ ప్రదర్శనకు కాశినరేష్ చేత నిధిసహాయం అందుతూ ఉంది. ఈ ఉత్సవాలకు రావణసంహారంతో ముగింపు పలుకుతారు. కాశీనరేష్ చేత 1830లో ఆరంభించబడిన ఈ ఉత్సవాలను ఇప్పటికీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.
భారత్ మిలాప్ మిలాప్ పేరిట 14 సంవత్సరాల వనవాసం తరువాత రామ భరతుల సమావేశం ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంటాయి. ఈ ఉత్సవాలను విజయదశమి మరునాడు నిర్వహించబడుతుంటాయి. కాశీరాజు తనపరివారంతో రాజరీక అలంకారలతో ఈ ఉత్సవాలలో పాల్గొంటాడు. ఈ ఉత్సవాలు అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
కార్తికమాస కృష్ణచవితి నాడు కాళీయుని మీద కృష్ణిని విజయానికి సంకేతంగా కాళీయమర్ధన దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం కొరకు గంగాతీరంలో కదంబ వృక్ష శాఖను నాటి దాని సమీపంలో నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే బాలలు కాళీయుని శిరసులపై నృత్యం చేసి వేణుగానం వినిపిస్తుంటాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు గంగాతీరం, పడవలలో ఉండి చూస్తుంటారు.
గంగాఅహోత్సవాల పేరిట ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ చేత నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలను కార్తిక పూర్ణిమనాడు నిర్వహించబడుతుంటాయి. పంటల కొరకు గంగాదేవికి కృతఙత తెలుపుతూ ఈ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.
గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.
ఈ హారతి దృశ్యాన్ని గంగాతీరంలో, పడవలలో కూర్చుని వేలాదిమంది యాత్రికులు తిలకిస్తుంటారు.

అనాదిగా వారాణసి నగరం సాహిత్యానికి, పాండిత్యానికి, కళలకు నిలయంగా ఉంది. కబీర్, తులసీదాస్, రవిదాస్, కుల్లూకభట్టు (15వ శతాబ్దంలో మను వ్యాఖ్య రచయిత)వంటి పురాతన రచయితలు, భారతేందు హరిశ్చంద్ర ప్రసాద్, జయశంకర్ ప్రసాద్, ఆచార్య రామచంద్ర శుక్లా, మున్షీ ప్రేమ్ చంద్, జగన్నాధ ప్రసాద్ రత్నాకర్, దేవకీ నందన్ ఖత్రీ, తేఘ్ ఆలీ, క్షేత్రేశ చంద్ర ఛటోపాధ్యాయ, బలదేవ్ ఉపాధ్యాయ, వాగీశ్ శాస్త్రి, విద్యా నివాస్ మిత్రా, కాశీనాథ్ సింగ్, నమ్వార్ సింగ్, రుద్ర కాశికేయ, నిర్గుణ వంటి ఆధునిక రచయితలు వారాణసికి చెందినవారు. శుశ్రుత సంహితం వ్రాసిన ఆయుర్వేద శస్త్రచికిత్సానిపుణుడు శుశ్రుతుడు వారాణసికి చెందినవాడే.

రాజ కొషోర్ దాస్ (కళా శోధకుడు), ఆనంద కృష్ణ (చరిత్ర కారుడు), ఓంకార్ ఠాకుర్ పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, గిరిజాదేవి, సిద్ధేశ్వరీ దేవి, డా. లాల్ మణి మిశ్రా, డా. గోపాల శంకర్ మిశ్రా, డా. ఎన్.రాజన్, డా. రాజభాను సింగ్, పండిట్ సమతా ప్రసాద్, కంథే మహరాజ్, పండిట్ ఎమ్.కల్వంత్, సితారా దేవి, గోపీకృష్ణ, పండిట్ కిషన్ మహరాజ్, రాజన్-సాజన్ మిశ్రా (అన్నదమ్ములు), మహాదేవ మిశ్రా వంటి అనేక సంగీతకారులు వారాణసినుండి ప్రఖ్యాతులయ్యారు.

వారాణసిలో ఉత్తర హిందూస్తానంలో జరుపుకొనే పండుగలన్నింటినీ ఘనంగా జరుపుకొంటారు.

వారణాసిలో విలసిల్లిన అసమానమైన సంస్కృతి మూలంగా విదేశీ యాత్రికులకు చాలా ప్రీతిపాత్రమైన యాత్రా స్థలం. నగరంలో 3,4, 5 స్టార్ హోటళ్ళు కూడా ఉన్నాయి. అన్ని రకాల వంటకాలు లభ్యమౌతాయి.అక్కడి సంస్కృతి ప్రభావం వలన వీటిలో చాలా వరకు వీధుల్లోనే లభిస్తాయి. పట్టు వస్త్రాలకు, ఇత్తడి సామానుకు వారాణసి ప్రసిద్ధి చెందినది. ఎంతో చక్కని పనితనం ఉట్టిపడే పట్టు చీరలు, ఇత్తడి పాత్రలు, ఆభరణాలు, చెక్క సామాను, తివాచీలు, గోడకు వేలాడదీసే పటాలు, ఆకర్షణీయమైన దీపపు స్తంభాలు, హిందూ, బౌద్ధ దేవతల బొమ్మలు విరివిగా లభిస్తాయి. చౌక్, గొధౌలియా, విశ్వనాధ్ సందు, లహురాబీర్, థటేరి బజార్ ముఖ్యమైన బజారులు. పురాతనమైన వారణాశి నగరంలో నాలుగవ భాగం గంగాతీరంలోనే ఉంది. ఇరుకైన సందులతో కూడిన వీధులతో ఉంటుంది. ఇవి కొత్తవారిని చాలా అయోమయంలో పడవేస్తాయి కనుక ఇక్కడ తిరగాలంటే సహాయకుల అవసరం ఎంతైనా ఉంది. హిందూ ఆలయాలు వీధివెంబడి అంగళ్ళూ ఇక్కడ ప్రసిద్ధం. ఈ నగర పురాతన తత్వం విదేశీ పర్యాటకులను సైతం అమితంగా ఆకర్షిస్తుంది. వారణాశిలో మద్యతరగతి, ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు నివసించడానికి అనువైన ప్రదేశాలు ఆలయానికి దూరంగా ఉంటాయి. అక్కడ తక్కువ కాలుష్యం అరియు తక్కువ జనసాంద్రత ఉండడం విశేషం. అంతేకాక పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రదేశాలలో సారనాథ్ మ్యూజియం, జంతర్ మంతర్, భారత్ కళాభవన్, రామనగర్ కోట ముఖ్యమైనవి.

జంతర్ మంతర్
గంగాతీరంలో ఉన్న పర్యాటక ఆకర్షణలలో జంతర్ అంతర్ ఒకటి. ద్శాశ్వమేధ్ ఘాట్ సమీపంలో గంగాతీరంలో ఎత్తైనప్రదేశంలో జయపూర్ రాజు అయిన రాజా జై సింగ్ ఘాటును ఆనుకుని జంతర్ మంతర్ ఉంది. డిల్లీ, జైపూర్ అబ్జ్ర్వేటరీలలా వారణాశి అబ్జర్వేటరీలో ఉపకరణాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఉన్న " సన్డయల్ ఏక్వేషనల్ " ఒకే ఒకేఒక న్యక్తి నిర్వహిస్తూ వివరాలనలు నమోదు చేయబడుతున్నాయి.

రామనగర్ కోట
రామనగర్ కోట గంగానది తూర్పుతీరంలో తులసీఘాటుకు ఎదురుగా ఉంది. రామనగర్ కోటను 18వ శతాబ్దంలో కాశీనరేష్ రాజా బలవంత్ సింగ్ చేత నిర్మించబడిది. ఈ కోట చునార్ ఇసుకరాళ్ళతో నిర్మించబడింది. ఇది మొగల్ నిర్మాణశైలితో వంపైన బాల్కనీలు, బహిరంగ సభామండపాలు, సుందర ద్వారాలు కలిగిఉంది. ప్రస్తుతం ఈ కోట జీర్ణావస్థలో ఉంది. ఈ కోట, ఇందులో ఉన్న పురాతన వస్తుసంగ్రహాలయంలో బెనారస్ రాజవంశానికి చెందిన వస్తువులు బధ్రపరచబడి ఉన్నాయి.

18వ శతాబ్దం నుండి ఈ కోట కాశీనరేశ్ నివాసస్థాంగా ఉంది. ప్రస్తుతం ఈ కోటలో ప్రస్తుత కాశీనరేస్ అనంత నారాయణ్ సింగ్ నివసిస్తున్నాడు. 1971లో నుండి కాశీ రాజరికం తొలగించినప్పటికీ నామమాత్ర రాజరికం, పురాతన సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. " యాన్ ఎసెంట్రిక్ మ్యూజియం" (అసాధారణ మ్యూజియం) అన్న పేరుతో ఉన్న ఉపభాగంలో నవరత్నఖచిత పల్లకీలు, అద్భుతమైన ఆయుధశాల, అరుదైన జ్యోతిష గడియారం భద్రపరచబడి ఉన్నాయి. సరస్వతీ భవనంలో మతసంబంధిత వ్రాతపతులు భద్రపరచబడి ఉన్నాయి. గోస్వామీ తులసీదాస్ వ్రాసిన రామాయణప్రతులు కూడా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. సుందరమైన డిజైనులు కలిగిన కవర్లను తొడిగిన మొగల్ మినియేచర్ శైలిలో పలు వర్ణచిత్ర పుస్తకాలుఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. ఈ పుస్థకాలలో గంగాతీర సౌందర్యం ప్రతిబింబించే చిత్రాలు ఉన్న కారణంగా ఇవి చలనచిత్రాల ఔట్‌డోర్ చిత్రాలలో ఉపయోగించబడుతున్నాయి. ఇక్కడ నిర్మించిన చలనచిత్రాలలోంబెనారస్ పేరున్న చలనచిత్రం చిత్రం ప్రధానమైన చలనచిత్రం చిత్రాలలో ఒకటి.ఈ కోట వారణాశి నుండి 14 కిలోమీటర్ల ( 9 మీటర్లు) దూరంలో ఉంది.

ఋగ్వేదంలో ఈ నగరాన్ని "కాశి", "జ్యోతి స్థానం" అని ప్రస్తావించారు. స్కాంద పురాణంలోని కాశీఖండంలో ఈ నగర మహాత్మ్యం గురించిన వర్ణన ఉంది. ఒక శ్లోకంలో శివుడు ఇలా అన్నాడు

ముల్లోకాలు నాకు నివాసమే. అందులో కాశీ క్షేత్రం నా మందిరం.🚩🚩

🚩🕉🚩🕉🚩🚩🕉🚩🕉🙏🏻చంద్రమౌళి న్యాయవాది &నోటరీ.

కథ - అధికారం చేతిలో వుంది కదా! అని ఎవరు కూడా ప్రజలను,తనక్రింది అధికారులనూ సతాయించ కూడదు.

పూర్వం విష్ణు శర్మ అనే ఒక రాజుండే వాడు.అతడికి విపరీత మయిన కథల పిచ్చి.తన ఆస్థానం లో వున్న వారి నందరినీ కథలు చెప్పమని సతాయించేవాడు.అందరికీ విసుగై పోయింది. మంత్రి రాజుతో సంప్రదించి రాజుకు కథలు చెప్పడానికి ఎవరైనా రావచ్చుననీ తగిన బహుమానం యివ్వ బడుతుందనీ టముకు వేయించాడు.

ఎంతమందో వచ్చి ఆయనకు ఎన్నో కథలు వినిపించేవారు.ఎన్ని చెప్పినా ఆయన యింకా చెప్పమని అడిగే వాడు.అతనికి విసుగే వుండేది కాదు.ఎంత మంది వచ్చినా రాజును తృప్తి పరచ లేక పోయారు.నాకు కథలు చెప్పి తృప్తి పరిస్తే సగం రాజ్యమిస్తాను లేకుంటే మరణ శిక్ష అని ప్రకటించాడు.

కొంత మంది యువకులుసగం రాజ్యం ఆశతోవచ్చారు ఆ యనను సంతృప్తి పరచలేక మరణించారు.ఆఖరుకు మరణ భయం తో ఎవరూ రావడం లేదు.రాజు మంత్రిని పదే పదే ఈ విషయం గురించి సతాయించే వాడు.
ఒకనాడు ఒక బీద బ్రాహ్మణుడు నేను మీకు కథ చెప్తానని వచ్చాడు.సరే నని రాజు కూర్చున్నాడు.ఆ బ్రాహ్మణుడు కథ చెప్పడం మొదులు పెట్టాడు.

ఒక వూరిలో ఒక రైతు ఉండేవాడు అతను తనపొలం లో జొన్నలు పండించాడు.ఆ సారి వర్షాలు బాగా పడి విపరీత మైన పంట పండింది.ఆ రైతు ఒక పెద్ద గోదాము కట్టించి వంద పుట్ల జొన్నలను అందులో వుంచాడు.దాన్నిఅన్ని పక్కలనుంచీ మూసివేసినా ఒక మూల చిన్న కంత వుండి పోయింది.అది ఒక పిట్ట చూసింది.ఆ కంత లోనుంచి లోపలి పోయి తనముక్కున ఒక గింజ కరుచుకొని పోయింది మళ్ళీ వచ్చి ఒక గింజ ముక్కున కరుచుకొని పోయింది యిది చూసి మిగతా పిట్టలు కూడా వచ్చి ఒక్కో గింజా ముక్కున కరుచుకొని పోతూ వున్నాయి.ఒక పిట్టా ఒక గింజ,ఒకపిట్టా
ఒకగింజ అంటూ అదే మాట చెప్తూ వచ్చాడు దినాలు గడుస్తున్నా అదే చెప్తూ వున్నాడు.రాజుకు విసుగు పుట్టింది తరువాతి కథ చెప్పకుండా యిదేమిటి?అని విసుక్కున్నాడు.

అందుకు అతను మహారాజా!మరి అన్ని పుట్ల ధాన్యం అయిపోవాలికదా! ఆ తరువాతే మిగతా కథ అని మరీ ఒక పిట్టా ఒక గింజ అని మొదులు పెట్టాడు..రాజుగారికి తల బొప్పి కట్టింది.యింక చాలించు మహా ప్రభూ అన్నాడు.అందుకు వాడు
ఎలా చాలించేది ప్రభూ!చాలిస్తే నా చావు తప్పదు కదా! అని మళ్లీ మొదుల పెట్టాడు.రాజుకు విసుగు పుట్టి
యిక మీదట కథలు చెప్పమని అడగను నీకు అర్ధ రాజ్యం యిస్తాను దయచేసి యింక చాలించు అన్నాడు.

అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు. యింకేప్పుడూ కథలు చెప్పమని ఎవరినీ యిబ్బంది పెట్టకండి. అర్ధ రాజ్యం నాకేమీ వద్దు కొంత ధనం యిప్పించండి చాలు అన్నాడు.అప్పుడు రాజు అతనికి జీవితానికి సరి పడా ధనం యిచ్చి పంపించాడు.అందరూ ఈ కథల పీడ వదిలించి నందుకు ఆ బ్రాహ్మడిని అభినందించి ఊపిరి పీల్చు కున్నారు..అప్పటి నుండీ ఆ రాజు బుద్ధి తెచ్చుకొని ప్రజానురంజకంగా పరిపాలించాడు.

అధికారం చేతిలో వుంది కదా! అని ఎవరు కూడా ప్రజలను,తనక్రింది అధికారులనూ సతాయించ కూడదు.ఏ విషయం లోనైనా సరే.
మా చిన్నప్పుడు ఎప్పుడో ఈ కథ చందమామ లో చదివాను.
.👏👏👏
Source: whatsapp sandesam

నీ మది చల్లగా...ఆత్మీయ అన్యోన్య దాంపత్యానికి ఇదే తరుణం

నీ మది చల్లగా...ఆత్మీయ అన్యోన్య దాంపత్యానికి ఇదే తరుణం

జీవితం ఒక మంచి విశ్రాంతి సమయం ఇచ్చింది...భవిష్యత్ గురించి నిద్రలేని రాత్రులు వద్దు...భార్య ఎన్నాళ్ళ నుండో ఎదిరిచూసే సమయం వచ్చింది...30 రోజులు కాదు 90 రోజులు ఏకాంత సమయం దొరికింది... సీతాదేవి... ద్రౌపదికి వచ్చిన కష్టం కంటే ఇది ఎక్కువ కాదు.. సీత భర్త వియోగం తో బాధపడింది..పట్టపురాణి ద్రౌపది చుట్టూ భర్తలు ఉన్నా విరాటకొలువులో దాసి పాత్ర పోషించింది. అలాంటి కష్టం కాదు కూడా ఇది..

ఉన్న నాలుగు రోజులు భర్త కళ్లెదుటే కనిపించడమే స్త్రీ చేసుకున్న అదృష్టంగా భావించండి! ఇప్పుడు భర్తను వేధించవద్దు.. ఆయన పడుతున్న బాధకు సాంత్వన కావాలి! ఏ విధి మారినా దైవం మారదు కదా!! ఇప్పుడు కలిమి కాదు లేమి అనుకో ! భర్తకు రెండు ధైర్య వచనాలు చెప్పి తల్లిలా లాలించు!! ఆయన మది సేద దిరేలా సపర్యలు చేయి! అదే భర్తకు వెయ్యేనుగుల బలం!!

ఏ సిరులు - ఏ నిధులు - ఏ సౌఖ్యం లెందుకు ఆత్మ శాంతి ఇప్పుడు కావాలి!! మనసు తనది కానప్పుడు మనిషిని సూటి పోటీ మాటలతో నరకం చూపించకుండా అక్కున చేర్చుకునే అడజన్మ సార్థకం అయిందని భావించు!! ఈ సమయాన్ని ఆస్వాదించాలి.

కొన్నిసార్లు పలు విషయాల్లో దంపతులిద్దరూ తీవ్రంగా స్పందించకండి! ఊర్మిళ ఎంత సహనం చూపించిందో ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోండి..14 ఏళ్ళు భర్త కు దూరంగా ఉన్న దురదృష్టం మీకు రాలేదు!! దంపతులిద్దరూ గౌరవించుకోని భవిష్యత్ కార్యచరణకు రూపకల్పన చేసుకునే రోజులని భావించండి!! ఆ సమయం ఇప్పుడు భగవంతుడు ఇచ్చాడు! పెళ్లి అనే బంధాన్ని నిలబెట్టే రెండు స్తంభాలు నమ్మకం, విశ్వాసం ఆ విశ్వాసం మీ కళ్ల ముందు ఉంది!

నల మహారాజు దమయంతి కథలో ఈ నీతి ఉంటుంది భర్త తనను గౌరవించినా, గౌరవించకపోయినా రాజ్యభ్రష్టుడైనా, దరిద్రుడైనా ఆర్తుడైనా, వ్యసనపరుడైనా, జూదపరుడైనా, భార్య ఎట్టి పరిస్థితులలోనూ కోపాన్ని చూపరాదు.’’ఇప్పుడు వచ్చిన కష్టం చాలా చిన్నది...🤏ఎంతో మంది పతివ్రత శిరోమణులకు వచ్చిన కష్టం కన్నా ఇది పెద్దదేమి కాదు...

తార, అహల్య, మండోదరి , కుంతి,
ద్రౌపది వీరిని ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోండి..భర్తల బాధితులు వారు.. ఆ బాధలు ముందు ఈ లాక్ డౌన్ ఒక బాధే కాదు!! ఇప్పుడు జయించే సూత్రం మీది!! ఆ మంగళ సూత్రం మీ దగ్గర ఉంది. ఇక విజయ కెరటాలు మీ ముంగింట్లో ఉన్నట్లే!!..

శ్రీమద్భాగవతం లోని కథ - రంతిదేవుడు

శ్రీమద్భాగవతం లోని కథ
రంతిదేవుడు
🕉️🌞🌎🏵🌼🚩

పూర్వం రంతిదేవుడను రేజేంద్రుడుండెడి వాడు. ఆతడు రాజైననూ మహాయోగి వలె విషయ వాంఛలకు లోనుగాక నిరతం హరినామ స్మరణతో కాలంగడిపేవాడు. దైవవశమున లభించిదానితోనే తృప్తిపడేవాడు. ఆ రాజు తన సంపదలను దానం ఇచ్చి ఇచ్చి బీదవాడైనాడు. కుటుంబంతో సహా చాలా కష్టాలపాలైనాడు. నలభై ఎనిమిది రోజులు అన్నము నీళ్ళు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా గుండెదిటవు కోల్పోలేదు.

ఒకరోజు ప్రాతఃకాలమున అతనికి నెయ్యి పాయసము హల్వ నీళ్ళు లభించాయి. భోజనకాలం వచ్చాక రంతిదేవుడు సకుటుంబముగా భోజనముచేయ సిద్ధపడ్డాడు. భరింపరాని క్షుత్పిపాసల బాధతీర్చుకుందామని అనుకుంటుండగా ఓ దీన బ్రాహ్మణుడు అతిథియై వచ్చాడు. రంతిదేవుడెంతో ప్రేమతో అతని గౌరవించి హరిసమర్పణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతడికిచ్చాడు. ఆ విప్రుడు కడుపారా భుజించి సంతృప్తుడై వెళ్ళాడు.

ఇంతలో ఒక శూద్రుడు వచ్చి అన్నంపెట్టమని అడిగాడు. వచ్చిన అభ్యాగతునిలో భగవంతుడిని దర్శించి ఆదరంతో ఆ శూద్రునికి ఆహారంలో ఒకభాగాన్నిచ్చాడు రంతిదేవుడు. వాడు సంతృప్తిగా తిని వెళ్ళాడోలేదో కుక్కల గుంపుతో ఒకడువచ్చాడు. “రాజా! నేను ఈ కుక్కలు ఆకలిచే మిగుల పీడితులమై యున్నాము. మాకు సరిపోయే ఆహారము ఇమ్ము” అని వాడన్నాడు. అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచిమాటలాడి పంపాడు రంతిదేవుడు.

ఇక రంతిదేవుని వద్ద నీళ్ళొకటి మిగిలాయి. అదీ ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు కడగడుతున్న రంతిదేవుడు అవి త్రాగబోగా ఓ చండాలుడు వచ్చి ఇలా అన్నాడు “అయ్యా! నేను చాలా దీనుడను. చాలా దాహంగా ఉంది. నీరసముతో అడుగు ముందుకు వేయలేకున్నాను. నీవద్దనున్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు”. ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుని చూచి “ఓ అన్నా! నావద్ద అన్నంలేదు కాని ఈ తీయ్యని నీళ్ళున్నాయి. దగ్గరకురా. నీ దాహం తీరేటట్లు త్రాగు.

ఆపదకలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థమేమున్నది మానవులకు”? అని రంతిదేవుడన్నాడు. తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్కచేయక రంతిదేవుడు “నా జలదానంతో ఈతడి బాధ ఆయాసం దాహం తొలగితే నాకంతే చాలు. అంతా ఈశ్వరేచ్ఛ” అని ఆ చండాలుని పాత్రలో నీళ్ళు పోశాడు.

బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమై జరిగినదంతా విష్ణుమాయా ప్రభావం అని చెప్పారు . బ్రాహ్మణ శూద్ర చండాల వేషములలో వచ్చినది వారే అని ఎఱుక కల్గించి ఆశీర్వదించారు. రంతిదేవుడు వారికి నమస్కరించినాడు. ధీరుడైన రంతిదేవుడు వారిని ఏదీ కోరలేదు. స్థిరమైన విష్ణుభక్తులకే కోరికలుండవు కదా! కడకు విష్ణుపదాన్ని పొందాడు. ఆ రాజేకాదు ఆ రాజు కథను బాగా విని అర్థంచేసుకున్న వాళ్ళందరూ ఆతని మహిమచే యోగులై కడకు మోక్షం సంపాదించారు.

🕉️🌞🌎🏵🌼🚩

కాశీలో వదిలేయడం!

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కాశీలో వదిలేయడం!
➖➖➖✍️

కాశీకి వెళ్లినప్పుడు ఇష్టమైన వాటిని ఎందుకు వదులుతారో తెలుసా?

పరమాత్మ....
ఈశరీరం,ఇంద్రియాలు,బుద్ది,మనస్సు,
అవయవాలు అన్నిటిని ఇచ్చారు!

పరమాత్మ ఇచ్చిన వీటితో ఆయనకు సేవ చేయాలి. మనస్సుతో ధ్యానం చేయటం, చేతులతో పూజ చేయటం, నాలుకతో భగవంతుణ్ణి నామస్మరణ చేయటం, కనులతో స్వామిని చూడటం, చెవులతో భగవంతుని కథలను వినటం, భగవంతుని పాదాలపై ఉంచిన తులసి మాలని ముక్కుతో వాసన చూడటం, కాళ్లతో దేవాలయాలకు, భక్తుల ఇళ్లకి వెళ్ళటం, మాట్లాడిన నాలుగు మాటలలో ఒకటి భగవంతుని గురించి మాట్లాడటం వంటివి చేస్తే సంసారంలో
ఉన్నా సన్యాసంలో ఉన్నట్టే!

కానీ కన్ను, ముక్కు, చెవులు, నాలుకకు ప్రకృతిలో లభించేవే ఇష్టం!

ఇలా చేయటం ఎవరికైనా కష్టమే.
మన ఇష్టాల కోసం భగవంతుడిని కూడా వదులుకుంటున్నాం. ఈవిధంగా చేయటం వలన మనకు కష్టాలే ఎక్కువగా వస్తాయి.

ఎక్కువగా తింటే అజీర్ణ వంటివి వస్తాయి. భగవంతుణ్ణి వదిలి ఇష్టాలను పట్టుకుంటే కష్టాలు ఎదురవుతాయి.

అదే మన శరీరానికి బాగా ఇష్టమైన వాటిని భగవంతుని కోసం వదిలితే మనసు, బుద్ధి, శరీరం ప్రసన్నంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

ఇలా ఇష్టమైన అన్నింటినీ వదిలేస్తే కష్టం కాబట్టి ఒక్కో క్షేత్రంలో ఒక్క ఇష్టాన్ని వదిలితే కోరికలు తగ్గుతాయి. అలా కాశీలో వదిలిన వాటిని జీవితంలో అసలు ముట్టుకోరు.
కాశీలో వదిలిన కూరగాయ, పండు ఇలా ఏదైనా ఒకసారి వదిలితే వాటి జోలికి అసలు వెళ్ళరు. ఇలా వదలటంలో పరమార్ధం ఏమిటంటే శరీరంలో కోరికలు తగ్గి మనస్సు ప్రశాంతంగా, నిగ్రహంగా ఉంటుంది...✍️
🙏హర హర మహాదేవ శంభో శంకర🙏

🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఇస్లాం మత వ్యాప్తి, వాళ్ళ ప్లానింగ్

ఇస్లాం మత వ్యాప్తి, వాళ్ళ ప్లానింగ్
.................................................
ఒక్కో స్టేజ్ లో ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం ...
ఒక హార్వర్డ్ యూనివర్సిటీ
అధ్యయనానికి
క్లుప్తంగా నా తెలుగు అనువాదం ...

ఆ అధ్యయనం ప్రకారం ... ఒకసారి గనక ఏదైనా దేశ జనాభాలో ముస్లిమ్స్ శాతం 16 శాతాన్ని దాటితే
ఇక ఆ దేశం ఏదో ఒక రోజు పూర్తి
ఇస్లామిక్ దేశంగా మారటం తథ్యం ... వంద లేదా నూట యాభై ఏళ్ళ లోపు
దశలవారీగా ఇది జరిగిపోతుంది .
ప్రత్యక్ష ఉదాహరణలు :
ఒకప్పుడు క్రిస్టియన్ దేశాలైన టర్కీ ,
ఈజిప్టు, సిరియా ....
ఒకప్పటి హిందూ దేశమైన పాకిస్తాన్ ... ఒకప్పటి బౌద్ధ దేశమైన ఆఫ్గనిస్తాన్ ....
ఒకప్పటి జొరాష్ట్రియన్ దేశమైన ఇరాన్ ....
ఇవన్నీ నేడు ఇస్లామిక్ దేశాలు ...

మొదటి దశ : ముస్లిం జనాభా 2 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడు :
వాళ్ళు శాంతికాముక మతంలా నటిస్తూ
అందరితో కలిసి ఉంటారు ( ఉదాహరణకు అమెరికా , ఆస్ట్రేలియా , కెనడా, చైనా , ఇటలీ , నార్వే )

రెండో దశ : వీళ్ళ జనాభా 2 నుండి 5 శాతానికి పెరిగిన తర్వాత :
వీళ్ళు ఆయా దేశాల్లో బాగా వెనుకబడిన ఇతరజాతులనుండి , చెరసాలల నుండి , వీధి రౌడీలగ్యాంగ్స్ నుండి వేల సంఖ్యలో జనాలను తమలో చేర్చుకుంటారు (
ఉదాహరణకు డెన్మార్క్ ,జర్మనీ, బ్రిటన్,
స్పెయిన్ , థాయిలాండ్ )

మూడో దశ : వీళ్ళ జనాభా 5 శాతం
కన్నా పెరిగిన తర్వాత :
వీళ్లకు కావాల్సినవి డిమాండ్ చేయటం
మొదలు పెడతారు ... హలాల్ ఫుడ్ లాంటివి ... డిమాండ్స్ తీర్చకపోతే
దాడులకు , బెదిరింపులకు తెగబడతారు .. వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో తమ సొంత షరియా చట్టాలు ఉండాలని డిమాండ్ కూడా మొదలు పెడతారు ( ఉదాహరణకు ఫ్రాన్స్ , ఫిలిపీన్స్ , స్వీడెన్ స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ , ట్రినిడాడ్ టుబాగో )

నాలుగో దశ : వీళ్ళ జనాభా పది శాతం దాటిన తర్వాత :
ఆయా దేశాల్లో ప్రభుత్వ నిర్ణయాలకు
వ్యతిరేకంగా చిన్న విషయాలను కూడా
మతంతో ముడిపెట్టి పెద్దఎత్తున గొడవలు , లూటీలు , దహనాలకు పాల్పడతారు ( ఉదాహరణకు గయానా , ఇండియా , ఇజ్రాయెల్ , కెన్యా , రష్యా )

ఐదో దశ : వీళ్ళ జనాభా 20 శాతం
దాటిన తర్వాత :
ఉగ్రవాదుల గ్రూప్స్ తయారవుతాయి ...
హత్యలు, బాంబు దాడులు , మెజారిటీ
మతానికి సంబంధించిన ప్రార్ధనా
మందిరాల పేల్చివేత ... ( ఉదాహరణకు ఇథియోపియా )

ఆరో దశ : వీళ్ళ జనాభా 40 శాతం
దాటిన తర్వాత :

భారీ ఎత్తున మారణహోమం , తరచూ జరిగే భారీ ఉగ్రవాద దాడులు (
ఉదాహరణకు బోస్నియా , చాద్ ,
లెబనాన్ )

ఏడో దశ : వీళ్ళ జనాభా 60 శాతం
దాటిన తర్వాత :
ఇస్లాంను అంగీకరించని వారిని షరియా చట్టం లాంటి వాటిని ఉపయోగించి
సామూహికంగా అంతమొందించడం ,
జిజ్యా లాంటి పన్నులు వేసి వారిని
వేధించటం ( ఉదాహరణకు
అల్బేనియా , మలేసియా , ఖతార్ ,
సుడాన్ )

ఎనిమిదో దశ : వీళ్ళ జనాభా 80 శాతం దాటిన తర్వాత :
ఇస్లాంను అంగీకరించని వారిని
ప్రతిరోజూ అంతమొందించటం , నూరు శాతం ఇస్లాం దేశంగా మారటమే
ధ్యేయంగా ఇతరులను
తరిమి కొట్టటం ( ఉదాహరణకు బాంగ్లాదేశ్ , ఈజిప్టు , గాజా , ఇండోనేషియా , ఇరాన్ , ఇరాక్ , జోర్డాన్, మొరాకో , పాకిస్తాన్, పాలస్తీనా, సిరియా , తజికిస్థాన్ , టర్కీ , యూఏఈ )

తొమ్మిదో దశ : వీళ్ళ జనాభా 100
శాతమయ్యాక :
అందరూ ముస్లిమ్స్ కదా ...ఇకమీదట శాంతియుతంగా ఉంటారా అంటే ... అదీ జరగదు .... సున్నీ లు షియాలను చంపడం , అతివాద ఇస్లాం మాత్రమే ఉండాలని మితవాద ఇస్లాంను
అణచివేయటం జరుగుతూ ఉంటాయి ( ఉదాహరణకు ఆఫ్గనిస్తాన్ , సౌదీ
అరేబియా , సోమాలియా , యెమెన్ )

కొసమెరుపు :
ప్రస్తుతం ప్రపంచ జనాభాలో దాదాపు 25శాతం ఉన్న వీళ్ల జనాభా ఈ శతాబ్దం
అంతానికి 50 శాతం దాటటం ఖాయం ...
కారణం ... మిగిలిన ఇతర మతాలు
అన్నిటినీ కలిపినా ముస్లిం జననాల
సంఖ్యకు సమీపంలోకి కూడా రాలేవు ...

కాబట్టి ....
సెక్యులరిజం పేరుతో త్వరత్వరగా మన గొయ్యి మనమే
తీసేసుకుందామా ... లేక కాస్త
అవగాహన పెంచుకుని అందుకు
తగ్గ ప్రభుత్వాలను ఎన్నుకుని మన
గొయ్యితీసే కార్యక్రమాన్ని కొన్ని దశాబ్దాలపాటు
వాయిదా వేద్దామా ?
నిర్ణయం మనదే ..
..................................


జై హింద్ 🙏🙏🙏

ఓ హిందూ మేలుకో.....
source:whatsapp sandesham

భావనరుషి

🕉🙏🏻🚩28-4-2020తేదీన భావన ఋషి జయంతి జరుపుకోబోతున్న సందర్భముగా

భావనరుషి

భావనాఋషిపద్మశాలీ వంశ మూలపురుషుడు. ఆయన సాక్షాత్తూ శ్రీ మన్నారాయణుని అంశగా భక్తుల విశ్వాసం.

జీవిత విశేషాలు
ఈయన భృగు వంశమున జన్మించిన "భార్గవ" శ్రేష్ఠుడు. ఆయనకు వేద శిర్షుడు (వేదములకు శిరస్సు వంటివాడు, బహూత్తమ, వస్త్ర బ్రహ్మ, అనేక బిరుదులున్నాయి. సకల లోకాలకు వస్త్రదానం చేసి మానవుల మానప్రాణాలను కాపాడిన ఋషి శ్రేష్ఠుడు. ఈయన శ్రీ మార్కండేయుని పుత్రుడు. ఆయన శ్రీ భావానారాయణ స్వామిగా పిలువ బడుతున్నాడు. ఆయన వైశాఖ శుద్ధ పంచమి మృగశిర నక్షత్రంలో జన్మించారు.
వంశక్రమము
దక్ష ప్రజాపతి పుత్రిక ఖ్యాతీ దేవిని భృగు మహర్షి వివాహం చేసుకొనిరి. వారి సంతానం ధాత, విధాత, శ్రీ మహాలక్ష్మీ. మహాలక్ష్మిని మహా విష్ణువు వివాహమాడెను. (దుర్వాస మహాముని శాపవశమున విష్ణువుని వీడి తిరిగి సముద్రమున జన్మించెను[2]) ధాత-ఆయతిల సంతానం ప్రాణుడు మర్క్యు దధీచీ. విధాత -నియతీ దేవిల సంతానం మృఖండ మహర్షి, మనస్విని (ముద్గల మహర్షి పుత్రిక). మృఖండ మహర్షికి శివుని వరప్రసాదమున బ్రహ్మజ్ఞాని అయిన మార్కండేయుడు జన్మించెను. మార్కండేయుడు, దూమ్రావతి లకు భావనా ఋషి, పంచమా ఋషి జన్మిస్తారు. వారిలో జ్యేష్టుడైన భావనాఋషి శ్రీమన్నారాయణుని అంశ, చేతిలో సహస్ర దళ పద్మము ధరించినవాడై ఉద్భవించేను. అతను జన్మతః సకల శాస్త్రా ప్రావీణ్యుడు, బ్రహ్మ సమానుడు కనుక "వేద శీర్షుడు" అని కొనియాడగా శ్రీ మన్నారాయణుని మనసున కలిగిన భావాన శక్తికి రూపం కనుక "భావనారాయణ" అని నామకరణం చేసిరి. శ్రీ భావానారాయణ స్వామి వైశాఖ శుద్ధ పంచమి మృగశిర నక్షత్రంలో జన్మించారు. ఇతడు కాలువాసురుడు అనే రాక్షసుడిని సంహరించటమే కాకుండా నగ్నత్వాన్ని ఛేదించినవాడై వస్త్ర సృష్టి చేసి సకల లోకాలకు పూజ్యుడైనాడు.
మార్కండేయుడు అల్పాయుష్షు గురించి తెలుసుకొని తపస్సు చేసి శివుని నుంచి చిరంజీవిగా వరం పొందుతాడు. అదే సమయంలో దేవతలు, మునీశ్వరులు వస్త్రాలు లేక తమ దీన స్థితిని విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. మార్కండేయుని సంతతియే వారి దీన స్థితిని తొలగిస్తారని విష్ణువు అభయమిచ్చి పంపుతాడు. దేవతల కోరిక మేర మార్కండేయుడు తన ఆయుష్షంత ఆయుష్షుకల్గిన దూమ్రావతిని పెళ్ళి చేసుకొని పుత్ర కామేష్టి యాగం చేయగా భావనా ఋషి, పంచమా ఋషి జన్మిస్తారు. వీరు పెరిగి పెద్దవారై ఏమి పనిచేయాలని తండ్రిని అడుగుతారు. శివుని ఆజ్ఞమేర విష్ణువు దగ్గరకు వెళ్లమని చెపుతాడు మార్కండేయుడు. అదే సమయంలో దేవతలు, మునీశ్వరులు వస్త్రాలు లేక తమ దీన స్థితిని విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటారు. మార్కండేయుని సంతతియే వారి దీన స్థితిని తొలగిస్తారని విష్ణువు అభయమిచ్చి పంపుతాడు. దేవతల కోరిక మేర మార్కండేయుడు తన ఆయుష్షంత ఆయుష్షుకల్గిన దూమ్రావతిని పెళ్ళి చేసుకొని పుత్ర కామేష్టి యాగం చేయగా భావనా ఋషి, పంచమా ఋషి జన్మిస్తారు. వీరు పెరిగి పెద్దవారై ఏమి పనిచేయాలని తండ్రిని అడుగుతారు. శివుని ఆజ్ఞమేర విష్ణువు దగ్గరకు వెళ్లమని చెపుతాడు మార్కండేయుడు. ఇదంతా దైవకార్యమేనని తెలుసుకొని పులిచర్మం కోసం భావనాఋషి భద్రావతి దగ్గరకు వెళ్లి పులులను తెస్తుండగా, నారదుడు ప్రేరేపించగా కాలువాసురుడనే రాక్షసుడు ఎదురు వచ్చి భావనాఋషితో యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధంలో భావనాఋషి అలిసిపోగా అతని చెమట నుంచి కూనపులి జన్మించి భావనాఋషికి యుద్ధంలో సహాయం చేస్తాడు. కాలువాసురున్ని యుద్ధంలో సంహరించి అతని దేహ భాగాలతో మగ్గం నిర్మించి వస్త్రం నిర్మిస్తాడు. ఆ తర్వాత దేవతల కోరిక మేరకు భావనాఋషి భద్రావతిని పెళ్ళి చేసుకొని నూట ఒక్క మంది సంతానానికి జన్మనిస్తాడు. వీరంతా పద్మశాలీలుగా పిలువబడుతూ నూటొక్క గోత్రాలుగా వర్ధిల్లుతున్నారు..
పద్మసంహిత గ్రంథమూల చరిత్ర
పూర్వం కాలువాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మవరం పొందినవాడై సకల దేవతలను మానవులను హింసించుచుండెను అందరు వాడి నుండి విముక్తి కొరకు మహా విష్ణువుని ప్రార్థించగా తన వంశజుడు ఋషి శ్రేష్టుడు భార్గవుడు అయిన మార్కండేయుడిని యజ్ఞము చేయవలసినదిగా కోరెను. బ్రహ్మచారి అయిన మార్కండేయునకు అగ్ని తన పుత్రిక అయిన దూమ్రావతిని ఇచ్చి వివాహం చేసెను. వారు సకల దేవతా సమక్షమున "మహా వారుణిక" అను యజ్ఞము చేసిరి. యజ్ఞఫలము హోమం నుంచి ఆజానుబాహుడు, తేజోమూర్తి అయోని సంభవుడు అయిన శ్రీ మహా విష్ణువు అంశగా "వేద శీర్షుడు" భావనారాయణుడు ఉద్భవించెను. అతనికి సూర్య పుత్రిక అయిన "భద్రావతీ దేవి"ని ఇచ్చి వివాహం చేసిరి. మానవాళికి నగ్నత్వం నుంచి విముక్తి కలిగించదలచి మహావిష్ణువు నాభి యందలి పద్మము (కమలము) యందలి తంతువులు గ్రహించి ఓతము (ఋగ్వేదం) - పడుగు, ప్రోతము (అధర్వణ వేదం) -ప్యాక అను వేదసారమున యంత్రములు సృష్టించి ధర్మ పత్ని సమేతుడై "మణిపురము"న గృహము నిర్మించి చైత్ర శద్ధ పంచమి రోజున మొట్టమొదటి "లక్ష్మీ విలాసం" అను ఉత్కల పౌష్టిక వస్త్రములు సృష్టించెను. వాటిని లక్ష్మీనారాయణులకు సమర్పించగా ఆనందభరితములైన వారు సకల సంపదలు ఒసంగి పద్మ బ్రహ్మ, బహోత్తమా అను బిరుదాంకితం చేసిరి.
బ్రహ్మసరస్వతులకు సమర్పించగా సంతోషమున 64 కళల సారస్వతమును అఖండ బ్రహ్మ జ్ఞానమును ఒసంగెను. శివ పార్వతులకు సమర్పించగా గౌరిదేవి మృత సంజీవని విద్య శాంభవీ విద్యలను అనుగ్రహించెను. శివుడు పులిచర్మం కోరగా పెద్దపులిని చూసి నఖఃశిక పర్యంతం శుభ్రంచేసి సమర్పించెను. అంతట సంతోషించి పెద్దపులి వాహనం పెద్దపులి ధ్వజం అందించెను. సకల దేవతలు సంతోషభరితులై 36 బిరుదులు బహూకరించెను. మహావిష్ణువు వేద శీర్షుణకు నూరు పద్మములు ఇచ్చెను. వాటి ప్రసాదమున నూరు మంది మహర్షులు సంతానం కలిగిరి.
శ్లోకం: అజరాశ్చతయోః పుత్ర పౌత్రష్చ బహవో భవన్! మార్కండేయ సమాఖ్యాతాః ఋషయో వేద పారగా!!
తాత్పర్యం: భావనారాయణునకు పుత్రులు, పౌత్రులు కలిగి వారు మార్కండేయుని వలె అఖండ మేధోసంపన్నులై, ఋషుశ్రేష్టులు, వేదపారంగతులు, పద్మశాలీ వంశ మూల పురుషులు అయ్యారు. భావానారాయణుడు పుత్ర సమేతుడై కాలువాసురునితో యుద్ధం చేసి అతి భయంకర యుద్ధమున "మహా నారాయణ అస్త్రం" ఉపయోగించి కాలువాసురుని సంహరించెను. అంతట సకల దేవతలు ప్రత్యక్షమై పుష్పవర్షం కురిపించగా సకల జనులు జయ ధ్వానాలు పలికెను అంతట మహా విష్ణువు ప్రత్యక్షమై ఇలా పలికెను.
శ్లోకం:స్మేరా వనస్తతశ్చాః వచనం ప్రతిజ్ఞకాః 'భవత్కుల ప్రసూతాయే తే సర్వే మామకా స్మృతాః'
తాత్పత్యం: ఓ భావనారాయణా నీకు ఒక వచనం ప్రతిజ్ఞ చేయుచున్నాను. నీ వంశమున పుట్టిన వారందరు నా వంశము వారే నా మతము వారే అవుతారు.
శ్లోకం: యువాంతు పద్మకోశియైః పూజనీయ ద్విజాదిభిః యోవైన పూజ్యతే తౌతు మమ ద్రోహి భవేదృవం'
తాత్పర్యం:పద్మకోశమున (పద్మశాలీ) కులమున పుట్టిన వారందరు బ్రాహ్మణాది చాతుర్వర్ణములచే సమస్త కులములచే సమస్త జాతులచే పూజింపతగినవారై ఉన్నారు. అట్లు పూజింప తగిన మిమ్ములను పూజింపని వారు నాకు ద్రోహం చేసినవారే అవుతారు అని పలికెను.
పద్మశాలి వంశ స్థాపన
శ్రీ భావనాఋషి పుత్రులు వంద మంది శత మార్కండేయులుగా కొనియాడబడినవారైరి. వారి పుత్రులు: మహా పద్ములు., పద్మశాఖీయులు., పద్మశాలీయులు., పద్మ కువిందులు అనే బిరుదులతో కీర్తింబడగా వారే నేడు పద్మశాలీయులుగా పిలవబడుతున్నారు.🕉🙏🏻🚩

కర్మ సిద్ధాంత వివరణ

"ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని "ఎందుకయ్యా నాకు వందమంది కౌరవ పుత్రులనిచ్చి అందరినీ చంపేసి ఇంత బాధపెట్టావు" అని అడుగగా,

"పూర్వం ఒక 50 జన్మలక్రితం అతడొక నిశాదుడని ఒక పక్షికి చెందిన వంద పిల్లల్ని అతడు ఒకేసారి చంపిన పాపం ఇలా వచ్చిందని" కృష్ణుడు చెబుతాడు.

"మరి ఇప్పుడే ఎందుకు, 50 జన్మలలో ఒకొక్కటి తీర్చవచ్చు కదా" అని అడుగగా,

"నీవు ఏమి చేసావో అలాగే నీకు దక్కాలి, ఆ పక్షి లాగా నువ్వు కూడా ఒకే సారి వందమంది బిడ్డలు పోయిన బాధ అనుభవించాలి, కానీ నీకు వందమంది పిల్లలు పుట్టేటంత పుణ్యం ఈ 50 జన్మలలో సంపాదించావు కావున ఇప్పుడు నీకు జరిగింది అని కృష్ణుడు చెబుతాడు


మనం చేసుకున్న కర్మలుఊహ తెలిసిననాటి నుండి ఎన్నో పుణ్యకర్మలు చేసానే, నాకిన్ని కష్టాలేమిటి?

ఇటువంటివి తరచు మనం వింటూనే ఉంటాం. ఎవరి వరకో ఎందుకు మనదాకా వస్తే మనం కూడా ఒకప్పుడు అనుకునే వుంటాం. ఇంతే కాదు.
మనకు తెలిసి బండెడు పాపాలు చేసినవారందరూ ఎంతో హాయిగా ఆనందంగా తిరుగుతున్నట్టు కనబడుతూ ఉంటారు. దీన్ని ఆధారంగా చేసుకుని దేవుని నిందిస్తూ ఉంటారు, అసలు దేవుడనే వాడు ఉంటె పాపాలు చేసే వాడికిన్ని సుఖాలేమిటి, అసలు పాపాల జోలికి వెళ్ళని నాకిన్ని బాధలేమిటి? ఇటువంటి ప్రశ్నలకు సామాధానం ఇవ్వగలిగినది మన ధర్మం, కేవలం కర్మసిద్ధాంతం మాత్రమే.

కర్మలు కాయిక, వాచిక, మానసిక అని మూడు ఉంటాయి. చేసిన కర్మ బట్టి దాని ఫలితం ఉంటుంది. దాని ద్వారా చేసిన కర్మ చెడుదైతే పాపం, మంచిదైతే పుణ్యం మూటకట్టుకుంటాం. మన ఎకౌంటులో పాపం, పుణ్యం జమ అవుతాయి.

మన ఎకౌంటు అంటే ఈ జన్మతో ఓపెన్ చేసినది కాదు. కొన్ని కోట్ల కోట్ల జన్మలనుండి అన్ని పేజీలతో మైంటైన్ చెయ్యబడుతూ ఉంటుంది.

ఒకొక్క జన్మది ఒకొక్క పేజీ అనుకుంటే వాటి స్థూల విలువ మన పాపపుణ్యరాశి.

ఈ పాపపుణ్యాలు అనేవి మన మానవ జన్మలో సంపాదించి ముందున్న విలువకు కలుపుకుంటాము. మానవ జన్మ కాక మరే ఇతర జంతుజన్మలు లభిస్తే ఆ శరీరంతో ఆ కర్మను కేవలం అనుభవిస్తాము.

జంతుజన్మలో విచక్షణ ఉండదు కాబట్టి వాటిలో కేవలం కర్మ అనుభవం మాత్రమే సాధ్యమవుతుంది.

ఇక మానవునిగా పుట్టినప్పుడు ఎడాపెడా పాపపుణ్యాలు తెగ మూటకట్టుకుంటాము. అలాగే ముందు జన్మలలో చేసిన కర్మలను అనుభవించగలిగే స్థాయి ఉన్నప్పుడు ఆ పాపపుణ్యాలను సుఖ దుఃఖాలుగా అనుభవిస్తూ ఉంటాము.

నేను పూర్వ జన్మలో ఎవడో తింటున్నది తిననీయకుండా ఒక రోజు చేసానంటే వడ్డీ చక్రవడ్డీతో లెక్క వేసి ఒక నెల రోజులు నాకు తిండి పడనివ్వకుండా చేస్తాడు.

కానీ నేను అది తట్టుకోగలిగే శక్తి ఉన్నప్పుడే ఆ కర్మను అనుభవింపచేస్తాడు. ఎవరినో కొన్ని పదుల జన్మల క్రితం తల్లీకొడుకులను కొన్ని రోజులు విడదీసి ఉంటావు, ఈ రోజు నీకొడుకు కొన్నేళ్ళు నిన్ను విడిచి వెళ్ళవచ్చు.

ఎప్పుడో ఎవరినో నానా దుర్భాషలాడి ఉండవచ్చు నేడు నీనోటినిండా పుళ్ళుపడి మాట్లాడలేక తినలేక బాధపడుతూ ఉండవచ్చు.

ఇక్కడ మరొక విషయం ఏమిటంటే మనం అనుభవింపలేని కష్టాన్ని మనకు కలుగచెయ్యడు. ఎన్నడైతే ఆ కర్మ పరిపక్వం అవుతుందో, ఎప్పుడైతే ఆ కర్మ అనుభవించగలిగే శక్తి నీకుందో అప్పుడే
ఆకర్మఫలితం ఇస్తాడు.

ఒక ఉదాహరణకు ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుని ఎందుకయ్యా నాకు వందమంది పుత్రులనిచ్చి అందరినీ చంపేసి ఇంత బాధపెట్టావు అని అడుగగా, పూర్వం ఒక 50 జన్మలక్రితం అతడొక నిశాదుడని ఒక పక్షికి చెందిన వంద పిల్లల్ని అతడు ఒకేసారి చంపిన పాపం ఇలా వచ్చిందని చెబుతాడు.

మరి ఇప్పుడే ఎందుకు, 50 జన్మలలో ఒకొక్కటి తీర్చవచ్చు కదా అని అడుగగా, నీవు ఏమి చేసావో అలాగే నీకు దక్కాలి, ఆ పక్షి లాగా నువ్వు కూడా ఒకే సారి వందమంది బిడ్డలు పోయిన బాధ అనుభవించాలి, కానీ నీకు వందమంది పిల్లలు పుట్టేటంత పుణ్యం
ఈ 50 జన్మలలో సంపాదించావు కావున ఇప్పుడు నీకు జరిగింది అని చెబుతాడు.

ఇది వ్యాస విరచిత భారతంలోనిది కాకపోయినా సహేతుకమైన కర్మ సిద్ధాంత వివరణ.

మనం చేసుకున్న పుణ్యఫలితంగా మన ఈ జన్మ ఆ నిర్దేశిత తల్లిదండ్రులదగ్గర, అంత చదువు హోదా ఇచ్చేటంత పుణ్యం సంపాదించి దానిద్వారా ఎంతో సుఖాలను పొందుతాము. సుఖం ఎలా అడగకుండా పొందుతున్నామో, దుఃఖం కూడా అలాగే పొందుతాము.

సుఖం వచ్చినప్పుడు నాకు ఈ సుఖం నావల్ల వచ్చింది అని రొమ్ము విరుచుకుంటాము, కానీ దుఃఖం వస్తే నాకే ఎందుకు అని అడుగుతాము.

ఒకసారి మనలోనుండి బయటపడి స్థిమితంగా ఆలోచిస్తే తత్త్వం బోధపడుతుంది.

మనకు పూర్వం చేసిన కర్మలు జ్ఞాపకం ఉండవు, వాటిని సరిదిద్దుకునే సమర్ధత లేదు. కానీ నీవు దేవుడిని నమ్ముకుంటే నీకు ఏది మంచిదో ఎలా అయితే తట్టుకోగలవో చూసి సుఖదుఖాలను మిళితం చేసి ఇస్తాడు.

నీకు నీ కొడుకు దూరమే అవ్వాలి అంటే వాడిని విదేశాలలో చదువుకు పంపుతాడు, కానీ నిన్ను ఇక్కడ ఉంచుతాడు. కాబట్టి నీ దుఖానికి స్వాంతన చేకూరే విషయం ఇస్తాడు.

రోగం ఇన్నాళ్ళు అనుభవించే కర్మ ఉంటే
ఆ రోగానికి ఉపశమనం కూడా ఇస్తాడు,
ఆ రోగం పేరు చెప్పి నీవారిని నీకు దగ్గర చేస్తాడు.

ఆ పాపకర్మ అనుభవించేందుకు
ఈ జన్మలో నీచేత compensation జరిగేట్టు పుణ్యకార్యాలు చేయిస్తాడు, దేవాలయాలలో అన్నదానసత్రాలలో నీచేత అన్నదానానికి విరాళాలు ఇప్పిస్తాడు. తద్వారా ఈపుణ్యాన్ని అడ్డుపెట్టి కొన్ని నెలలు అనుభవించాల్సిన బాధను కొన్ని రోజులకు కుదిస్తాడు.

కావలసినది ఆయన మీద నమ్మకం..! తార్కికంగా చూస్తె శ్రీదేవి భూదేవితో కలిసి ఉన్న స్వామీ, శ్రీదేవి అంత విశ్వాసం, శరణాగతి చేసి భూదేవి అంత ఓర్పుతో నిలిచి నా పాదాలను పట్టుకుంటే నీ కటి మునగకుండా రక్షించి కాపాడతాను అని మన ప్రత్యక్షదైవం ఆ తిరుమల వేంకటేశ్వరుడు చెబుతున్నాడు.

గురువును నమ్ముకుంటే, శరణాగతి కోరితే జన్మ జన్మలు అనుభవించవలసి ఉన్న కర్మని కేవలం కొద్దిరోజులకి కర్మను తీసే ప్రయత్నం చేస్తారు.అయితే గురువు ఏం చెబితే అది చేయాలి గురువు ప్రశ్నకు ఎదురు సమాధానం ఉండరాదు.*
🌹🌹🌹🌹🌹

ఎవరీ.. ఆర్నాబ్ గోస్వామి .. ?

. * ఎవరీ.. ఆర్నాబ్ గోస్వామి .. ?

ఆర్నాబ్ గోస్వామి ఎవరు.

భారత జర్నలిజంలో పెను సంచలనం.అక్షర ప్రభంజనం. దేశంలో ప్రస్తుతం ఆరాధ్యుడు.

కరోనా అనే చైనా వైరస్ అంతానికి కృషి చేస్తున్న గొప్ప యోధులుగా ప్రఖ్యాతులు సాధించిన మోడీ, యోగి ల తర్వాత అంత పేరు సాధించిన జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి.

తక్కువ సమయంలో ఇంత పేరు సాధించడానికి కొన్ని కారణాలు.

72 సంవత్సరాలుగా హిందూ ధర్మం మీద విషం కక్కుతున్న మీడియాను తూర్పార బడుతున్నాడు.

హిందూ ధర్మ వ్యతిరేక కుట్రలన్నీ సాక్ష్యాధారాలతో చూపించి సింహస్వప్నంగా నిలబడ్డాడు.

కరోనా,చైనావైరస్ తబ్లిగీ జమాత్ సంస్థ సమావేశాల వల్లనే దేశంలో వ్యాపించింది అని నిలదీసిన మొనగాడు.

ఆ సంస్థ సమావేశంలో ఏమి జరిగింది, ఎలాంటి కుట్రలు ఉన్నాయని సాక్ష్యాలతో సహా సంచలన కథనాలు ఇచ్చాడు.

ఆ సంస్థ సభ్యులు డాక్టర్ల మీద దాడులు, ఉమ్మి వేయడం మొట్టమొదట, ప్రశ్నించి చీల్చి చెండాడిన వ్యక్తి.

ప్రపంచంలో కరోన వైరస్ ఉన్న సమయంలో విదేశీ ప్రచారకులు ఎందుకు వచ్చారని పూర్తి సాక్ష్యాధారాలతో సంచలన కథనాలు ఇచ్చి వారందరి పైన కేసులు నమోదు చేయించాడు.

ప్రార్థనాస్థలాల్లో దాగిన విదేశీ ప్రచారకుల సభ్యుల వీడియోలు ఇచ్చి అందరిని జైలుకు పంపాడు.

ఆ సంస్థ మీద వరుస కథనాలు ఇచ్చి దేశ ప్రజలందరికీ నిజాలు తెలియజేశాడు.

PMకి వ్యతిరేకంగా సాగిన అసత్య ప్రసారాలను సాక్ష్యాధారాలతో సహా నిరూపించాడు.

సెక్యులర్ ముస్గు వీరుల మీడియా కధనాలను ఆధారాలతో సహ అబద్దం అని తేల్చిన వ్యక్తి.

ముంబైలో జర్గిన పబ్లిక్ జమాత్ సభ్యుల సమావేశ వీడియోలు బయటపెట్టాడు.

సాధువుల హత్య మీద మహారాష్ట్ర ప్రభుత్వాన్ని చీల్చి చెండాడిన వ్యక్తి.

సూడో మీడియా,సూడో సెక్యులర్, అవార్డు వాపసీ ఇలా భారత వ్యతిరేకులందరిని ప్రపంచానికి చూపించాడు

గాంధీ పేరు పెట్టుకున్న వనిత ఇటాలియన్
వనిత అని ప్రశ్నించి అసలు పేరు పెట్టి పిలిచి, లోకానికి తెలియచెప్పి వీళ్ళ కుటుంబానికి, వీళ్ళ వారసుల కుటుంబానికి గాంధీ తో ఎటువంటి సంబంధం లేదని పూర్తి వివరాలు చూపించిన దీశాలి.

మోడీకి దేశానికి వ్యతిరేకంగా ఏవైనా అంతర్జాతీయ కుట్రలు జరిగితే అవి పూర్తిగా చూపించే వాళ్లని వెధవల్ని చేశాడు.

ఎన్నో విషయాలను పూర్తి సాక్ష్యాలతో భారత దేశ ప్రజలకు లకు చూపించిన జర్నలిస్టు.

భారతీయులకు, ధర్మానికి పూర్తి మద్దతుగా నిలిచిన మొట్టమొదటి గొప్ప జర్నలిస్ట్.వెరసి రిపబ్లిక్ టీ.వీ ఎడిటర్ ఇన్ చీఫ్.

ఈయన దృష్టిలో అందరూ సమానం. చెడును ప్రోత్సాహించక అసత్యాలను చెండాడమంటాడు...