Friday, January 31, 2025

 *ప్రేరణ ✌️మార్గ*
There is only one way to avoid criticism: Do nothing, say nothing, and be nothing.
Aristotle
✌️✌️
Too many of us are not living our dreams because we are living our fears.
Les Brown
✌️✌️
If you have time to judge other people, you have way too much time on your hands. Get off your ass and do something meaningful.
Shane Gibson
✌️✌️
The future depends on what you do today.
Mahatma Gandhi
✌️✌️
“Life is a series of experiences, each one of which makes us bigger, even though sometimes it is hard to realize” –Henry Ford
✌️✌️
“Faith is taking the first step even when you don’t see the whole staircase” –Martin Luther King Jr.
✌️✌️
“Every adversity, every failure, every heartache carries with it the seed of an equal or greater benefit.” –Napoleon Hill
✌️✌️
“The only certain means of success is to render more and better service than is expected of you, no matter what your task may be” –Og Mandino.      
 *ధ్యాన 😌 మార్గ*
కన్యాకుబ్జపురమునందు అజామిళుడనే బ్రాహ్మణ బాలుడు గురుకుల వాసం చేస్తూ చతుర్వేదాలు భక్తిశ్రద్ధలతో నేర్చుకుంటూ గురువులకు సేవ చేసుకుంటూ కాలం గడుపుతుందేవాడు. అజామిళునకు యౌవనదశ వచ్చింది. బలం, కామ వికారం వంటివి ఉత్పన్నమయ్యాయి. ఒకనాడు అజామిళుడు దర్భలు, సమిధలు, పువ్వులు, పండ్లుతేవడం కోసం సమీపంలో ఉండే వనానికి వెళ్లాడు. యజ్ఞసంభారాలన్నింటినీ సమీకరించుకొని ఒక పువ్వుల పొద వద్దకు వెళ్ళి పువ్వులు కోస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పూపొదలలో ఒక పురుషుడు, యౌవనంలో ఉన్న ఒక స్తీ మోహావేశంతో లోకాన్నే మర్చిపోయిఉండటం చూశాడు. అలా చూచిన అజామిళుని మనసు చలించింది! ఇంకేముంది! విద్య, జ్ఞానం, మానం, మర్యాద, పాపభీతి వీటన్నింటిని విడిచిపెట్టి మదవతియైన ఆ స్త్రీ సాంగత్యంలో చిక్కువడిపోయాడు.

తన బ్రాహ్మణత్వాన్ని విడిచి పెట్టి వర్ణ సాంకర్యంలో స్వర్గసుఖాలను అనుభవించడానికి సిద్ధపడి ఆమెతోనే జీవితం అంటూ పతితుడైపోయాడు. అలా ఆమెతో కలిసి సంసారం సాగిస్తూ పదిమంది కొడుకుల్ని కూడా కన్నాడు. సంసారయాత్ర కోసం అనేక రకాల నీచమైన కార్యాలు చేసి చెప్పరానంత పాపాన్ని మూటగట్టుకున్నాడు. కొంతకాలానికి ముసలితనం వచ్చింద కాని సంసార విషయవాంఛలు మాత్రం వీడలేక తన కొడుకుల్లో చిన్నవాడైన నారాయణుడిపై అజామిళునికి ప్రేమ ఎక్కువ. ఆ కొడుకు ప్రేమలో పడి మొత్తం లోకాన్నే మర్చిపోయేవాడు. తన వృద్ధాప్య ఆఖరిక్షణాల్లో అజామిళునకు మృత్యుఘడియలు సమీపించాయి. అతని మనోనేత్రానికి యమదూతలు కనిపించారు. క్రూరమైన రూపాలతో ఉన్నవారిని చూశాక తనకు చనిపోయే సమయం ఆసన్నమైందని తెలుసుకొని అజామిళుడు పుత్రున్ని విడిచి వెళ్లడం తప్పదని తెలిసి దుఃఖిస్తూ దేహం అంతా వణుకు పుట్టి ఏదో తెలియని ఆందోళనతో అతడు తన చిన్నకొడుకుని నోరారా “నారాయణా! నారాయణా!!!” అని పిలుస్తూనే ప్రాణం విడిచాడు. యమభటులు అతన్ని యమపాశంతో కట్టి యముని వద్దకు బయలుదేరుతూండగా అదే సమయానికి విష్ణుదూతలు అక్కడికి వచ్చారు. వారిని చూసి యమభటులు ఆశ్చర్యపోయి. “అయ్యలారా! ఈజీవి జీవితకాలం చాలా పాపాలు చేశాడు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం ఇతన్ని యమలోకానికి తీసుకువెళుతున్నాం”
అన్నారు. అందుకు జవాబుగా శ్రీవారి సేవకులు చిరునవ్వుతో
మీరు యముని భటులైతే వినండి! ఈతడు మరణాసన్న సమ
యంలో తన కుమారుడైన నారాయణున్ని “నారాయణా! నారాయణా!! అని పిలిచి ఆ దేవదేవుడైన నారాయణుని స్మరించాడు. అతను పిలిచింది తన కుమారుణ్ణే ఐన్వా అది శ్రీహరి నామంకాబట్టి ఆ ప్రాణి చేసిన నానాపాపాలు అంతటితోనే నశించిపోయాయి. కాబట్టి ఎలాంటి కష్ట్టమయంలోనైనా ఆ శ్రీమన్నా
రాయణుని నామాన్ని పలికిన వారికి యమబాధలుండవు;
అన్న విష్ణుదూతల మాటలకు యమభటులు తెల్లబోయి మరో
మాట మాట్లాడక అజామిళుని జీవాన్ని బంధవిముక్తి చేసి అక్కడి
నుండి వెళ్ళిపోయారు. అటుపై విష్ణుదూతలు అజామిళుని తమ
దివ్యవిమానంలోని కెక్కించుకొని వైకుంఠానికి తీసుకెళ్ళారు.

దీన్ని బట్టి తెలిసిందేమంటేే యవ్వనదశలో తెలిసీ
తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి, కనీసం
వృద్ధాప్యంలోనైనా కొంతవరకు భగవంతుని ధ్యానం చేయడం
చాలా ఉత్తమమైందని గ్రహించాలి.
------------------      
 🕉️ ఓం నమః శివాయ 🕉️

🙏 శివాయ గురవే నమః 🙏

వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?

"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః "  అంటే అర్ధం తెలుసా?

SUN'DAY

MO(O)N'DAY

TUESDAY

WEDNESDAY

THURSDAY

FRIDAY

SATUR(N)DAY

అంటే ఏమిటో తెలుసా....? 

సూర్యహోర

చంద్రహోర

కుజహోర

బుధహోర

గురుహోర

శుక్రహోర

శనిహోర - అంటే

ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగము, ఇవి ఎంతో శాస్త్రీయమైనవి.

ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి! వారము - అంటే 'సారి' అని అర్ధము.

1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!

కాస్త విపులంగా....

భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే.ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.

మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః

అనగా... 

పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. 

ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? 

ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?

ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.

భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. 

ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.

ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. 

ఆ భాగాలను వారు "హోర" అన్నారు.

"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.

దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. 

ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.

హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.

ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. 

ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. 

కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.

మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,

ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.

ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.

అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. 

వస్తున్నా... అక్కడికే వస్తున్నా...

ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. 

దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.

అదే మొదటిరోజు. 

అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.

ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. 

అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.

అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.

ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు. 

అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం! 

అదీ...భారతీయ ఋషుల గొప్పదనం! 

నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరే కాదు.!!
🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏
 Vedantha panchadasi:
అతద్వ్యావృత్తిరూపేణ సాక్షాద్విధిముఖేన చ ౹
వేదాన్తానాం ప్రవృత్తిః స్యాద్విధేత్యాచార్య భాషితమ్ ౹౹87౹౹
వేదాంతముల ప్రవృత్తి - నిషేధ,ప్రతిపాదరూపములు.
కనుక అంతఃకరణమును నిషేదించుచు బ్రహ్మమున కుపాధి చెప్పుటలో అసంగమేమీ లేదు అని దృఢపరచుచున్నాడు.

అహమర్థపరిత్యాగాదహం బ్రహ్మేతి ధీః కుతః ౹
నైవమంశస్య హి త్యాగో భాగలక్షణయోదితః ౹౹88౹౹

88. 'అహం' ను వదలిన 'అహం బ్రహ్మస్మి' బోధ క‌లుగుటెట్లు ? అందలి విరుద్ధాంశమును మాత్రమే వదలుట భాగలక్షణచే జరిగినది.

అంతఃకరణ సంత్యాగాదవశిష్టే చిదాత్మని ౹
అహం బ్రహ్మేతి వాక్యేన బ్రహ్మత్వం సాక్షిణీక్ష్యతే ౹౹89౹౹

89. అంతఃకరణమును పరిత్యజింపగా మిగిలిన సాక్షియగు చిదాత్మ యందు అహం బ్రహ్మస్మి అనే వాక్యముచే బ్రహ్మత్వము గుర్తింపబడుచున్నది.

వ్యాఖ్య :- వేదాంతము యొక్క 
(ఉపనిషత్తుల యొక్క) ప్రవృత్తి రెండు విధాలుగా ఉంటుంది.
మొదటిది అతద్వ్యావృత్తిరూపం కలది.
'తత్' అంటే బ్రహ్మము గదా !
'అతత్' అంటే,
 బ్రహ్మము కానిది - 
అజ్ఞానము, అనాత్మ, దృశ్యమాన ప్రపంచము మొదలైనవన్నమాట.

ఈ మిధ్యారూపమైన ప్రపంచాన్ని 'నేతినేతి' 
 (ఇదికాదు ఇదికాదు) అంటూ నిషేధించటం బ్రహ్మజ్ఞాన సంపాదనకు ఒక ఉపాయం. ఇది అతద్వ్యావృత్తి రూపం.

రెండవది సాక్షాద్విధి ముఖంగా కలిగే ప్రవృత్తి.అంటే, బ్రహ్మమును ప్రతిపాదించు
"సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ"
తై. 2-1-1  ఇత్యాది శ్రుతివాక్యాల ప్రవృత్తిద్వారా బ్రహ్మప్రతిపాదనం చేయటం.
 విధిరూపమునను వేదాంతములు అనగా ఉపనిషత్తులు బోధించుచున్నవి అని 
'శ్రీ శంకరభగవత్పాదులు' చెప్పిరి.
ఇది రెండవ ఉపాయం తద్వ్యావృత్తి అని ఆచార్యులు అంగీకరించారు.

అయితే, 'అహం'  అనే భావమును కూడా నిషేధిస్తే - త్యజిస్తే - ఇక
'అహం బ్రహ్మస్మి' అనే జ్ఞానం ఎట్లా కలుగుతుంది ? 
అని శంక. 

సమాధానం -
'అహం' అనే పదానికి వాచ్యార్థమైన కూటస్థ చైతన్యాన్ని కూడా పరిత్యజిస్తే
(నేతి నేతి అని నిషేధిస్తే)
'నేను బ్రహ్మను'
(అహం బ్రహ్మస్మి) అనే జ్ఞానం ఎలాకలుగుతుందంటే -
'అహం' అనే శబ్దంలోని ఏకాంశాన్ని మాత్రమే పరిత్యజించాలని భాగత్యాగ లక్షణద్వారా చెప్పబడ్డది.

'తత్' రూపమగు చైతన్యము 'అతత్' రూపమగు అంతఃకరణము కలసి 
'అహం' 'నేను' ఏర్పడినది.భాగత్యాగ లక్షణవలన అంతఃకరణమును వదలుట వలన చైతన్య స్వరూపమగు బ్రహ్మముతో ఐక్యము బోధపడుచున్నది.

అంటే , 'అహం' శబ్దాని కున్న జడాంశాన్ని మాత్రమే త్యజించాలి; అంతే తప్ప కుటస్థుని కాదు.ఈ విధంగా 'అహం బ్రహ్మస్మి' జ్ఞానం కలుగుతుంది.

అంతఃకరణముతో కూడినవాడు చేతనుడు అయిన జీవునినుండి జడాంశాన్ని అంటే అంతఃకరణమైన ఉపాధిని పరిత్యజించటంవల్ల చిదాత్మరూపము,సాక్షి అయిన 
బ్రహ్మమే మిగిలి ఉండటం వల్ల 
'అహం బ్రహ్మస్మి' అనే బ్రహ్మసాక్షాత్కారం కలుగుతుంది.

స్వప్రకాశోఽ పి సాక్ష్యేవ ధీవృత్త్యా వ్యాప్యతేఽ న్యవత్ ౹
ఫలవ్యాప్యత్వమేవాస్య శాస్త్రకృద్భిర్నివారితమ్ ౹౹90౹౹

90. సాక్షియగు చిదాత్మ స్వప్రకాశమేయైనను బుద్ధివృత్తిచే ఇతర విషయముల వలెనే వ్యాప్యమగుచున్నది.
శాస్త్ర కారులు ఫలవ్యాప్తిని మాత్రమే ఇచ్చట నిషేధించిరి.

వ్యాఖ్య:- 
దేనినైన గుర్తించునది తెలియునది అంతఃకరణమే గదా ! అది లేనపుడు బ్రహ్మత్వము మాత్రమే ఎట్లు గుర్తింపబడును? 
అని సంశయము.
విషయములను గూర్చిన గుర్తింపు ఎట్లు కలుగునో మొదట విచారింతము.

గుర్తింపునందు రెండు దశలున్నవి.
 ఒకటి జ్ఞేయవిషయమును గూర్చిన అజ్ఞానము తొలగుట.
రెండవది జ్ఞేయవిషయమును గూర్చిన జ్ఞానము అంతఃకరణమునందు ప్రతిఫలించి చిదాభాసయందు కలుగుట.ఈ వికారము చిదాభాసయందు కలిగినను చిదాభాస అంతఃకరణమునందే ఉన్నది కనుక ఈ రెండూ సామాన్య విషయములందు ఒకటిగనే ఫలించును.
చిదాభాసయందు కలుగే వికారమునకు 
ఫలవ్యాప్తి అని పేరు.

బ్రహ్మమును గూర్చిన బోధ కలిగితే,  దానిని గూర్చిన అజ్ఞానము తొలగును.అనగా అంతఃకరణమునందు కలిగిన ఈ వికారముచే అంతఃకరణమే నశించును.అజ్ఞాన కార్యము గనుక.
అనగా బ్రహ్మము గూర్చిన 
వృత్తి వ్యాప్తి సిద్ధించును.

ఇక చిదాభాసుడు గూడా అంతఃకరణముతో నశించుటచే 
ఫలవ్యాప్తి సిద్ధింపదు.

ఆ సాక్షి ఇతర ఘటాది పదార్థాల్లాగా 
'నేను స్వయం ప్రకాశరూపుణ్ణి' అనే బుద్ధి వృత్తిచేత వ్యాప్తం కావచ్చు గదా ! 
పూర్వశాస్త్రకారులేమో ఫలవ్యాప్తి నిషేధించారాయె !

అంటే - ఫలము అంటే బుద్ధి వృత్తియందు ప్రతిబింబితమైనట్టి చిదాభాస.
ప్రత్యగాత్మ స్వప్రకాశమైనది కాబట్టి పూర్వాచార్యులు ఆ చిదాభాసకు సంబంధించిన విషయత్వాన్ని నిషేదించారు.

కానీ , ప్రత్యగాత్మ స్వయంప్రకాశమైనందున బుద్ధివృత్తికి విషయంకాదు అని అంటున్నారు.
 సాక్షియగు చిదాత్మ స్వప్రకాశమగుటచే తానే బ్రహ్మము అని గుర్తించును.

'నేను  ఉన్నాను' అనే బోధ 'కుండ వున్నది' అనే బోధ వలెనే స్పష్టముగ అంతఃకరణము నందు ఏర్పడును. 
కాని జ్ఞేయవిషయము అగుటచే కుండను అంతఃకరణమును,చిదాభాస సహితమైనది గ్రహింపగలదు.
కుండవలె జ్ఞేయవిషయము కాకపోవుటచే చిదాభాస సహితమైన అంతఃకరణము బ్రహ్మమును గ్రహింపలేదు.

చిదాత్మ అనగా ప్రత్యగాత్మ ,
బ్రహ్మమువలెనే స్వప్రకాశము గనుక వాని ఐక్యత, నేను ఉన్నాను అనే బోధ వలెనే,
సిద్ధించును.

ప్రత్యగాత్మయందు ఫలవ్యాప్తి ఉండదని చూపించటానికై ఘటపటాది పదార్థాల్లో వృత్తిని
(అంతఃకరణ పరిణామాన్ని) అందులోని చిదాభాస వలన ఫలాన్ని చూపిస్తున్నారు.

వ్యాఖ్య:- 
దేనినైన గుర్తించునది తెలియునది అంతఃకరణమే గదా ! అది లేనపుడు బ్రహ్మత్వము మాత్రమే ఎట్లు గుర్తింపబడును? 
అని సంశయము.
విషయములను గూర్చిన గుర్తింపు ఎట్లు కలుగునో మొదట విచారింతము.

గుర్తింపునందు రెండు దశలున్నవి.
 ఒకటి జ్ఞేయవిషయమును గూర్చిన అజ్ఞానము తొలగుట.
రెండవది జ్ఞేయవిషయమును గూర్చిన జ్ఞానము అంతఃకరణమునందు ప్రతిఫలించి చిదాభాసయందు కలుగుట.ఈ వికారము చిదాభాసయందు కలిగినను చిదాభాస అంతఃకరణమునందే ఉన్నది కనుక ఈ రెండూ సామాన్య విషయములందు ఒకటిగనే ఫలించును.
చిదాభాసయందు కలుగే వికారమునకు 
ఫలవ్యాప్తి అని పేరు.

బ్రహ్మమును గూర్చిన బోధ కలిగితే,  దానిని గూర్చిన అజ్ఞానము తొలగును.అనగా అంతఃకరణమునందు కలిగిన ఈ వికారముచే అంతఃకరణమే నశించును.అజ్ఞాన కార్యము గనుక.
అనగా బ్రహ్మము గూర్చిన 
వృత్తి వ్యాప్తి సిద్ధించును.

ఇక చిదాభాసుడు గూడా అంతఃకరణముతో నశించుటచే 
ఫలవ్యాప్తి సిద్ధింపదు.

ఆ సాక్షి ఇతర ఘటాది పదార్థాల్లాగా 
'నేను స్వయం ప్రకాశరూపుణ్ణి' అనే బుద్ధి వృత్తిచేత వ్యాప్తం కావచ్చు గదా ! 
పూర్వశాస్త్రకారులేమో ఫలవ్యాప్తి నిషేధించారాయె !

అంటే - ఫలము అంటే బుద్ధి వృత్తియందు ప్రతిబింబితమైనట్టి చిదాభాస.
ప్రత్యగాత్మ స్వప్రకాశమైనది కాబట్టి పూర్వాచార్యులు ఆ చిదాభాసకు సంబంధించిన విషయత్వాన్ని నిషేదించారు.

కానీ , ప్రత్యగాత్మ స్వయంప్రకాశమైనందున బుద్ధివృత్తికి విషయంకాదు అని అంటున్నారు.
 సాక్షియగు చిదాత్మ స్వప్రకాశమగుటచే తానే బ్రహ్మము అని గుర్తించును.

'నేను  ఉన్నాను' అనే బోధ 'కుండ వున్నది' అనే బోధ వలెనే స్పష్టముగ అంతఃకరణము నందు ఏర్పడును. 
కాని జ్ఞేయవిషయము అగుటచే కుండను అంతఃకరణమును,చిదాభాస సహితమైనది గ్రహింపగలదు.
కుండవలె జ్ఞేయవిషయము కాకపోవుటచే చిదాభాస సహితమైన అంతఃకరణము బ్రహ్మమును గ్రహింపలేదు.

చిదాత్మ అనగా ప్రత్యగాత్మ ,
బ్రహ్మమువలెనే స్వప్రకాశము గనుక వాని ఐక్యత, నేను ఉన్నాను అనే బోధ వలెనే,
సిద్ధించును.

ప్రత్యగాత్మయందు ఫలవ్యాప్తి ఉండదని చూపించటానికై ఘటపటాది పదార్థాల్లో వృత్తిని
(అంతఃకరణ పరిణామాన్ని) అందులోని చిదాభాస వలన ఫలాన్ని చూపిస్తున్నారు.

వ్యాఖ్య:- ఘటమును తెలియుట యందు బుద్ధియు దానియందలి చిదాభాసము రెండును వికారము నొందును.

బుద్ధివృత్తి,అందులో ఉన్న చిదాభాస, ఈ రెండూ ఘటాన్ని వ్వాప్తం చేస్తున్నాయి.ఈ రెండింటి వల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నాయి.

మొదటదైన బుద్ధివృత్తివల్ల ఘటమును గూర్చిన అజ్ఞానము నశించిపోతుంది.
జడమగు ఘటమునకు
స్వయం స్ఫురణం అనేది లేదు, అందువల చిదాభాస వికారమువల్ల
ఘటము స్ఫురిస్తోంది.

ఘటపటాది అనాత్మ వస్తు సమూహం కంటే, ఆత్మకున్నట్టి 
వైలక్ష్యణ్యాన్ని 
చూపిస్తూన్నారు -
బ్రహ్మమును తెలియుటయందు 
అజ్ఞాన నివృత్తికై వృత్తివ్యాప్తి అనగా బుద్ధివికారము ఆవశ్యకమగును.
కానీ బ్రహ్మము స్వయంముగనే స్ఫూరిస్తుంది గనుక చిదాభాస వికారమగు ఫలవ్యాప్తి అనావశ్యకము.

జీవాత్మ బ్రహ్మము ఒకటే అనే విషయం అజ్ఞానము చేత ఆవరింపబడి ఉంది.
ఆ బ్రహ్మవిషయకమైన అజ్ఞాన నివృత్తికోసం 'అహం బ్రహ్మస్మి' అనే వాక్యం ద్వారా ఉత్పన్నమయ్యే బుద్ధివృత్తివల్ల వ్యాప్తి అనేది 
(బ్రహ్మాకార విషయంలో) అవసరమౌతోంది.

చిదాత్మ స్వయం స్ఫురణరూపం  కలది.అది స్ఫురించటానికి చిదాభాస అగత్యము ఉండదు - చిదాత్మ స్ఫురణకోసం,చిదాభాస ఉపయోగ పడదు.

ఈ విషయమై దృష్టాంతం చూపుతున్నారు -
ఘటం మొదలైన 
స్వయం స్ఫురణలేని (అప్రకాశ) పదార్థములను చూడాలంటే కన్ను ,దీపము రెండూ అవసరమవుతున్నాయి.
కానీ దీపాన్ని చూడాలంటే కండ్లు మాత్రమే సరిపోతున్నాయి.

అట్లాగే, బ్రహ్మవిషయకమైన అజ్ఞానం నశించటానికి బ్రహ్మాకారమైన బుద్ధివృత్తి మాత్రమే అవసరమవుతుంది -
చిదాభాస యొక్క అవసరం ఉండదు.          
 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
                 *ఆనంద సృష్టి*

*"పువ్వులను మనం సృష్టించలేం. వాటికవే పుష్పించి, వికసించి అందరికీ ఆనందం కలగజేస్తాయి. నవ్వులను మనం సృష్టించుకోగలం. ఆ నవ్వుల్లో మునిగి ఆనంద డోలికల్లో తేలియాడగలం. కొన్ని మన చేతుల్లో ఉంటాయి. పెద్ద పనుల్ని మనం చెయ్యలేకపోయినా చిన్నచిన్న పనులను పెద్ద హృదయంతో చెయ్యాలి. గొప్ప పనులు చెయ్యలేకపోతున్నామని బాధ పడకూడదు. ఆ సందర్భం వస్తే అనుకోకుండా అద్భుతమైన పనుల్లో మనం భాగస్వాములమవుతాం. ఆనందం, మనం చేస్తున్నది చిన్నపనా పెద్దపనా అని కొలతలు వెయ్యదు. ఎంతగా మనసు పెట్టి, హృదయపూర్వకంగా పసివాడిలా ఆ పని చేస్తున్నామా అని చూస్తుంది. ఆనందానికి మనం చిరునామా అయిపోవాలి. బాధలు కిటికీ తెరలు. మహాద్వారం మన అంతులేని సంతోషమే. దాన్ని నిలబెట్టుకోవాలి.*

*ఆ గృహంలో నిత్యం గంతులు వేస్తూ ఉత్సవం. చేసుకోవాలి. చెట్టును, పిట్టను, కొంగను, కోడిని చూసి మురిసిపోవాలి. కూడా ప్రతీ దృశ్యం సూర్యోదయంలా ఉండదు. ప్రతి సందర్భం పడమట సంధ్యారాగంలా సంగీతాన్ని ఆలపించదు. చేతిలో చిన్న వెదురుముక్క కూడా, నాలుగు రంధ్రాల్లో చక్కటి వేణుగానం వినిపిస్తుంది. హృదయంలో సంతోషం సంతకాలుండాలి. మనసులో మంచి జ్ఞాపకాల మంచు కురుస్తూ ఉండాలి. ప్రేమ లేకుండా మనిషిని భగవంతుడు సృష్టించలేదు ఆనందం లేకుండా అతడిని జీవించమని చెప్పలేదు. మనిషి ఆనందిస్తుంటే మురిసిపోయేవాడు ఆ దేవదేవుడే.*

*ఉదయం లేవగానే రెండే రెండు అవకాశాలు మన ముందుంటాయి. రోజంతా సంతోషంగా ఉండాలా, లేదంటే వేదనతో కాలం గడపాలా అని. ఆనందం మన హక్కు ఆనందంగా ఉండటం మన స్వభావంపుట్టుకతో బాధలు అందరికీ ఉండవుమధ్యలో వచ్చేవి మధ్యలోనే పోతాయి. ఆనందాన్ని సృష్టించు. అపరిమితంగా సృష్టించు. గడ్డిపువ్వుల్లోనూ మానస సరోవర బ్రహ్మకమలాన్ని చూడగలిగే మనసును తయారుచేసుకోవాలి. బతకడానికి సిరులు-సంపదలు కాదు కావాల్సింది. పెద్ద హృదయంలో చిన్ని చిన్ని ఆనందాలు సృష్టించుకోవడం తెలిసిన నేర్పరితనం కావాలి. బృందావనంలో ప్రవేశించినంతనే శ్రీకృష్ణ దర్శనం కాదు. కాని, బృందావన దర్శనం అవుతుంది. అది పరమాత్మ తిరిగిన ప్రదేశం. ప్రతి మొక్క, ప్రతి పూవు, గాలి, నీరు మాట్లాడతాయి. మనసును తెరచి ఉంచుకోవాలి. అంతే!*

*'మనలోపల శ్రీకృష్ణుడు వ్యాపిస్తే, కళ్లకు విశ్వమంతా కృష్ణమయంగా అనిపిస్తుంది. భావంతో దైవాన్ని మనం లోపల సృష్టించకపోతే బాహ్యప్రపంచంలో ఆయన ఎలా కనిపిస్తాడు... నిత్య సంతోషికి దూరంగా దేవుడు ఉండగలడా? కొంత సంతోషం ఇతరుల మీద చల్లగలిగితే మనకు అది రెట్టింపై తిరిగి వస్తుందిజీవితాంతం నవ్వుతూ ఉండటం జీవన రహస్యం తెలిసినవాడికి మాత్రమే సాధ్యమవుతుంది. అతడే జ్ఞానిఅతడే తనకు చాలా ఇష్టమైనవాడు అంటాడు గీతాచార్యుడు. బాధలు, బాధ్యతలు అందరికీ ఉంటాయి. ప్రపంచం భూతంలాగా కనిపిస్తుందిసంసారం సముద్రంలాగా అనిపిస్తుంది. వైరాగ్యంతో మనసు చేదెక్కిపోయి ఉంటుంది. అక్కడే మనిషి తన భావాన్ని మార్చుకుని చిరునవ్వు నవ్వగలిగి ఉండాలివెంటనే మరిచిపోయి, కళ్లు తుడుచుకున్న చిన్నపిల్లాడిలాగా జీవితాన్ని ఆహ్వానించాలి. ప్రపంచాన్ని కౌగిలించుకోవాలి. నవ్వుతూ అందరినీ పలకరించాలి.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴
 *శంబల - 22*
💮

*రచన : శ్రీ శార్వరి* 


*బై బై శంబల -2

ప్రశ్న: "మాస్టర్! నిజంగా శంబల ఉందా? మీరు దర్శించారా? నిజం చెప్పండి." [తాషీలామా కళ్లు మూసుకుని చాలాసేపు ఆలోచించాడు].

"అసలు శంబల సప్తసాగరాల అవతల ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఎవరికీ తెలియదు. మేం చెప్పేది శంబల నమూనా గురించి. అదొక స్వప్న లోకం. అదొక స్వర్గసీమ. నిజం చెబుతున్నాను శంబల భూగోళం మీద ఎక్కడా లేదు. శంబల మన నేల పైన కనిపించదు. అయినా మనవారికి దాని పైన అంత ఇష్టం ఎందుకో అర్థంకాదు. ఉత్తరాన చాలా దూరంగా, పర్వతాల నడుమ శంబల ప్రతిబింబం కనిపిస్తుంది. అక్కడ శంబలకు చెందిన జ్ఞాన కిరణాలు ప్రసరిస్తుంటాయి. అది నిజం."

ప్రశ్న : "స్వర్గం ఎక్కడ ఉంటుందో, ఎట్లా ఉంటుందో? స్వర్గాన్ని వర్ణిస్తాం, ఆశిస్తాం, నమ్ముతాం. అలాగే మీరు లేని శంబలను ఊహించి నమ్మకం పెంచుకోవడం అనుకో వచ్చునా? ఉన్నట్లు లోకాల్ని నమ్మిస్తున్నారు కదూ."

లామా : "మేము ఎవర్నీ రమ్మని పిలవ లేదు. అందని స్వర్గాన్ని అరచేతికి అందించే ప్రయత్నం అసలు చేయం. శంబలను ఎవరికీ చూపించింది లేదు. కనుక శంబల గురించి ఎట్లా చెప్పగలను?"

ప్రశ్న : "శంబల గొప్పదనం గురించి, వైశిష్ట్యం గురించి మేము విన్నాం. అది
ఉన్నదని మా విశ్వాసం. భూమి పైన నకిలీ స్వర్గం ఉండవచ్చు గదా. మీవంటి గొప్ప లామాలు, ప్రాజ్ఞులైనవారు లోగడ శంబల దర్శించిన కథలు, గాధలు ఉన్నాయి. మాస్టర్ మైత్రేయ, మాస్టర్ మోర్య, కుత్తమి, జ్వాల్ కూల్, సెయింట్ జర్మనీ పేర్లు వింటున్నాం. వీరంతా శంబలకు చెందిన పరమ గురువులే కదా! వారు బాహ్య ప్రపంచంలో కొందరితో సంబంధం పెట్టుకున్నారు. అది నిజం కాదా? మేము హిందూ దేవుళ్లకంటే, సప్తర్షులకంటే హిమాలయ గురువుల్ని, శంబల మాస్టర్లను ఎక్కువ అభిమానిస్తాం గౌరవిస్తాం."

భార్గవ : "లామా! ఐర్యత్ లామా అనే వ్యక్తి ఒక రహస్య సొరంగం ద్వారా శంబల వెళ్లాడని విన్నాం. శంబల చుట్టూ మూడు అభేద్యమైన కోట గోడల్లాంటి పర్వత శ్రేణులు, అగడ్తలు ఉన్నాయంటారు. మీరేమో శంబల 'అందని స్వర్గం' అని ఆకాశం కేసి చూపిస్తున్నారు. ఆకాశంలోని స్వర్గానికి సమానం భూగోళం పైనున్న శంబల కావచ్చు కదా! శంబల ఉందని మా నమ్మకం. ఆ రహస్యం మీరు చెప్పడం లేదు. ఇష్టం లేకనా?"

(లామా గారికి కాస్త కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నాడు].

లామా : “అవునా! కావచ్చు. ఒకనాడు ఇండియా నుండి బౌద్ధం టిబెట్ కి వలస వచ్చింది. ఇప్పుడు తిరిగి ఇండియా చేరుతోంది. అది టిబెట్ బౌద్ధుల నిర్వాకం వల్ల. అన్ని దేశాల్లో బౌద్ధ ధర్మం ఆదరించ బడుతోంది. కాస్త ఆచరణలో భేదాలు ఉన్నా బౌద్ధం ధర్మమే గదా! ప్రపంచంలో చాలా మార్పులు వస్తున్నాయి. మత మౌఢ్యం తగ్గిపోయి, ధర్మం ఆదరించబడు తోంది. మనుషులందరి ధర్మం ఒక్కటే. ప్రపంచంలో చాలా మంచి మార్పులు వస్తున్నాయి. ప్రాక్పశ్చిమ సంస్కృతులు కలిసిపోతున్నాయి. సౌభ్రాతృత్వం, విశ్వమానవత, విశ్వశాంతి అందరి ధ్యేయం. మాకంటే మీకే శంబల గురించి తెలుసు. అంటే రిగ్డెన్ జెయ్పే (మైత్రేయ ప్రజ్ఞ అందరిలో పనిచేస్తోందని అనిపిస్తుంది). శంబల కిరణాలు దశ దిశలా వ్యాపిస్తున్నాయి. రిగ్డెన్ అందరినీ గమనిస్తూ మానవత్వానికి మెరుగులు దిద్దుతున్నాడు. అది మైత్రేయం. ప్రపంచంలో ఎక్కడ ఏ మార్పు వచ్చినా అది శంబలలో నమోదవుతుంది.

'మైత్రేయ' అన్నది ఒక భావన. ఎవరైనా అందుకోవచ్చు. యోగ్యులైన వారందరికీ మైత్రేయ సహాయం అందుతుంది. మైత్రేయ నుండి ప్రసరించే కాంతి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. సన్మార్గంలో పయనించే వారికి అన్ని సదుపాయాలు కలుగుతుంటాయి. నష్టం, కష్టం ఉండవు. మైత్రేయ మనుషుల కర్మలను సైతం రహితం చేస్తాడు.

ప్రశ్న: “మహాత్మా! మీరు మైత్రేయ పక్షాన ఆయన ప్రొమోటర్ మాట్లాడుతున్నారు.

లామా : “ఇక్కడ ఎవరి పేరు ఉచ్చరించ కూడదు. పేర్లు ముఖ్యం కాదు. శంబల ఎంత రహస్యమో కాలచక్రం అంతే రహస్యం. పరమ గురువుల విషయాలు అంతే రహస్యం. తెలిసినా ఎవరు ఏమీ చెప్పరు. ఇక్కడ భావన ముఖ్యం. ఇది భావనా ప్రపంచం. భావ వ్యక్తీకరణకు శబ్దం అనవసరం. శబ్దం ద్వారా మీ భావాలు గాలిలో సంచరిస్తాయి. శబ్ద కాలుష్యం లేకుండా శబ్దాలు నిశ్శబ్దంలో ప్రసరిస్తాయి. భావాలు నిశ్శబ్దంగా శూన్యంలో ప్రసారం అవుతుంటాయి.

మీకు రిగ్డెన్ జయ్ - మైత్రేయ ఒక్కరేనన్న అభిప్రాయం ఉంది. దానిని అలాగే ఉండనీయండి. నేను అవునని చెప్పను కాదని చెప్పను.

శంబలలో ఎంతమంది ఉంటారంటే ఏం చెప్పను? అసంఖ్యాకం, అగణితం. ఇక్కడ జనాభా లెక్కలుండవు. తపస్సు పండినవారు వచ్చిపోతుంటారు. మానవ పరిణామానికి, వికాసానికి అవసరమైన అనేక పథకాలు ఇక్కడ రచిస్తుంటారు. అవి ప్రపంచానికి అందుతుంటాయి.

భార్గవ : “లామా? మానవతకు కొత్త శక్తులు అందుతాయని మా వేదం చెబుతుంది. నిజమా?”

లామా : “మీ వేదాలు ఘోషించినా, వేదాంతులు వల్లించినా, మా ప్రామాణిక గ్రంధాలు ఉదోషించినా అన్నీ ఆకాశం నుండి వచ్చే భావనలే. అందరికీ మూలం ఒక్కటే. ఇవన్నీ తధాగతుడు ఎప్పుడో కాలచక్రంలో నిక్షిప్తం చేసి ఉంచాడు. రిగ్ డెన్ వారసులు అనేక దేశాలలో జన్మిస్తారు.

ప్రశ్న : “మహాత్మా! అంతమంది మహా యోగులు భూమ్మీద అవతరించి ఆధ్యాత్మికంగా కృషి చేస్తుంటే భూమి పైన శంబల రూపు దాల్చినట్లే కదా!”లామా : ”భూమ్మీది శక్తులు, పరలోకాల శక్తులు కలిసే సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. అది ఒక్కరి వల్ల అయ్యేపని కాదు. శంబల ఆరాధకులు ఎక్కువవుతున్నారు. ఇక పైన శంబలను చేరడం ఉండదు.”

భార్గవ : “మహాత్మా! ఇప్పుడు టిబెట్లో మహాత్ములనదగ్గ లామాలు కనిపించడం లేదు. మార్పా, మిలారేపా లాంటి వారు నేడు లేరు. పంటపోయి కలుపు మొక్కలు మిగిలాయి. పరమ గురువులు లేరు. వారి స్థానంలో సాదాసీదా లామాలు మిగిలారనిపిస్తుంది. మీ లామాలు మా దేశంలోని రుషుల కన్న ఏ విధంగా గొప్ప?”

లామా : “కారణాలు చెప్పలేను. కాలచక్ర మహిమ. కొందరు తపోలోకాలకు వెళ్లిపో తుంటారు. కొందరు నక్షత్ర గోళాలలో సెటిలై ఉంటారు. వారు అక్కడ నుండే గైడ్ చేస్తారు. అందరు మానవత్వాన్ని ఉద్దరించాలని అనుకోవాలి. మాస్టర్లయిన వారికి మనిషి మాత్రమే ముఖ్యం కాదు. కొందరికి తిరిగి జన్మించడం ఇష్టం ఉండదు. కనుక మహా యోగ్యులైన లామాలు అసలు అందుబాటులో ఉండరు. బహుశః శంబలలో ఏ మూలనో అజ్ఞాతంగా ఉంటారేమో నాకు తెలియదు.

ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో మహా యోగులు ఉన్నారు. అందరూ టిబెట్లో గుంపు కట్టాలని లేదు. ఎక్కడైనా ఉండవచ్చు. ఎక్కడైనా అదృశ్యంగానే ఉంటారు. వారి ఆస్ట్రల్ శరీరాలు పని చేస్తుంటాయి. మీరు శంబలపై ఆసక్తితో వచ్చారు. తిరిగి ఇండియా వెడతారు. మీ పైన శంబల ముద్ర ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో శంబల భావుకత ఉంటుంది. మీ కృషిలో శంబల తొంగి చూస్తుంది. మీ భావనల్లో శంబల ఉండి తీరుతుంది. సత్-యోగం ఎక్కడ ఎవరు చేసినా అది సద్యోగమే 'సత్యయోగం'. ఇప్పుడు చాలామందికి పెంచన్ లామా శంబలకు చెందిన పరమగురువేనని తెలియదు.”

ప్రశ్న : “నాకు తెలిసి ప్రపంచ దేశాలలో పెంచన్ లామా, దలైలామా అభిమానులు ఉన్నారు. వారంతా బుద్ధ ధర్మాన్ని అనుసరిస్తున్నారా? బౌద్ధం పైన రాజకీయ ప్రభావం ఉంది గదా! లామాలకు రాజకీయ అధికారాలు అవసరమా? అధికారం ఆధ్యాత్మికానికి ప్రతికూలం గదా?”

లామా : “ఒక కథ ఉంది. పెంచన్ దిన్ పోచ్ ని శత్రువులు ముట్టడించారు. ఆయన తన బృందంతో పారిపోతున్నా డు. ఒక చోట ఆయన బృందానికి శత్రువుల బృందానికి మధ్య మంచు ప్రవాహం ఏర్పడ్డది. శత్రువులు వారిని పట్టుకోలేకపోయారు.

మరొకసారి పెంచన్ లామా పర్వతాల పైన ఒక సరస్సు దగ్గరకు వచ్చాడు. శత్రువులు చాలా దగ్గరగా వస్తున్నారు. ఆయన సరస్సు చుట్టు ఒకసారి ప్రదక్షిణం చేసి ధ్యానంలో కూర్చున్నాడు. శత్రువులు సరస్సు దాటి వారిని చేరలేకపోయారు. సరస్సుపై పొగమంచు క్రమ్మి శత్రువులు దారి తప్పారు.

పెంచన్ లామా ప్రయాణం చేసినంత కాలం ఆయన బృందాన్ని శంబల రక్షించేది. అలాంటి సంఘటనలు అనేకం ఉదహరించవచ్చు.

మీకు ఎక్కడైనా మంచి గంధం వాసన తగిలిందా?" అడిగాడు లామా. 

"తగిలింది" అన్నాను.

లామా : “మీకు మంచి గంధం వాసన వేస్తే అది శంబల సంకేతం. శంబల మిమ్మల్ని ఆహ్వానించినట్లు, ఆమోదించినట్లు. మంచి గంధ పరిమళం మీ పవిత్రతకు నిదర్శనం.”

ప్రశ్న: “అదే 'కాలచక్ర' రహస్యమా లామా?”

లామా : “అది ఒక సంకేతం మాత్రమే. 'కాలగీయ' అనే మాట వినిపిస్తే అది సంకేతం. ఆ శబ్దం విన వచ్చిన దిశగా వెళ్లితే శంబల చేరవచ్చు. అక్కడ శంబల ప్రవేశ ద్వారం ఉంటుంది. రిగ్డెన్ మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. శంబలకు చెందిన పరమ గురువులు మీ బాధ్యతలు తీసుకుంటారు.”

భార్గవ : “మహాశయా! యోగులకు, తాపసులకు శంబల గురువులతో పని ఉండవచ్చు. సామాన్య ప్రజకు శంబలతో ఏం పని? ఏం ఉపయోగం?”

లామా : “సామాన్యులు, అసామాన్యులు అని లేదు స్వామీ. ఈ జన్మలో సామాన్యు లుగా ఉన్నవారు పూర్వజన్మలో గొప్ప యోగులై ఉండవచ్చు. ఇప్పుడు గొప్ప వారుగా చలామణి అయ్యేవారు పూర్వం సామాన్యులై ఉండవచ్చు. ఇది ధర్మ పోరాటం. కష్టాలు అనుభవానికి రావాలి. అందువల్ల అన్ని జన్మలు ఒక్కటిగా ఉండవు.”

భార్గవ : “శంబల గురించి బయటి ప్రపంచానికి తెలియకపోవడమే రహస్యమా? లేక తెలిసినా, శంబల గురించి మీ వంటివారు చెప్పకపోవడం రహస్యమంటారా? ఏది అసలైన రహస్యం?”

లామా : “ఎవరు ఏ పనులు చేస్తున్నా పై వారు గమనిస్తుంటారు. విధి నిర్వహణలో ఏ ఇబ్బంది కలిగినా పైవారు చక్కదిద్దుతారు.

ఒకసారి మంగోలియా గోబీలో ఒకరికి ఒక పని అప్పగించారు. ఆ రహస్యం ఎవరికీ చెప్పకూడదని ఆంక్ష విధించారు. అతను ముసలివాడై చావు దగ్గరకు వచ్చింది. తన దగ్గర రహస్యం ఎవరికి చెప్పాలి. దుష్ట శక్తులు వచ్చి ఆవహించాయి. అతను కోమాలోకి వెళ్లాడు.

తన దగ్గరున్న రహస్యం చెప్పదగ్గ యోగ్యుడు కనిపించలేదు. శంబల గురువులు ఎవరో వెళ్లి అతనిని రక్షించారు. తర్వాత యోగ్యుడి కోసం అన్వేషించారు. గురువు తన కొక రహస్యం చెబితే దానిని రక్షించడం తన బాధ్యత. ఎవరి కర్మవారును వారే అనుభవించాలి. మహా గురువులైనా సరే ... ఇతరుల కర్మల్ని వారు తీసుకోరు.”

భార్గవ : “మహాత్మా! టుర్కీస్థానంలో సుదీర్ఘమైన పర్వత గుహలున్నాయి. ఆ గుహల మార్గంలో శంబల చేరవచ్చు అంటారు. ఆ మార్గం ద్వారానే శంబల వాసులు బయటకు వస్తుంటారుట. నిజమా? కాదా?”లామా : “నిజమే! అప్పుడప్పుడు శంబల వాసులు బయటకు వస్తుంటారు. తమ పక్షాన పనిచేస్తున్న వారిని వెళ్లి కలుస్తూ ఉంటారు. మీరు చెప్పే మోర్య, జ్వాల్ కూల్,  కుత్ హోమిలు అలా వచ్చిన శంబల వాసులే. వాళ్లు పరమ గురువులు కారు. మాస్టర్స్ అని చెప్పలేం. మాస్టర్స్ మీడియమ్స్ కావచ్చు. లేదా వారి ప్రతినిధులు అయి ఉండవచ్చు. వారు గాలిలో ప్రయాణం చేస్తారు. గాలి లోంచి వస్తువులు సృష్టిస్తారు. మీరు అడిగిన వస్తువులు తెచ్చి అందిస్తారు. రిగ్డెన్ జెయపో అప్పుడప్పుడు భౌతిక శరీరంతో కనిపిస్తారు. పవిత్ర స్థలాలలో, పుష్కరాల లో దర్శనమిస్తాడు. జనసమ్మర్థం ఉన్న చోట్ల సడెన్ గా కనిపించి అంతర్థానమవు తాడు. ఎవరికో ఏదో సందేశం యిచ్చి పోతుంటాడు.

రాత్రి వేళల్లో, సూర్యోదయ సమయాల్లో శంబల గురువులు ఏ దేవాలయ ప్రాంగణంలోనే దర్శనం యిస్తారు. వారు వచ్చినపుడు తలుపులు అవే తెరుచు కుంటాయి. దీపాలు వెలుగుతాయి. పుణ్య పురుషులకు మాత్రమే వారి రాక తెలుస్తుంది. అవసరం కలిగినపుడు వారే వచ్చి కలుస్తారు. వారిది మౌన సందేశం. మానవ సందేశం.

ప్రళయం వస్తుందో, రాదో చెప్పలేం కాని యుగం మారుతోంది. గ్రహాలు కొత్త కార్యక్రమాలు తయారు చేస్తున్నాయి. సత్యయుగం ఆరంభం అవుతోంది. మైత్రేయ అవతరణ జరుగుతుంది. ఫరవాలేదు - ప్రపంచంలో ఆధ్యాత్మిక దృక్పథం బాగా పెరిగింది. రిగ్డెన్ మళ్లీ అవతరిస్తాడు.
🪷
*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂



 🙏 *రమణోదయం* 🙏

*యుగాన్ని ఒక్క క్షణంగాను, క్షణాన్ని ఒక యుగంగానూ తోచేట్లు చేసి కల్లోలపరచడమే మనస్సు యొక్క మాయాజాలం.*

వివరణ: *మనోమాయ చేత దేశకాల భేద కల్పితాలు జరుగుతున్నాయని భావం.*

తనకు తాను ఉంటాడు..ఇతరులకూ తానుంటాడు
ఇది జీవితం🌹
ఇతరులకు తాను ఉండడు..తనకు తాను ఉంటాడు
ఇది మరణం🌹
ఇతరులకు తాను ఉంటాడు..తనకు తాను ఉండడు 
అయినా "తాను ఉంటాడు"..ఇది మోక్షం!🙏

నేను పుట్టక మునుపు,
నేను మరణించాక ఉన్న
"నేను" యొక్క అడ్రస్ ఎవ్వరికీ తెలియదు.
అనగా జనన - మరణ రహస్యం
ఎప్పటికీ రహస్యమే!🙏

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.561)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*||

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🌹🙏

****సన్యాసము... త్యాగము.....*

 *సన్యాసము... త్యాగము.....*

కోరిక చే చేయు కర్మలను మానడం సన్యాసమనీ, కర్మఫలితాలు విడిచి పెట్టడమే త్యాగమని పండితులు అంటారు. కర్మలన్నీ బంధ కారణాలే కనుక చేయకపోవడమే మంచిదని కొందరు, యజ్ఞ, దాన, తపస్సులను విడవకూడదని కొందరు అంటారు.

త్యాగం విషయంలో చిత్తశుద్దిని కల్గించు యాగ, దాన, తపస్సులను మూడు కర్మలు ఎన్నడూ విడవరాదు. వాటిని కూడా మమకారం లేక, ఫలాపేక్ష లేకుండా చేయాలి. కర్తవ్యాలను విడిచి పెట్టడం న్యాయం కాదు. అలా విడవడం తామస త్యాగం.
శరీరకశ్టానికి భయపడి కర్మలు మానడం రాజస త్యాగం. దానికి ఫలితం శూన్యం.

శాస్త్రకర్మలు చేస్తూనే ఆసక్తినీ, కర్మఫలాన్నీ విడిస్తే అది సాత్వికత్యాగం. ఇలా చేయువాడు, సందేహాలు లేనివాడై ఆత్మజ్ఞాని దుఃఖాలను ఇచ్చే కర్మలను ద్వేషింపడు. సుఖాన్నిచ్చే కర్మలను ఆనందింపడు.
శరీరం కల్గినవారు కర్మలను వదలడం అసాధ్యం. కాబట్టి కర్మఫలితాన్ని వదిలే వాడే త్యాగి.

ఇష్టము, అనిష్టము, మిశ్రమము ..అని కర్మఫలాలు మూడు రకాలు. కోరిక కల్గిన వారికి ఆ ఫలితాలు పరలోకంలో కలుగును. కర్మఫల త్యాగులకు ఆ ఫలితాలు అందవు.

శరీరం, అహంకారం, ఇంద్రియాలు, ప్రక్రియా పరమైన వివిధ కార్యాలు, పరమాత్మ అను ఈ ఐదే అన్ని కర్మలకూ కారణమని సాంఖ్య శాస్త్రం చెప్తోంది.

మనస్సు, మాట, శరీరాలతో చేసే అన్ని మంచి, చెడు కర్మలకూ ఈ ఐదే కారణము. ఈ విషయాలు తెలియనివారు, చెడ్డ భావల వారు మాత్రం తమే చేస్తున్నట్టూ అహంకారంతో తిరుగుతారు. తను పని చేస్తున్నానన్న అహంకారం లేనివాడు, అజ్ఞానం లేనివాడు ఈ లోకం లో అందరినీ చంపినా సరే.. ఆ పాపం వాడికి ఏ మాత్రమూ అంటదు.

జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత ..అని మూడు కర్మ ప్రోత్సాహకాలు. అలాగే..

కర్త, కర్మ, సాధనం.. అని కర్మ సంగ్రహం మూడు రకాలు.

జ్ఞానం, కర్మ, కర్త అనేవి సాంఖ్యశాస్త్రం ప్రకారం మూడేసి విధాలుగా ఉన్నాయి...

జ్ఞానం...

1) విభిన్నంగా కనపడే అన్ని జీవులలో అవినాశమై, మార్పు లేని, ఒక్కటిగా ఉన్న ఆత్మను గ్రహించే జ్ఞానమే సాత్విక జ్ఞానం.

2) ఎన్ని జీవులుంటే అన్ని ఆత్మలు ఉన్నాయనడం రాజస జ్ఞానం.

3) ఏది చూస్తే అదే సర్వమని అనుకొనే జ్ఞానం తామస జ్ఞానం.

కర్మ...

1) అభిమాన, మమకార, ద్వేషం లేక ఫలాపేక్ష లేక చేయు విధిపూర్వక కర్మలు సాత్వికం.

2) ఫలితం పైన ఆసక్తితో, అహంకార అభిమానాలతో, చాలా కష్టంతో చేయునవి రాజస కర్మలు.

3) మంచిచెడ్డలను, కష్టనిష్ఠూరాలను గమనింపక మూర్ఖంగా చేయు పని తామస కర్మ.

కర్త...

1) ఫలితం పైన ఆశ పెట్టుకోకుండా, నిరహంకారియై, ఫలితం లోని మంచిచెడ్డలకు ప్రభావితం కాక ధైర్యోత్సాహాలతో పని చేయువాడు సాత్విక కర్త.

2) ఫలితం పైన ఆశతో, అభిమానంతో, లోభగుణంతో, హింసతో, అశుచిగా, సుఖదుఃఖాలకు చలిస్తూ పని చేయువాడు రాజస కర్త.

3) ధైర్యం పోగొట్టుకొని, మూర్ఖత్వంతో, మోసంతో, దీనమనస్సు తో, వృథా కాలయాపంతో పనిచేయువాడు తామస కర్త.

బుద్ధి, ధృతి అనే ఈ రెండూ గుణబేధాలచే మూడు విధాలు...

బుద్ధి...

1) ధర్మాధర్మములందు ప్రవృత్తి నివృత్తులను, కర్తవ్యాకర్తవ్యాలను, భయాభయాలను, బంధనమోక్షాలను స్పష్టంగా తెలుసుకోగలిగినదే సాత్విక బుద్ధి.

2) ధర్మాధర్మాలు, కార్యాకార్యాలు నిజజ్ఞానాన్ని కాక పొరపాటుగా గ్రహించేది రాజస బుద్ధి.

3) ప్రతిదాన్ని వ్యతిరేకంగా గ్రహించేది తామస బుద్ధి.

ధృతి...

1) మనసు, ప్రాణం, ఇంద్రియాల వృత్తులను నిగ్రహించి చెదిరిపోకుండా నిలిపే పట్టుదలను సాత్విక ధృతి అంటారు.

2) ఫలితంపై అధిక ఆసక్తి, ధర్మ, అర్థ, కామాలందు చూపే అధిక పట్టూదలే రాజస ధృతి.

3) కల, భయం, బాధ, విషాదం, గర్వం వీటికి లోనవుతూ కూడా మూర్ఖపు పట్టుదలను వీడనిది తామసికధృతి.

సుఖాలు మూడు విధాలు...

1) మొదట దుఃఖకరమైనా సాధన చేస్తున్నకొద్దీ సులవు అనిపించి, ఇబ్బందులు తొలగి చివరికి ఎనలేని ఆనందం ఇస్తుందో ఆ అమృతమయ బుద్ధితో జన్మించేదే సాత్విక సుఖం.

2) ఇంద్రియ సంయోగం వలన పుట్టేదీ, మొదట అమృతంగా ఉన్నా చివరికి విషం అయ్యేది రాజస సుఖం.

3) ఎప్పుడూ మోహింపచేస్తూ, నిద్ర, ఆలస్య, ప్రమాదాలతో కూడినది తామస సుఖం.

త్రిగుణాలకు అతీతమైనది ఏదీ భూ, స్వర్గ లోకాలలో, దేవతలలో ఎక్కడా ఉండదు.

స్వభావ గుణాలను అనుసరించి నాలుగు వర్ణాలవారికీ కర్మలు వేర్వేరుగా విభజింపబడ్డాయి...

1) బాహ్య, అంతర ఇంద్రియనిగ్రహం, తపస్సు, శౌచం, క్షమ, సూటి స్వభావం, శాస్త్రజ్ఞానం, అనుభవ జ్ఞానం మొదలగునవి స్వభావంచే బ్రాహ్మణ కర్మలు.

2) శౌర్యం, తేజస్సు, ధైర్యం, వెన్ను చూపనితనం, సపాత్రదానం, ఉత్సాహశక్తులు క్షత్రియ కర్మలు.

3) వ్యాపారం, సేవావృత్తి వైశ్యులకు..

4) వ్యవసాయం, గోరక్షణ, శూద్రులకు స్వభావ కర్మలు.

తన స్వభావ కర్మలను శ్రద్ధాసక్తులు కలిగి ప్రవర్తించేవాడు జ్ఞానయోగ్యతారూప సిద్ధిని పొందుతాడు. పరమాత్మను తనకు విధించబడిన కర్మలచే ఆరాధించేవాడు చిత్తశుద్ధిని పొందుతాడు.

మాయ లేని నిశ్చల జ్ఞానంతో మనసును నిగ్రహించి, శబ్దాది విషయాలను వదిలి, రాగద్వేష రహితుడై, నిత్యమూ వైరాగియై, యేకాంత వాసంతో, అల్పాహారియై, మనస్సు, మాట, శరీరాలల్ను నియమబద్దం చేసి, ధ్యాన యోగియై, అహంకార, అభిమాన, కామ, క్రోధాలను వదిలి, విషయ స్వీకారం విడిచి, మమకారంలేని వాడై, శాంతచిత్తం కల్గినవాడే బ్రహ్మభావానికి అర్హుడు.

బ్రహ్మజ్ఞాని దేనినీ కోరడు. దేనికీ దుఃఖించడు. అన్ని భూతాలందూ సమ దృష్టి కల్గి ఈశ్వర భక్తిని పొందుతాడు. ఆ భక్తిని పొందినవాడు ఈశ్వరుడుని పూర్తిగా గ్రహించి ఆ భక్తితోనే ఈశ్వరుని లో ఐక్యం అవుతాడు. ఎన్ని పనులు చేస్తున్నా, ఈశ్వరుడుని నమ్మిన కర్మయోగి ఈశ్వరుడుని పరమపదమే పొందుతాడు.

అన్ని కర్మలూ ఈశ్వరుడికి అర్పించి సమ బుద్దిరూపమైన యోగం చేసి. ఈశ్వరుడె పరమగతి అని తెలుసుకొని నీ మనసును ఈశ్వరుని యందు లగ్నం చేయి. ఈశ్వరుడుని శరణు కోరితే ఆయన అనుగ్రహంతో సంసారాన్ని తరిస్తారు.

సర్వభూతాలనూ తన మాయచే కీలు బొమ్మలలా ఆడిస్తూన్న ఈశ్వరుడు అందరి హృదయాలలో ఉన్నాడు. అతడినే అన్నివిధాలా శరణు వేడు. ఈశ్వరుని దయచతనేే శాంతి, మోక్షం పొందుతారు...    
 *బ్రహ్మరాత.....*

ఒక మంచి ప్రతిభావంతుడైన ముని వుండేవారు. సకల శాస్త్రాలు, విద్యలు తెలిసినవారు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా, ఒక నాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి.

వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు. ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు.

ఇదిలా వుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు.

కాసేపట్లో లోపలి నుండి చంటి బిడ్డల ఏడుపులు వినిపించ్చాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి వుండేవాడు కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు.

అతడు ''బ్రహ్మ''. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు.

బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు.. నాయనా.. ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనా కష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు.

ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు.

వెంటనే తన గురువు గారిని బ్రహ్మ రాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు.

ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా.. అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య, అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒక రోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు. 
వారందరిని వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా... దానికి వసంతుడికి అందరు చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు అని.

అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు.

వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా.. అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ.. నువ్వు బాధపడకు. ఇప్పటి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా.. ఇక నుండి నువ్వు ఎలా చెపితే అలానే చేస్

తాను'' అన్నాడు శంకరుడు.

ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు.

ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు. 
తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా.. ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు.

దానికి వసంతుడు తమ్ముడూ.. నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు. 
ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.

వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా.. నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ.. ఊరుకోమ్మా.. ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన.

ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా.. ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం. కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు.

ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు. 

ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు...

 ప్ర: *మన ఇళ్లల్లో ఉన్న దేవతల క్యాలెండర్లు, చిత్ర పటాలు జీర్ణించినప్పుడు లేదా ఉపయోగించనప్పుడు వాటిని ఎలా విసర్జించాలి?*

జ: మనం ఉపయోగించనప్పుడు ఉపయోగించే వారికి ఇవ్వచ్చు. జీర్ణించినప్పుడు వాటిని నదులలోగానీ, సముద్రాలలోగానీ వదిలేయాలి. అవి ఆ జలాల లోపాలకి వెళ్లిపోయేలా చూసుకుని కదలాలి. మళ్ళీ వడ్డుకి వచ్చి చెత్తలో కలవకుండా జాగ్రత్తపడాలి.

ప్ర: *శివునకు భక్ష్యం, భోజ్యం, పులిహోరా, పొంగలి, గుగ్గిళ్ళు భక్తులు తమ ఇళ్లల్లో వండి శివాలయంలో నైవేద్యం పెట్టవచ్చునా లేక అర్చకులే వండి వడ్డించాలా? వారి ఇంట్లో వండిన అన్నం నైవేద్యం పెట్టవచ్చా?*

జ: దేవాలయంలో శుచి ప్రధానం. అది కాపాడబడినప్పుడే దేవాలయంలో శక్తి స్థిరంగా ఉంటుంది. వేరేచోట వండి తెచ్చిన ఆహారం నివేదనకు పనికిరాదు. ఎంత శుచిగా వండినా, ప్రాంతం మర్చి తెచ్చిన వంట నివేదించరాదు. 

దేవసన్నిధానంలో శుచిగా వండినది, అన్యదృష్టి సోకకుండా దైవానికి నివేదించాలి. అర్చకుల ఇళ్లల్లో వండినా సన్నిధిలో నున్న గృహంలోనైతే ఫరవాలేదు. వారైనా సరే శుచిగా వండవలసిందే. లేకపోతే నివేదించడం కుదరదు.        
 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


92. పశ్యన్తి సర్వే చక్షుషా, న సర్వే మనసా విదుః

అందరూ కంటితో చూస్తున్నారు కానీ అందరూ మనస్సుతో తెలుసుకోలేరు
(అథర్వవేదం)

సూర్యభగవానుని గురించి వేదమాత చెప్పిన వాక్యమిది. కంటితో మనం చూసే సూర్యాది జ్యోతిస్సులలోని దైవత్వాన్ని మనస్సుతో భావించవలసినదే. కానీ మానవులు
కేవలం బాహ్యదృష్టితో సూర్యాదులను జడ ప్రకృతిగానే చూడగలుగు తున్నారు.
భౌతిక దృష్టితోనే పరిశీలిస్తున్నారు.

'మనసా' అనే మాటకి 'జ్ఞానముచే' అనే అర్థాన్ని కూడా భావించవచ్చు - 'మన అవబోధనే' అనే ధాత్వర్థాన్ని అనుసరించి.

సూక్ష్మమైన జ్ఞానముతో - స్థూలమైన సూర్యాదులలోని దేవతా చైతన్యాన్ని
గ్రహించగలం. కానీ ఆ జ్ఞానమును సంపాదించలేక, దానితో సత్యాన్ని
చూడలేకపోతున్నాం.

కంటితో దర్శించడం సర్వసామాన్యం. కానీ జ్ఞానముతో దైవతత్త్వాన్ని, ఆత్మతత్త్వాన్ని దర్శించడం అందరికీ సాధ్యం కాదు. అందుకే "అందరూ” అనే మాట పై మంత్రంలో
ఉన్నది. స్థూలదృష్టి అందరికీ ఉంటుంది- సూక్ష్మదృష్టి అందరికీ ఉండదు. అదే పై మంత్రభావం. సూక్ష్మమైన దృష్టితోనే ఆత్మతత్త్వాన్ని తెలుసుకోగలం.

ఈ సూక్ష్మదృష్టినే 'జ్ఞానదృష్టి'... అంతర్ముఖావలోకనం.... ఇలాంటి మాటలతో వేదాంతవాఙ్మయం బోధిస్తోంది.

“అందరూ కేవలం బహిర్ముఖ ప్రవృత్తి గలిగిన ఇంద్రియాలననుసరించి ప్రపంచాన్ని అనుభవిస్తారు. ధీరుడైన ఏ ఒక్కడో మాత్రమే బహిర్ముఖత్వం నుండి వెనుదిరిగి అంతరృష్టితో ప్రత్యగాత్మను దర్శిస్తారు" కశ్చిద్ధీరః ప్రత్యగాత్మాన మైక్షత్అని ఉపనిషద్వచనం.

ఆ విధమైన బ్రహ్మజ్ఞానదృష్టిని అలవరచుకోవడానికే ఆధ్యాత్మిక సాధనలు. లోకంలో అవివేకి దృష్టికీ - భౌతిక విజ్ఞాని దృష్టికీ తేడా ఉన్నది కదా! అలాగే భౌతిక విజ్ఞానదృష్టికీ
ఆధ్యాత్మిక జ్ఞాన దృష్టికీ తేడా ఉంది. 
కేవలం పశుప్రాయమైన అవివేకి చూసే ప్రపంచం కన్నా, ఒక భౌతిక శాస్త్రవేత్త చూసే ప్రపంచదృష్టి విభిన్నమైనది. అంతకంటే ఆధ్యాత్మికవేత్త చూపు ప్రత్యేకం.

‘అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్వికమ్' - అని గీతాచార్యుని మాట.విడివిడిగా కనబడే ప్రపంచంలో అంతర్యామిగా ఉండే ఏకతత్త్వాన్ని చూడడమే ఉత్తమ జ్ఞానమని దీని భావం.

'పండితాః సమదర్శనః’
'యః పశ్యతి స పశ్యతి'
-
వంటి మాటలు ఈ 'దృష్టి' గురించే చెబుతున్నాయి. రకరకాల నగలను
చూసేటప్పుడు, అవన్నీ ఒకే సువర్ణంతో ఉన్నవని తెలుసుకోవడం ఏకదృష్టి. నగలుగా చూస్తే భిన్న దృష్టి. భిన్న దృష్టి అందరికీ సహజం. ఏకదృష్టియే వివేకంతో లభించేది.
ప్రపంచాన్ని ప్రపంచంగా చూడడం సామాన్యదృష్టి - పరమేశ్వరమయంగా దర్శించడం జ్ఞానదృష్టి. “మనసా విదుః" - అనే మాటలోని అర్థం ఇదే.

“... తస్మిన్ దృష్టే పరావరే” పరమాత్మ యందు దృష్టిని నిలిపినప్పుడు, హృదయగ్రంధి భేదింపబడి, సంశయములు ఛేదింపబడి, కర్మబంధములు క్షీణించి కైవల్యాన్ని
పొందుతాడని ఉపనిషత్తు పలుకు.             
 *కర్మాచరణ... జ్ఞానం.....*

ఈ జీవితము, ఈ అనుభవాలు ఇవన్నీ నిజమేనా.. కలా.. మాయా.. ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు జిజ్ఞ్యాసులను సతమత పరుస్తుంటాయి. కొన్ని భౌతికమైనటు వంటి సంశయాలు అయితే మరికొన్ని ఆధ్యాత్మిక మైన సంశయాలు ఏర్పడుతుంటాయి. ఏదైనా కూడా వాటిని తొలగించుకొని ముందుకి వెళ్లడం అనేది మనకి అవసరం. అయితే సంశయం అనేది మానవుని కర్తవ్యంలోంచి వెనక్కి లాగుతూ వుంటుంది.

సంశయం అంటే ఇదా.. అదా.. ఇలానా.. అలానా.. ఇప్పుడా.. అప్పుడా.. నిశ్చయం ఏర్పడదన్నమాట. అది ఇటు అటు రెండు వైపులా మానవులని లాగుతుండే టటువంటి స్థితిని మనం సంశయం అని అంటాం. అలా కలిగినప్పుడు ఏదో ఒకటి చేయడము  అనేది ఎప్పుడూ జరగదు. నిశ్చయం ఏర్పడితేనే మంచైనా, చెడైనా చేయగలుగుతాడు. సంశయంలో ఉండి, ఊగిసలాడుతూన్నంత వరకు మంచీ చేయలేడు, చెడూ చేయలేడు.

మన సమాజానికి మనకి కూడా మంచి చేస్కోవాలి అనుకుంటున్న వ్యక్తులం కనక మంచి గురించి మనకి ఒక నిశ్చయం ఏర్పడాలి. ఐతే మన అనుభవం , మనకుండేటటు వంటి జీవితం చాలా తక్కువ కనక అనుభవించినటు వంటి పెద్దల యొక్క ఉపదేశం మన ఆసరాగా తీస్కున్నట్టైతే త్వరగా ముందుకి సాగగలుగుతాం. అనుభవించి నటువంటి వ్యక్తులు ఎవరు.. ఏం చెప్పాలి వాళ్ళు మనకి, ఎట్లా చెప్తారు.

లోకంలో ఉండేటటు వంటి వ్యక్తులు ఒక్కొక్కరూ ఒక్కొక్క మార్గం మనకి చూపిస్తుంటారు, నలుగురిని ఆశ్రయించి మనం వినేటప్పటికి అస్సలు ఏది తగునో ఏది తగదో నిర్ణయించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతుంటాము. అందుకే భగవంతుడు తానే నేరుగ భాద్యత తీసుకొని, ఏది తగునో దాన్ని నిర్ణయించి చెప్పడానికి, ఏది తగదో దాన్ని మానమని చెప్పడానికి ఈ లోకం లోకి దిగివచ్చాడు శ్రీకృష్ణుడై అవతరించాడు.

అర్జునుడికి 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఎంతో ఉపదేశం చేసాడు, నాయినా నువ్వు తగినటువంటి భాద్యతని నెరవేర్చు కర్మని ఆచరించు, ఆ కర్మ ఒకవేళ తప్పుగ కనిపించిన బెంగ పడకు, దానిని సవ్యంగా చేసుకుంటూ వెళ్ళు, అలా చేసినట్టైతే అది మంచి పనే అవుతుంది, నీకు అది ఈశ్వర ఆరాధన తో సమానమవుతుంది, వైద్యుడు శరీరాన్ని కోస్తాడు కాని దాన్ని మనం హింస అని అనటంలేదు కదా.. అది కోయకపోతే తప్పు వాడికి అది అవసరం. రోగికి అది అవసరం వైద్యుడు దాన్ని చేయాలి, అందుచేత చేసే పనిలో తప్పు ఉన్నా ఫరవాలేదు ఐతే చేసేటప్పుడు భావం వెనకాతల ఎలా ఉండి చేయాలో తెలుసుకొమ్మని చెప్పాడు.

ఎలా ఉండి చేయాలి.. వెనకాతల ఉండే భావం అంటే ఏమిటి.. ఒక జ్ఞానం. ఆ జ్ఞానం ఎట్లా ఉండాలి.. నేను చేసేది కేవలం నా స్వార్ధం కోసం కాదు, వాడి హితం కోసం నా లాభం కోసం కాదు, వాడి శ్రేయస్సు కోసం, ఇది ప్రపంచ వ్యవస్థకి అవసరం, భగవంతుడు ఏర్పరిచింది, కనుక నేను అట్లా ప్రవర్తించాలి, అది నేను చేసే తీరాలి అని జ్ఞానం కలిగి చేయాలి, జ్ఞానం చాలా ప్రధానం సుమా.. అని చెప్పారు...

 *ప్రేరణ ✌️మార్గ*
“The only certain means of success is to render more and better service than is expected of you, no matter what your task may be” –Og Mandino
✌️✌️✌️
“Realize what you really want, it stops you from chasing butterflies and puts you to work digging gold” –William Moulton
✌️✌️✌️
“Get in to the arena, forget about the critics and play big with the gifts of your days. If you listen to your critics, you will never do anything great with your life. You were meant to shine and let your talents see the light of the day” –Robin Sharma
✌️✌️✌️.             "మీ పని ఏమైనప్పటికీ, మీ నుండి ఆశించిన దానికంటే ఎక్కువ మరియు మెరుగైన సేవను అందించడమే విజయానికి ఏకైక మార్గం." -ఓగ్ మాండినో

 "మీకు నిజంగా ఏమి కావాలో గ్రహించండి, ఇది సీతాకోకచిలుకలను వెంబడించకుండా ఆపుతుంది మరియు బంగారం త్రవ్వే పనిలో మిమ్మల్ని ఉంచుతుంది" - విలియం మౌల్టన్

 “అరేనాలోకి ప్రవేశించండి, విమర్శకుల గురించి మరచిపోండి మరియు మీ రోజుల బహుమతులతో పెద్దగా ఆడండి.  మీరు మీ విమర్శకుల మాటలు వింటే, మీరు మీ జీవితంలో గొప్పగా ఏమీ చేయలేరు.  మీరు ప్రకాశింపజేయాలని మరియు మీ ప్రతిభను రోజు వెలుగులోకి తీసుకురావాలని ఉద్దేశించబడింది. ”-రాబిన్ శర్మ

 *ధ్యాన🧘‍♂️ మార్గ*                To all the warriors fighting their inner battles, keep pushing forward. The journey to self-improvement is a marathon, not a sprint.
                                                       వారి అంతర్గత పోరాటాలతో పోరాడుతున్న యోధులందరికీ, ముందుకు సాగండి.  స్వీయ-అభివృద్ధి కోసం ప్రయాణం మారథాన్, స్ప్రింట్ కాదు!

Everyone will have their way of prioritizing their own interests. Make sure you prioritize yourself. Don’t lose yourself trying to be everything to someone. Come back to you. Have the courage to love yourself so much that putting yourself first comes natural to you.

ప్రతి ఒక్కరికి వారి స్వంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి వారి మార్గం ఉంటుంది.  మీరు మీకే ప్రాధాన్యత ఇస్తున్నారని నిర్ధారించుకోండి.  ఎవరికైనా సర్వస్వం కావాలనే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు కోల్పోకండి.  మీ వద్దకు తిరిగి రండి.  మిమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించే ధైర్యం కలిగి ఉండండి, మీకే మొదటి స్థానం ఇవ్వడం మీకు సహజంగా వస్తుంది.

 Vedantha panchadasi:
ఏవం సతి మహావాక్యా త్పరోక్షజ్ఞాన మిర్యతే ౹
యైస్తేషాం శాస్త్రసిద్ధాంత విజ్ఞానం శోభతేతరామ్ ౹౹79౹౹

79. ఇట్లుండగా మహావాక్యముల వలన బ్రహ్మము గూర్చిన పరోక్షజ్ఞానమే లభించునను వారు తమ అద్భుతమైన శాస్త్రసిద్ధాంత వి(అ)జ్ఞానమును ప్రకటింతురు.

ఆస్తాం శాస్త్రస్య సిద్ధాన్తో యుక్త్యా వాక్యాత్పరోక్షధీ ః ౹
స్వర్గాది వాక్యవన్నైవం దశమే వ్యభిచారతః ౹౹80౹౹

80. యుక్తితో తార్కికముగ సాధించిన శాస్త్రి సిద్ధాంతములు అట్లుండనిమ్ము.శాస్త్ర వాక్యముల వలన కలుగునది స్వర్గాదుల వలె బ్రహ్మము గూర్చి పరోక్షజ్ఞానమే కదా అనినచో,అట్లుకాదు దశమజ్ఞానములా మహావాక్యము వలన అపరోక్షజ్ఞానము కలుగును.

స్వతోఽ పరోక్ష జీవస్య బ్రహ్మత్వ మభివాఞ్ఛతః ౹
నశ్యే త్సిద్ధాపరోక్షత్వమితి యుక్తిర్మహత్యహో ౹౹81౹౹

81.బ్రహ్మ స్వరూపాకాంక్ష కలిగి ఉండేటటువంటి స్వభావ సిద్ధంగానే అపరోక్షజ్ఞానము తో కూడినట్టి జీవునియొక్క అపరోక్షత్వం నష్టమౌతుందనే మీ యుక్తి చాలా గొప్పది !

వృద్ధిమిష్టవతో మూలమపి నష్టమితీదృశమ్ ౹
లౌకికం వచనం సార్థం సంపన్నం త్వత్ర్పసాదతః ౹౹82౹౹

82. వడ్డీమీది లోభంవల్ల అసలుకే మోసం వచ్చిందనే లోకంలోని సామెత తమలాంటి వ్యక్తుల దయవల్లనే సార్థకమౌతోంది.

వ్యాఖ్య:- ఇంత జరిగినప్పటికీ -
మహావాక్యాలవల్ల అపరోక్షజ్ఞానం సిద్ధించినప్పటికీ, కొంతమంది 'తత్త్వమసి'ఇత్యాది వాక్యాలద్వారా పరోక్షజ్ఞానం మాత్రమే కలుగుతుందని వల్లిస్తూ తమ అద్భుతమైన శాస్త్రసిద్ధాంత వి(అ)జ్ఞానమును ప్రకటిస్తూ ఉంటారు.
అటువంటి పండితుల శాస్త్ర సిద్ధాంతజ్ఞానం అందమైనదే అనుకోవాలి.
వారికి శాస్త్ర సిద్ధాంతజ్ఞానం లేదని భావం.

"శాస్త్ర సిద్ధాంతాలను వదిలివెయ్యి ! 
'తత్త్వమసి' ఇత్యాది మహా వాక్యాలవల్ల పరోక్షజ్ఞానమే కలుగుతుందని - 
స్వర్గాదులను  ప్రతిపాదించే వాక్యాల్లాగా!
ఇది యుక్తిపూర్వకంగా - అనుమానంతో తెలుస్తుంది" అని అనవచ్చు.ఇందుకు సమాధానమేమిటంటే -
నీవు పదవవాడవు అనే వాక్యం ఉంది,దీనివల్ల ఆ పదవ వానికి అపరోక్షజ్ఞానం పదవ వాని గూర్చి కలుగుతున్నట్లు తెలుస్తోంది గదా ! కాబట్టి, అన్ని వాక్యాల్నీ పరోక్షజ్ఞానం కలిగించేవిగానే భావించరాదు'అని.

ఇతర శ్రుతి వాక్యముల వలన బ్రహ్మమును గూర్చిన పరోక్షజ్ఞానమును,
మహావాక్య ముల వలన అపరోక్షజ్ఞానమును బుద్ధియందు కలుగును.
రెండూ ప్రతిబంధకములు తొలగినపుడే కలుగును.

'త్వమ్' అనే పదానికి అర్థమైన జీవాత్మకు అపరోక్షత్వం ఉండకపోతుందేమోనని మహావాక్యాన్ని పరోక్షజ్ఞాన జనకంగా అంగీకరించారా ? అని అంటే,

బ్రహ్మ స్వరూపకాంక్ష కలిగి ఉండేటటువంటి,
స్వభావ సిద్ధంగానే అపరోక్షజ్ఞానముతో కూడినట్టి
జీవుడు స్వయముగనే ఎల్లరకును అపరోక్షముగ తెలియును.
ఆ జీవుడే బ్రహ్మము అని మహావాక్యములు చెప్పగా,
ఉన్న అపరోక్షత్వము నశించి పరోక్షమగుననట ఏమి అద్భుతమైన యుక్తి !
బొత్తిగా అసంగతమైన విషయమని భావము.

వడ్డీ వచ్చునని ఆశింపగా అసలుకే (మూలధనానికే) ముప్పువచ్చెననే సామెత 
మీ (ప్రతివాదుల) అనుగ్రహము వలన సార్థకమైనది.

'తత్త్వమసి' మొదలగు మహావాక్యములందు 'త్వం' పదమునకర్థమైన జీవునియందు అపరోక్షత్వము ఉండనే ఉన్నది.
ఆ అపరోక్షత్వమే 'తత్' పదమైన బ్రహ్మమునకును సిద్ధించునని వేదాంతులు, చెప్పుచుండగా బ్రహ్మమునకు
ప్రస్తుతమున్న పరోక్షత్వమే మహావాక్యముల వలన జీవునకు కలిగి అతని అపరోక్షత్వమే నశించునని ప్రతివాదులనుట హాస్యాస్పదము గదా!

"మహావాక్యముల వలన బ్రహ్మము గూర్చిన అపరోక్షజ్ఞానము కలుగును".

"శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులయిన గురుదేవుల"  చేత సర్వోపనిషత్తుల సారమైన "తత్త్వమసి" - యనెడు మహావాక్యమును అనగా 
"ఆ బ్రహ్మమే నీవైయున్నావని"  విషయమును అర్థసహితంగా శ్రవణంజేసి, విచారణ పద్ధతిలో మననము,నిదిధ్యాసనము గావించిన పురుషునికి
"అహం బ్రహ్మస్మి" - నేనే బ్రహ్మమునైయున్నాననెడి అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానము గల్గుచున్నది.

అంతఃకరణ సంభిన్న బోధో జీవోఽ పరోక్షతామ్ ౹
అర్హత్యుపాధి సద్భావాన్న తు బ్రహ్మానుపాధితః  ౹౹83౹౹

83. (ఆక్షేపము) జీవుడు అంతఃకరణమనే ఉపాధి గలవాడగుటచే అపరోక్షజ్ఞానమునకు విషయము కాగలడు. బ్రహ్మమునకు అట్టి ఉపాధి ఏమీ లేదు.కనుక నిరుపాధికమైన బ్రహ్మము అపరోక్షజ్ఞానమునకు విషయము కాజాలదు.

నైనం బ్రహ్మత్వ బోధస్య సోపాధి విషయత్వతః ౹
యావద్విదేహ కైవల్య ముపాధేరనివారణాత్ ౹౹84౹౹

84. (సమాధానము) విదేహముక్తి కలిగే వరకు ఉపాధి పూర్తిగా నివారింపబడదు. అందుచేత బ్రహ్మత్వబోధ కూడా సోపాధికమే అగును.

అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం విశిష్యతే ౹
ఉపాధిర్జీవభావస్య బ్రహ్మతాయాశ్చ నాన్యథా ౹౹85౹౹

85.అంతఃకరణము ఉండుట జీవునకు ఉపాధి. అతఃకరణము లేకపోవుట బ్రహ్మమునకు ఉపాధి. వేరు భేదము లేదు.

యథా విధిరుపాధిః స్యాత్ర్పతిషేధస్తథా న కిమ్ ౹
సువర్ణ లోహభేదేన శృఖలాత్వం న భిద్యతే ౹౹86౹౹

86.విధియుపాధియైనట్లు ప్రతిషేధము మాత్రము ఏల ఉపాధి కాజాలదు ?బంగారువైనను ఇనుపవైనను సంకెలలు సంకెలలే గదా !

వ్యాఖ్య:- అంతఃకరణం ఉపాధిగా కలిగిన జీవునియొక్క అపరోక్షత్వం అనేది యుక్తి యుక్తంగానే ఉంటుంది.కానీ, బ్రహ్మము ఉపాధిలేనట్టిది - నిరుపాధికం.
అటువంటి బ్రహ్మానికి సంబంధించిన అపరోక్షత్వజ్ఞానం ఎట్లా సంభవమౌతుంది ? అని శంక.

బ్రహ్మము నిరుపాధికం అనటం విరుద్ధం అంటూ ఇందుకు సమాధానంగా -
జీవాత్మకుండే పరబ్రహ్మ రూపత్వజ్ఞానం కూడా ఉపాధితోకూడిన వస్తువు లాగానే ఉంటుంది.
అంటే ఉపాధిని విషయం చేసుకొనేదిగా ఉంటుంది.
కాబట్టి,అతని జ్ఞానానికి విషయమైనట్టి బ్రహ్మముకూడా సోపాధికమనే అనాలి. సోపాధికం కాకపోతే జ్ఞేయానికి సంబంధించిన జ్ఞానం అసంభవం,
విదేహముక్తి కలిగేటంత వరకు ఉపాధియొక్క నివృత్తి జరగదు - ఉపాధి ఉంటుంది.అందుచేత బ్రహ్మత్వబోధ కూడా సోపాధికమే అగును.
జ్ఞానము సోపాధికమైనపుడు జ్ఞేయము సోపాధికము కాక తప్పదు కదా!

అపరోక్షజ్ఞానము కలిగిన పిమ్మట ప్రారబ్ధము ఏమగుననుటలో భేదాప్రయములున్నవి.
ఆ ప్రారబ్ధము వలన అపరోక్షమైన బ్రహ్మజ్ఞానము,బ్రహ్మము కూడా సోపాధికములని ప్రస్తుత ప్రతిపాదనము.
మరి ఆ బ్రహ్మమునకు గల ఉపాధి ఏది ?

అయితే,
జీవుని ఉపాధి,బ్రహ్మ యొక్క ఉపాధి అని రెండు ఉపాధులు ఉంటాయా ? అని సందేహం, 
సమాధానం -

జీవత్వ బ్రహ్మత్వ ఉపాధులు అంతఃకరణ సహితంగాను, అంతఃకరణ రహితంగానూ ఉంటాయి.
అంతఃకరణమనే ఉపాధితో కూడి ఉన్న వానిని జీవుడని,
అంతఃకరణ మనే ఉపాధి లేనివానిని బ్రహ్మమని అంటారు.
వేరుభేదము లేదు.

అద్దము ఉండిననే ప్రతిబింబము అందు కన్పించును.అద్దము పోయిన ప్రతిబింబము కూడా పోవును.
బింబము ఎప్పుడును ఉండునదే కదా !
అట్టి అద్దమే అంతఃకరణము,
అజ్ఞానవికారము.

ఉపాధి యొక్క 
ఉద్దేశము, కార్యము ఏమి ?
భేదము కల్పించుట మాత్రమే.
ఉపాధిరూపమేమి అది వేరుగ ఉన్నదా లేదా అనే ప్రశ్నలు అనావశ్యకములు.
అంతఃకరణము ఉండుట జీవునకు ఉపాధి.అది లేకపోవుటయే బ్రహ్మమునకు ఉపాధి.

కుండకు పటమునకు భేదముగలదు.అయినచో కుండకు ఈ భేదమునకు భేదము గలదా ?మరలా ఈ రెండు భేదములకు భేదము గలదా అని తర్కింపుము.
భేదము తెలియుటతో ఆ భేేదము తీరినది.
అట్లే ఉపాధి యొక్క పని కూడా జీవునకు బ్రహ్మమునకు భేదము కల్పించుట.
ఆ పని ఉండుటయు చేయవచ్చును.లేకపోవుటయు చేయవచ్చును.

విధి(భావరూపమైన అంతఃకరణము)అనేది సంబంధరూపమైన ఉపాధి అయినట్లే 
ప్రతిషేధం(అభావరూపమైన అంతఃకరణం)అనేది వియోగరూపమైన ఉపాధి ఎందుకు కాకూడదు ?
భావ అభావ రూపమైన భేదం చాలా స్వల్పమైనది.
బంగారుగొలుసు,ఇనపగొలుసుల్లో ఉన్న భేదమల్లా లోహానికి సంబంధించినదే ! 
గొలుసు అనేది రెంటిలోనూ ఒకటే అయినట్లు.

బంగారువైనను,ఇనుపవైనను సంకెలలు సంకలలే కదా!
బంధించుటకు సమర్థములే గదా!                
 *అసలు హిందువు పాకిస్తాన్ నుండి వచ్చినవాడు, అక్కడ నివసించిన తర్వాత కూడా తనను తాను హిందువుగా చెప్పుకుంటాడు.*

*గురువు: “అత్యధిక హిందువులు ఉన్న దేశం ఏమిటో చెప్పండి”?*

*విద్యార్థి: “పాకిస్తాన్!”*

*ఉపాధ్యాయుడు (షాక్‌గా): “అప్పుడు హిందువులు తక్కువగా ఉన్న దేశం ఏది”?*

*విద్యార్థి: “భారతదేశం”!*

*టీచర్ (కోపంతో): "ఎలా?"*

*విద్యార్థి: “సర్, ఇక్కడ హిందువుల సంఖ్య దాదాపు శూన్యంగా పరిగణించండి, ఇక్కడ ఎక్కువగా ‘సెక్యులర్’ ప్రజలు నివసిస్తున్నారు. ఆపై జాట్‌లు, గుర్జర్‌లు, ఠాకూర్లు, బ్రాహ్మణులు, లాలాలు, పటేళ్లు, కుర్మీలు, యాదవ్‌లు, సోనార్‌లు, లోహర్‌లు, వడ్రంగులు, ప్రజాపతి, పడవలు, ధునియాలు, మల్లాలు, కోరిలు, చమర్లు, దాడీలు, పాసిలు, పాశ్వాన్లు... మొదలైనవి!!”*

*గురువు: “అప్పుడు హిందువులు ఎక్కడ నివసిస్తున్నారు?”*

*విద్యార్థి: “సార్ అవును, ఆలోచించండి.”*

*మీరు హిందువులైతే అయోధ్యలో రామ భక్తులను చంపిన ములాయం సింగ్‌కు అధికారం ఇచ్చేవారా?*

*మీరు హిందువులైతే రామసేతు ఊహాజనితమని చెప్పిన వాడికి అధికారం ఇచ్చేవారా?*

*నువ్వు హిందువువే అయితే “కాషాయ ఉగ్రవాది” అని పిలిచేవాడికి అధికారం ఇచ్చి ఉండేవాడా?*

*మీరు హిందువు అయితే కాశ్మీర్‌లో హిందువులను చంపిన వాడికి అధికారం ఇచ్చేవారా?*

*మీరు హిందువులైతే దసరా (మమతా బెనర్జీ)ని ఎగ్గొట్టి మొహర్రం జరుపుకున్న వాడికి అధికారం ఇచ్చేవారా?*

*నువ్వు హిందువువే అయితే, “గుడికెళ్ళేవాళ్ళు ఆడపిల్లల్ని ఆటపట్టిస్తారట!” అన్న వాడికి అధికారం ఇచ్చేవాడా?*

*మీరు హిందువు అయితే శ్రీరాముని రుజువు అడిగేవాడికి అధికారం ఇచ్చేవారా?*

*మీరు హిందువు అయితే 8 రాష్ట్రాల్లో హిందువులను మైనారిటీలు చేసిన వాడికి అధికారం ఇచ్చేవారా?*

*మీరు హిందువులైతే, “ఈ దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు!” అని చెప్పిన వాడికి అధికారం ఇచ్చి ఉండేవారా? అలా చెప్పేవాడికి అధికారం ఇస్తారా?*

*మీరు హిందువులైతే బుర్హాన్, యాకూబ్, ఒసామాలను అమరవీరులుగా పిలిచేవాడికి అధికారం ఇస్తారా?*

*మీరు హిందువు అయితే, దేశాన్ని రెండు భాగాలుగా (భారత్-పాకిస్థాన్) విభజించేవాడికి అధికారం ఇస్తారా?*

*గురువు (కళ్లలో కన్నీళ్లతో): “వావ్ కుమారా! నువ్వు చెప్పింది నిజమే!”*

*పురోహితుడు పెళ్లి చేస్తే సమ్మతమే, మౌల్వీ నికాహ్ చేస్తే సమ్మతమే, హిందూ పండిట్ పెళ్లి చేస్తే కోర్టు సర్టిఫికెట్ కావాలి ఎందుకు?*

*“ఎక్కడ ముస్లింలు తక్కువగా ఉంటారో అక్కడ సోదరభావం ఉంటుంది, ఎక్కడ ఎక్కువ ముస్లింలు ఉంటారో అక్కడ హిందువులు పేదలు, ఇది ఒక్కటే హిందువులు అర్థం చేసుకోలేకపోతున్నారు.”*

*మన హిందువులకు ఉన్న అతి పెద్ద అపార్థం, ముస్లింలందరూ చెడ్డవారు కాకపోతే, మంచి ముస్లింలు ఏ హిందువు మరణానికి నిరసనగా ఎందుకు నిరసన వ్యక్తం చేయరు?*

*అమెరికా మిమ్మల్ని నగ్నంగా చేస్తుంది, చైనా మీ గడ్డం తెంపుతుంది,*

*మరియు మీరు భారతదేశంలో భయపడుతున్నారు*

*అద్భుతమైన బక్రుద్దీన్ మియాన్*

*చత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్ మరియు గురు గోవింద్ సింగ్ జీ చరిత్రలో పొందవలసిన గౌరవం ఎక్కడ*

*బాబర్, అక్బర్ మరియు ఔరంగజేబులకు కాంగ్రెస్ ఆ గౌరవం ఇచ్చింది.*

*హమ్ దో హమారే దో - ہم دو ہمارے دو*


*ఈ నినాదాలు గోడలపై హిందీలో వ్రాయబడి ఉన్నాయి.*

*అదే, ఖాన్ గ్రెస్  వాటిని ఉర్దూలో రాసేవారు*

*ఆలయాన్ని కూల్చివేస్తే, “యోగి సేవ్”*

*సోదరీమణులు, కూతుళ్లు, భార్యల పరువు దోచుకుంటే “సేవ్ మోడీ”*

*మీరు 100 కోట్ల మంది హిందువులు, వేణువు వాయించండి*

*ఇంకా నిజం ఉంది. కానీ మీరు అర్థం చేసుకుంటే, మీరు సమయానికి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.*

*మేల్కొలపండి మరియు ఇతరులను మేల్కొలపండి. కొన్ని సత్యాలలో చేదు నిజం.*

*1. తన దేశంలో కూర్చున్న ద్రోహులపై ఎలాంటి చర్యలు తీసుకోని ఏకైక దేశం భారతదేశం.*

*2. మైనారిటీ కమ్యూనిటీ మెజారిటీ కమ్యూనిటీని అణచివేస్తున్న ప్రపంచంలోని ఏకైక దేశం భారతదేశం.*

*3. సరిహద్దుల్లో నియమించబడిన సైనికులకు ఏడాది పాటు సెలవు లభించని దేశం భారతదేశం మాత్రమే. అయితే జైలులో ఉన్న ఖైదీలకు ప్రతి 2 నెలలకు పెరోల్‌పై సెలవు లభిస్తుంది.*

*4. లక్షలు, వేలకోట్లు మోసాలు చేసే వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నా వారిపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో పాటు అమాయకులు జైల్లో మగ్గుతున్న దేశం ప్రపంచంలోనే భారతదేశం.*

*5. టెర్రరిస్టులు, రేపిస్టుల మానవ హక్కుల కోసం పోరాడే వారు దొరికిన దేశం భారతదేశం అయితే ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన వారి మానవ హక్కుల గురించి ఎవరూ మాట్లాడరు.*

*6. ప్రతిపక్షంలో కూర్చొని 57 ఏళ్లు పాలించిన పార్టీ దేశ శత్రువులైన పాకిస్థాన్‌, చైనాలను ప్రాణ స్నేహితులుగా భావించే దేశం భారతదేశం.*

*7. భారతదేశంలోని సెక్యులర్ నాయకులు ఉగ్రవాదులకు గౌరవం ఇచ్చేవారు మరియు జాతీయవాదులను దుర్భాషలాడారు.*

*8. బయటి అక్రమార్కుల రేషన్ కార్డులు, ఓటరు కార్డులు ఇంట్లో కూర్చొని తయారు చేసే దేశం భారతదేశం. అయితే వీటన్నింటికీ పరిగెత్తాల్సిందే మన దేశంలోని సామాన్యుడి చెప్పులు కోసి అరిగిపోతాయి.*

*9. ప్రపంచంలో 5వ తరగతి పాసైన వ్యక్తి విద్యాశాఖ మంత్రి కాగల దేశం భారతదేశం.*

*10. చరిత్రలో భగత్ సింగ్‌ను టెర్రరిస్టు అని, భారత్‌పై దాడి చేసిన అక్బర్, సికందర్‌లను గొప్పగా పిలుచుకున్న ప్రపంచంలో భారతదేశం అలాంటి దేశం.*

*దయచేసి ఫార్వార్డ్ చేయడం ద్వారా భారతీయుడిగా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి.*

*మరియు దానిని తీవ్రంగా పరిగణించండి*

*అఖండ భారత్ సౌజన్యంతో*

*ప్రతి హిందూ సోదర సోదరీమణులు ఈ గ్రూప్‌లో లేని వారి 5 మంది హిందూ సోదరులు మరియు సోదరీమణులకు ఈ సందేశాన్ని పంపండి లేదా మీ 5 మంది బంధువులకు పంపండి మరియు ఫార్వార్డ్ చేయమని అడగండి, తద్వారా ప్రతి హిందూ సోదరుడు మరియు సోదరీ దీని గురించి తెలుసుకుంటారు.*

*దేశమె అంతరించి పోతుంటే, నీ మతమే అంతరించి పోతుంటే ఇంకా నువ్వు సంపాదించిన ఆస్తులు, నీ అంతస్తులు, వచ్చే తరం ఎక్కడ ఉంటాయి.*

జై హింద్✊🏻
 *_పుట్టినామా... ఆనందించినామా... తిన్నామా... పడుకున్నామా... తెల్లారిందా... రోగం వచ్చినదా... సచ్చినామా... అంతేనా జీవితం అంటే.?_*

*_మనిషిగా నీవు పుట్టినందుకు సమాజానికి ఏదో ఒకటి ఇచ్చే వెళ్లాలి. రావడం... పోవడంలో జీవన మాధుర్యం ఏముంటుంది.?_*

*_అలా అనుకుంటే పశుపక్షాదులు, క్షుద్ర  చీమలు, కీటకాలు... జన్మిస్తున్నాయి, మరణిస్తున్నాయి. మనకు పశుపక్షాదులకు గల తేడా ఏంటి.?_*

*_ధనమును సంపాదించండి తప్పులేదు. ఒకరిని ముంచి సంపాదించాలనుకోకండి. పదవులు, కీర్తిని సంపాదించండి. కానీ, ఒకడిని తొక్కి పై స్థాయికి రావాలనుకోకండి..._*

*_డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. అది ఎలా సంపాదించావు అనేది ముఖ్యం._*

*_వంద కోట్లు ఉన్నా వందేళ్లు బ్రతకలేము. పది యిళ్లు ఉన్నా ఉండేది ఒక ఇంట్లోనే... ఉన్న ఒక్క జన్మకి వందేళ్లు గుర్తుండేలా బ్రతకాలి. పది మందికి సహాయం చేసేలా ఉండాలి._*

*_మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే, మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం గొప్పది._*

*_ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళకింద, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించింది ఏదీ మనది కాదు, శాశ్వతంగా నిలిచి ఉండేది... మంచితనం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప మరేమి లేదు._*

*_నీ పుట్టుక ఒక సాధారణం కావచ్చు. కానీ, నీ జీవితం మరో చరిత్ర కావాలి. అలా బ్రతకాలి, అలా ఉండాలి జీవితమంటే...☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🪷🙇🪷 🌹🌹🌹
 *2024లో జరిగిన చివరి హజ్ యాత్రలో వేడి కారణంగా 900 మంది రోడ్లపై చనిపోయారు. ఏ ఒక్క మీడియా సంస్థలో కూడా దీనిపై చిన్న వార్త కూడా లేదు. కాని కుంభమేళ ప్రమాదం పై గంట గంటకు అప్డేట్లు ఇస్తున్నాయి.*

*1954 కుంభమేళా సమయంలో నెహ్రూ స్నానం చేయాలని వచ్చాడు. దాంతో పోలీస్ ఫోర్స్ మొత్తం ఆయన భద్రతకు వచ్చారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో వెయ్యిమంది మృత్యువాత పడ్డారు. రెండు వేలకు పైగా గాయ పడ్డారు. ఈ న్యూస్ అప్పటి నెహ్రూ ప్రభుత్వం బయట పడకుండా తొక్కిపెట్టింది. నెహ్రూ రాజీనామా చెయ్యలేదు. కానీ ఇప్పుడు సిఎం, పీఎం లు రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నాడు.*
 *మనం తెలుసుకోవడమే మరిచిపోతున్నామా లేకపోతే తెలుసుకోవాలి అనే ఆలోచననే మర్చిపోయామ..*

*ప్రపంచంలో జరిగే అన్నీ యుద్దాల గురించి.*
*అన్యాయాల గురించి ప్రతిరోజు ఆరా తీస్తూ..*
*మన పక్కనున్న మనుషుల్ని  కనీసం పట్టించుకోకుండా పక్కకు తప్పుకుంటున్నాం, కాదు కాదు కావాలని తప్పించుకుంటున్నాం. అయినా ఎవరు ఎం అయినా మనకెందుకు..*

*అమ్మ ను వంట గదిలో వదిలిపెట్టి...*
*అమ్మకైన గాయాలను ఖాతరు చేయకుండా...*
*ఏం కర్రీ చేసావంటూ పైపైకి నవ్వుతూ అడుగుతున్నాం. మన స్వార్ధమే కదా మనకి కావలి...*

*నాన్నను డబ్బులు అడగడమే తప్ప, నాన్న మన కోసం చేస్తున్న అప్పులెన్నీ, కడుతున్న వడ్డీ లెన్నీ, పడుతున్న పాట్లెన్నీ,అడగడం మరిచిపోతున్నాం. మనకెందుకు అవన్నీ, అవసరానికి డబ్బు వస్తుందా లేదా..... అది చాలు...*

*మనకున్న ఎకరాలు ఎన్నో గుర్తుపెట్టుకొని.*
*నాన్న వాటిని కాపాడడానికి పడుతున్న కష్టాలను లోలోపల కార్చుతున్న కన్నీళ్లను గుర్తించలేకపోతున్నాం.*
*బాధ్యతలు బరువులు మోసీ మోసీ కుంగిపోయిన నాన్న  వెన్నును,బక్కచిక్కిన అమ్మను  కనీసం దగ్గరికి తీసుకోలేకపోతున్నాం.  ఎంతకు దిగజారిపోతున్నాం...*
*తల్లిదండ్రులు అవసాన దశలో ఎలాగో పక్కన ఉండము, చివరకు వాళ్ళు చనిపోతే శవాన్ని కుడా మనకోసం ఎదురు చూసే అంత గొప్పగా బిజీ అయ్యి ఎదిగిపోతున్నాం... ఒక్కోసారి వర్క్స్ బిజీ లో అంత్యక్రియలు కూడా చేయలేం.... బిజీ కదా మరీ...*

*వీకెండ్ విందుల్లో విలాసాల్లో* 
*మునిగితేలి  ప్రపంచాన్ని మరిచిపోవడమే మన ప్రపంచం అనుకుంటున్నాం.*
*ఇక్కడ మందు బాటిళ్లు, చికెన్ ముక్కలు, సిగరెట్ డబ్బాలే కాదు.*
*అంతకన్నా మత్తు నిచ్చే మనుషులు ఉన్నారని మరిచిపోతున్నాం.*

*క్లబ్బులు పబ్బులే కాదు.*
*మనల్ని తిరిగి మనుషుల్ని చేసే పుస్తకాలు ఉన్నాయని,*
*మన స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం వాళ్ళ ప్రాణాలనే పణంగా పెట్టిన పోరాట యోధులు ఉన్నారని  మరిచిపోతున్నాం.*

*ఎప్పుడంటే అప్పుడు బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని*
*తినే మనం, కలుషిత ఆహారం తిని*
*విగత జీవులైన విద్యార్థులు ఉన్నారని?*
*తెలుసుకోవడమే మరిచిపోతున్నాం.*

 
*అర్ధరాత్రి బెనిఫిట్ షోలకు వెళ్లి  తిరిగి వచ్చే కొడుకు కోసం,*
*భర్త కోసం,తెల్లవార్లు ఎదురుచూసే  తలుపు గడియ తీసే ఉంచే  మన అమ్మ , భార్య మన కోసం  ఉన్నారని*
*ఎదురుచూస్తుంటారని మరిచిపోతున్నాం.*

*మనకు అలవాటేగా దగ్గర ఉన్నదాన్ని వదిలేసి దూరం గా చూడటం... దేనికోసమో పోరాటం...*
 *ఒక చిట్టికధ మీఅందరితో పంచుకుంటా ఈరోజు..చిన్నపిల్లల కధలా ఉంది అనుకోకండేం...!*

*ఒకసారి రెండుకాకులు ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగరగలవో చూద్దాము అని పోటీ పెట్టుకున్నాయి..*
*ఆ పోటీలో ప్రత్యేకత ఏమిటంటే...రెండు కాకులు ఒకే పరిమాణం అంటే ఒకే సైజు ఉన్న సంచీలో ఏదో ఒకటి నిండుగా నింపుకుని ఆ బరువున్న సంచీని ముక్కుకి కరుచుకుని పైకి ఎగరాలి...అలా బరువు మోస్తూ ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగరగలిగితే వారిదే గెలుపు..!*

*మొదటికాకి సంచి నిండా దూది నింపుకుంది..రెండోకాకి సంచి నిండా ఉప్పు నింపుకుంది...మొదటికాకి అది చూసి రెండోకాకి వైపు చూస్తూ హేళనగా నవ్వింది ఇక గెలుపు నాదేలే అనుకుంటూ...!*

*రెండు కాకులు సుమారుగా చాలా ఎత్తువరకు వెళ్ళాయి ఉన్నట్టుండి మబ్బులుకమ్మి వాన పడి ఆగింది ఉప్పు సంచీ లో ఉప్పు వాననీళ్ళకు కరిగిపోయింది దూది సంచీలోని దూది వాననీళ్ళు పీల్చుకుని బరువెక్కుతోంది ఇక అక్కడ మొదలయ్యాయి మొదటికాకికి తిప్పలు తేలికగా దూదిని మొయ్యచ్చు అనుకుంది కానీ అదే దూది నీరు పీల్చుకుని బరువయ్యింది దానివల్ల మొదటికాకికి ఊహించని కష్టం ఎదురయ్యింది రెండో కాకి ఉప్పు నింపుకునేటప్పుడే బరువు మొయ్యటానికి సిద్ధపడింది.ఇప్పుడు ఉప్పు కరిగిపోయి సంచీ తేలిక అయ్యి అనుకోని అదృష్టం కలిసొచ్చింది..ఇక మొదటికాకి తడిసిన దూది బరువు మొయ్యలేక ఎత్తు ఎగరటం సంగతి తర్వాత ముందు కిందకి అయినా సరిగ్గా దిగగలనా లేదా అని తెలిసి రెండో కాకి ముందు తన ఓటమి ఒప్పుకుని దూదిసంచీని వదిలేసి క్షేమంగా కిందకు తిగింది...గెలుపు ఓటమిల కంటే ముఖ్యం సురక్షితంగా ఉండటం...!*

*అంతే జీవితం .... ఉన్నట్టుండి కధ అడ్డం తిరుగుతుంది..ఓడలు బళ్ళు,  బళ్ళు ఓడలు అవుతుంటాయి...ఊహించని కోణంలో రెండోకాకి గెలిచింది..ప్రతీసారీ విధి కష్టమే ఇవ్వదు, ఒక్కోసారి అద్భుతాలు, కలిసొచ్చే అద్రృష్టాలు కూడా ఇచ్చి ఆనందం పంచగలదు...*
 🤘 విదుర నీతి 🤘

 నిద్ర పట్టని వాళ్లు ఎవరు? 

జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. 

సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. 

ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. 

నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది.  

మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో ఇవి చెబుతాయి.  

మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. 

కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.

ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు.  

విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ ఉండేవాడు.

సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, 
ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. 

అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. 

విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు. 

విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు.

 ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, 
సంపద పోగొట్టుకున్న వాడికి, 
కాముకుడికి, 
దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. 

విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!

జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, 
మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. 

తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, 
పోయినదాన్ని గురించి విచారించనివాడు, 
ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. 


అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.

మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, 
ఆలస్యంగా చేస్తాడు. 

అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. 

ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా 
ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.

‘మధుర పదార్థం నలుగురికీ పం�

Thursday, January 30, 2025

Neem Karoli Baba Life Story Part 3: The Baba Who Inspired Steve Jobs & Ram Dass | #neemkarolibaba

 Neem Karoli Baba Life Story Part 3: The Baba Who Inspired Steve Jobs & Ram Dass | #neemkarolibaba

https://youtu.be/PVzfRSt6vYg?si=V7DEpzsIzYLnBU5Q


హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భార్గవ రెడ్డి నేను గత కొన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను నాకు యోగులన్న యోగుల జీవిత చరిత్ర అన్నా చాలా ఇష్టం అయితే ఈ మధ్యనే భారతదేశ సుప్రసిద్ధ గురువుల్లో ఒకరైన శ్రీ నీమ్ కరలి బాబా గారి జీవిత చరిత్రను చదవడం జరిగింది గమనిక ఈ వీడియో మొదలు పెట్టే ముందు శ్రోతలకు నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే నేను చెప్తున్న ఈ నీమ్ కరులి బాబా గారి జీవితం ఇదేదో కల్పిత కథనో లేదా నా సొంత పాండిత్యాన్ని జోడించి చెప్పడం లేదు నేను చెప్తున్న ప్రతి మాట నిజం బాబా గారి జీవితంలో జరిగినవే నేను మీతో పంచుకుంటున్నాను ఇక నేమ్ కలలి బాబా గారి జీవిత చరిత్ర మూడవ భాగాన్ని మొదలు పెడదాం ఈ మూడవ భాగంలో బాబా గారి మరికొన్ని మహిమల గురించి తెలుసుకోబోతున్నాం అవేంటంటే బాబా మంచి నీటిని నెయ్యిగా ఎలా మార్చారు అదేవిధంగా హార్వర్డ్ యూనివర్సిటీలోని ఆల్బర్ట్ రిచర్డ్ అనే ప్రొఫెసర్ బాబాకి ఎలా భక్తుడు అయ్యాడు అదేవిధంగా ఆర్మీలో ఉన్న సైనికుడిని బాబా తన కంబలితో ఏ విధంగా కాపాడారు అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి 1937 వ సంవత్సరంలో నేను కొరలి బాబా గారికి మరియు రామ్ బేటికి గారికి రెండవ సంతానంగా ఒక కొడుకు జన్మిస్తారు ఆయన పేరు ధర్మనారాయణ శర్మ అదేవిధంగా 1945 వ సంవత్సరంలో వీరికి మూడవ సంతానంగా ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది ఆవిడ పేరు గిరిజా దేవి ఇక్కడ నేను ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మనం చాలా మంది యోగుల జీవితాలను చదివి ఉంటాము లేదా విని ఉంటాము కానీ ఈ నేమ్ బాబా గారి జీవితంలో ఏంటంటే ఒకవైపు ఈయన స్పిరిచువల్ గురువుగా ఉంటూ మరోవైపు ఈయన్ని గ్రామ పెద్దగా కూడా ఎన్నుకోబడతారు ఒకవైపు ఆధ్యాత్మిక జీవితం మరోవైపు ప్రాపంచిక జీవితం ఒకసారి ఏమవుతుందంటే ఆ అక్బర్ బూర్ కు కొంత దూరంలో ఉన్న ఒక ఊర్లో ఒక వ్యక్తికి ఒక సమస్య వస్తుంది ఈ వ్యక్తి ఆ నీమ్ కరోలి బాబా గారిని వెతుక్కుంటూ వస్తారు వచ్చి నేమ్ కరోలి బాబా గారిని కలుస్తారు నీకలి బాబా గారు ఆ వ్యక్తి యొక్క సమస్యకు పరిష్కారం చెప్తారు ఇలా నేమ్లి బాబా గారు ప్రాపంచిక జీవితాన్ని మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని రెండింటిని సమానంగా ముందుకు తీసుకెళ్లేవారు ఒకసారి ఏమవుతుందంటే కెంచిదాం అనే ఒక ఊర్లో పూనానంద్ తివారి అనే ఒక వ్యక్తి ఉంటారు ఈయన గత కొన్ని రోజులుగా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు సో ఆ కెన్ ధామ్ కి కొంత దూరంలో నయనత అనే ఒక టౌన్ ఉంటుంది ఈ పూనానంద్ తివారి గారు అక్కడికి వెళ్లి అక్కడ ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని తిరిగి తన ఇంటి వైపు వస్తుంటాడు సో అప్పటికే చీకటి పడి ఉంటుంది ఉత్తరాఖండ్ మొత్తం కూడా లోయలు కొండలతో ఉంటుందన్నమాట ఈయన చాలా స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్తుంటాడు వెళ్తుంటే ఒక రోడ్డు మలుపు దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఓ పూర్ణానంద్ ఓ పూర్ణానంద్ అని అరుస్తుంటాడు ఈ పూర్ణానంద్ గారు భయపడతారు ఏంటంటే ఆ పిలుస్తున్న వ్యక్తి ఎవరో ఈయనకు తెలియదు సో భయపడుతుంటే ఆ పిలిచిన వ్యక్తి ఈయన దగ్గరికి వస్తాడు వచ్చి రాంగానే ఈయన చెప్తాడు నువ్వు భయపడకు నువ్వు ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నావు కదా అతి తక్కువ కాలంలోనే ఆ సమస్య మటుమాయమై నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు అని చెప్తాడు ఈ మాట వినగానే ఈ పూర్ణానంద్ తివారి గారు చాలా సంతోషపడతారు మళ్ళీ బాబా గారు పూర్ణానంద్ తివారి గారితో చెప్తారు నేను నీ ద్వారా ఒక పని చేయాలి కాకపోతే అది ఇప్పుడు కాదు 20 సంవత్సరాల తర్వాత అని చెప్పి మళ్ళీ నేను నిన్ను 20 సంవత్సరాల తర్వాత కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ పూర్ణానంద్ తివారి గారికేమో ఎక్కడ లేని సంతోషం ఎందుకంటే ఆయన చాలా తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉండి కొద్ది రోజుల్లోనే ఆయన చనిపోతాను అనే ఫీలింగ్ లో ఉంటాడు అన్నమాట అప్పుడు ఈ నీమ్ కరులి బాబా గారు వచ్చి ఈ విషయం అని చెప్పడంతో ఆయన ఎంతో సంతోషిస్తాడు అలా నేమ్ కరోలి బాబా గారు చెప్పినట్లే కరెక్ట్ గా 20 సంవత్సరాల తర్వాత అంటే 1962 వ సంవత్సరంలో బాబా గారు వచ్చి ఈ పూర్ణానంది వారి గారిని కలుస్తారు ఈ 20 సంవత్సరాల్లోనే ఈ బాబా గారి పేరు ప్రఖ్యాతలు మన దేశమంతా వ్యాపిస్తాయి అన్నమాట బాబా వచ్చి పూర్ణానంద్ గారిని కలవగానే పూర్ణానంద్ తివారి గారు కూడా చాలా సంతోషిస్తారు బాబా ఈ పూర్ణానంద్ తివారి గారిని ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఆ ప్లేస్ ని చూపిస్తూ ఇక్కడ నేను గుడి కట్టాలనుకుంటున్నాను దీనికి నీ సహాయం నాకు కావాలి అని చెప్తాడు అప్పుడు ఈ పూర్ణానంద్ తివారి గారు ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులందరిని తీసుకొచ్చి ఈ బాబా గారికి పరిచయం చేస్తారు అప్పుడు ఆ పెద్ద మనుషుల్లో ఒక వ్యక్తి బాబా గారితో చెప్తారు బాబా గారు మీరు ఏ ప్లేస్ లో అయితే గుడి కట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది కాబట్టి మన మనం గుడి కట్టాలనుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయినా లేదా అటవీ శాఖ మంత్రి నుంచి కానీ మనం అనుమతి తీసుకోవాలి అని చెప్తారు అప్పుడు బాబా ఎవరు ఈ అటవీ శాఖ మంత్రి అని అడుగుతారు అడిగితే ఆ పెద్ద మనిషి చెప్తాడు శ్రీ చరణ్ సింగ్ గారు అని చెప్తారు అప్పుడు బాబా ఒక నిమిషం కళ్ళు మూసుకొని తర్వాత కళ్ళు తెరిచి చెప్తాడు అన్నమాట సరేలే రేపు చరణ్ సింగ్ ఇక్కడికి వచ్చి మనకు పర్మిషన్ ఇస్తానులే అని చెప్తాడు బాబా గారు చెప్పినట్లే మరుసటి రోజు పొద్దున్నే శ్రీ చరణ్ సింగ్ గారు పెద్ద కాన్వా వేసుకొని ఈ కెంజిదాంకి వచ్చి బాబా గారిని కలుస్తారు కలిస్తే బాబా గారు ఆయన ఎక్కడ గుడి కట్టాలనుకుంటున్నాడో ఆ ప్లేస్ ని చూపిస్తారు చూపించి ఇలా నేను గుడి కట్టాలనుకుంటున్నాను అని చెప్తారు చెప్పిన వెంటనే శరణ్ సింగ్ గారు అంటారు గురువుగారు మీరు గుడి నిర్మాణాన్ని మొదలు పెట్టండి నేను మీకు కావలసిన అనుమతి పత్రాలన్నిటిని మీకు నేను పంపిస్తాను అని చెప్తారు అప్పుడు బాబా ఈ చరణ్ సింగ్ గారితో నువ్వు ప్రధానమంత్రి అవుతావులే పో అంటాడు బాబా చెప్పినట్లే అతి తక్కువ కాలంలోనే ఆయన మన దేశ ప్రధానమంత్రి అవుతాడు అలా బాబా చెప్పే ప్రతి వాక్కు నిజమయ్యేది సో ఆ రోజు నీమ్ కరోలి బాబా గారు కట్టిన గుడే ఈరోజు కెంచిద్దాం నీమ్ కరోలి బాబా ఆశ్రమం ఇలా బాబా గారి జీవిత కాలంలో 108 గుడులను నిర్మించాడు అందులో ముఖ్యంగా ఒకటి కెంచిదాం అయితే రెండవది బృందావన్లో ఉన్న గుడి అలా బాబా కొద్ది రోజులు కెంచిదాంలో కొద్ది రోజులు బృందావన్లో ఉండేవారు ఇక్కడ నేను ఒక అనుభవం చెప్తాను అదేంటంటే ఒకసారి నేమ్ కలి బాబా గారు పెద్ద యజ్ఞం చేస్తుంటారు యజ్ఞం చేస్తుంటే ఈ యజ్ఞానికని అప్పట్లోనే కొన్ని లక్షల మంది వస్తారు అయితే అందరికీ ప్రసాదం వండుతుంటారు వండుతుంటే వారి దగ్గర ఉన్న నెయ్యి అయిపోతుంది అయిపోతే అక్కడున్న భక్తులు వెళ్లి నీకలి బాబా గారికి చెప్తారు స్వామి ఇలా లక్షల్లో భక్తులు వచ్చారు కానీ మన దగ్గర ఉన్న నెయ్యి అయిపోయింది ఇప్పుడు ప్రసాదం ఎలా వండాలి అని అడుగుతారు అడిగితే అప్పుడు బాబాగారు ఇద్దరు భక్తులను పిలిచి అక్కడున్న కుండలను తీసుకొని వెళ్లి ఆ యజ్ఞానికి కొంత దూరంలో నది ప్రవహిస్తుంటుంది ఆ నదిలో ప్రవహించే నీటిని తీసుకురమ్మంటారు తీసుకురమ్మని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ నీటిని తెచ్చేంతవరకు కంటిన్యూగా రామ జపాన్ని జపిస్తూ వెళ్ళాలి అని చెప్తారు అలా బాబా చెప్పినట్లే ఆ ఇద్దరు భక్తులు ఆ కుండల్ని తీసుకొని రామ నామాన్ని జపిస్తూ నదిలో నీటిని తీసుకొచ్చి బాబా చెప్పిన ఒక పెద్ద పాత్రలో పోస్తారు పోస్తే ఆ విచిత్రం ఏంటంటే వీరు తెచ్చిందేమో నీళ్లు కానీ ఇక్కడికి తెచ్చి ఆ పాత్రలో పోయంగానే ఆ నీరు నెయ్యి అయిపోయి ఉంటుందన్నమాట అలా బాబా గారు నీటిని నెయ్యిగా మారుస్తారు మార్చి ఆ నెయ్యితో ప్రసాదాన్ని వడ్డించి అక్కడున్న భక్తులందరికీ పంచుతారు మళ్ళీ బాబా ఆయన ప్రియ భక్తుని పిలిచి రేపు పొద్దున్నే మార్కెట్ నుంచి రెండు టిన్నుల నెయ్యిని తీసుకురమ్మంటాడు కానీ ఆయనకేం అర్థం కాదు ఎందుకు బాబా అలా చెప్తున్నాడు అని బాబా చెప్పినట్లే మరుసటి రోజు పొద్దున్నే ఆ భక్తుడు రెండు పెద్ద టిన్నుల నెయ్యిని తీసుకొస్తాడు తీసుకొస్తే ఈ బాబా ఆ నేని తీసుకెళ్లి ఆ నదిలో కలిపేస్తాడు ఇలా ఈయన అనుభవాలు చాలా అద్భుతంగా ఉండేటివి ఇంకొక అనుభవం చెప్తాను అదేంటంటే హార్వర్డ్ యూనివర్సిటీలో ఆల్బర్ట్ రిచార్డ్ అనే ఒక ప్రొఫెసర్ మరియు సైంటిస్ట్ ఉండేవారు ఈయన ఏంటంటే ఎల్ ఎస్ టి అనే డ్రగ్ పైన పరిశోధనలు చేస్తుంటారు ఈ ఎల్ ఎస్ టి అనే డ్రగ్ ఏంటంటే ఇదొక మారక ద్రవ్యం అది తీసుకోగానే వీళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు ఏదో తెలియని ఒక మంత్లోకి వెళ్ళిపోతారు సో ఈ వ్యక్తి ఏంటంటే ఈ డ్రగ్స్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు అయితే ఆ యూనివర్సిటీ యొక్క రూల్ ప్రకారం ఆ డ్రగ్ ని అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి ఇవ్వకూడదు అయితే అనుకోకుండా ఈ రీచార్జ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కి ఇస్తాడు అన్నమాట ఈ విషయం తెలిసిన హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆయన్ని డిస్మిస్ చేస్తారు అలా డిస్మిస్ అయిన ఈ రీచార్ట్ ఏం చేయాలో తెలియక కొన్ని నెలల తర్వాత ఇండియాకి వస్తాడు ఇండియాలో భగవాన్ దాస్ అనే ఒక యోగా టీచర్ ని కలుస్తాడు ఆ యోగా టీచర్ ఈ రీచార్డ్ ని నేమ్ కలి బాబా గారి దగ్గరికి తీసుకొస్తారు తీసుకొచ్చిన వెంటనే బాబా గారు ఈ ఆల్బర్ట్ రిచార్డ్ ని చూసి హే నీ దగ్గర ఏదో యోగి మెడిసిన్ ఉంది కదా ఇదో నాకు ఇవ్వు అంటాడు ఈ ఆల్బర్ట్ రిచర్డ్ కి ఏం అర్థం కాదు అదేంటి యోగి మెడిసిన్ ఏంటి అంటాడు హే అదే నీ దగ్గర ఏదో ఉంది కదా మాతర్లు అది నాకు ఇవ్వు అంటాడు అప్పుడు ఓ ఈయన అడుగుతుంది ఎల్ ఎస్ డ్రగ్ అని రీచార్డ్ దగ్గర ఉన్న ఒక టాబ్లెట్ ని తీసి బాబా చేతిలో పెడతాడు బాబా అది చూసి అరే ఇంకోటి ఇవ్వు అంటాడు మళ్ళీ ఆ రీచార్డ్ ఇంకోటి ఇస్తాడు అలా ఆయన దగ్గర సిక్స్ టాబ్లెట్స్ ఉంటే ఆ సిక్స్ టాబ్లెట్స్ తీసుకొని ఒకేసారి వేసేసుకుంటాడు ఈ ఆల్బర్ట్ కేమో ఎక్కలేని టెన్షన్ ఎందుకంటే ఇంత చిన్న మిల్లీ మైక్రో గ్రామ్ తీసుకుంటేనే మనం మత్తులోకి వెళ్ళిపోతాం ఈయనేమో ఈ టాబ్లెట్స్ అన్నిటిని మింగేస్తాడు ఈయన ఏమైపోతాడు అని టెన్షన్ పడుతుంటాడు టెన్షన్ పడుతుంటాడు బాబా గారేమో ఆ టాబ్లెట్స్ అన్నీ మింగేసి పక్కనున్న భక్తులతో మాట్లాడుతుంటాడు ఇలా కొన్ని గంటలు అయిపోతుంది ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు అప్పుడు ఈ ఆల్బర్ట్ రిచర్డ్ కి అర్థమవుతుంది ఈ డ్రగ్ కంటే ఈ ఏదైతే మత్తు పదార్థం ఉంది కదా దీనికంటే గొప్పదైంది ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ మెడిటేషన్ అని ఆయన రియలైజ్ అవుతాడు రియలైజ్ అయ్యి ఆయన పేరుని ఆల్బర్ట్ రిచర్డ్ నుంచి బాబా రామ్దాస్ గా మార్చుకుంటాడు మార్చుకొని అలా అమెరికా మొత్తం అనేక సంస్థలను స్థాపించి యోగ మరియు మెడిటేషన్ ని ప్రచారం చేస్తాడు ఈయన అనేక పుస్తకాలు రాస్తారు ఇక మీకు ఇంకొక అనుభవం చెప్తాను ఒకసారి ఏమవుతుందంటే బాబా గారు కీల ఘాటు దగ్గర ఉంటున్నప్పుడు ఆ కీలా ఘాటుకి కొంత దూరంలో వృద్ధ దంపతులు ఉంటారు ఈ ఇద్దరు కూడా బాబా గారికి పరమ భక్తులు ఈ దంపతులకు ఒక్కగాన ఒక కొడుకు ఆర్మీలో పని చేస్తుంటాడు అయితే గత కొన్ని నెలల నుంచి వాళ్ళ కొడుకు నుంచి ఈ తల్లిదండ్రులకి ఎలాంటి సమాచారం ఉండదు అరే నా కొడుకు ఏమైపోయారు అసలు నా కొడుకు ఉన్నాడా వాడికి ఏమన్నా అయ్యిందా అని ఏమి ఎలాంటి సమాచారం ఉండదు ఈ రోజుల్లో అంటే ఫోన్లు ఉన్నాయి మనం ఫోన్ చేయొచ్చు కనుక్కోవచ్చు కానీ ఇది 60 70 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ సో ఇలా ఆ వృద్ధ దంపతులు బాధపడుతుంటే ఒకానొక రోజు నీమ్ కరోలి బాబా గారు వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్లి అరే నాకు ఆకలిగా ఉంది ఏదో ఒకటి పెట్టు నాకు తినాలని ఉంది అంటాడు ఆ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి బాబా గారికి ఇస్తారు బాబా దాన్ని తిని ఈ రాత్రికి నేను మీ ఇంట్లోనే ఉంటున్నాను అని బాబా చెప్తారు సో వీళ్ళేమో చాలా పూర్ ఫ్యామిలీ ఒకవైపు వీళ్ళు పడుకొని మరోవైపు బాబా పడుకోవడానికి ఏర్పాట్లు చేస్తారు రాత్రి అవుతుంది బాబా గారు వచ్చి పడుకుంటారు ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈయనతో పాటు ఒక కంబలి ఉంటుంది సో ఈయన తెచ్చుకున్న కంబలి ఈయన ముసుకేసుకొని పడుకుంటాడు పడుకున్న తర్వాత ఈ కంబలి లోపల నుంచి ఎవరైనా వ్యక్తి బాగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కొన్ని సౌండ్స్ చేస్తారు కదా అంటే ముక్కుతూ మూలుగుతూ ఏడుస్తూ అలాంటి శబ్దాలు ఆ కంపల్ లోపల నుండి వస్తుంటాయి ఈ వృద్ధ దంపతకి ఏం అర్థం కాదు అరే ఏమవుతుంది ఈయన మన ఇంటికి వచ్చి పడుకున్నాడు చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని వాళ్లకేం అర్థం కాదు ఇలా రాత్రి ఆ వృద్ధ దంపతులకు జాగారం ఆయనేమో కంబల్లో పండుకొని ఈ ఇలా విచిత్ర విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటారు ఇలా మొత్తానికి తెల్లవారుతుంది ఈ బాబాగారు లేచే కంబల్ని నీట్ గా చుట్టుతారు చుట్టి ఆ వృద్ధ దంపతుల చేతుల్లో ఇచ్చి మీరు గత కొంతకాలంగా మీ కొడుకు గురించి బాధపడుతున్నారు కదా ఏం కాలేదులే సరిగ్గా నెల రోజుల్లో మీ కొడుకు మీ ఇంటికి వస్తాడులే అని చెప్పంగానే ఈ వృద్ధ దంపతులు ఇద్దరికి ఎక్కడ లేని ఆనందం వస్తుంది తర్వాత బాబా ఆ చుట్టిన కంబలిని వాళ్ళకి ఇచ్చి ఈ కంబలిని తీసుకొని వెళ్లి ఆ నదిలో పడేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కంబలి లోపల ఏముంది అని మీరు చూడకూడదు అంటారు సరే గురువు చెప్పినట్లే ఈ వృద్ధ దంపతులు ఇద్దరు చెరో వైపు పట్టుకొని నది వైపు వెళ్తూ ఉంటారు అయితే ఆ కంబలి చాలా బరువుగా ఉంటుంది వీళ్ళకి డౌట్ వస్తుంది అరే ఈ కంపల్ లోపల ఏముంది ఒకసారి విప్పి చూద్దామని కానీ ఆయన గురువు కదా ఆయన చెప్పిన మాట గుర్తుకొచ్చి అలాగే తీసుకెళ్లి నదిలో పడేస్తారు సరిగ్గా ఇది జరిగిన నెల రోజులకు ఆర్మీ నుంచి కొడుకు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి అమ్మ నాన్న మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే సరిగ్గా నెల రోజుల క్రితం మేము జపాన్ వాళ్ళ పైన యుద్ధానికి వెళ్ళాం అయితే ఆ జపాన్ సైనికులు మేము ఉంటున్న క్యాంప్ పైన అటాక్ చేశారు ఆ అటాక్ లో నాతో పాటు ఉన్న సైనికులందరూ చనిపోయారు కాకపోతే వాళ్ళు నా వైపు గన్స్ తో కాలుస్తున్నారు కానీ బుల్లెట్లు తగలకుండా నా వైపు నుండి ఇటు అటు వెళ్ళిపోతున్నాయి కాసేపు తర్వాత నేను సృహ తప్పి పడిపోయాను తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు పొద్దున్నే మా సీనియర్ ఆఫీసర్ వచ్చి ఆఫీస్ కి తీసుకెళ్లాడు అని చెప్తాడు అప్పుడు ఈ తల్లిదండ్రులు ఏ రోజు జరిగిందో ఆ డేట్ అడుగుతారు అప్పుడు చూస్తే అదేంటంటే ఈ అబ్బాయి పైన అటాక్ జరిగింది ఆ బాబా వచ్చి వీళ్ళ ఇంట్లో పడుకున్న రోజు రెండు ఒకటే అంటే ఏదైతే ఆ కొడుకు అనుభవించాలో ఆ అబ్బాయి అనుభవించాలో ఆ బుల్లెట్లు గాయాలు ఆ నొప్పులను ఈ బాబా అనుభవించి ఆ అబ్బాయిని కాపాడాడు బాబాను నమ్ముకున్న భక్తుల్ని బాబా ఈ విధంగా కాపాడేవారు ఈ అనుభవాన్ని బుల్లెట్ ప్రూఫ్ కంబల్ అని బాబా రామదాస్ గారు మిరాకిల్ ఆఫ్ లవ్ అనే పుస్తకంలో రాశారు మళ్ళీ మనం నేమ్ కరలి బాబా గారి జీవిత చరిత్ర నాలుగవ భాగంలో కలుసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు 
 17th November- నాథూరామ్ గాడ్సే పుట్టిన రోజు సందర్భంగా ——

*'పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ వారికి 20 కిలోమీటర్ల వెడల్పుతో రోడ్డు వేయాలని గాంధీ గారు అనుకున్నారు.* 

*ఒకవేళ అలా జరిగి ఉంటే పై భాగంలో నీ కాశ్మీర్ నుండి బెంగాల్ వరకు పాకిస్తాన్ లో కలిసిపోయే ప్రమాదాన్ని గుర్తించిన నాథూరామ్ గాడ్సే*
*అఖండ భారతాన్ని చీల్చడం ఇష్టం లేని గాడ్సే తన ప్రాణాలకు తెగించి మరి గాంధీని చంపేశాడు*
 *ఆరోజు గాడ్సే ఒక అడుగు ముందు చేయకుంటే ఈరోజు మన దేశం ముక్కలైపోయేది*

గాడ్సే గారు తాను గాంధీ గారిని చంపటాని గల కారణాలను కోర్టులో సవివరంగా చెప్పారు. 

ఆ రికార్డ్ ను ఈ రోజు వరకూ రహస్యంగానే ఉంచారు. బయటకు తీస్తే ఇలాటివి చాలా చాలా బయటి ప్రపంచానికి తెలుస్తాయి. 

*నాథూరామ్ గాడ్సే వర్ధంతి* *సందర్భంగా ఆ మహానీయునికి*
 *శతకోటి వందనాలు."*
 *జై నాథూరామ్ గాడ్సే.🙏*

 

ఈ ఫొటోలో బిచ్చగాడిలా పిచ్చివాడిలా కనిపిస్తున్న 
ఇతని పేరు 'వశిష్ఠ నారాయణ్ సింగ్'
NASA లో స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజర్లలో ఒకరు.
ఐన్ స్టీన్ ప్రతిపాదించిన e=mc2 అనే ఫార్ములాకే సవాల్ విసిరిన దిట్ట. కాలిఫోర్నియా యూనివర్సిటీ లో పీహెచ్డీ పూర్తిచేసాడు...
..👉
కానీ విధి వైకరించింది ఇతడు ఇలా ఐపోవడానికి కారణం మన దేశంలోని బీహార్ ప్రభుత్వం. ఎలాగంటారా...ప్రపంచానికి '0' సంఖ్యను కనుకొన్న ఆర్యభట్ట జన్మించిన బీహార్ రాష్టంలోనే ఈయన జన్మించారు. కాలేజి లో చదువుకునే సమయంలోనే ఇతడు అడగే ప్రశ్నలకి లెక్చరర్ల దగ్గర సమాధానం ఉండేదికాదు. అమెరికా నుండి ఆ కాలేజికి వచ్చిన ఒక ప్రొఫెసర్ కి ఈయన ప్రతిభ నచ్చి తనతో అమెరికాకి తన సొంత డబ్బులతో తీసుకెళ్లి కాలిఫోర్నియా యూనివర్సిటీ లో చేర్పించాడు. అక్కడినుండి వశిష్ఠ జీవితం మారిపోయింది. అవార్డులు రివార్డులతో ఆయన ఏకంగా నాసా లో ముఖ్యమైన శాస్రవేత్తల్లో ఒకరిగా కొనసాగారు. 
తనని వెంట తీసుకెళ్లిన ఆ ప్రొఫెసర్ కూతురునే ప్రేమించి విషయం చెప్పాడు అందుకు అదృష్టంగా భవిస్తూ ఒప్పుకున్నాడు. ఇలా సాగుతున్న తన జీవితంలో ఒకసారి నారాయణ్ ఇంటినుండి రమ్మని కబురు వచ్చింది. వెళ్ళాడు. వెళ్లిన వెంటనే ఆయనకి తెలియకుండానే పెళ్లి కుదిర్చేసి హడావిడిగా పెళ్లి చేసేసారు. నారాయణ్ కి తన తండ్రి కళ్ళల్లో సంతోషం చూసి, ఇష్టం లేకున్నా ఆ పెళ్లి చేసుకున్నాడు. ఇష్టంలేని పెళ్లి చేసుకున్నందున లోలోపల మధనపడుతూ కొంతకాలం బీహార్ లోనే ఉన్నాడు. ఉన్నట్టుండి నారాయణ్ కి ఒక వ్యాధి వచ్చింది. తనలో తానే మాట్లాడుకోవడం, పిచ్చిగా ప్రవర్తించడం చూసి తన భార్య విడాకులు ఇచ్చేసింది. అతన్ని అక్కడి ప్రభుత్వ పిచ్చాసుపత్రిలో చేర్పించారు నిజానికి నారాయణ్ కి వచ్చిన వ్యాధి అంత ప్రమాదకరమైనదేమి కాదు ట్రీట్మెంట్ ఇస్తే కొన్ని నెలల్లోనే కోలుకునేవాడు. ఈ సమయంలోనే అక్కడి ప్రభుత్వం మారడంతో నారాయణ్ కి వైద్య పరీక్షలు చేయడం మానేసారు. చేసేదేమి లేక తన తమ్ముడు అతన్ని ప్రయివేట్ హాస్పిటల్ కి తీసుకెళితే దారి మధ్యలో ఎక్కడో తెలియని ఊరిలో రైలు దిగేసాడు. అప్పటినుండి నారాయణ్ ఆచూకీ ఎవ్వరికి తెలియలేదు. అతని కుటుంబ సభ్యులు ఈయనకోసం ఎంతవెతికినా దొరకలేదు. సరిగ్గా నాలుగేళ్ళ తర్వాత డోరేగంజ్ లోని ఒక బస్టాప్ దగ్గర ఇదిగో ఇలా కనిపించాడు. నారాయణ్ వైద్యపరీక్షలకి అయ్యే ఖర్చుని అప్పటి మారిన ప్రభుత్వం భరించి ఉంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఇలా అయ్యేది కాదు..
ఏ దేశం పేరుని నాసా వరకు తీసుకెళ్లాడో ఆ దేశమే ఇతన్ని పట్టించుకోలేదు.
అవును మరి... మన దేశంలో సైన్టిస్ట్ లకన్నా బాబాలే ఫెమస్ అంటారుగా... ఏది ఏమైనా నారాయణ్ గొప్పతనం అమెరికా వాళ్ళకి ఎప్పటినుండో
తెలిసింది కానీ, మనకి మాత్రం ఈమధ్యనే తెలిసింది. అపోలో 11 రాకెట్ ప్రయోగం సమయంలో 20 కంప్యూటర్ లు ఆగిపోవడంతో వాటిని మల్లి దారిలోకి తెచ్చింది నారాయణ్ నే... ఇంకా అయన రాసిన కొన్ని సైన్టిఫిక్ ఫార్ములాలని అమెరికా లోని యూనివర్సిటీ ల్లో ఇప్పటికీ పాఠాలుగా చెప్తున్నారు కూడా...
...
వశిష్ట నారాయణ్ సింగ్ జీ .... సెల్యూట్ 😥😥
 నిత్యం అవకాశం కొరకు ఆరాటం"

నిజానికి ఈ భూమి మీద ఉన్న 
ప్రతి ఒక్కరూ.. ఏదో ఆశతో 
అవకాశం కొరకు
ఎదురు చూస్తూనే ఉన్నారు!...
తమలో పుట్టిన ఆశయం 
నిలబెట్టుకోవడానికి 
తిప్పలు పడుతూనే  ఉన్నారు!...

శ్రమలేకుండా లక్ష్యం నెరవేరదు!...
అందమైన ఊహలవెనుక ఎన్ని ఆలోచనలో!...
విశ్వాసంతో అవకాశం అందుకోవడానికి
నిత్యం ప్రయాస పడుతున్నారు!!...

నిత్యం ఏదో అన్వేషణ!...
అనునిత్యం ఏదో ఆలోచన!...
జీవితాంతం రోజులను..దినాలను నెట్టేసుకుంటూ..
తనమీద తాను గట్టిగా ఒట్టేసుకుంటారు!...

నమ్ముకున్నకాలం వెనుక అడుగులువేస్తూ...
ప్రతిరోజూ తనకు తాను వికసిస్తూ...
ఆశయం కొరకు అర్రులు చాస్తూ...
పరుగెత్తుకొచ్చే అవకాశం కొరకు 
ఒక సజీవ జీవనదిలా ప్రవహిస్తూఉంటారు!...

సహనం..సాహసం 
చైతన్య దీప్తిలా వెలుగుతూ...
ఉదయానికి హృదయం పరిచి...
ఆశయం అంది పుచ్చుకోవాలని...
ఓ భక్తునిలా తనశక్తిని ఉపయోగిస్తారు!

ఆలోచనలోని అంతర్గత భావమే
ముందుకు నడిపిస్తోంది!...
అంచెలంచెలుగా అనుకున్నది సాధించాలనే తపన... 
ఓపక్క లోకం...మరోపక్క తాపం...
మరోపక్క అనుకున్న ఆశయం...
కళ్ళముందు కాలం కనుమరుగైంది!!
అందుకోలేని అవకాశం ఎదురైంది!...

ప్రతిక్షణం మనుసు పదేపదేకోరుతోంది..
ఇప్పుడు ఆచూపులేదు ఆ ఊపూలేదు..
బతుకులో అంతా వెలితి!...
అడ్డదారిలో అడుగులు వేసేవారికి
ఇది ఇష్టంగా ఉంటుంది!...
 
కొందరు నిజాయతీగా... 
కష్టమైనా...ఇష్టంగా అందుకోగలరు!..
సాధించడానికి ప్రయత్నంచేస్తారు!...
అవకాశం కోసం ఆకాశంవైపు చూస్తే
చుక్కలే కనబడతాయి!... 
కానీ ఆశయం నెరవేరదు!...

వెతుకుతున్నది పాతరోజులు కాదు...
ఓ విచిత్రమైన కొత్తరోజులు!...
తరం మారింది ఓ కొత్త తరం వచ్చింది...  
ఎక్కడచూసినా.. పైశాచిక ప్రవృత్తి!...
ఇది అవకాశాలులేని ఆరాటమే...
ఆశయం కొరకు పోరాటమే!...

అందుకే పటిష్టమైన పట్టుదల నిండైన విశ్వాసం...
దృఢమైన మానసిక సంకల్ప బలం ఉంటే... 
ఎంత కష్టమైన అవకాశం అందుకోగలరు!...

అంబటి నారాయణ
నిర్మల్
9849326801
 *శంబల - 21*
💮

*రచన : శ్రీ శార్వరి* 


*శంబల జీవనం - 4*


“మేడం! ఏ వ్యాపకం లేక ఇక్కడ నాకు బోర్ గా ఉంది” అని అడిగాను. 

“అప్పుడేనా? వచ్చి ఎంత కాలమైందని? ఏం తెలుసుకున్నావని? అసలు మిమ్మల్ని రప్పించింది ఎవరో, ఏ పని మీద ఇక్కడికి పిలిపించారో నాకు తెలియదు. వచ్చాక పని కాకుండానే వెళ్లిపోతారా? శంబల రావడం వెళ్లడం మీ ఇష్టం కాదు. మాస్టర్ల అనుమతి కావాలి దేనికైనా.” అంది.

“ఆ మాస్టర్లు ఎవరూ కనిపించడంలేదు. నాకు పిచ్చిపడుతోంది.”

“పట్టిందిగా శంబల పిచ్చి! పట్టిన పిచ్చి వదలగొట్టి పంపుతాలే.”

"నేను వెళ్లిపోవాలి మేడం! అక్కడ సగంలో ఆపిన పనులున్నాయి. పూర్తి చేయాలి."

"ఇక్కడ ఉండి అక్కడి పనులు పూర్తి చేయలేరా? ఆలయాలు చూడకుండానే వెళ్లిపోతే ఎలా? శంబల రహస్యం ఆ ఆలయాల్లో ఉంటుంది.”

"ఆలయదర్శనం అయ్యేలోగా నా పని అయ్యేట్లుంది. అసలు ఆలయాల్లోకి నన్ను అనుమతించకపోతే ఎలా?"

"నేను గ్యారంటీ. మీ విషయాలన్ని చూచే బాధ్యత నాది."

"ఇక్కడ తిండి, తిప్పలు లేకుండా ఎట్లా బ్రతకడం మేడం?"

"మేం బ్రతుకుతున్నట్లే మీరూ కూడా బ్రతుకుతారు" అన్నది కూల్ గా.

"ఇదీ ఒక బ్రతుకేనా?" అనుకున్నాను. పైకి అనలేదు.

"ఇదే బ్రతుకు మిత్రమా, మీరు ఎంతకాలం బ్రతికినా మీ బ్రతుకులు అశాశ్వతం. ఇక్కడ అంతా శాశ్వతం."

"ఇలా ఎంతకాలం జీవించాలి? జీవించి ఏం ప్రయోజనం? నా వల్ల కాదు మేడం నేను మనిషిని, మీలాగా దేవతని కాను."

“ఎప్పటికైనా ఇక్కడికి రావలసిందేగా. మీరు చేస్తున్న యోగం, తపస్సు ఇందుకొరకేగా."

"అప్పుడు చూద్దాంలేండి. ఇప్పటికి ఇక్కడి నుండి బయటపడే మార్గం చూపండి. మీకు ఆజన్మం రుణపడి ఉంటాను."

"మార్గం తెలుసు. కాని చెప్పలేను. మీరు వెళ్లడానికి నేను పర్మిషన్ ఇవ్వలేను. మాస్టర్స్ పర్మిషన్ కావాలి దేనికైనా. నేను చెప్పడానికైనా, మీరు వెళ్లడానికైనా."

"ఆలయాలకు వెళ్లే మార్గం చూపించండి. వెళ్లి మాస్టర్స్ నే అడుగుతాను."

"మీరు వెళ్లి అడిగితే వాళ్లు పలకరు శార్వరీ. అసలు నీ కళ్లకు వాళ్లెవరూ మీకు కనిపించరు. మీ ఆత్మశక్తి ఇంకా ఎక్కువ ద్విగుణీకృతం కావాలి స్వామి".

"నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. అదైనా చెప్పండి ఎట్లా చావాలో?"

"నా వల్ల కాదు స్వామి" నవ్వుతూ అన్నది ఆమెగారు.

"ఏదో సామెత చెప్పినట్లు పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం. అట్లా ఉంది నా స్థితి."

"స్వామీ నువ్వు ఎలకవు కావు, పిల్లి కూనవు. యోగ కూనవు. అయినా మాస్టర్స్ ముద్దు పట్టివి. అభిమాన బిడ్డవు కదా.”

“మేడం, వచ్చే జన్మలో మీ కడుపున పుడతాను. నన్ను రక్షించండి. దయచేసి నన్ను వెళ్లిపోనీయండి.”

"అంటే నిన్ను మళ్లీ కనడం కోసం నేను పుట్టాలా? పురిటి నొప్పులు పడాలా ? భలే వాడివే. ఇక్కడ శంబలలో ఎవరికీ కడుపులు రావు బాబూ. ఎవరూ కనరు? అంతా ఆత్మ సంతానం. సద్యోగర్భాలు, సద్యోసంతానం. ఎవరికెవరు ఏమీ కారు తెలుసా!"

"మేడం! మీరు ఏది చెప్పినా చేస్తాను. దయచేసి నా విషయం కాస్త మాస్టర్లకు రికమెండ్ చేయండి ప్లీజ్.”

"సరే. ఆలయ భూములకు పోదాం వద. ఆలయాలు చూసినట్లు ఉంటుంది. నీ పర్మిషన్ ఏదో నీవే తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత నన్ను కూడా మీ ప్రపంచంలోకి తీసుకుపోతారా స్వామి?"

"మిమ్మల్నా?"

"ఏం తగనా? అక్కడ నాకు బాగానే ఉంటుంది. యోగీ మీతో వస్తాను. నేను ఎక్కడైనా adjust కాగలను తెలుసా!"

"వద్దు మేడం! మా ప్రపంచంలో కష్టాలు మీరు పడలేరు. అక్కడ మేమే బ్రతకలేక చస్తున్నాం. చావలేక బ్రతుకుతుంటాం. Horrible Life."

“ఫరవాలేదు. కష్టపడతాను. నాకూ అనుభవం కావాలిగా."

తారామాత వెంట బయలుదేరాను. నా వెంట దేవి బయలుదేరింది.

“ఈమె గారికీ పిల్లలంటే ప్రేమ ఎక్కువే” అనుకున్నాను.

"ఇక్కడ మొగుళ్లు, పిల్లలు, వాళ్ల మీది ప్రేమలు నామ మాత్రం స్వామీ, మీలాగా వెంపర్లాడరు. ఎవరికి వారే! ఎవరికి ఎవరూ ఏమీ కారు. ఎప్పుడన్నా ఎక్కడున్నా కనిపిస్తే, గుర్తిస్తే 'ఓహ్' అనుకుంటారు. అవి బంధాలు కావు. అనుబంధాలు కావు. ఉత్తి ఆత్మ సమీకరణాలు. ఇక్కడ ప్రేమ కామ మయం కాదు. మీ ప్రపంచం ప్రేమ రహితం, కామపూర్ణం. అంతే తేడా.

"అందుకే మేడం! బోర్ అంటున్నది?"

ఆమె అన్నది "మీ జీవితాలే హాయి  యోగీ. స్వర్గం, స్వర్గం అంటూ ఊహిస్తూ సుఖపడిపోతారు. స్వర్గంలోని దేవతలకు మీరంటే ఇష్టం. భూమి పైకి రావాలని తెగ ఉబలాట పడుతుంటారు. స్వర్గంలో లేని సుఖాలు భూమి పైన ఉంటాయని దేవతల భావం. భూమి పైకి వచ్చినవారు తిరిగి స్వర్గం చేరరు తెలుసా? శంబల చేరుతుంటారు.”

"ఏం? స్వర్గానికి తిరిగిపోరా?"

"అదెక్కడ ఉంది స్వామి?”


ఒక కొండ ఎక్కి అంచున క్రిందికి దిగాం. ఒక గంట నడిచాం. మరొక గంట ప్రయాణం తర్వాత ఒక గుహ దగ్గరికి చేరుకున్నాం.

"ఈ గుహలో కూర్చుని శంబల ధ్యానం చేయండి. నెగెటివ్ ఆలోచనలు పూర్తిగా వదలండి. పూర్తిగా శూన్యం అయిపోండి. అసూయ, ద్వేషం, ఆశ, భయం ఏవీ ఉండకూడదు. భయపడ్డారో ఢాకినీ వస్తుంది.

నాకు నిజంగానే భయం వేసింది. వెంటనే నా ముందు ఒక మంచు మనిషి ప్రత్యక్షమైనాడు. అది ఢాకినీ అని భయంతో కళ్లు మూసుకున్నాను.
ఢాకినీ కాదు. అది బ్రహర్షి భార్గవ.

"హలో గురూజీ! పిలిచారా?" నవ్వుతూ అడిగాడు.

"పిలిచానా! భయంతో గావుకేక వేశానా!"

“అయితే నువ్వు ఎట్లా ఇక్కడ?""ఈ బాట నాకు తెలుసు గురూజీ. రండి పోదాం."

అది కలా? భ్రాంతా?

"పదండి. మిమ్మల్ని తిరిగి పంపిస్తాను" అంది తారాదేవి.

"పర్మిషన్ వచ్చింది యోగీ! సరిహద్దులు దాటిస్తాను పదండి!"

కళ్లు మూసుకుని కూర్చున్నాం. మరు నిమిషంలో షిగాట్సేలో ఉన్నాం భార్గవ, నేను.

తారాదేవి కనిపించలేదు.
🪷

*బై... బై... శంబల*

తిరుగు టపాలో లాసా చేరుకున్నాం.

ఖాట్మాండు చేరితే ఢిల్లీ చేరుకున్నట్లే. రెండు గంటలు ప్రయాణం. శంబల గురించి ఇంకా తెలుసుకోవాలని నా మనసు ఆరాటపడుతోంది.

అక్కడకు దగ్గరలో షిగాట్సే వద్ద 'తాషీలామా' ఆశ్రమం ఉందని భార్గవ చెప్పాడు. అప్పుడప్పుడు భార్గవ మంచి విషయాలు చెబుతాడు. పాపం అతడు మంచివాడే! మంచి మనసున్నవాడు. ఆయనతో ఒక రోజు గడపాలని నిర్ణయించుకున్నాం. భార్గవ లామా అపాయింట్మెంట్ తీసుకువచ్చాడు. ఇద్దరం లామాసరి చేరాం. భార్గవ్ కి అది తెలిసిన రూటే! సులభంగానే లామాతో భేటీ కుదిరింది.

ప్రశ్న : "మాస్టర్ లామా! మీరు బోధి సత్వులు, జ్ఞాన సంపన్నులు. దయచేసి శంబల గురించి మీ అనుభవాలు చెప్పండి. శంబల గురించిన విషయాలు ఎవరూ ఏవీ లోకానికి తెలియనివ్వరు ఎందుచేత?”

'కాలచక్రం' ప్రసిద్ధి దాని గురించి వివరంగా చెప్పండి."

“మీరు ఇండియా నుండి వచ్చారు గనుక మీకు గౌతమ బుద్ధుని గురించి తెలిసే ఉంటుంది. కాలచక్రం గురించి తెలుసుకు నే అర్హత మీకు ఉందనే నా అభిప్రాయం. మీరంటే మా టిబెట్ బౌద్ధులకు చాలా ఇష్టం. చాలా ప్రేమ, గౌరవం ఇండియా నుండి ఎవరు వచ్చినా బుద్ధుని వారసులని మా నమ్మకం.”

“ఇంతకాలం మాకు గర్వంగా ఉండేది బౌద్ధం శంబలలో సురక్షితంగా ఉందని. దాని పవిత్రతను మౌలికతను కాపాడుతు న్నామని. ఈ మధ్య తెలిసింది టిబెట్ లోని బౌద్ధంలో బౌద్ధధర్మం తగ్గిపోయింద ని. బౌద్ధంలో మంత్రాలు, తంత్రాలు ప్రవేశించాయి. ఇక్కడి బౌద్ధంలో ధర్మం కనిపించకుండా పోయి తంత్రం ఒక్కటే పైకొచ్చింది. బౌద్ధం పేర గారడీ విద్యలు ప్రాచుర్యం పొందాయి. అసలు బౌద్ధం తిరిగి జన్మభూమికి చేరుతోంది. ఈనాడు బుద్ధగయకున్న ప్రాధాన్యం టిబెట్ కి లేదు. లామాల ఉద్ధతి తగ్గిపోయింది.
🪷

*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂