Sunday, July 31, 2022

ఇది కథ కాదు

 ఇది కథ కాదు

                 సి.ఎన్.చంద్రశేఖర్

                  (9490050214)


         ఉత్తరం చివర సంతకం పెట్టబోతున్న సమీర- తలుపు తెరచుకుని గదిలోకి వచ్చిన వార్డెన్ కాత్యాయనిని చూసి ఉలిక్కిపడి, ఉత్తరాన్ని మంచం మీదున్న దుప్పటి క్రింద దాచేసింది.

             "ఏమిటి దాస్తున్నావు? ఏదీ...చూపించు!" తీక్షణంగా సమీర వైపు చూస్తూ అంది కాత్యాయని.

    "మా నాన్నకు రాసిన ఉత్తరం మేడం!" భయంభయంగా చూస్తూ అంది సమీర.

            "నాన్నకు రాసిందా? బాయ్ ఫ్రెండ్ కు రాసిందా? ఏదీ..ఇటివ్వు!"

                "నాన్నకు రాసిందే మేడం...ప్రామిస్!"

             "నాన్నకు రాసిందే అయితే నాకు చూపడానికి భయమెందుకు?

           "అదీ..అదీ...పర్సనల్ విషయం మేడం!"

కాత్యాయని ఓ క్షణం ఆలోచించింది...'సమీర మంచి అమ్మాయి, అమాయకురాలు. పైగా ర్యాంకు హోల్డర్. ఆమెని ఇబ్బంది పెట్టడం బాగుండదు ' అనుకుని 

        "సరే..వస్తా..తలుపేసుకో!" అంటూ కదిలింది.

           మళ్ళీ 'సమీర అమాయకురాలే కావచ్చు. ఇలాంటివాళ్ళను వలలో వేసుకోవాలనుకునే వేటగాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ వలలో ఈమె చిక్కుకుని ఉంటే? ' అన్న ఆలోచన వచ్చి, వెనక్కి తిరిగి-

        "నేను మొదటి వాక్యం మాత్రం చదివి ఇచ్చేస్తాను...ఆ ఉత్తరం తీసుకురా!" అంటూ కుర్చీలో కూర్చుంది కాత్యాయని.

         సమీర భయంభయంగా ఉత్తరాన్ని సగం మడిచి కాత్యాయని చేతికిచ్చింది.

            "ప్రియాతిప్రియమైన నాన్నకు...' అన్న సంభోదన చూడగానే-

"సారీ...నిన్ను ఇబ్బంది పెట్టాను!" అంటూ ఉత్తరం తిరిగి ఇవ్వబోతున్న ఆమెకు- మడతకు మరోవైపు పెద్ద పెద్ద అక్షరాలతో "నేను చచ్చిపోతున్నాను నాన్నా!" అన్న వాక్యం కనిపించింది.

           "ఏమిటమ్మా...నువ్వు చచ్చిపోదామనుకుంటున్నావా?" ఆశ్చర్యంగా అడిగింది సమీరని.

       Vసమీర ఉన్నట్టుండి వెక్కి వెక్కి ఏడవసాగింది.

      కాత్యాయని "కాస్త ఆగు!" అని విసుక్కుని, తర్వాత ఉత్తరాన్ని చదవసాగింది.

          "ప్రియాతి ప్రియమైన నాన్నకు.. నీలాంటి తండ్రి దొరకడం నా అదృష్టం నాన్నా. అక్షరాభ్యాసం నుంచి సంస్కారాభ్యాసం వరకూ నా వెనకే ఉండి నడిపించావు. నీ ప్రోత్సాహం వల్ల నేను టెన్త్ లో స్కూల్ ఫస్ట్, ఇంటర్ లో కాలేజి సెకండ్ వచ్చాను. కలెక్టర్ అవ్వాలన్న ధ్యేయంతో ఈ కాలేజీలో బి.ఏ. చేరాను.

సాఫీగా సాగిపోతున్న నా జీవితాన్ని చిన్నాభిన్నం చేయడానికి వచ్చారు ఇద్దరు యమదూతలు. వారి పేర్లు...సురేంద్ర, ఫణీంద్ర!

             నన్ను అనుక్షణం వెంటాడారు. ఓ రోజు ప్రేమ అంటారు. ఓ రోజు తమతో రమ్మంటారు. ఏసిడ్ పోస్తామంటారు. ప్రిన్సిపాల్ తో చెబితే చంపేస్తామంటారు. నేను భయంతో వణకిపోయేదాన్ని. మీతో చెప్పి మిమ్మల్నీ బాధపెట్టడం ఎందుకని చెప్పలేదు.

           నా గుండె పగిలే మరో విషయం...ఈరోజు నాకు తెలిసింది.

   ఎలా చేశారో తెలియదుగాని- నా బాత్రూంలో కెమెరా పెట్టారు. నేను స్నానం చేస్తూంటే వీడియో తీశారు. తమ కోరిక తీర్చమనీ, లేకుంటే ఆ వీడియో ఇంటర్నెట్ లో పెడతామనీ బెదిరిస్తున్నారు.

         ఆ వీడియో బయటికి వస్తే నేను తలెత్తుకు తిరగలేను. వాళ్ళకు లొంగిపోవడం కంటే చచ్చిపోవడమే మేలు! అందుకే నేను చచ్చిపోతున్నాను నాన్నా!

       నేను కలెక్టర్ కావాలన్న మీ ఆశల్ని ఆవిరి చేసి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నాను. కానీ ఆడపిల్లగా మాత్రం కాదు నాన్నా! ఈ సమాజంలో మనశ్శాంతిగా బ్రతికే అదృష్టం ఆడపిల్లలకు లేదు. నేటి స్త్రీ మనుషుల మధ్య బ్రతకడం లేదు...కామాంధుల మధ్య బ్రతుకుతూంది. కెమెరా కళ్ళ మధ్య భయంభయంగా బ్రతుకుతూంది. బస్సులో నిలబడ్డా, ట్రైన్లో పడుకున్నా, చెప్పు తెగి వంగినా, రోడ్డుపై నడిచినా..కెమెరాల్లో బందీ అవుతూంది. అంతర్జాలంలో దర్శనమిస్తూంది.

              మిమ్మల్నీ, అమ్మనీ తలచుకుంటూంటే నాకు ఏడుపొస్తూంది నాన్నా! ధైర్యంగా ఉండండి నాన్నా. అమ్మకు ధైర్యం చెప్పండి!

           శెలవు నాన్నా..

                    క్షమాపణలతో-

                          మీ...సమీర.

           ఉత్తరం చదవడం పూర్తి చేసిన కాత్యాయని కళ్ళనిండా నీళ్ళు నిండాయి.

          "జరిగింది చిన్న విషయం కాదు. కాని, సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా చనిపోవాలనుకోవడం తప్పమ్మా!" అంది సమీరతో.

              సమీర భోరున ఏడవసాగింది.

            "ఏడవకమ్మా! నీవు ఉత్తరంలో రాసినట్లు ఆడపిల్ల జీవితం నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది. నీ వయసువాళ్ళే కాదు, మా వయసువాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి సమాజంలో నెలకొని ఉంది. నీ సమస్యకు పరిష్కారం నేను కనుక్కుంటాను. నీవు మాత్రం ఎలాంటి అఘాయిత్యం చేసుకోనని నాకు మాటివ్వు!" అంది కాత్యాయని చెయ్యి చాపుతూ.

           ఏడుస్తూనే కాత్యాయని చేతిలో చెయ్యి ఉంచింది సమీర.

            "ఈ రాత్రి నా గదిలోనే పడుకుందువుగాని...పద!" అంటూ బయటకు నడిచింది కాత్యాయని.

        ఆరాత్రి-చాలాసేపటివరకు కాత్యాయనికి నిద్ర పట్టలేదు.

సమీరకు అభయమైతే ఇచ్చింది కాని- ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆమెకు అర్థంకాలేదు. తర్వాత ఆమెకు తన స్నేహితుడు విశ్వం గుర్తుకొచ్చాడు. 

            'విశ్వం మంచి రచయిత. తను ఏది పాటిస్తాడో..అదే తన రచనల్లో రాస్తాడు. పైగా అతనికి ఊర్లో మంచి పలుకుబడి ఉంది. అతనికి విషయం చెప్పి సలహా తీసుకుంటే మంచిది!' అనుకుంది.

       * * * * 

       హాస్టల్ ఆఫీసు గుమ్మం దగ్గర నిలబడి 'మే ఐ కమిన్?" అన్న విశ్వం వైపు చూసి-"లోపలికి రావడానికి నీకు కూడా పర్మిషన్ కావాలా?" అంది కాత్యాయని నవ్వుతూ.

              "అమ్మాయిల హాస్టల్ కదా...కొన్ని హద్దులు ఏర్పరచుకుంటేనే మంచిది!" అంటూ వచ్చి కాత్యాయని ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు విశ్వం.

       విశ్వం వైపు మెచ్చుకోలుగా చూసింది కాత్యాయని.

  'ప్రతి మగవాడూ విశ్వంలాంటి సంస్కారవంతుడైతే స్త్రీలు నిర్భయంగా,మనశ్శాంతిగా బ్రతకవచ్చు!' అనుకుంది మనసులో.

           "ఊరక పిలవరు మహానుభావులు!" అన్నాడు విశ్వం నవ్వుతూ.

   "ఔను....పనుండే పిలిచాను!" అంటూ ప్రక్కన ఉన్న సమీరను అతనికి పరిచయం చేసి, జరిగిన విషయం చెప్పింది.

           "ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్నావా?" అని సమీరను అడిగాడు విశ్వం.

         "ఇది చిన్న విషయమా అంకుల్...ఆ వీడియో బయతపడితే నేను ఎలా తలెత్తుకు తిరగను?"

             "నువ్వేం దొంగతనం చెయ్యలేదు, హత్య చెయ్యలేదు....స్నానం చేశావు. అది తప్పు కాదే! నువ్వు స్నానం చేస్తున్నప్పుడు వీడియో తియ్యడం వాళ్ళ తప్పు. వాళ్ళు చేసిన తప్పుకు నువ్వెందుకు చనిపోవాలి? ఆ వీడియో బయటికి వస్తే, పది మంది చూస్తే నీకు ఎంబరాసింగ్ గా ఉంటుంది. ఆ విషయం నేనూ ఒప్పుకుంటాను. అప్పుడు నువ్వు ఇక్కడ చదివే బి.ఏ. ఇంకో ఊరెళ్ళి చదువు! చావడం కంటే ఇలా చెయ్యడం నయం కదా?"

      "ఇంటర్నెట్ ప్రపంచమంతా ఉంటుంది అంకుల్!"

       "ఆ వీడియో ఇంటర్నెట్ లో పెట్టేవాళ్ళు నీ చిరునామా రాసి మరీ అప్లోడ్ చేస్తారా? గతంలో నీలిచిత్రాల్లో నటించిన ఒకావిడ రూటు మార్చుకుని బాలీవుడ్ చిత్రాల్లో నటించసాగింది. ఇప్పుడు ఆవిడ ఓ సెలెబ్రిటీగా మారింది. మరి ఏ తప్పూ చేయని నువ్వు చనిపోవాలనుకుంటున్నావు. మనిషి మనిషికీ ఆలోచనల్లో ఎంత తేడా ఉందో చూశావా? ఎన్ని కష్టాలొచ్చినా ఓ వ్యక్తి ఎదుగుతాడు. అవే కష్టాలు వచ్చిన మరో వ్యక్తి క్రిందకి జారిపోతాడు. విజయానికీ,అపజయానికీ తేడా..కేవలం ఆలోచనలే!"

                 సమీర ఆసక్తిగా వింటూండిపోయింది.

         "నీ సమస్య గురించి మీ అమ్మానాన్నలకు చెప్పావా?" విశ్వం అడిగాడు.

           "లేదు అంకుల్. వాళ్ళు చాలా సున్నిత మనస్కులు. ఇలాంటివి వింటే తట్టుకోలేరు."

             "మరి నువ్వు చనిపోతే వాళ్ళు ఆ విషయం విని తట్టుకోగలరా? ఇలాంటి విషయాలు మొదట తల్లితండ్రులతోనూ, తర్వాత ప్రిన్సిపాల్, లెక్చరర్లకూ తప్పనిసరిగా చెప్పాలి. ప్రపంచం గురించి మీకంటే వారికి ఎక్కువ తెలుసు. వారికున్న జీవితానుభవంతో మంచి పరిష్కారాన్ని సూచించగలరు."

         "అయినా చదువుకునే పిల్లలు ఎందుకు ఇలా అయిపోతున్నారు? సెక్స్ తప్ప ఇంకో విషయం పట్టదా వీళ్ళకి? జాలి,కరుణ, నైతిక విలువలు అక్కర్లేదా వీళ్ళకి?" -ఆవేదనగా అడిగింది కాత్యాయని.

            "కాలేజీలో విద్యార్థుల కళ్ళముందు ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. వాటికి చలించకుండా తాము కాలేజీకి ఎందుకొచ్చామో తెలుసుకుని ప్రవర్తించేవాళ్ళు జీవితంలో స్థిరపడతారు. చలించి వక్ర మార్గాన ఆలోచించేవారు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. ఉదాహరణకు బ్యాంకులో పనిచేసే ఉద్యోగుల కళ్ళముందు కోట్ల రూపాయలు ఉంటాయి. అయినా చలించకుండా పనిచేసుకునేవాడు ఉద్యోగంలో ఉంటాడు. చలించి చేతివాటం చూపించినవాడు జైల్లో ఉంటాడు. అమ్మాయిల విషయంలో అబ్బాయిలకు జరిగేది కూడా ఇదే!"

           "నిజమే. ఇంతకూ ఈ అమ్మాయి విషయంలో నీవు ఏమి ఆలోచించావు?" అని అడిగింది కాత్యాయని.

           "ఈ ఏరియా ఏ.ఎస్.పి. రామ్మోహన్ నాకు మంచి మిత్రుడు. దొంగతనం చేసిన వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తాడేమో గాని-అమ్మాయిలను వేధించేవాళ్ళను మాత్రం తాట ఒలుస్తాడు. సమీరకు ఇబ్బంది కలగకుండా ఈ కేస్ దీల్ చెయ్యమని అతనితో చెబుతాను.." అన్నాడు విశ్వం.

       తర్వాత సమీర వైపు తిరిగి "చూడమ్మా..కొన్ని సమస్యలొస్తే కొందరు ఏవేవో ఊహించుకుని భయపడతారు, మనశ్శాంతి లేకుండా గడుపుతారు. నీలాంటి కొంతమంది ఆత్మహత్యాప్రయత్నం కూడా చేస్తారు. అయితే సమస్యలు చాలాసార్లు సులభంగా పరిష్కారమవుతాయి. నువ్వు కూడా భవిష్యత్తులో కలెక్టర్ అయి 'ఆరోజు ఆత్మహత్య చేసుకునిఉంటే కలెక్టర్ అయ్యేదాన్ని కాదు కదా! ' అని అనుకుంటావు!" అన్నాడు విశ్వం నవ్వుతూ.

          విశ్వం వెళ్ళిపోయాక "ఆ అంకుల్ మాటలు నాకు చాలా ధైర్యాన్నిచ్చాయి!" అంది సమీర కాత్యాయనితో.

    * * * *

             విశ్వం ఇంటికి వచ్చిన కాత్యాయని,సమీరలను విశ్వం భార్య జయంతి సాదరంగా ఆహ్వానించింది.

        హాల్లోకి వచ్చిన విశ్వంతో " ఏం విశ్వం! పార్టీ అని పిలిచావు. మీ శ్రీమతి పుట్టినరోజా లేక మీ పెళ్ళిరోజా?" అని అడిగింది కాత్యాయని.

          "రెండూ కాదు...చెడుపై విజయం సాధించినందుకు! సమీర సమస్య పరిష్కారమైనందుకు!"

      సమీర ముఖం ఆనందంతో వికసించింది.

      "ఎలా?" అంది కాత్యాయని ఆశ్చర్యంగా.

"కూర్చోండి...చెబుతాను.        

      "రామ్మోహన్ వాళ్ళిద్దరినీ సెల్ లో వేసి పోలీస్ ట్రీట్ మెంట్ రుచి చూపించడం మొదలుపెట్టిన అయిదు నిమిషాలకే వాళ్ళు అన్నీ ఒప్పేసుకున్నారు. నిజానికి వాళ్ళు హాస్టల్ లో పనిచేసే ఓ వ్యక్తి ద్వారా వీడియో తీయడానికి ప్రయత్నించారు. కానీ రికార్డింగ్ ఫెయిల్ అయింది. అందువల్ల ఏవో వెబ్ సైట్లనుండి డౌన్లోడ్ చేసుకున్న దృశ్యాల్ని సమీరకు చూపి భయపెట్టారు. సమీర అమాయకురాలు కాబట్టి వాటిని పరిశీలించకుండానే నమ్మేసింది. వీడియో గురించి ఆరోజే సమీరను అడగాలనుకున్నాను. తను ఇబ్బంది పడుతుందని అడగలేదు. ఇకపై వాళ్ళు ఏ అమ్మాయి జోలికీ వెళ్ళరు. సమీర జోలికి అసలు రారు." 

              "ఒకవేళ వాళ్ళు పోలీసులకు వేరే వీడియోలు చూపించి,తర్వాత ఎప్పుడైనా సమీరపై తీసిన వీడియో బయటపెడితే?" అనుమానం వ్యక్తం చేసింది కాత్యాయని.

          "ఇక్కడ నా రచయిత బుర్ర ఉపయోగించాను. వాళ్ళిద్దరినీ జైల్లో పెట్టి వీడియో తీశాము. సమీర వీడియో ఏదైనా బయటకు వస్తే ఈ వీడియో యూట్యూబ్ లో పెడతామని బెదిరించాము.వాళ్లకు సహకరించడానికి ప్రయత్నించిన మీ హాస్టల్ ఉద్యోగి ఎవరో తర్వాత చెబుతాను. అతన్ని హాస్టల్ నుంచి పంపేయండి. అటువంటి వాళ్ళతో ఎప్పటికైనా ప్రమాదమే."

        "అందుకే ఈ బాధ్యత నీకు అప్పజెప్పాను. థాంక్యూ సో మచ్!" అంది కాత్యాయని.

        సమీర విశ్వం కాళ్ళమీద పడింది.

విశ్వం ఆమెను లేవనెత్తి "ఇక హాయిగా చదువుకో! నా ఫోన్ నంబర్ ఇస్తాను. నువ్వు కలెక్టర్ కాగానే నాకు ఫోన్ చెయ్యాలి!" అన్నాడు.

        పదేళ్ళ తర్వాత సమీర విశ్వంకు ఫోన్ చేసింది...'కలెక్టర్ 'హోదాలో.

     * * * *

*(సోమేపల్లి జాతీయ స్థాయి కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ  )*

శరీరం, సంసారం అవసరాలు తీర్చాలని కోరుతోంది, మనసు ఆధ్యాత్మిక సాధనపై నిలువటంలేదు, శాంతి రావట్లేదు ?

 🙏🕉🙏                    ...... *"శ్రీ"*


                 💖💖💖

        💖💖 *"294"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

    

*"శరీరం, సంసారం అవసరాలు తీర్చాలని కోరుతోంది, మనసు ఆధ్యాత్మిక సాధనపై నిలువటంలేదు, శాంతి రావట్లేదు ?"*

******


*"ఆధ్యాత్మిక సాధన ఏదీ శాంతి, తృప్తిని ఇవ్వదు ! ఈ దేహం ఒకటి ఉంది కాబట్టి దాని అవసరాలు తీర్చక తప్పదు. భోజనం, నీరు, వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీరాల్సిందే. ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది. కానీ రుచులుకోరే మనసు మాత్రం శాంతించటంలేదు. ఆకలి శరీర అవసరమైతే, రుచి మనసుకు కలిగే కోరిక. ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చటం సముచితమైనా మితము లేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవటం శాంతిని దూరంచేసే విషయం. ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. కనుక శరీర పోషణ, రక్షణలు మనకు అత్యావశ్యకం. అశాంతి కారకాలైన కోరికల ఉద్ధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం. సుఖ-సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోనిదేనన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది. అలాగే పవిత్రమైన జీవనవిధానం అలవర్చుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొందగలుగుతుంది. ఈ పవిత్ర జీవనం కోసమే మన పెద్దలు ధర్మం ఆచరించమన్నారు" !*


*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

          🌼💖🌼💖🌼

                🌼🕉🌼 

ఇంద్రియ నిగ్రహం – సాధన

 ఇంద్రియ నిగ్రహం – సాధన

(శృ౦గేరి శారదా పీఠం 36వ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి బోధలు)

ఇంద్రియములు అంటే ఙ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అని. వాటిలో మనస్సుకూడా ఒక ప్రధానమైన ఇంద్రియం. అదే కర్మలకు కారణమైన ప్రధాన ఇంద్రియం. తనకు ఇష్టమైనదాని మీదకు పోవటం దాని సహజ లక్షణం. అది దానికి ఇష్టంలేని దానిమీదకు పోదు. ఎందుచేతనంటే దానివలన దానికి ప్రయోజనం లేదు కనుక! అలాంటప్పుడు ఎందుకు శ్రమపడాలి? కాబట్టి మనస్సుకు (ఇంద్రియానికి) ఏది ఆకర్షణముగా ఉంటుందో, దేనివలన తాను కోరుకున్న ఆనందం కలుగుతుందో దాని మీదనే ఆసక్తి ప్రసరిస్తుంది. అది లౌకికమైన తాత్కాలిక ఆనందం. కష్టసాధ్యమైన పారమార్ధిక విషయాలవైపు మనస్సు పోదు. అటువంటి మనస్సును నిగ్రహించి దానిని పారమార్ధికమైన విషయాలవైపు మళ్ళించటం కష్టసాధ్యమైన కార్యం. ఆ విధముగా మనస్సును మళ్ళించగల శక్తిని సమకూర్చుకోవటాన్నే ఇంద్రియ నిగ్రహం అంటారు.

కాబట్టి లౌకిక సుఖాన్ని కాదు అనుకుని పారమార్ధిక సుఖానికై మానవుడు ప్రయత్నం చెయాలి. ఈ ప్రయత్నం నిరంతరం సాగుతునే ఉండాలి. కార్యసాధనకు ప్రయత్నం అవసరం. అదే ముఖ్యం! లేకపోతే మనస్సును నిగ్రహించి కార్యోన్ముఖముగా చేయటం ఎట్లా సంభవిస్తుంది. కాబట్టి కార్యసాధనకు తీవ్రమైన ప్రయత్నం చెయ్యాలి. ఆలోచన చెయ్యాలి.. ఆలొచన అంతర్ముఖం చేసుకొని మనస్సు ఏ విషయాలకు లోను అవుతుందో వాటిని నిరోధించుకునే ప్రయత్నం చెయ్యాలి.

మనకు ఇష్టంలేని ప్రస్థావన తీవ్రమైనప్పుడు మనకు కోపం వస్తుంది. క్రోధం అంతః శత్రువు. హద్దు మీరుతుంది. చేయకూడని పని చేస్తుంది. మాట్లాడకూడని మాటలను మాట్లాడిస్తుంది. దీనివలన అనర్ధం జరుగుతుంది. అది తనకు మంచి చేయదు, ఎదుటివారికీ ప్రయోజనం కలిగించదు. అటువంటి క్రోధాన్ని ప్రయత్నపూర్వకముగా నిగ్రహించాలి.

సహనం, వివేకం అలవరుచుకోవాలి. మనకు అనుకోని విధముగా ఒక విఘాతం (ఆపద) ఏర్పడింది అనుకుందాము. త్రోవన పోయే ఒకనిని హటాత్తుగా పాము కాటు వేసింది అనుకుందాము. అది ఆకస్మికమైన విపత్తు. దానికి ఏడ్చి పొడబొబ్బలు పెట్టి, ఇతరులను నిందించి, పాముపై క్రోధం పెరిగి, దానిని చంపటానికి ప్రయత్నించి, అది కనపడకుండా పోయి, దానిపై పగ, భయము పెంచుకుంటూపోతే చేయవల్సిన కార్యం మరచి సమయం వ్యర్ధమవుతుంది. దానివలన ఏమి ప్రయోజనం? అటువంటి సమయంలో సహనము, వివేకముతో కూడిన కార్యము తలపెట్టాలి.

ఏ కార్యం జరగటానికైనా ఒక కారణం ఉంటుంది. ఆ పాము కాటు వేయటానికి ఒక ప్రేరణ ఉండి ఉంటుంది. అదియే దైవ ప్రేరణ. (శివుని ఆఙ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని లోకోక్తి) ప్రారబ్ద కర్మాను పాలనంలోనే అట్లా జరిగి ఉంటుంది అని భావించాలి. అట్లా విచారణచేయటమే వివేకం. ఈ విచారణము వివేకముచే స్థిరపరుచుకుని నిర్ణయం చేసుకోగలుగుతున్నాము.

ఈ విధమైన విచక్షణ చేయగలగటానికి ఎన్నో కఠినమైన పరిస్థితులు, అవరోధాలు కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. వీటిని సహనంతో అధిగమించాలి. దీనినే తితిక్ష అని కూడా అంటారు. తితిక్ష కలవాడే వేదాంత శిక్షణకు యోగ్యుడు. అటువంటి వానికే శాస్త్రము యెడల శ్రద్ధ కలుగుతుంది శాస్త్రంలో శ్రద్ధ అంటే విశ్వాసం. శాస్త్రం ఏది నిర్దేసిస్తుందో అది చేయాలి. ఆ విధముగా శాస్త్రం ఎందుకు చెప్పింది అన్న దానిపై పరిశోధన చేయకూడదు. శాస్త్రంపై పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే చాలదు. శాస్త్రం చెప్పిన విధముగా ఆచరించాలి. 

--- నోరి రామకృష్ణయ్య

శృంగేరిజగద్గురువైభవం

వేమన సంబంధ 16 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో.

 *వేమన  సంబంధ 16 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*
------------------------------------------------
వేమన పద్యములు www.freegurukul.org/g/Vemana-1

వేమన యోగి www.freegurukul.org/g/Vemana-2

వేమన పద్యాలు 5000 www.freegurukul.org/g/Vemana-3

విశ్వదాభిరామ వినురవేమ www.freegurukul.org/g/Vemana-4

వేమన వేద సూక్తులు www.freegurukul.org/g/Vemana-5

వినుర వేమ www.freegurukul.org/g/Vemana-7

వేమన్నవాదం www.freegurukul.org/g/Vemana-8

మన వేమన www.freegurukul.org/g/Vemana-9

సత్యాన్వేషి వేమన www.freegurukul.org/g/Vemana-10

వేమన వివిధ దృక్కోణాలు www.freegurukul.org/g/Vemana-11

బొమ్మల యోగి వేమన www.freegurukul.org/g/Vemana-12

ప్రజాకవి వేమన www.freegurukul.org/g/Vemana-13

వేమన్న - సర్వజ్ఞులు www.freegurukul.org/g/Vemana-14

భారతీయ సాహిత్య నిర్మాతలు www.freegurukul.org/g/Vemana-15

వినురవేమ నీతికథలు www.freegurukul.org/g/Vemana-16

ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

Video మేము సినిమాలో, ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు బేబిని ఎలా ఎడ్యుకేట్ చేసారో వివరించిన సన్నివేషం

Saturday, July 30, 2022

రమణోపదేశం... అదే ధ్యాన ఫలం....

రమణోపదేశం

రమణుల ఉపదేశం సరళ గంభీరం. కర్తతో ప్రారంభమై కర్మ విచారణ సాగి ఆత్మవిచారంతో ముగిసే వారి ఉపదేశాలసారం అమృతతుల్యం. మనిషి ఏ కర్మ చేసినా దాన్ని భగవదర్పితం చేయాలి. సమర్పణవల్ల బంధం దూరమ్తైపోతుంది. బంధం లేనప్పుడు వియోగం ఉండదు. కర్మలు నిస్వార్థంగా ఉండాలి. స్వార్ధరహిత కర్మలే ఆనందాన్ని పంచుతాయి. ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు రమణులు ఇలా చెప్పారు- శరీరం, వాక్కు మనసు... ఈ మూడింటినీ సాధకుడు తన సాధనలో జాగ్రత్తగా వాడుకోవాలి. శరీరం ద్వారా పూజ చేయాలి. వాక్కుతో జపం చేయాలి. మనసుతో చింతన చేయాలి. దేహంకన్నా వాక్కు, దానికన్నా మనసు, తద్వారా జరిగే పూజ, జపం, చింతనల్లో ఒకదానికంటే మరొకటి ఉత్తమమైనవి. పూజ అంటే దేవుడి ముందు కూర్చుని పత్రి, పువ్వు వెయ్యడమే కాదు. సమస్త జగత్తును పరమేశ్వర రూపంగా భావించాలి. రమణుల బోధ ప్రకారం- మొదట ఏదైనా మంత్రాన్ని బిగ్గరగా పలుకుతూ అటుపై దానికన్నా మంద్రస్థాయిలో అనుకొంటూ ఆ తరవాత మౌనాన్ని ఆశ్రయించి సాగించే ధ్యానం సర్వోత్కృష్టమైనది. ఉత్తమమైన ధ్యానం వల్ల కోరికల తీవ్రత క్రమేపీ నశించి ఆలోచనా ప్రవాహపు ఒరవడి తగ్గి నిశ్చల స్థితి కలుగుతుంది. ధ్యానం వల్ల మనసు మన అధీనంలోనే ఉంటుంది. ఒకసారి అంతర్ముఖ స్థితి కలిగితే బాహ్య వస్తువులపై ఆశ నశిస్తుంది. అదే ధ్యాన ఫలం.



మందు తాగిన గంట తర్వాత

 మందు తాగిన గంట తర్వాత

మందు తాగాక ఓ పదినిమిషాల్లోనే మనిషికి మత్తు తెలిసిపోతుంది. మనసుకి మత్తు తెలుస్తోంది అంటే, మన రక్తంలో ఆల్కహాల్ నిల్వలు పెరిగిపోయాయని అర్థం. ఇలా ఓ గంటా గంటన్నర గడిచిన తర్వాత శరీరంలోని ప్రతి అవయవమూ ప్రభావితం అవుతుంది. అదెలాగంటే...

కిడ్నీలు

మద్యానికి diuretic అనే స్వభావం ఉంది. అంటే మన ఒంట్లోని నీటిని నిలవ ఉంచకుండా బయటకు పంపేస్తుందన్నమాట. దీనివల్ల నీటిలో పాటుగా శరీరంలోని ముఖ్యమైన ఖనిజాలు కూడా మూత్రం ద్వారా బయటకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా మనిషి నీరసించిపోతాడు. అతని మెదడులోని నీటిశాతం కూడా తగ్గిపోతే ఫిట్స్ వచ్చే ప్రమాదమూ ఉంటుంది.

మెదడు

ఆల్కహాల్ మెదడు మీద చాలా తీవ్రంగా పనిచేస్తుంది. నిర్ణయం తీసుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి తగ్గిపోతాయి. అలాంటి స్థితిలో మనిషి ఎంతటి ఉన్మాదానికైనా పాల్పడేందుకు సిద్ధంగా ఉంటాడు. మెదడులోని వేర్వేరు వ్యవస్థల మధ్య సమన్వయం కొరవడుతుంది. మందు తాగిన వెంటనే కొందరు వాంతులు చేసుకోవడానికి కారణం ఇదే!

లివర్ (కాలేయం)

లివర్ ఒంట్లోని చెడు పదార్థాలను వేరుచేసే ఫిల్టర్లాగా పనిచేస్తుంది. అందుకే శరీరంలోకి మద్యం చేరగానే లివర్ మీదే ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి క్రమేపీదాని పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. ఫ్యాటీ లివర్, లివర్ సిరోసిస్ లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఒకోసారి లివర్ పూర్తిగా దెబ్బతినేదాకా ఈ వ్యాధి ఉందని బయటపడదు. వ్యాధిని గుర్తించే సమయానికి అది చేతులు దాటిపోయి ఉండవచ్చు!

ఊపిరితిత్తులు

మన ఊపిరి తీసుకునేటప్పుడు, ఆహారం తినేటప్పుడు ఊపిరితిత్తులు చాలా జాగ్రత్తగా పనిచేస్తాయి. కానీ రక్తంలోని అల్కహాల్ మోతాదు దాటినప్పుడు ఈ పనితీరు మందగిస్తుంది. ఫలితంగా పొలమారడం, వాంతులు లాంటి సమస్యలు రావచ్చు. ఊపిరితిత్తులలోని కఫం పేరుకుపోయి న్యుమోనియా వంటి రోగాలకు దారితీయవచ్చు.

జీర్ణవ్యవస్థ

మద్యం మన పేగులలోని పైపూతని దెబ్బతీస్తుంది. దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా కడుపు ఉబ్బరంగా ఉండటం, గ్యాస్, అల్సర్, విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడతాయి. తిన్న ఆహారంలోని పోషకాలు కూడా సరిగ్గా ఒంటికి పట్టవు.

పాంక్రియాస్

మన శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని చూసుకునే అవయవం పాంక్రియాస్. మద్యం మోతాదు మించినప్పుడు ఈ పాంక్రియాస్ పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా శరీరంలోని షుగర్ నిల్వలు ఒక్కసారిగా పడిపోతాయి. చేతులు వణకడం, చెమటలు పట్టడం, కళ్లు అదేపనిగా తిరగడం లాంటి సమస్యలు ఇలా వచ్చేవే! ఆలస్యం చేస్తే మెదడు కూడా దెబ్బతింటుంది.

నాడీవ్యవస్థ

మందు పుచ్చుకున్న కాసేపటికి చేతులూకాళ్లూ తిమ్మర్లు ఎక్కడం, మాట తడబడటం, తూలిపోవడం లాంటి లక్షణాలు గ్రహించవచ్చు. ఇదంతా కూడా మన నాడీవ్యవస్థ మీద ఆల్కహాల్ చూపే ప్రభావమే! మందు తాగాక ఎట్టిపరిస్థితుల్లోనూ బండి నడపకూడదని చెప్పేది కూడా ఇందుకే!

ఆడవాళ్లకి నిజంగా ఏం కావాలి?

 ఆడవాళ్లకి నిజంగా ఏం కావాలి?

అనగనగా ఆర్ధర్ అని ఒక రాజు ఉండేవాడు. యువకుడు, అందగాడు, తెలివైనవాడు అయిన ఆ రాజంటే, రాజ్యంలో అందరికీ ఇష్టమే. అలాంటి ఆర్ధర్కి అనుకోని కష్టం ఎదురైంది. ఆర్థర్కంటే గొప్ప చక్రవర్తి ఒకరు, ఆర్థర్ రాజ్యం మీద దాడిచేశాడు. అతని మహాసైన్యం ముందు ఆర్థర్ పరాక్రమం ఏమాత్రం నిలవలేదు. ఆ చక్రవర్తి సైనికులు ఆర్థర్ని బంధించి తమ చక్రవర్తి ఎదుట ప్రవేశపెట్టారు.

ఆర్థర్ని ఓడించిన చక్రవర్తి కూడా సామాన్యుడు కాడు. సైనికబలంతో పాటుగా అపారమైన మేథస్సు అతని సొంతం. తన ముందు సంకెళ్లతో నిలబడి ఉన్న ఆర్థర్ ప్రతిభ అతనికి తెలియంది కాదు. ‘‘నీ సామర్థ్యం తెలిసినవాడిని కనుక నీకు మరణశిక్ష విధించాలనుకోవడం లేదు. అయితే ఇందుకు ఒక షరతు. నన్ను ఎప్పటి నుంచో ఒక ప్రశ్న వేధిస్తోంది. నువ్వు కనుక ఆ ప్రశ్నకి బదులు చెప్పగలిగితే నీ రాజ్యాన్ని నీకు తిరిగి అప్పగించేస్తాను. మరోసారి ఈ రాజ్యం వంక కన్నెత్తి కూడా చూడను. కానీ ఒక్క ఏడాదిలో కనుక నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతే, నీకు మరణదండను తప్పదు.’’ అని ఆర్థర్కి ఒక షరతు పెట్టాడు ఆ చక్రవర్తి.

చక్రవర్తి మాటలు విన్న ఆర్థర్కు చెప్పలేనంత సంతోషం కలిగింది. ‘‘ఇంతకీ మీ ప్రశ్న ఏమిటో చెప్పారు కాదు?’’ అని ఉత్సాహంగా అడిగాడు.

‘‘ఆడవాళ్లు నిజంగా కోరుకునేది ఏమిటి? అన్నదే నన్ను వేధిస్తున్న ప్రశ్న. దీనికి ఎలాంటి సందేహానికీ తావు లేనటువంటి సమాధానం నాకు కావాలి.’’ అని సెలవిచ్చాడు చక్రవర్తి.

‘ఓస్ ఇంతే కదా! దీనికి ఏడాది సమయం ఎందుకు. ఒక్క రోజులో సమాధానం చెప్పేయగలను,’ అనుకున్నాడు ఆర్థర్. కానీ తన అంతఃపురానికి వెళ్లి ఎంతగా ఆలోచించినా తగిన సమాధానం తట్టనేలేదు. డబ్బు, హోదా, బంగారం, సంతానం, భవంతులు, ఆరోగ్యం.... ఇలా ఏ ఒక్కదాన్ని ఎంచుకున్నా మిగతావి లోటుగా కనిపిస్తున్నాయి. తనకు దక్కిన ప్రశ్నకు జవాబు కోసం ఆర్థర్ రాజ్యంలో తనకి తెలిసిన ప్రతి ఒక్కరినీ కదిపి చూశాడు. తన మంత్రులను, సామంతులను, స్నేహితులను, పండితులను అందరినీ అడిగి చూశాడు. ప్చ్! ఎవ్వరి దగ్గరా అతనికి తృప్తి కలిగించే జవాబు దక్కనే లేదు. ఇంతలో ‘ఈ రాజధాని శివార్లలో ఒక మంత్రగత్తె ఉంది. ఆమె దగ్గర ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం లభిస్తుందని చెబుతారు. కానీ మన సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆమె కోరినంత మూల్యం చెల్లించి తీరాలి,’ అని విన్నాడు ఆర్థర్.

ఆ మంత్రగత్తెను కలవడం ఆర్థర్కు ఇష్టం లేదు. కానీ ఏం చేసేది! అతనికి విధించిన గడువు మరొక్క రోజులో ముగిసిపోనుంది. దాంతో ఇక చివరి అస్త్రంగా మంత్రగత్తె దగ్గరకి వెళ్లక తప్పలేదు. ఆర్థర్ సందేహాన్ని విన్న మంత్రగత్తె తనకి జవాబు తెలిసినట్లుగా ఓ చిరునవ్వు నవ్వింది. ‘‘నీ ప్రశ్నకి నేను జవాబు చెబుతాను. మరి నాకు కావల్సినది నువ్వు ఇస్తావా!’’ అని అడిగింది. ఆర్థర్కి సరే అనక తప్పలేదు.

‘‘ఆడది తన జీవితం మీద తనకే అధికారం ఉండాలని అనుకుంటుంది. ఆ గౌరవం ఆమెకి దక్కని రోజున, నువ్వు ఆమెకి ఏమిచ్చినా దండగే! తన వ్యక్తిత్వానికి విలువ లేని చోట ఆమెకి ఏమిచ్చినా... తన మనసులో లోటుని పూడ్చలేవు.,’’ అని చెప్పింది మంత్రగత్తె.

మంత్రగత్తె చెప్పిన జవాబు ఆర్థర్కి చాలాబాగా నచ్చింది. ‘‘నీ జవాబు చాలా బాగుంది. ఇది తప్పకుండా ఆ చక్రవర్తిని తృప్తి పరుస్తుంది. మరి ఇందుకు బదులుగా నీకేం కావాలి?’’ అని అడిగాడు ఆర్థర్.

‘‘మరేం లేదు! నీ జీవితంలో ఎందరో స్త్రీలు ఉంటారు. తల్లి, భార్య, చెల్లి, కూతురు.... ఇలా ఎందరో ఆడవారితో నీ జీవితాన్ని పంచుకుంటావు. నేను ఇందాక చెప్పిన జవాబుని వారికి అన్వయించు చాలు. వారికంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుందని, తనదైన మనసు ఉంటుందని గుర్తించి గౌరవించు. హద్దులు దాటి వారి జీవితాలను కూడా నువ్వే శాసించాలని ప్రయత్నించవద్దు. ఇదే నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం,’’ అని చెప్పింది.

సైన్స్ ద్వారా ప్రయోగశాలలో తయారు చేయబడింది అంతా శరీరానికి హానికరం!

 సోనాలి బెంద్రే - క్యాన్సర్
 అజయ్ దేవ్‌గన్ - లిటరల్ ఎపికొండైలిటిస్
 (తీవ్రమైన భుజం వ్యాధి)
 ఇర్ఫాన్ ఖాన్ - క్యాన్సర్
 మనీషా కొయిరాలా - క్యాన్సర్
 యువరాజ్ సింగ్ - క్యాన్సర్
 సైఫ్ అలీ ఖాన్ - గుండెపోటు
 హృతిక్ రోషన్ - బ్రెయిన్ క్లాట్
 అనురాగ్ బసు - రక్త క్యాన్సర్
 ముంతాజ్ - రొమ్ము క్యాన్సర్
 షారుఖ్ ఖాన్ - 8 శస్త్రచికిత్సలు
 (మోకాలి, మోచేయి, భుజం మొదలైనవి)
 తాహిరా కశ్యప్ (ఆయుష్మాన్ ఖురానా భార్య) - క్యాన్సర్
 రాకేశ్ రోషన్ - గొంతు క్యాన్సర్
 లిసా రాయ్ - క్యాన్సర్
 రాజేష్ ఖన్నా - క్యాన్సర్,
 వినోద్ ఖన్నా - క్యాన్సర్
 నర్గిస్ - క్యాన్సర్
 ఫిరోజ్ ఖాన్ - క్యాన్సర్
 టోమ్ బలిపీఠం - క్యాన్సర్ ...
 ఈ వ్యక్తులు లేదా వారు
 డబ్బు కొరత లేని వారు!
 డైటీషియన్ సలహా మేరకు ఎల్లప్పుడూ ఆహారం తీసుకుంటారు.
ఎసిలో నివసించేవారు మరియు బిస్లెరి నీరు త్రాగేవారు.
 జిమ్‌కు కూడా వెళ్తారు.
 రోజూ అన్ని శరీర పరీక్షలకు చేయించుకుంటారు.
 ప్రతి ఒక్కరికి వారి స్వంత అర్హత కలిగిన వైద్యుడు ఉన్నారు.
 ఇప్పుడు అన్నిటి తరువాత ఒక ప్రశ్న తలెత్తుతుంది
 అతని శరీరంపై చాలా శ్రద్ధ ఉన్నప్పటికీ, అతను అకస్మాత్తుగా ఇంత తీవ్రమైన అనారోగ్యం ఎలా పొందాడు.
 ఎందుకంటే సహజమైన వస్తువులను ఉపయోగించడం
 వారు చాలా తక్కువగా చేశారు.
 లేదా అస్సలు చేయలేదు.
 ప్రకృతి మనకు 
 ఇది ఎప్పటికీ హాని కలిగించదు కాబట్టి తీసుకోండి.
 ఏదైనా సహజ ఫలo, తినండి,లేదా త్రాగండి,
శరీరానికి ఎటువంటి హాని జరుగదు
 మనం ఈ భూమిని కలుషితం చేయకపోతే, 
  భూమి నుండి బయటకు వచ్చిన నీరు, చాలా
  నాణ్యత బాగుంటుంది.
 మీరు, పుట్టినప్పటి నుండి మీ పిల్లవాడిని అలాంటి ప్రదేశంలో ఉంచండి
 ఒక్క సూక్ష్మక్రిమి లేని చోట.
 పెరిగిన తరువాత, సాధారణ ప్రదేశంలో నివసించడానికి వదిలివేయండి,
 ఆ పిల్లవాడు సాధారణ జ్వరాన్ని కూడా భరించలేడు!
 ఎందుకంటే అతని శరీరం యొక్క నాడీ వ్యవస్థ సూక్ష్మక్రిములతో పోరాడటానికి అభివృద్ధి చెందలేదు.
 కంపెనీలు ప్రజలను చాలా భయపెట్టాయి,
 మీరు ఒక రోజు సబ్బుతో స్నానం చేయకపోతే, మీరు సూక్ష్మక్రిములతో చుట్టుముట్టబడతారు మరియు సాయంత్రం నాటికి మీరు చనిపోతారు.
 మనం ఎక్కడ నివసిస్తున్నామో అర్థం కావడం లేదు.
 ఒకరితో ఒకరు కరచాలనం చేసిన తరువాత ప్రజలు
 మేము శానిటైజర్ను వర్తింపజేయడం చూస్తాము.
 మనిషి ఆలోచిస్తున్నాడు - మనం డబ్బు ఆధారంగా జీవితాన్ని గడుపుతాము.
 మీరు ఎప్పుడైనా గమనించారా -
 పిజ్జా బర్గర్ సిటీ పీపుల్
 జ్వరంలో భూమి తిరగడం ప్రారంభిస్తుంది.
 పాలు పెరుగు మజ్జిగ అంటే ఇష్టం
 గ్రామంలో వృద్ధులకి అదే జ్వరం, మందులు లేకుండా నయమవుతుంది.
 ఎందుకంటే వారికి డాక్టర్ స్వభావం ఉంటుంది.
 ఎందుకంటే వారు ఇప్పటికే సాదా ఆహారాన్ని తింటారు.
 సహజ విషయాలను స్వీకరించండి!
 సైన్స్ ద్వారా ప్రయోగశాలలో తయారు చేయబడింది
 అంతా శరీరానికి హానికరం!
 డబ్బు ఎప్పుడూ ఆరోగ్యం మరియు ఆనందాన్ని కలిగించదు.
 మళ్ళీ వెళ్దాం_
 * ప్రకృతి వైపు ... * (true translation)

మనలోనే తృప్తి, శాంతి సహజంగా ఉన్నప్పుడు మరి వెంపర్లాడటం ఏమిటి ?

 🙏🕉🙏 *"శ్రీ"*

        💖💖 *"213"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

*"మనలోనే తృప్తి, శాంతి సహజంగా ఉన్నప్పుడు మరి వెంపర్లాడటం ఏమిటి ?"*

*""జ్ఞానం అంటే ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియటం. జీవితంలో మనం కోరుకునే తృప్తి, శాంతి మనలోనే సిద్ధంగా ఉన్నప్పటికీ అజ్ఞానం వలన వెంపర్లాడటం జరుగుతుంది. మెలకువలో నిజమనిపిస్తున్న వరకూ అనేక భావాలతో ఉండే మనసుకి సుషుప్తిలో ఉనికి ఉండటంలేదు. మనకు ఇప్పుడు అనుభవంలో లేని ఆత్మ గురించి విచారణ చేయలేము. కనుక మనకి అనుభవంలో ఉన్న దేహం గురించి, ఆ అనుభవాలను పొందే మనసును గురించి విచారించి సత్యాన్ని అర్ధం చేసుకోవాలి. అజ్ఞానం వీడేవరకు వెంపర్లాట ఉంటుంది !*

*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*

భోగభాగ్యములు ఎంత సంపాదించుకొని ఏమి ప్రయోజనం?! భోగములన్నీ రోగములు. సేవలన్నీ యోగములు.

 *🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*

*_🌴" సాధన అంటే జపధ్యానాదులూ, దండకములూ, పఠించడం కాదు. సేవయే నిజమైన సాధన. సేవ కోసం మీ సంసారాలను విసర్జించమని గాని, ఉద్యోగాలను, ఆస్తిపాస్తులను వదలిపెట్టమని గాని దైవము చెప్పలేదు. దినమునకు ఇరవై నాల్గు గంటలలో ఒక్క అరగంట సేవ చేయడానికి ఎందుకు సాధ్యం కాదు? ప్రభుత్వంకోసం, వారిచ్చే డబ్బుకోసం ఎనిమిది గంటలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అయితే, భగవదనుగ్రహానికి ఇంత, అంత అని హద్దు లేదు. మీరు చేసినదానికంతా మీ పేరున ఒక పెద్ద నిధి ఏర్పడుతుంది. వ్యాపారం ద్వారా, ఉద్యోగంద్వారా ధనం సంపాదించుకొంటున్నట్లుగానే మీరు న్యాయంగా జీవిస్తూ సేవాకార్యంలో నిమగ్నమైనప్పుడు దానికి మించిన దైవానుగ్రహ ధనం మీకు ప్రాప్తిస్తుంది. ఇట్టి అనుగ్రహ ధనమును మీరు సంపాదించుకోవాలిగాని, తుచ్ఛమైన భోగభాగ్యములు ఎంత సంపాదించుకొని ఏమి ప్రయోజనం?! భోగములన్నీ రోగములు. సేవలన్నీ యోగములు."🌴_* 

నిరంతర దైవ చింతన - సత్కర్మ ఆచరణ - వల్ల లాభమేమిటి?

 *నిరంతర దైవ చింతన - సత్కర్మ ఆచరణ - వల్ల లాభమేమిటి?*

ఈరోజు ఈ ప్రశ్న అందరికీ, అర్థం కానిదనే చెప్పాలి, కొంతమంది, ఇలాంటివి, ఇప్పుడెందుకు అని, మరి కొంతమంది, రిటైర్డ్ అయ్యాక చేయొచ్చు కదా అని, వాదిస్తుంటారు...

     పవిత్ర సంస్కారములవైపే మానవుని మనస్సులో సంచలనము తీవ్ర ముగా కలుగు చుండవలెను...

ఎలా...!!!

రాతిపైన 20 సుత్తి దెబ్బలు కొట్టి నను, అది పగులక ఉండును...

21 వ దెబ్బకు అది పగిలి పోవును, మరి ముందు కొట్టిన 20 దెబ్బలు వ్యర్ధమైనట్లా?...

కాదు, కాదు, చివరి దెబ్బ యొక్క సఫలతకు మిగిలిన దెబ్బలు తోడ్పడినవి, అని అర్థం...

నిరంతరమూ, లోపలా బైటా అనంతమైన సృష్టి వ్యాపించి యున్నది...

ఈ సృష్టి లో మనస్సు పోరాటము సాగిస్తూనే ఉన్నది, ఎప్పుడూ జయము  కలుగుతుందని చెప్పలేము,

కానీ నిరంతర సత్కర్మలనాచరిస్తూ ఉన్నప్పుడు, సదా ఈశ్వర ప్రేమతో హృదయమునిండి, ఆ ప్రేమ జీవితమున అనుభవించి నపుడు నిత్యానందము పొందగలము...

సదా ఈశ్వర స్మరణ వలన సత్కర్మలు, అప్రయత్నంగా జరుగుచుండును...

ఆ నిరంతర ప్రయత్నములో ఏదో ఒక  సత్కర్మ అను దెబ్బ తోనే మనో నాశనమగును, అంతకు ముందు చేసిన సత్కర్మలేవియూ వృధాకావు, దీనికి పరమేశ్వరుడే మన రక్షకుడని విశ్వాసము ఉండవలెను...

బిడ్డలో ధైర్యమును పెంచుటకు, తల్లి బిడ్డను వదిలినా, పడనీయదు...

వెంటనే వచ్చి ఎత్తుకొనును, అలానే ఈశ్వరుడు కూడా నిరంతరము జీవునిపైనే దృష్టి ఉంచి, గాలి పఠం యొక్క దారము వలె తన చేతిలో ఉంచుకొనును...

నిరనిరంతర చింతన అనే ప్రేమ పాశము భగవంతుని, ఎడబాయక దైవమును జ్ఞప్తికి తెచ్చుచుండును...

*🍀🙏సర్వం శ్రీ అరుణాచల శివార్పణమస్తు🙏🍀*

సహనమే.. సాధకునికి సంజీవని

 ,సహనమే.. సాధకునికి సంజీవని

🌷🌷🌳🕉🌳🌷🌷

సహనం అనేది మానవునికి అత్యంత ప్రధానమైన లక్షణంగా భాసించాలి. సహనం విజయానికి ప్రధానమైన కారణంగా ఎన్నోసందర్భాల్లో నిలుస్తుంది. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు ఎటువంటి ఒత్తిడికీ లోను కాకుండా, విజయం వైపు సాగడమే సహనానికున్న ఔన్నత్యం.. సహనం అనే గుణం మానవునికి విలువైన ఆభరణం వంటిది.

సహనం అంటే క్షమ, ఓర్పు అని కూడా చెప్పవచ్చు. సహనంగా ఉండడం అనేది మనిషిలోని స్థితప్రజ్ఞతకు నిదర్శనం. సహనంగా ఉండడాన్ని అసమర్థతకు నిదర్శనంగా భావించరాదు. ‘‘అణిగి మణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు’’ అన్న మాటను మనం తరచూ వింటూనే ఉంటాం కదా..!!

లౌకికంగా జీవితంలో చేసే ప్రయత్నం, కృషి, ఆలోచనా ధోరణి ఎంత అవసరమో, దారిలో వచ్చే కష్టాలనూ, యాతనలనూ భరించడం, సహనాన్ని కోల్పోకుండా ఉండడం మనిషిని ఉన్నత స్థితికి తీసుకు వెళతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఒకానొక గురుకులంలో ఒక శిష్యుడు తోటివారితోనూ, గురువుగారితోనూ ఎంతో అసహనంగా ప్రవర్తించేవాడు. గురువు చెప్పిన విషయాలను పూర్తిగా వినకుండానే తనకు తోచిన రీతిలో దురుసుగా మాటలు మాట్లాడడం, వింతైన భాష్యాలను చెప్పడం అతని నైజంగా ఉండేది. గురువుగారు అతని ప్రవర్తనకు ఎంతగానో విసిగిపోవడమే గాక, ఒకింత ఆవేదనకూ గురయ్యేవారు. సహనంగా వ్యవహరించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని అతనికి తెలియచెప్పాలని ఆయన నిర్ణయించుకున్నారు.

ఒకసారి గురువుగారు తన శిష్యులతో కలిసి అడవిలో ప్రయాణిస్తున్నాడు. అప్పుడే పెద్దగా వాన కురిసి, వెలిసింది. వాతావరణం చల్లగా ఉంది. ఆయన ఒక శిష్యునితో ‘‘నాయనా.. కొంచెం పక్కనే పారుతున్న సెలయేటిలోని నీరు తీసుకుని వస్తావా.. దాహాన్ని తీర్చుకుందాం’’ అనడంతో శిష్యుడు సెలయేటి చెంతకు వెళ్ళి తిరిగివచ్చాడు. ‘‘గురువర్యా.. ఆ నీళ్ళు బురదగా ఉన్నాయి. తాగడానికి ఏమాత్రం బావుండవు’’ అన్నాడు. మళ్ళీ కాసేపటి తర్వాత గురువు గారు అతన్ని సెలయేటి దగ్గరకు పంపడం, మళ్ళీ అదే సమాధానం చెప్పడం జరిగింది. రెండు మూడుసార్లు ఆ విధంగా జరిగాక, శిష్యుడు చివరకు ఆనందంగా నీటితో తిరిగి వచ్చాడు. ‘‘గురువుగారూ.. ఇప్పుడు నీళ్ళు స్వచ్ఛంగా ఉన్నాయి. అందుకే తాగడానికి తెచ్చాను’’ అన్నాడు.

గురువుగారు అతని వైపు చూస్తూ, ‘‘నాయనా.. మనమంతా కొంత సమయం సహనంతో వేచి ఉన్నాం. అందుకే నీళ్ళు మామూలుగా ఉన్నాయి. మనం వేచి ఉన్న సమయాన నీటిలోని బురద స్వయంగా స్థిరపడింది. అందుకే ఇప్పుడు నీవు తెచ్చిన నీరు ఎంతో నిర్మలంగా ఉంది. మీ మనస్సు కూడా అలాంటిదే! ఇది ఆలోచనలనే బురదతో నిండి ఉన్నప్పుడు, మీరు దానిని తొట్రుపాటుకు లోను కాకుండా అలానే ఉంచాలి. మనసుకూ స్థిరపడడానికి కొంత సమయం అవసరం. అసహనానికి గురికావడంవల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. నీటిద్వారా నీవు తెలుసుకున్న ఉదాహరణే సహనంతో వర్తిస్తూ, విజయమార్గాన సాగడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది’’ అని చెప్పగానే శిష్యునికి కనువిప్పు కలిగింది. నాటినుంచి సహనంగా ప్రవర్తించడం అలవరుచుకుని, జీవితాన్ని సుఖమయం చేసుకున్నాడు ఆ శిష్యుడు.

సహనం అనేది కొద్దిపాటి చేదుగానే ఉంటుంది. కానీ, సహనం యిచ్చే ఫలాలు ఎంతో మధురంగా ఉంటాయి. భూమాతకున్న సహనం ఎవరికుంది? ఎక్కడన్నా ఓటమి ఎదురైతే, క్రుంగిపోకుండా, ఓర్పును కలిగి ఉండాలి. ఓర్పు లేదా సహనం కలిగి ఉండడం అంటే,  కేవలం ఒక బొమ్మలాగా మూలన నిశ్సబ్దంగా కూర్చోవడం కాదు. తాను వేచి ఉన్న తరుణం రాలేదని గ్రహించి, వైఫల్యానికి దారితీసిన కారణాలను కూలంకషంగా అన్వేషించి, విజయపథానికి బాటలు వేసుకోవడమే సహనంలోని ఆంతర్యం.

ఏ రంగంలోనైనా విజయపతాకం ఎగురవేయాలంటే సహనంతోనే సాధ్యమని ఎన్నో చరితలు మనకు తెలుపుతాయి. కొందరు పరాక్రమించినా, కొందరు శాంతిమంత్రాన్ని పఠించినా, సహనంతో పోరాడడంతోనే ఆంగ్లేయుల చెరనుంచి మనకు విముక్తి లభించింది.

ప్రతి క్రీడాకారుడూ గుర్తుంచుకోవలసిన వ్యక్తిత్వం శ్రీ లంక మాజీ కెప్టెన్‌ మర్వన్‌ సొంతం. అంతర్జాతీయ క్రికెట్‌లో తాను ఆడిన తొలి 6 ఇన్నింగ్సులో 5 సార్లు సున్నా పరుగులు మాత్రమే సాధించి ఘోరంగా విఫలమైన మర్వన్, మరో ఇన్నింగ్సులో ఒక పరుగు సాధించాడు. అటువంటి ఆటతో ఆరంభించిన మర్వన్‌ ఎంతో సహనంతో  ఆటను కొనసాగించి, శ్రీ లంక జట్టుకు 4 ప్రపంచ కప్పుల్లో ప్రాతినిధ్యం వహించడమేగాక, జట్టుకు నాయకుడుగానూ వ్యవహరించడం గమనార్హం. ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో ఆటగానిగా స్వర్ణ పతకాన్ని సాధించి దేశానికే గర్వకారణమైన నీరజ్‌ చోప్రా ‘‘నైపుణ్యం ప్రతి ఆటగాడికీ అవసరమే. అయితే, పరాజయాన్ని తట్టుకుని, సహనంతో ముందుకు సాగడం వల్లనే, ఎవరికైనా విజయం సిద్ధిస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’’ అని పలికిన మాటలు అందరికీ ఆచరణీయమైనవే.

ఏ రంగంలోనైనా విజయపతాకం ఎగురవేయాలంటే సహనంతోనే సాధ్యమని ఎన్నో చరితలు మనకు తెలుపుతాయి. కొందరు పరాక్రమించినా, కొందరు శాంతిమంత్రాన్ని పఠించినా, సహనంతో పోరాడడంతోనే ఆంగ్లేయుల చెరనుంచి మనకు విముక్తి లభించింది. 

ఓం నమః శివాయ🙏 

గాఢనిద్రలో వేటితో పనిలేకుండానే శాంతి వస్తుంది, మెలకువలో అలా ఎందుకు సాధ్యం కావటంలేదు ?

 🙏🕉🙏 ...... *"శ్రీ"*


                 💖💖💖

       💖💖 *"292"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

     🌼💖🌼💖🌼💖🌼

           🌼💖🕉💖🌼

                 🌼💖🌼

                       🌼


*"గాఢనిద్రలో వేటితో పనిలేకుండానే శాంతి వస్తుంది, మెలకువలో అలా ఎందుకు సాధ్యం కావటంలేదు ?"*

**************************


*"గాఢనిద్రలో లభించే శాంతి మనలోని ఆత్మతత్వానికి నిదర్శనం. మనం శాంతి, తృప్తిని సుఖసంతోషాల ద్వారా పొందాలని అనుకుంటున్నాం. అందుకే శాంతి కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. అనుకున్న పనులు చేయటం ద్వారా, శరీరాన్ని సుఖంగా ఉంచడం ద్వారా మాత్రమే శాంతి కలుగుతుందని మన భావన. శరీరంతో అనుకున్నవి చేయగలిగినప్పుడు, మనసుతో ఇష్టమైన విషయాలు భావన చేయగలిగినప్పుడు కలిగే అనుభూతిని శాంతిగా భావిస్తున్నాం. నిజానికి శాంతి, తృప్తి మనలోని ఆత్మ సుగుణాలు. శరీర క్రియలతో, మనోభావాలతో పనిలేకుండా అవి మన సొంతం. పగలంతా అనేక శరీర క్రియలతో కష్టసుఖాలు అనుభవిస్తున్నాం. స్వప్నంలో దేహంతో పనిలేని అనేక మానసిక భావనలతో కూడిన సంతోష, దుఃఖాలను పొందుతున్నాం. నిద్రలో అప్రయత్నంగా శాంతి పొందటానికి అదే కారణం" !*


*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*

          🌼💖🌼💖🌼

                🌼🕉🌼

            

కర్మ క్షయానికి మరి కొన్ని మార్గాలు -

 🙏🕉🙏                     .......  "శ్రీ" 

                 

        🪷🪷  "52"  🪷🪷

🪷🪷  "కర్మ - జన్మ"  🪷🪷🪷


  కర్మ క్షయానికి మరి కొన్ని మార్గాలు - 1  

  1. దైవారాధన: 

  "దైవారాధన ఎవరు ఎందుకు చేసినా దాని ఫలితంగా పూర్వ జన్మార్జిత దుష్కర్మలు క్షయం అవుతాయి. ఆ దైవారాధన ఏ రూపంలోనైనా ఉండచ్చు. జపం, పూజ, యజ్ఞం, వ్రతం, దేవాలయ సందర్శనం, క్రతువు... ఇలా శాస్త్రంలో చెప్పిన ఏ రీతిలో ఉన్నా ఫలం లభిస్తుంది." 

  "ఆది శంకరాచార్య ప్రశ్నోత్తర మణిమాలలో ఇలా చెప్పారు." 

  కిం కర్మ కృత్వా న హి శోచనీయం?   

  ఏ కర్మ చేస్తే విచారించక్కర లేదు?  -  శివకేశవుల పూజ చేస్తే విచారించక్కర లేదు. 


  2. పుణ్య క్షేత్రాల దర్శనం, దీక్షలు: 

  "తీర్థాటనకి వెళ్ళినప్పుడు పూర్వపు రోజుల్లో కాలి నడకనో, ఎద్దుల బళ్ళ మీదో వెళ్ళేవారు. వేళకి భోజనం ఉండదు. కౄర మృగాలుండే అడవులు దాటి వెళ్ళాల్సి వచ్చేది." 

  "కటిక నేల మీద శయనం. ఎలాంటి ప్రాపంచిక లాభం రాని, దైవం కోసం స్వచ్ఛందంగా పడే ఈ శారీరక కష్టాల వల్ల, కర్మ ఫలంగా అనుభవించాల్సిన రాబోయే శారీరక కష్టాలు రద్దవుతాయి అని పెద్దలు చెప్తారు." 

 "పూర్వకాలంలో తీర్థయాత్రల వల్ల ఈ అదనపు లాభం ఉండేది. ఇప్పుడు సౌకర్యాలు పెరిగి శరీరం అంతగా అలవదు. ఈ రోజుకీ మహారాష్ట్ర ప్రజలు ఏటా ఓ సారి కాలి నడకన పండరీపురానికి వెళ్తారు. దారిలో కటిక నేల మీద పడుకుంటూ వారు ఎంతదూరం అయినా ఇలా కాలి నడకనే గుంపులుగా వెళ్తారు. పుణ్య క్షేత్రాల దర్శనం వల్ల ఈ విధంగా శారీరకంగా అనుభవించాల్సిన దుష్కర్మల ఫలాలు రద్దవుతాయి." 

  "నాడి జ్యోతిష్యం చెప్పేవారు పాప పరిహారంగా కొన్ని పుణ్య క్షేత్రాలని సందర్శించమని చెప్పడం మనకి అనుభవమే." 


 శ్రీశైల శిఖరం దృష్ట్యా వారణాస్యాం మృతోధృవమ్   కేదారే హృదకం వీత్వా పునర్జన్మ న విద్యతే 

                                - పద్మ పురాణం 

  భావం:-  

  శ్రీశైలం శిఖర దర్శనం వల్ల, కాశీలో మరణం వల్ల, కేదార క్షేత్రంలోని నీటిని తాగడం వల్ల పునర్జన్మ లేక ముక్తి ప్రాప్తిస్తుంది. 


  3. ఆథ్యాత్మిక దీక్షలు:  

  "ఇలాగే ఆథ్యాత్మిక దీక్షల్లో పడే శారీరక శ్రమతో ఎంతో దుష్కర్మ క్షయం అవుతుంది. అయ్యప్పమాల దీక్ష, ఆలాంటి కఠినమైన ఇతర దీక్షలు మన పాపాలని క్షయం చేస్తాయి. తమిళనాడులో గుళ్ళల్లో పెట్టే పొర్లు దణ్ణాలు, భగ భగ మండే నిప్పుల మీద నడక మొదలైనవి కూడా శారీరక కష్టంతో కూడిన, తద్వారా దుష్కర్మలని రద్దు చేసే దైవారాధనలే." 

  4. శారీరక సేవ: 

  "ఇతరులకి శారీరకంగా చేసే సేవ వల్ల కూడా కర్మ క్షయం అవుతుంది. వెంకయ్య స్వామి దీన్ని గురించి ఇలా అనేవారు." 

  "అయ్యా! చేతుల్లో గీతలు అరిగేలా పని చేస్తే సద్గురువు మీ గీతల్ని మార్చి గీస్తాడు.” 

  5. హిత కర్మ: 

  "ఆది శంకరాచార్య ప్రశోత్తర మణిమాలలో నిజమైన కర్మ ఎలాంటిదో ఇలా చెప్పారు.  "సత్యం చ కిం భూతహితం సదైవః" యదార్ధమైన కర్మ ఏది? -  "ఎల్లప్పుడు పరులకి హితం చేయడమే యదార్ధ కర్మ." 

  "ముఖ్యంగా మనవల్ల ఎవరికైనా అపరాధం జరిగితే వారికి మనం సదా హితాన్ని చేస్తూండాలి. అందువల్ల అతను మన అపరాధాలని మనసా విస్మరిస్తే, అది మనం చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తం అయి ఆ కర్మ తొలగుతుంది." 

  6. పంచశాంతులు:  

‌  "పాపపరిహారం కోసం "పంచశాంతులు" నిర్దేశించబడ్డాయి. అవి..." 

1.  ఉపవాసం 
2.  జపం  
3.  మౌనం 
4.  పశ్చాత్తాపం  
5.  అన్నశాంతి 

1.  ఉపవాసం:-  

 "తీర్ధయాత్రలా ఉపవాసం కూడా శారీరక కష్టంతో కూడిన దైవారాధన. కష్టం పాప ఫలానుభవంగా వస్తుంది. కాబట్టి మనం స్వచ్చందంగా పాప పరిహారం కోసం చేసే ఉపవాసంతో అనుభవించే శారీరక కష్టం, ఆ మేరకి రాబోయే ప్రారబ్ద కష్టాలని తొలగిస్తుంది." 

 "వైష్ణవులకి ప్రతీ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం ఓ ప్రధాన దైవారాధన. ద్వాదశి ఘడియలు వచ్చాకే వారు ఉపవాస దీక్షని విరమిస్తారు. మన పెద్దలు కూడా ప్రాయశ్చిత్తంగా శాస్త్రంలో రెండు ఉపవాస వ్రతాలని నిర్దేశించారు. అవి -   కృఛ్ఛ్రము, చాంద్రాయణము.  

         🪷🪷  "53"  🪷🪷

🪷🪷  "కర్మ - జన్మ"  🪷🪷🪷


  కర్మ క్షయానికి మరి కొన్ని మార్గాలు - 2  


 ప్రాయ ఇతి శబ్దేన  దోషసంపాదనం చిత్త మితి 
 తాస్ర ప్రతిషేధః తస్మా త్ప్రాయశ్చిత్తమిత్యాచ్యతే 

 భావం:-   

  "ప్రాయ' అంటే, దోష సంపాదనం అని అర్ధం. 'చిత్తం' అంటే దాన్ని నివారించుకోవడం అని అర్ధం. 'ప్రాయశ్చిత్తం' అంటే దోషాన్ని నివారించుకోవడానికి చేసే కార్యక్రమం అని అర్ధం." 

  కృచ్చ వ్రతం:-  

  "ఈ వ్రతం ఆరంభించిన రోజునించి మూడు రోజుల దాకా మధ్యాహ్న సమయంలో పెద్ద నిమ్మకాయంత పరిమాణంలో ఇరవై ఆరు అన్నపు ముద్దలు తినాలి. ఉదయం రాత్రి ఏమీ తినకూడదు." 

 "తర్వాతి మూడు రోజులు సాయం కాలం మాత్రమే ముప్ఫై రెండు ముద్దలని, తర్వాతి మూడు రోజులు కోరకుండా లభించిన ఇరవై నాలుగు అన్నపు ముద్దలని తినాలి." 

 "ఆ తర్వాతి మూడు రోజులు కటిక ఉపవాసం ఉండాలి. ఈ విధంగా పన్నెండు రోజులు చేసే వ్రతాన్ని కృఛ్ఛ్ర వ్రతం అంటారు." 

  చాంద్రాయణ వ్రతం:  

  "చంద్రుని వృద్ధి క్షయాలని అనుసరించి ఆచరించే ప్రతం ఇది. ఇదీ ఉపవాసానికి సంబంధించిందే. ఈ వ్రతం అమావాస్య వెళ్ళిన తర్వాతి రోజు, అంటే శుక్ల పక్ష పాడ్యమి నించి ప్రారంభం అవుతుంది." 

 "పాడ్యమి రోజు కేవలం ఒకే ఒక్క అన్నం ముద్ద తినాలి. రెండో రోజు రెండు ముద్దలు, మూడో రోజు మూడు ముద్దలు, ఇలా పూర్ణిమ దాకా ప్రతీ రోజు ఒకో ముద్దని పెంచుకుంటూ తినాలి." 

  "అలా పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు తిని, మర్నాటి నించి కృష్ణ పక్ష పాడ్యమి దాకా ఒకో రోజు ఒకో ముద్దని తగ్గించుకుంటూ తినాలి. అమావాస్య రోజు కటిక ఉపవాసం ఉంటే చాంద్రాయణ వ్రతం ముగుస్తుంది." 

  "పరస్త్రీ పొందు, శాఖాహార మాంసాహార భక్షణం చేయడం లాంటి పాపాలని పోగొట్టుకోడానికి ఈ రెంటినీ ధర్మ శాస్త్రంలో పెద్దలు ఏర్పాటు చేసారు." 

  "ఓ ప్రముఖ స్వామి ఆశ్రమంలోని ఒకరు, ఆ ఆశ్రమంలోని పరస్త్రీని అనుభవించిన కారణంగా, ఆ పాపాన్ని పోగొట్టుకోవాలన్న తపనతో ఈ చాంద్రాయణ వ్రతాన్ని స్వచ్ఛందంగా, రహస్యంగా చేసి తీవ్ర అనారోగ్యానికి గురైన ఓ ఉదంతం ఈ పుస్తక రచయిత దృష్టికి వచ్చింది." 

  "కాబట్టి, వయసు పైబడ్డవారు, బి.పి, షుగర్ లాంటి వ్యాధులు గలవారు ఎవరూ కూడా వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ వ్రతాన్ని చేయకూడదు." 

  "ఋషికేశ్ లోని ముని-కి-రేతిలో గల అతి ప్రాచీన ఆశ్రమం అయిన కైలాసఆశ్రమంలో చేరిన బ్రహ్మచారులు అనుమతి లేకుండా ఆశ్రమం దాటి బయటకి పోకూడదు." 

 "అలా వెళ్తే, ముఖ్యంగా రాత్రి బయటే ఉంటే వారిని గోమూత్రంతో స్నానం చేయించి, శుద్ధి చేసి కాని తిరిగి ఆశ్రమంలోకి అడుగు పెట్టనివ్వరు. ఈ నిబంధనని కొన్నేళ్ళ క్రితం దాకా కఠినంగా పాటించేవారు." 

  "పంచగవ్యములు"  -:  "అనగా గోవు పేడ, మూత్రం, పాలు, పెరుగు, నెయ్యిలని కలిపి తినిపించి కూడా ప్రాయశ్చిత్తం చేస్తారు. రాత్రి లేదా పగలు నీళ్ళల్లో మెడ దాకా ముణిగి ఉండి ఉపవాసం చేస్తూ గడపటం కూడా ఓ ప్రాయశ్చిత్తం. ఒకటుంది." 

  "జైన మతంలో "నిర్జరం" అనే తీవ్ర ప్రాయశ్చిత్తం ఒకటి ఉంది.  కఠిన నిష్టతో అన్నాహారాలు మానేసి శరీరాన్ని శిధిలం చేసి దేహ త్యాగం చేయడమే నిర్జరం అనే ఈ ప్రాయశ్చిత్తం. మన పురాణాల్లో దీన్ని "ప్రాయోపవేశం" అంటారు." 

  "ఈ అన్ని ప్రాయశ్చిత్త పద్ధతులలో శారీరక కష్టాన్ని స్వచ్ఛందంగా అనుభవించి, తద్వారా కర్మఫలాన్ని స్వచ్ఛందంగా ముందే అనుభవించడం అవుతుంది."  

  "ఉద్దేశపూర్వకంగా జరిగిన పాప కర్మలకి ప్రాయశ్చిత్తం లేదని యాజ్ఞవల్క్యస్మృతి లో చెప్పబడింది (3-226)" 

 "అనాలోచితంగా జరిగినవి ప్రాయశ్చిత్తం ద్వారా పోవడం తేలిక. స్మృతులు రాసిన వారిలో ప్రాయశ్చిత్తం మీద ఏకాభిప్రాయం లేదు. కొందరు అవి పాపనిర్మూలనని చేయదని రాస్తే, మరి కొందరు చేస్తుందని రాసారు." 

 జానతాతుకృతమ్ పాపం గురుసర్వం భవత్యుత  
 అజ్ఞానాత్‌స్ఖలితే దోషే ప్రాయశ్చిత్తం విధీయతే 

                        - శాంతి పర్వం 36-41 

 భావం:-   

  ఉద్దేశపూర్వకంగా చేయబడిన దుష్కార్యాలు చాలా తీవ్రమైనవి. ఉద్దేశం లేకుండా అంటే యాదృచ్ఛికంగా చేయబడిన దుష్కార్యాలు తీవ్రములు కావు. వాటిని ప్రాయశ్చిత్తంతో నిరోధించవచ్చు. 


  "ఈ రోజు పంచశాంతులలో ఒకటైన ఉపవాసం గురించి తెలుసుకున్నాం."          

ధన సంపాదన కాదు గుణ సంపాదనే ద్యేయంగా పిల్లలను పెంచినపుడే అసలైన తల్లిదండ్రులు కాగలగుతారు అన్న విషయం ఎల్లపుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి.

 *🌺🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🏻🌺*




*_🌴మానవుని అభిరుచులు వారి వారి అభ్యాసముల మీద ఆధారపడి ఉంటాయి. ఎలా అంటే చేపలు అమ్మేవాడికి పూల వాసన గిట్టకపోవచ్చు. అలాగే పూవులమ్మేవాడికి చేపల వాసన గిట్టక పోవచ్చు దీనికి కారణం వారి వారి అభిరుచి అభ్యాసములే!. మన అభిరుచులు మన అలవాట్ల మీద, మనం పుట్టి పెరిగిన వాతావరణం మీద ఆధార పడి ఉంటాయి. కనుక తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యం నుండే మంచి అలవాట్లను అలవరచుకోవడం నేర్పుతుండాలి. వారిలో భగవంతునిపై ప్రేమ విశ్వాసాలు లేత వయసు నుండే పెంపొందించాలి. నిస్వార్థం, దయ, సేవాభావం వంటి సద్గుణాల కోసం సత్సంగానికి పంపుతుండాలి. ధన సంపాదన కాదు గుణ సంపాదనే ద్యేయంగా పిల్లలను పెంచినపుడే అసలైన తల్లిదండ్రులు కాగలగుతారు అన్న విషయం ఎల్లపుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి.🌴_* 

జ్ఞానం.....

 జ్ఞానం..... 

                  ➖➖➖

 వయసుతో నిమిత్తం లేకుండా చిన్న వయసులోనే పరిపూర్ణజ్ఞానం గలవారిని జ్ఞానవృద్ధులంటారు. 

 సాధారణంగా జీవితమంతా ఆర్జించిన అనుభవాలు వార్ధక్యజ్ఞానంగా పరిణతి చెందుతాయి. 

 అనుభవ జ్ఞానం అన్నింటికన్నా గొప్పదంటారు. కొందరికి పుట్టుకతో లభించే జ్ఞానం కూడా తక్కువేమీ కాదు. 

 అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి శిష్యులు ఉచ్చారణ దోషాలను ఎత్తి చూపి శాప గ్రస్తుడయ్యాడని కథ. 

 జ్ఞానం దైవ ప్రసాదం. వేదవ్యాసుడు సద్యోగర్భజనితుడు (ఆ క్షణంలోనే జన్మించిన వాడు). ఆయనకు కృష్ణ ద్వైపాయనుడనే పేరు కూడా ఉంది. పద్దెనిమిది పురాణాలు, మహాభారతం, భాగవతం వంటి దివ్యరచనలు చేసిన వ్యాసుడు ప్రాతఃస్మరణీయుడు. ఆయన విష్ణురూపుడు. మరణం లేని కాలాతీతుడు. త్రికాలవేది. జగద్గురువుల్లో ప్రసిద్ధుడు. ఆయన ఎవరి దగ్గరా శిష్యరికం చెయ్యని జన్మజ్ఞాని. 

 కొందరు ఏక సంథాగ్రాహులుగా ఉంటారు వారు అల్పకాలంలోనే అనల్పజ్ఞానం ఆర్జిస్తారు. గురువులను మించిపోతారు. గురు నానక్‌ దేవ్‌ అలాంటి అసమాన జ్ఞాని. సిక్కులు ఆయనను గురుపరమాత్మగా ఆరాధిస్తారు. మనలో కూడా కొందరు బాలమేధావులుంటారు. సంగీతం, నృత్యం వంటి కళా రంగాల్లో వారు ప్రసిద్ధులు. కానీ, వారి ప్రావీణ్యం ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. ఎవరి జ్ఞానం వృద్ధుల చేత గుర్తింపు పొంది గౌరవానికి నోచుకుంటుందో వారు వయసులో చిన్నవారైనా జ్ఞాన వృద్ధులుగా పేరొందుతారు. 

 ప్రపంచ సంపదలకు హెచ్చు తగ్గు లుంటాయి. జ్ఞాన సంపద పంచిన కొద్దీ పెరుగుతుంది. 

 విదురుడు కారణ జన్ముడు. జ్ఞాన వృద్ధుడిగా చెప్పదగిన వాడు. ధృతరాష్ట్రుడు వంటి వారికి నీతి బోధ చేసినవాడు.  అనేక ధర్మ సందేహాలను తీర్చిన ప్రాజ్ఞుడు. ఆయన బోధలు విదురనీతి పేరుతో లోక ప్రసిద్ధం. 

 జ్ఞానం ఆనందకారకం. హయగ్రీవ స్వామిని, దక్షిణామూర్తిని జ్ఞానానంద స్వరూపులుగా చెబుతారు.  

 దక్షిణామూర్తిని దీక్షగా చూస్తే చాలు.. జ్ఞానప్రసారం జరుగుతుందన్న కథ ఉంది. 

 ఏది అజ్ఞానమో తెలిపేది జ్ఞానం. అలౌకికమైన జ్ఞానమే ఆధ్యాత్మిక జీవితానికి ఆలంబనం. వెలుగు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమే వివేకం. క్షణభంగురమైన జీవితాన్ని శాశ్వతమని భ్రమించక సద్వినియోగం చేసుకోవడమే మనిషి కర్తవ్యం. 

 ఆదిశంకరులు ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్నప్పుడు ఒక చోట వృద్ధుడు వ్యాకరణం వల్లె వేస్తుంటాడు. ఆ క్షణంలోనే ఆయన భజగోవింద శ్లోకాలు ఆశువుగా చెప్పినట్లు కథ ప్రచారంలో ఉంది. ఆ వృద్ధ విద్యార్థితో ఆదిశంకరులు.. ‘ఓ మూఢుడా.. మృత్యుముఖంలో ఉన్నప్పుడు ఈ వ్యాకరణసూత్రాలు నీకు అక్కరకు రావు. గోవిందుణ్ని భజించు. నీకు మోక్షం లభిస్తుంది’ అంటారు. 

 ఈ సలహా అందరికీ వర్తిస్తుంది. భగవంతుడి సన్నిధికి చేర్చేది భక్తి మార్గమే.. శాస్త్ర జ్ఞానం కాదు. జ్ఞాన వృద్ధులు బాల్యం నుంచే భక్తి మార్గంలో స్థిరచిత్తులై ఉంటారు. భగవంతుడి గురించి సుబోధకం చేసేదే జ్ఞానం. అలాంటి జ్ఞాని ప్రపంచ మాయలో చిక్కుకోడు...


భక్తులు భగవంతునికి సమర్పించవలసినది....

 *🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*


భక్తులు భగవంతునికి సమర్పించవలసినది పువ్వులు, ఆకులు, పండ్లు మరియు ఇతర తినదగినవి కాదు! ఇవన్నీ తాత్కాలికమైనవి. మార్పు చెందేవి. మార్పు చెందనిది ఏదైతే ఉందో అది భగవంతునికి సమర్పించుకోవాలి. అదే మన హృదయం, మనస్సు. అయితే  మనస్సు నిండుగా కోరికలను నింపుకుని భగవంతునికి అర్పిస్తామంటే అది అంత సులువుగా కదలదు! మనస్సు అన్నింటినీ కాల్చివేసిన బూడిద వలె కోరికలు లేకుండా మరియు నిర్లిప్తంగా మారాలి. ఆ విధమైన స్వచ్ఛమైన మనస్సునే దేవుడికి అర్పించాలి. అదే సరైన నివేదనం..🌴

నిజమైన భక్తుని లక్షణం ఎలావుంటుంది

 నిజమైన భక్తుని లక్షణం ఎలావుంటుంది


నిజ భక్తులకు తన ఊహలు ఎప్పుడూ భగవంతుని పైనే ఉండును...

తన సౌఖ్యము, తన కష్టముల విషయమై తెలుసుకొనుటకు భక్తులకు సావకాశము ఉండదు...

వారికి భగవత్సాక్షాత్కారము తప్ప ఇంకొక విషయము స్ఫురించదు, అందుకు అవకాశము కూడా ఉండదు...


ఉదా:-

ఒక చిన్న పిల్లవాడు తన తల్లి కనపడక " అమ్మా, అమ్మా", అని ఏడ్చుచు ఆమె కోసం వెతుకును...

ఆమె కనిపించి వానిని యెత్తు కొనును, అప్పుడు ఆ పిల్లవాడు ఏడ్పు మాని విచారము లేకుండా ఉండును,

కానీ పిల్లవాడు, పూర్వము ఉన్న స్థితిని, అమ్మ ఒడిలో ఉన్న స్థితిని, తేడా గమనించవలసిన అవసరమే లేదు... ఆ ఊహే తనకింక అవసరముండదు...


అట్లే భగవంతుని సేవ, భగవంతుని చింతన, అనే మహాద్భాగ్యం దొరికిన తరువాత, వేరు చింతలు కష్టములు తాను తలంచడు...


ఇవన్నియూ దొరకనంత వరకే! దొరికిన తరువాత, అనుభవించుటకు చూచునే కానీ, పూర్వపు ఊహలను యోచించడు...


వారు ఎప్పుడూ, ఏది చెప్పినా, ఏది మాట్లాడినా, ఏమి చేసినా భగవద్ విషయాలే వుంటాయి, భగవద్ కథలే మాట్లాడుతారు, చేసే పనులు భగవద్ సంభదితమై వుంటాయి..,అలాంటివారికి భగవంతుఁడు చిరస్థాయిగా నిలిచి వుండే వరాలను ఇస్తూ అద్భుతమైన మహిమలను  వారి జీవితంలో చూపిస్తూ ఉంటాడు అలాంటి వారిని నిందించడం కానీ, హేళన చేయడం కానీ మహా పాపం, దానికి ప్రక్షాళన అనేది కూడా లేదు... తన భక్తుల రక్షణ స్వయంగా ఆ దేవదేవుడే చూస్తాడు. 

రాజకీయ పార్టీలని విమర్శించే ఆవేశంతో హిందూ మతాన్ని కించపరచటం మానుకోవాలి..

 మహమ్మద్ అయేషాని పెళ్లిచేసుకున్నప్పుడు ఆమె వయసు 6 ... 

ఇది చాలామంది ఇస్లాం మతబోధకులే ఒప్పుకున్నారు ... 

ఇదేం వివాదమని ? 

మహమ్మద్ అనే మనిషి  దేవుడు కాదు ,,

ఒక ప్రవక్త (?),సాయెబ్బు...

 జీసస్ లాగే .. 


బాబ్రీ మసీదు , జ్ఞాన వాపి మసీదులపై తీర్పులు సర్వేల అనంతరం .. 

మన అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతుందని ముస్లిములు అభధ్రతా భావంలో ఉన్నారు 

వారికి తమ పూర్వీకులు చేసిన అకృత్యాలు ,హత్యాకాండ ,

అత్యాచారాలు తెలియనివి కావు .. 

కొన్ని వేల గుళ్ళు మసీదులుగా నేటికీ ఉన్నాయి .. 


ఆరేళ్ళ పాపని పెళ్లి చేసుకున్నాడు మీ ప్రవక్త అనగానే తప్పు అనిపించినప్పుడు .. 

ఇస్లాం విస్తరణలో,

పవిత్ర యుద్ధాలు చేసి .. 

ఆయా హిందూ రాజ్యాలని ఆక్రమించి ..

 దేవాలయాలు కొల్లగొట్టిందే కాక ,, 

చెరబట్టిన అంతః పురంలో .. రాణిని , యువరాణిని , ఇతర సౌందర్యవతులను ఉంపుడుగత్తెలుగా సేనాధిపతులు పట్టుకుపోయి .. లైంగిక బానిసలుగా వాడి .. 

కొంతమంది పిల్లలు పుట్టగానే కింది స్థాయి సైనికులకు బహుమతిగా ఇస్తే ,, 

వారు కూడా అనుభవించి .. మరికొంతమంది పిల్లలు పుట్టగానే జీవచ్ఛవాలు గా మారిన హింధూ రాణులని ,, ఉంపుడు గత్తెల కొట్టంలో పశువుల మేపేవారిగాను ,

వాడుకున్నారని ,, 

మగవారిని చంపటమో, 

లేక అందంగా ఉన్న రాకుమారులను కూడా .. 

ఈ‌ తురకలు లైంగికంగా వేధించారని ,

మరి కొందరిని..

వృషణాలు చితకగొట్టి చంపారని ,,

 బతికినవారిని హిజ్దా గా మార్చి లైంగిక వికృతచర్యలకు పాల్పడ్డారని ..

బతుకుమీద ఆశతో మతం మారిన హిందువులతోనే .. మన మందిరాలు కూలదోసి .. దేవతా మూర్తులను కాలిమెట్లుగా వాడారని .. 

ముక్కలు చేసిన దేవతా మూర్తులపై నిలబడి వికృత చేష్టలు చేశారని.. 


తెలియని హిందూ జాతి *సెక్యులరిజం* అంటూ తమ ఉనికినే ప్రశ్నార్ధకం చేసుకుంటుంటే .. 

మిగిలిన కొందరిలో ...

 తమ చేవలుడుగిన తనాన్ని దాచేయటానికి ,

శాంతి అంటూ .. 

సెక్యులర్ జపం చేస్తుంటే ...

 బహుపితా పుత్ర సంత ,

సూకర సంత .. 

హిందూత్వంపై అవాకులు చావాకులు పేలుతూ ఉంటారు .. 

హిందూ జాతికి నేడు చరిత్ర తెలుసుకునే ఓపిక , సమయమూ రెండూ లేవు .. 

తురకల మాదిరిగా .. 

వారం వారం రెచ్చగొట్టే ప్రసంగాలు వినే అలవాటు లేదు .. 

అశోకుడు  భౌద్ధం స్వీకరించాక మౌర్య సామ్రాజ్యం పతనం మొదలయినట్టు .. 

చరిత్ర తెలుసుకోలేని ,

పిరికి సెక్యులర్ ..

హిందువుల వలన హిందూ ప్రాభవం పతనమైపోకూడదు ... 

ఏ రాజకీయ పార్టీనో మనల్ని కాపాడుతుందనే పిచ్చ హిందువులు ఉరితాళ్ళు సిద్ధంగా ఉంచుకున్నట్టే !


రాజకీయ పార్టీలని విమర్శించే ఆవేశంతో హిందూ మతాన్ని కించపరచటం మానుకోవాలి..


ప్రవచన కర్తలు, పురోహితులూ... దేవాలయ ధర్మ కర్తలు.. పుర పెద్దలు... సమన్వయం తో ధర్మ రక్షణ కొరకు మార్గ దర్శి ని రూపొందించాలి..

యువత కూడా.. 

నిద్ర లేచి ధర్మ రక్షణ కు పూనుకోవాలి...


🚩🚩🚩🙏🏻🚩🚩🚩

మన వంతు ప్రయత్నం లేకుండానే భారతదేశం స్వాధీనమవుతుంది. ముస్లింల పాలన లోకి వస్తుంది

 😢ఎంత #క్రూరమైన_ప్లాన్ వేశారో గమనించారా...!😢
"హిందూ బాలికల #గర్భాలలో మన యొక్క వీర్య #విత్తనాలను నాటండి"
"మన వంతు ప్రయత్నం లేకుండానే భారతదేశం స్వాధీనమవుతుంది.
ముస్లింల పాలన లోకి వస్తుంది" 
అని 1971లో జనరల్ టిక్కా ఖాన్, పూర్వపు తూర్పు పాకిస్తాన్, ప్రస్తుత బంగ్లాదేశ్‌లో అన్నారు.
ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన వాస్తవాలు.
 (మూలం : బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమంలో భారతదేశం యొక్క సహాయం, డాక్టర్ సలాం ఆజాద్).
పైన పేర్కొన్న ప్రకటన భారతదేశంలో #ఇస్లామీకరణ ప్రణాళికను 50 సం. ముందు నుండే అమలు చేస్తున్నారని స్పష్టం చేస్తుంది.
మీరు జాగ్రత్తగా గమనిస్తే, ప్రస్తుతం #బాలీవుడ్‌ లోని అన్ని సినిమాల్లోనూ ఎక్కువ మంది #హీరోలు ముస్లింలే కావడం గమనించవచ్చు!
మరియు దాదాపు వారి భార్యలందరూ #మతంమారిన_హిందూఅమ్మాయిలే! బాగా గమనించండి.
1. నవాబ్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ - షర్మిలా ఠాగూర్‌ను వివాహం చేసుకుని ఆమెను ముస్లిం మతం లోకి మార్చుకున్నారు.
2. గౌరీని పెళ్లి చేసుకుని ఆమె మతం మార్చుకునేలా చేసాడు షారుక్ ఖాన్ !
3. అమీర్ ఖాన్ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. అతని మొదటి భార్య రీమా దత్తా, అతని రెండవ భార్య కిరణ్ రావ్, ఇద్దరూ ముస్లింలుగా మతం మారారు! ఆలోచించండి హిందువులారా...!
4. సైఫ్ అలీ ఖాన్ పటౌడీ రెండుసార్లు వివాహం చేసుకున్నారు. మొదట అమృతా సింగ్,రెండవది కరీనా కపూర్, ఇద్దరూ ముస్లింలుగా మారారు.
అర్థం అవుతోందా...?
5. ఫర్హాన్ అక్తర్ హిందూ అమ్మాయి అయిన అధునా భవానిని వివాహం చేసుకుని ఆమె మతం మార్చాడు. 
6. ఫర్హాన్ అజ్మీ - ఆయేషా టకియా అనే హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ముస్లిం మతం లోకి మారవలసి వచ్చింది.
7. అమృత అరోరా - షకీల్ లడఖ్ అనే ముస్లిం యువకుడిని వివాహం చేసుకుని ఇస్లాం మతంలోకి మారింది.
8. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ - మలైకా అరోరాను వివాహం చేసుకుని ఆమెను ముస్లిం గా మార్చుకున్నాడు!
9. సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ మరో హిందూ అమ్మాయి సీమా సచ్‌దేవ్‌ను వివాహం చేసుకుని ఆమెను మతం మార్చాడు.
10. ఇమ్రాన్ ఖాన్, ఇతను అమీర్ ఖాన్ మేనల్లుడు. అవంతిక మల్లిక్ అనే మరో హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన మతం లోకి మార్చుకున్నాడు.
11. సంజయ్ ఖాన్ కుమారుడు జాయెద్ ఖాన్ హిందూ అమ్మాయి మల్లికా పరేఖ్‌ను వివాహం చేసుకున్నాడు.
12. ఫిరోజ్ ఖాన్ కుమారుడు ఫర్దీన్ ఖాన్‌కు నటాషా అనే హిందూ భార్య కూడా ఉంది.
13. ఇర్ఫాన్ ఖాన్ సుతాపా సిక్దర్ అనే మరో హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని ముస్లిం మతం లోకి మార్చుకున్నాడు.
14. రత్న పాఠక్ అనే ఆమె ముస్లింగా మారింది నసీరుద్దీన్ షా ను పెళ్లి చేసుకున్నాకే అని మీరు తెలుసుకోవాలి.
ఇస్లామీకరణ అనే మిషన్ ను 50సం. లుగా వాళ్ళు ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నారో గమనించారా...!
ఇకనైనా మేలుకోండి.
ఇంతకుముందు ముస్లిం నటీనటులు తాము ముస్లింలమని ప్రేక్షకులకు తెలిస్తే, తమ సినిమాలను చూడటానికి రారనే భయంతో హిందూ స్క్రీన్‌పేర్లు తమకంటూ పెట్టుకునేవారు!
వాటిలో బాగా తెలిసినవి:
1. స్క్రీన్ నేమ్‌ని ఉపయోగించిన యూసుఫ్ ఖాన్ - దిలీప్ కుమార్ అని సుపరిచితుడు!
2. మీనా కుమారి అని పిలువబడింది మెహజబిన్ అలీ బక్ష్ అనే ముస్లిం.
3.మధుబాల పేరును ఉపయోగించి హిందూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నది -ముంతాజ్ బేగం అని గ్రహించండి. 
4.బద్రుద్దీన్ జమాలుద్దీన్ ఖాజీ మనందరికీ జానీ వాకర్ అని తెలుసు.(ఇక్కడ క్రిస్టియన్ స్క్రీన్ పేరు ఉపయోగించబడింది).
5.హమీద్ అలీ ఖాన్ తన స్క్రీన్ నేమ్ -అజిత్‌ గా సుపరిచితుడు!
6.సైరా ఖాన్ తన స్క్రీన్ పేరు రీనా రాయ్ ద్వారా మరింత ప్రజాదరణ పొందింది.
7.ఫర్హాన్ అబ్రహం - క్రిస్టియన్ స్క్రీన్ పేరు జాన్ అబ్రహమ్ అని పెట్టుకున్నాడు. అతను ముస్లిం.
గత 60 ఏళ్లలో సరిగ్గా ఏమి జరిగిందంటే, ముస్లిం కళాకారులు ఇకపై హిందూ స్క్రీన్ పేర్లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా పోయింది.
బదులుగా నేడు ముస్లిం పేర్లు బ్రాండ్‌గా మారాయి!
ఇది ముస్లిం కళాకారుల కృషి ఫలితమా ? లేక హిందువుల అసమర్ధతా..?చిత్ర పరిశ్రమలో అండర్ వరల్డ్ నుండి జరుగుతున్న మిషన్ని కనిపెట్టలేక పోవడమా...? ఏమైనా వాళ్ళు బాగా బలపడ్డారు.
1. హిందువులమైన మనం వారి చిత్రాలను ఎందుకు హిట్‌లు మరియు సూపర్‌హిట్‌లు చేస్తున్నాము? ఇకపై ఆపండి.
2. మెజారిటీ బాలీవుడ్ సినిమాల్లో హీరోలు ముస్లింలు మరియు హీరోయిన్లు హిందూ అమ్మాయిలే ఎందుకు?
సినిమా పరిశ్రమకు అతిపెద్ద ఫైనాన్సర్ దావూద్ ఇబ్రహీం కూడా అలా కోరుకుంటున్నాడనేది సమాధానం.
T-సిరీస్ యజమాని గుల్షన్ కుమార్ అతనికి విధేయత చూపడానికి నిరాకరించాడు. అందుకే అతను హత్యకు గురయ్యాడు అంటారు బాలీవుడ్ లో.
కానీ మనకు తెలియని విషయమేమిటంటే, ఏ సినిమా డైరెక్టర్ అయినా ముస్లింని హీరోగా పెట్టుకుంటే అతను దుబాయ్ నుండి చాలా సాధారణ షరతులతో మరియు అతి తక్కువ వడ్డీకి రుణం పొందేందుకు అర్హులు.
ఇక్బాల్ మిర్చి మరియు అనీస్ ఇబ్రహీం వంటి జాతి వ్యతిరేక ఏజెంట్లు ఇవాళ - ఏడు నక్షత్రాల హోటళ్లలో సమావేశాలు నిర్వహించగలుగుతున్నారు.
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, నసీరుద్దీన్ షా, ఫర్హాన్ అక్తర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఫవాద్ ఖాన్ వంటి పేర్లలో ఏదైనా ఒక హిందీ చిత్రానికి ఉంటే విజయం ఖాయం.
అదే అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగన్‌, హృతిక్‌ రోషన్‌ లకు ఎన్నో అడ్డంకులు.ఎందుకు..?
ఆలోచించండి.
ప్రతిభావంతులైన ముస్లిం నటీమణులు టబు, హుమా ఖురేషి, సోహా అలీ ఖాన్ మరియు జరీన్ ఖాన్‌ల కెరీర్‌లు బలవంతంగా ముగిసిపోతున్నాయి, ఎందుకంటే వారు ముస్లింలు కదా...మరియు ఇస్లామిక్ ముల్లాలు వారి నటనా వృత్తిని, ఉద్యోగాలను మజాబ్‌కు వ్యతిరేకమైనవిగా భావిస్తారు! అందుకే వారిని ఎంకరేజ్ చేయరు.
స్క్రిప్ట్ రైటర్ సలీం ఖాన్ లేదా జావేద్ అక్తర్ అయితే సినిమా విజయవంతం కావాలి మరియు అది వారి జన్మ హక్కు అని నమ్ముతారు!
వీరి కథల్లో ప్రాథమికంగా క్రింది పాత్రలు తప్పనిసరిగా ఉంటాయి.
1. మంచి (ఇమందర్) ముస్లిం.
2. చెడ్డ బ్రాహ్మణుడు.
3. క్రూరమైన రాజు.
4. రాజు (క్షత్రియ) యొక్క రేపిస్ట్ కుమారుడు.
5. బ్లాక్ మార్కెటీర్ వైశ్యడు.
6. జాతీయ వ్యతిరేక హిందూ నాయకుడు.
7. అవినీతిపరుడైన పోలీసు అధికారి.
8. పేద దళిత మహిళ.
ఇవే సినిమాలో ప్రాథమిక పాత్రలు.
ఇలాంటి మరిన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి:
9. పాటల రచయిత తప్పనిసరిగా ముస్లిం అయి ఉండాలి.
10. చాలా కీలకమైన దశలో మౌలాను కీర్తిస్తూ పాట ఉండాలి. మరియు ప్లేబ్యాక్ సింగర్ పాకిస్థాన్‌కి చెందినవారై ఉండాలి.
అండర్‌వరల్డ్‌ వ్యక్తులు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం... 
టీవీ ఛానెళ్లలో కూర్చుని సెక్యులరిజాన్ని పొగుడుతారు., వారు వేర్వేరు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు...మరియు బలవంతంగా మతం మార్చుకుంటారు!
ఎందుకు.?  
దేశంలో ముస్లిం బాలికల కొరత ఉందా.? 
లేదే...
కానీ హిందూ అమ్మాయిల పట్ల తమ ప్రేమను చూపించడానికి వారిలో ఎవరూ హిందూ #మతంలోకి మారడం మీకు ఎప్పటికీ #కనిపించదు!
【వాళ్ళు ఎన్ని చేసినా హిందువులైన #మనం వాళ్ళను #ఏమీపీకలేము...మీరు ఏదో చెయ్యాలనో... ఇది చదివిన మీలో కొంతమంది ఏదో #పొడిచేస్తారనో ఇవి మీకు చెప్పడం లేదూ
ఇక ముందు #మనహిందూ_ఆడపిల్లలను/స్త్రీలను కంటికి రెప్పలా #కాపాడుకుంటారని ఈ పోస్ట్ చేశా...
అనాదిగా... మనకు #ఇతరులపై దాడులు అలవాటు లేవు..కనుక ఇప్పుడు వాళ్లపై దాడులు చేయండి అని చెప్పడం లేదు.
అవతలి వారి దాడులను #ఎదుర్కోవడమే మనకు  అలవాటు... #ఎదుర్కొండి అని #చెబుతున్నా ఇది నా అభిప్రాయం..
మీ #రవీందర్_గజవెళ్లి】
ఇది ఓ మహానుభావుడి మహాహానుభవసారం మీకోసం.....

Friday, July 29, 2022

భక్తుడు అనుకునే వారి సాధన ఎలా ఉండాలి భగవంతునికి ఇష్టమైన భక్తి ఏమిటి

భక్తుడు అనుకునే వారి సాధన ఎలా ఉండాలి

భగవంతునికి ఇష్టమైన భక్తి ఏమిటి

" మానవునిలో హృదయ పరివర్తనం రానంతవరకు ఎన్ని సాధనలు చేసిననూ ప్రయోజనము లేదు "...
దయాగుణం, దానగుణం లేనిదే దైవమును ఎన్ని పూజలు చేసిననూ ఉపయోగం ఏమీ ఉండదు...
నేడు చాలామంది పుణ్యం వస్తుందని నదులలో స్నాన్నములు చేస్తుంటారు, ఉపవాసాలు చేస్తుంటారు, ప్రదక్షిణలు ,జపాలు చేస్తుంటారు...
కానీ వీటి వలన పుణ్యం రాదు, ఇవన్నీ మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి చేసే సాధనలు మాత్రమే! ...

నదులలో స్నానం చేస్తే పాపం పోయి పుణ్యం వస్తుందనుకుంటే, చేపలు కంటే పుణ్యాత్ములు ఈ సృష్టిలోనే ఉండవు!
ఉపవాసాలు ఉండడం వలన కోరికలు తీరుతాయి అనుకుంటే, నిత్యమూ ఆకలితో పస్తులుండే పేదవాడు ఎప్పుడో ధనవంతుడు అయ్యేవాడు! ...

మానవులను అధోగతి పాలు చేసే గుణాలు: అత్యాశ, సోమరితనం, లోభత్వం,  స్వార్థం, అహంకారం, పరనింద, ఆత్మస్తుతి, నీది కానిదానిని ఆశించడం, దానికై ఆరాటపడడం మొదలైన వాటివలన మానవుడు ఆధ్యాత్మిక పురోగతి సాధించలేక అధోగతి పాలవుతున్నాడు భ్రమకు లోనగుచున్నాడు... ఇవి క్రమక్రమంగా విడిచి పెడితేనే దైవానుగ్రహమునకు పాత్రులమౌతాము

కానీ అంతటితో ఆగిపోకుండా ఆత్మతత్వమును అర్ధం చేసుకుని హృదయము పరిశుద్ధం చేసుకుని పరమాత్మను అంతరాత్మలో ఆరాధించుకోవాలి,అప్పుడే ఆత్మాలో పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది

ఏనాడు మన హృదయాలు పరిశుద్ధమై పరమాత్మ కొరకు పరితపిస్తామో ఏ పనులు చేసినా అవి పరమాత్మ మెచ్చేలా చేయగలమో ఆనాటి నుంచి మనం నిజమైన పుణ్యాత్ములవుతాము... దన్యాత్ములవుతామని తెలుసుకుని ఆ ప్రకారం నడచుకోవడమే ఆధ్యాత్మిక సాధన... 

మంచి మాట..లు(29-07-2022)

శుక్రవారం :-29-07-2022
ఈ రోజు AVB మంచి మాట..లు

చెడ్డ అలవాట్లు ఉన్న వ్యక్తితో కలిసి తిరిగిన ఏమీ కాదు, కానీ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తన అవసరం కోసం మనల్ని వాడుకునే వ్యక్తితో మాత్రం చాలా దూరంగా ఉండాలి, లేకపోతే, మన సమయము, ధనము వృధా అవుతాయి,ఆలోచించండి ..

మనస్సు సరిగా లేనప్పడు మాటల జోలికి వెళ్ల కండి.
మనస్సు ను సరి చేసుకునేందుకు మార్గాలు ఉన్నవి
కానీ మాటల్ని వేనక్కు తీసుకొనేందుకు ఒక్క మార్గం కూడా లేదు
అందుకే మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని అంటారు పెద్దలు

మన జీవితంలో ఎదురయ్యే వారంతా మన గురువులే.... మంచివాళ్ళు పాఠం నేర్పుతారు చెడ్డవాళ్ళు గుణపాఠం నేర్పుతారు
చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది. కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది
మన జీవితంలో ఇద్దరిని మర్చిపోకూడదు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారిని మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చిన వారిని

. చీకట్లోనే
నక్షత్రాలు
కనపడతాయి
అలాగే!
కష్టాల్లోనే
సత్యాలు
గోచరమవుతాయి....!!

పొగడ్తల్ని, విమర్శల్ని
సమానంగా స్వీకరించాలి.
ఎందుకంటే!
పువ్వు
వికసించాలంటే
ఎండా, వాన రెండూ కావాలి.

నీ చికాకులో ఎక్కువగా
మౌనమే వహించు.
ఆ సమయంలో నీ నోటినుండి వచ్చేవి
మాటలుకాదు . మారణాయుధాలు
."
మనం
సంతోషంగా బతకాలి అనుకుంటే
మన గురించి
ఇతరులు ఏమనుకుంటున్నారో
అని
ఆలోచించడం మానేయాలి."


ఓర్పు, ఓరిమి, సహనము
కోల్పోయినట్లయితే
ఎంతోకాలం శ్రమించి, కష్టించి, కృషిచేసి సంపాదించిన
మంచిపేరు, ప్రతిష్ఠలు
ఒక క్షణంలో
మటుమాయం
అయిపోతాయి. సంపాదించడం
ఒక ఎత్తు.
దానిని నిలబెట్టుకోవడం
మరొక ఎత్తు

సమాజంలో కొందరు
మనం ఏం చేస్తున్నాం
అనే దాన్నికన్న
ఎదుటి వాళ్లు ఏం చేస్తున్నారుఅనే దానిపైన ఎక్కువ ఆసక్తి చూపిస్తారు జాగ్రత్త .

చేతులున్నందుకు
దానంచేయాలి . చెవులున్నందుకు మంచి మాటలు వినాలి. నోరున్నందుకు మంచి మాటలు మాట్లాడాలి . అందుకే ఒక మంచిమాట తలకు కిరీటాన్ని పెడితే, ఒక చెడుమాట తలను తీసేస్తుంది. ఒక మంచి మాట తృప్తిని కల్గిస్తే, ఒక చెడుమాట మనసును కలిచివేసి, ఆబాధ జీవితాంతం గుర్తు ఉండేలా చేస్తుంది.....

సేకరణ ✒️మీ ఆత్మీయ బంధువు AVB సుబ్బారావు 💐🤝

Thursday, July 28, 2022

ఈశ్వరేచ్ఛ

 ఈశ్వరేచ్ఛ

💝 ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు. ఆయన నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది. దాన్నే మనం"ఈశ్వరేచ్ఛ" అంటాం. 

💖 ఎవరు ఏ కర్మ చేస్తే వారికి దానికి తగిన ఫలితం వస్తుంది. ఆయన ఎవరి యందూ ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు. ఆయన సాక్షి. కాబట్టే ఈ కర్మలు నమోదై, ఆయా కర్తవ్య పాలనానికి ఆయా ఫలితాలు పొందుతున్నాం. 

💕 ప్రతి మనిషికీ ప్రతీ సంఘటనకీ తన హద్దు ఒకటి తనకు ఉంటుంది. భక్తుడే కావచ్చు, జ్ఞాని కావచ్చు, యోగి కూడా కావచ్చు. తన అంతస్థును పరిథిని అతిక్రమించకూడదు. 

💓 అంతస్థు అంటే ధనం, ఐశ్వర్య సంబంధితం కాదు. ఉద్యోగం చేస్తున్నచోట మనతో కలిసి పనిచేసే వ్యక్తిని తక్కువగా చూడటం ధర్మం కాదు. (అవతల వ్యక్తి సేవకా వృత్తిలో ఉన్నప్పటికీ) ఒకరు సేవ్యుడు, ఒకరు సేవకుడు. అంతవరకే. ఆ హద్దు మీరవద్దు. ఏ అంతస్థులో, ఏ ఉద్యోగంలో, ఏ విధి నిర్వహణలో ఉన్నా మన పరిధి దాటకూడదు. దాన్ని దాటితే ధర్మాన్నిఅతిక్రమించిన దోషం కలుగుతుంది. 


❤️ శ్రీరాముడు మానవుడుగా వచ్చాడు.మానవుడుగా జీవించాడు. యుద్ధంలో రావణుని ఎదిరించాడు, సంహరించాడు. స్వయం ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణువువే, ఆ "ఈశ్వర" అంశ అని చెప్పినా ఆంతర స్థితిలో ఏమున్నా లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ మనుష్యుడు గానే ఉన్నాడు. దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు. మానవుడిగా తన పరిథి దాటలేదు. తన పరిథిని అతిక్రమించలేదు. 

❤️ శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిథేమిటో తెలియవచ్చేలా చేసాడు. భీష్ముడు దైవీశక్తులు కలవాడు. దైవాంశ సంభూతుడు. వసువులలో ఒకడు. 

 కురుక్షేత్రంలో భీష్ముడు యుద్ధమత్తుడై ఒళ్ళుమరచి తన దైవీశక్తులను ప్రకటిస్తూ, పాండవ సేనను చీల్చి చెండాడుతూ, అర్జునుని మీద కూడా తన దైవీ శక్తులను ప్రకటించి యుద్ధం చేసాడు. భీష్ముడు మీరుతున్న మానవ పరిధిని సహించక, మానవునిగా యుద్ధం చేయక అంతస్థుని, పరిథిని మించి దైవీ శక్తులను ప్రకటిస్తున్నాడు కనుక ఆయుధం పట్టనన్న కృష్ణుడు భీష్ముని మీదకు ఉరికాడు. భీష్ముడు తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణుని దండన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. 

💖 సంపూర్ణ అవతారమైనా ధర్మం విషయంలో మనుష్యులతో మమేకమైనప్పుడు కృష్ణుడు ఎక్కడా పరిథిని మీరలేదు.గీతలో "నీ కర్తవ్యం యుద్ధం చేయడం. యుద్ధం చెయ్యి, గెలిస్తే రాజ్యం , ఓడితే స్వర్గం" అన్నాడు తప్ప.. “ఏం జరిగినా నేనున్నాను, మీ అందరినీ కాపాడతా" అని చెప్పలేదు. 

 నువ్వు చేయవలసింది, నీ పరిథిలో చేయమని చెప్పాడు. "ధర్మం పాటించు” అన్నాడంతే. కాపాడే కర్తవ్యం తన మీద పెట్టుకోలేదు. 

💞 కాల స్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు...”నేను మీకు ఫలితం ఇచ్చేయడం కాదు. నువ్వు యుద్ధం చేయబోతున్నావు. మీరు యుద్ధం గెలవబోతున్నారు. వారు చనిపోబోతున్నారు. మీరు రాజ్యం చేస్తారు" అని చూపించాడే తప్ప “నేను మీకిచ్చేస్తున్నాను" అని చెప్పలేదు. అలా ఐతే కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చేయవచ్చు కదా…! అలా చేయలేదు. 

💝 అంటే... మనం చేసే కర్మలకు తగిన ఫలితమే మనకు వస్తుంది. “ఈశ్వరేచ్ఛ" అంటే కూడా అదే. ఏ కర్మకు ఏ ఫలితాన్నివ్వాలో నిర్దేశించడం తప్ప మరోటికాదు.  

జిడ్డు కృష్ణమూర్తి సంబంధ 14 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో.

 *జిడ్డు కృష్ణమూర్తి  సంబంధ 14 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

కృష్ణమూర్తి తత్త్వం www.freegurukul.org/g/JidduKrishnamurthi-1

తెలివిడి నుంచి స్వేఛ్చ www.freegurukul.org/g/JidduKrishnamurthi-2

ఈ విషయమై ఆలోచించండి-2 www.freegurukul.org/g/JidduKrishnamurthi-3

మహాతాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి అవగాహన www.freegurukul.org/g/JidduKrishnamurthi-4

శ్రీలంక సంభాషణలు www.freegurukul.org/g/JidduKrishnamurthi-5

నిరంతర సత్యాన్వేషి కృష్ణమూర్తి తత్త్వదర్శన కరదీపిక www.freegurukul.org/g/JidduKrishnamurthi-6

స్వీయ జ్ఞానం www.freegurukul.org/g/JidduKrishnamurthi-7

ఈ విషయమై ఆలోచించండి-1 www.freegurukul.org/g/JidduKrishnamurthi-8

గతం నుండి విముక్తి www.freegurukul.org/g/JidduKrishnamurthi-9

నీవే ప్రపంచం www.freegurukul.org/g/JidduKrishnamurthi-10

జిడ్డు కృష్ణమూర్తి అవగాహన-1 www.freegurukul.org/g/JidduKrishnamurthi-11

జిడ్డు కృష్ణమూర్తి జీవితము-భాషణము www.freegurukul.org/g/JidduKrishnamurthi-12

మన జీవితాలు www.freegurukul.org/g/JidduKrishnamurthi-13

ముందున్న జీవితం www.freegurukul.org/g/JidduKrishnamurthi-14


ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను  ప్రతి రోజు పొందుటకు:

Telegram Channel లో join అగుటకు  https://t.me/freegurukul

Whatsapp Group లో join అగుటకు  www.freegurukul.org/join

ఇదే కర్మ క్షయ రహస్యం.

 🙏🕉🙏 ....... *"శ్రీ"*

                 

        🪷🪷 *"51"* 🪷🪷

🪷🪷 *"కర్మ - జన్మ"* 🪷🪷🪷


 *కలల్లో కర్మ ఫలం 1* 

********************

*"యత్కర్మ సుకృతం ప్రోక్తం మనోవాక్కాయ సంభవమ్!* 
*తత్తు కర్మాన్తరం హన్తి మనోవాక్కాయ సమ్భవమ్!!*

 *భావం:-*  

**********

 *"మనసుతో, మాటతో, క్రియతో చేయబడ్డ దుష్కర్మలు అవి మనసుతో, మాటతో, క్రియతో చేసే సుకర్మల వల్ల నాశనం అవుతాయి".*

 *"మనం చేసే పుణ్య కర్మలతో, గతంలో మనం చేసిన పాప కర్మలు నశిస్తాయి. మనిషి జన్మకి కారణం ఇదే. సుకర్మలు చేసి గతంలో చేసిన దుష్కర్మలని వదిలించుకోవడానికి మనిషి జన్మ ఉత్తమ అవకాశం. కాని మనం అది తప్ప మిగిలినవన్నీ చేస్తూ, కర్మ బంధాలని, జన్మ పరంపరని పెంచుకుంటూ పోతున్నాం."*

 *"కొందరు ఏ కర్మకి ఆ కర్మే విడివిడిగా అనుభవించాలని, సుకర్మ దుష్కర్మని రద్దు చేయదని భావిస్తారు. తార్కికంగా ఆలోచిస్తే ఆ వాదన తప్పు. అదే నిజమైతే ఎవరూ ముక్తిని పొందలేరు. ఎందుకంటే వారు చేసిన సర్వ కర్మలు భస్మమయితే తప్ప ముక్తి సాధ్యం కాదు."*

 *"అలా కర్మలని అనుభవించడానికి మానవ దేహం తీసుకున్నాక మాయ చేత, ప్రకృతి శాసించే ఇంద్రియాల వల్ల మనిషి మరిన్ని శుభ, అశుభ కర్మలని చేస్తూనే ఉంటాడు."*

*"జన్మ ఎత్తి కర్మలని అనుభవిస్తూ, మళ్ళీ కొత్త కర్మలని ఆ జన్మల్లో చేస్తూంటాం, చేసిన కర్మలని రద్దు చేసుకునే విధానం లేకపోతే, ఇక ఈ చక్రానికి అంతే ఉండదు."*

 *"అజ్ఞానంలో గత జన్మల్లో చేసిన వివిధ కర్మలని నాశనం చేసుకుని ముక్తి పొందడానికే ధ్యాన మార్గం అని, అందుకే మానవ జన్మ అని కూడా శాస్త్రం స్పష్టంగా చెప్తోంది."*

 *"కాబట్టి మంచి కర్మలు చేస్తే కలిగే పుణ్యం వల్ల పాత దుష్కర్మలు భస్మం అవుతాయి. ముల్లుని ముల్లుతో తీసినట్లుగా సుకర్మ దుష్కర్మని తీసేస్తుంది. *'కర్మ కర్మణా నశ్యతి'* *'కర్మ కర్మతోనే నశిస్తుంది' అనే శృతి వాక్యం అర్ధం ఇదే. మరో ఋషి దాన్ని ఇలా చెప్తున్నాడు."*


*"యస్య పాపం కృతం కర్మ కుశలేన విధీయతే*
*స ఇమం లోకం ప్రభాసయత్యభ్రాన్ముక్త ఇవ చంద్రమా"* 

*భావం:-* 

*********

*"పూర్వం చేసిన పాపాన్ని ఎవడైతే పుణ్యం ద్వారా అణగదొక్కుతాడో అతడు ఈ లోకానికి నిర్వాణ మార్గం చూపే జ్యోతి అవుతాడు. కారు మబ్బులనించి బయటకు వచ్చిన పూర్ణచంద్రునిలాంటి వాడు అవుతాడు."* 

 *"సుకర్మని సమర్థిస్తూ శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి ఇలా అన్నారు. 'కొయ్యలోకి పూర్తిగా కొట్టిన మేకును ఉదాహరణగా తీసుకుందాం. మొదట మేకు బయటి భాగం మాత్రమే కనిపిస్తుంది. కొయ్యలో ఎంత దిగిందో తెలీదు."*

 *"ఆ మేకుని బయటకి లాగడానికి ఎంత శక్తిని ఉపయోగించాలి? లోపలకి మేకు ఎంత దిగింది అన్న దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అందుకు ఆధారమైనవి మూడు. ఒకటి మేకు నెత్తి మీద ఎన్ని దెబ్బలు కొట్టారు, రెండు ఒకో దెబ్బకి ఎంత శక్తి ఉపయోగించారు, మూడు కొయ్య ఎంత ప్రతిఘటించింది అన్నది."*

 *"కాబట్టి మేకుని బయటకి లాగడానికి చేసే ప్రయత్నాలు మేకుని లోపలకి కొట్టిన శక్తి, దాన్ని ప్రతిఘటించిన కొయ్య శక్తిల మీద ఆధారపడి ఉంటాయి."*

 *"మేకు ఈ జన్మలో మనకి కలిగిన కష్టం అనుకుంటే, మేకుని కొట్టిన శక్తి గతంలో మనం చేసిన దుష్కర్మలు అనుకుంటే, అవి మనకి ఇప్పుడు కనబడవు.అవి తెలియవు కదా అని మేకుని బయటకి లాగడం విరమించుకుంటామా? లేదు కదా. అది బయటకి వచ్చే దాకా మన శక్తిని ఉపయోగించి లాగుతూనే ఉంటాం."*

*"అలాగే మనం చేసే సుకర్మలన్నీ ముందు రాబోయే కష్టాలనే మేకులని బయటకి లాగడానికి ఉపయోగించే శక్తిగా మారుతుంది. సుకర్మలు చేయడానికి ఇది ముఖ్య సూత్రం. ఇదే కర్మ క్షయ రహస్యం."*

 *"కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ వారు ఓ సందర్భంలో చెప్పిన మాటలు కూడా దీన్ని బలపరుస్తున్నాయి."*

            

ఏకాగ్రత

 ఏకాగ్రత

🌷🌷🌷🌷🌷

ఒకసారి ఓ సంస్కృత పండితుడు కబీర్ దగ్గరికొచ్చి ఏం చేస్తున్నారు ప్రస్తుతం ' అని అడిగాడు. మనసును ప్రాపంచిక విషయాలనుంచి వేరుచేసి భగవంతుడి పాదపద్మాలకు అతికిస్తున్నాను' అని జవాబిచ్చారాయన. 

ఇదే ఏకాగ్రత లేదా ``ధారణ... మనసును ఒకే ఆలోచనపై ఉంచడం. వేదాంతులు మనసును ఆత్మ పైన నిలుపుతారు. హరయోగులు, రాజయోగులు వారి దృష్టిని ఆరు చక్రాల పైన, శక్తి కేంద్రాల పైన కేంద్రీకరిస్తారు. భక్తులు దృష్టిని తమ తమ ఇష్టదేవతల పైన లగ్నం చేస్తారు.

అభిలషించేవారికి ఏకాగ్రత ఎంతో అవసరం. దృష్టి నిలిపేటప్పుడు మనసులోని విభిన్న కిరణాలు ఒక చోట కేంద్రీకృతమవుతాయి. మనసు ఎగిరిపడదు. గాఢమైన ఏకాగ్రత ఉన్నప్పుడు శారీరక స్పృహగానీ, పరిసరాలను పట్టించుకోవడంగానీ ఉండదు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఏకాగ్రతతో ఉంటారు. ఆధ్మాత్మిక లక్ష్యాల్లో ఏకాగ్రత అనంత స్థాయిలో అవసరమవుతుంది.

చదరంగంలాంటి ఆటలకు ఏకాగ్రత ఎంతో అవసరం. ఏకాగ్రత అనేక రకాలుగా వ్యక్తీకరణం చెందుతుంది. తీవ్ర భావపరంపరగా శక్తి వెలువడటం సాధుమార్గంగా గోచరిస్తుంది.

ఉన్నతస్థాయుల్లో ఏకాగ్రత ఎంతో లోతుగా ఉండి, అభ్యాసంలో ప్రశ్నలకందని స్థాయికి చేరుతుంది. యోగిని పూర్తిగా ఏకాగ్రతతోనే గుర్తిస్తారు. 

ఒక విషయం అధ్యయనం చేయాలనే కోరిక ఉంటే, ముందుగా దాన్ని ఇష్టపడాలి. ఆ ఇష్టమే. లేకపోతే దానిపట్ల శ్రద్ధ ఉండదు. ఏకాగ్రతకు చోటుండదు. ఇకఆనందం ఎక్కడుంటుంది. ఏకాగ్రత లేదని చాలామంది చెప్పడానికి అదే ప్రధాన కారణం. -ప్రాథమిక సమస్య ఇష్టం. లేకపోవడం. మనిషి దేన్నైతే విని అవగాహన చేసుకోవాలనుకుంటాడో దానిలో అతడు లీనమైపోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వినికిడి కళ గురించి ఉపదేశిస్తాడు. మనసుతో విని తాను చెప్పేదాన్ని అతిశించుకొమ్మంటాడు

తేనెటీగ ఒక చోటు నుంచి మరో చోటుకు ఎగురుతూ, నచ్చిన పూలను ఎంపిక చేసుకుని వాలుతుంది. అది ప్రయాణించే బాటలో ఎన్నో ముళ్లుంటాయి. ఆవరోచాలుంటాయి. ఎంతో నేర్పుగా వెళ్ళి పూలను ఎంపిక చేసుకుని, నిరంతర శ్రమతో ఆ అమృతాన్ని సేకరిస్తుంది. అనుకున్న లక్ష్యం పూర్తికాగానే, క్షణం కూడా వృథా చేయకుండా నేరుగా తేనెతుట్టెను చేరుకుంటుంది. సేకరించి తెచ్చిన తేనెను భద్రపరుస్తుంది. దీనికి ఎంతో ఏకాగ్రత అవసరం. చలించకుండా ఉండే శ్రద్ధ, పట్టుదల అవసరమన్న పాఠాన్ని మనుషులు తేనెటీగ నుంచి నేర్చుకోవాలి.

ఆ సృష్టికర్త ఈ భూమ్మీదకు ఇంతమందిని పంపించాడంటే దానికి కారణం లేపోలేదు. ఆధ్యాత్మిక మూర్తిమత్వానికి కావాల్సిన పరిపూర్ణతను సాధించడానికి ఎదురయ్యే తీసి చేదు అనుభవాలను అసాధారణమైన స్ఫూర్తితో ఎదుర్కొంటూ, ఎంతో ఎరుకతో ఆధ్యాత్మికంగా మనిషి ఎదగాలి. లక్ష్యం ఏదైనా పూర్తి ఏకాగ్రత అవసరం. 

మార్గంలో ధ్యానభంగం కలిగించే పరిస్థితులు ఎదురుకావడం సహజం. అనేకానేక ఆకర్షణలు లోనై వాటివైపు అనవసరంగా దృష్టి మళ్ళుతుంటుంది. మనిషి సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఓర్పు, కరుణలతో ఉంచడానికి ప్రతీకారం వ్యతిరేక భావనల్లాంటివి లేకుండా క్షమాగుణం కలిగి ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని

పెంచుకోవాలని సృష్టికర్త ఉద్దేశం. సూదిలో దారం ఎక్కించాలంటే ముందు విడివిడిగా కనిపించే దారపు పోగులను ఒకటిగా చేసి కొనదేరేలా చేస్తాం- సులభంగా దారం ఎక్కించడానికి. అదే విధంగా విచ్చలవిడిగా ఉండే కోరికల్ని తొలగించుకుని, ఆహంకారాన్ని వదిలిపెట్టి. వినమ్రతతో మనసును దైవం పైన లగ్నం చేయడమే  ఏకాగ్రత

🌷🌷🌷🌷🌷

నిత్యజీవితంలో భగవద్గీత

 నిత్యజీవితంలో భగవద్గీత

🔹🔸🔹🔸🔹🔸🔸

భగవద్గీత మానవ జీవితానికి జీవనవేదం. మనిషి జీవితం ఎన్నో ఎత్తుపల్లాలు మయం. మాయామోహితం. రాగద్వేష మాయం. ఇట్టి త్రిగుణాత్మ భూయిష్ఠమైన జీవితం సాఫీగా సాగాలి అంటే ప్రతీవానికి జీవితంలో బలమైన ఊత అవసరం. ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే ఆ ఊతే భగవద్గీత.

 ఆ గీతాచార్యుని త్రికరణ శుద్ధిగా నమ్మి ఎందరో ఈ భాగవద్గీత పారాయణ చేసుకుని తరించిపోయారు. 

శ్రీకృష్ణ పరమాత్మ అర్జనుని మిషగా పెట్టి లోకానికి ఉపదేశించిన జీవితసారం భగవద్గీత. దీనిని గనుక జాగ్రత్తగా చదివి అర్ధం చేసుకోగలిగితే మానవజీవితం తామరాకుపై నీటి బొట్టు వలే సాగిపోతుంది. 

చాలా మందిలో భగవద్గీత జీవిత చరమాంకం లో ఉన్నవారికే అనే అపప్రధ ఉంది. కానీ వాస్తవానికి జీవించడం ప్రారంభించిన మొదలు అవగాహన చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని నేపధ్యం చాలా విశిష్టం గా ఉంటుంది. అర్జున విషాదయోగం తో ప్రారంభించి కర్మ జ్ఞ్యాన వైరాగ్యాలను ఉపదేశిస్తాడు. పరంధాముడు. 

జీవితం అనిత్యం అశాశ్వతం అట్టిదానిగురించి దుఃఖించుట భీరువుల లక్షణమంటాడు. 

మానవునికి కర్మ చేయుటయందే అధికారముంటుంది గానీ దాని ఫలితం మీద ఉండదు. అట్లని కర్మ చేయడం మానరాదు.. ఈ శ్లోకాన్ని విశ్లేషించుకుంటే కర్తవ్యానికి బాధ్యతకు తేడా చెప్పబడింది. మనిషి కర్తవ్యాన్ని నిర్వహిస్తే తృప్తి కలుగుతుంది అదే బాధ్యత అనుకుంటే బరువుగా అనిపిస్తుంది. మనం చేసే పనిమీద కన్నా దాని ఫలితం మీద దృష్టి సారించడం ఎలాంటిదంటే కుక్కర్ లో బియ్యం పెట్టి మాటిమాటికి మూతతీసి చూడడం వంటిది. 

మరొక శ్లోకం లో స్వామి ఎప్పుడెప్పుడైతే ధర్మం గతితప్పుతుందో అప్పుడప్పుడు నేను ధర్మసంస్థాపనకు అవతరిస్తాను అంటాడు. పరమాత్మ ధర్మపక్షపాతి. ఆయన అవతార స్వీకరించింది మొదలు ధర్మ రక్షణ తన ప్రధమ కర్తవ్యం గా పెట్టుకొన్నాడు. అదే ధర్మ సంస్థాపన కొరకు కురుక్షేత్ర సంగ్రామం నిర్వహించి పాండవులకు రావలసిన రాజ్యాన్ని ధర్మబధ్ధంగా ఇప్పించాడు. 

అరిషడ్వార్గాలు గురించి వివరిస్తూ, మానవుడు ఒకవిషయం గురించి కామించితే అది క్రోధం గా మారి దాని వలన బుద్ధి నశించి తుదకు అధోగతి పాలవుతారని విశ్వమానవాళికి సందేశమిచ్చారు పరంధాముడు. ఇది నిత్య సత్యం. అందుకే ఎవరికీ అధర్మ బద్ధమైన కామనలు ఉండకూడదు. కోరికలను ధర్మం తో ముడివేస్తే అట్టి ధర్మ సమ్మతమైన కోరికని ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు. 

గంగాజల పానమెటులో భగవద్గీత పారాయణ రెండు కూడా ముక్తిహేతువులే. బాల్యప్రాయం నుంచి గనక భగవద్గీత శ్లోకాలను పిల్లలుచేత సాధనచేయించి ఆచరణలో పెట్టించ గలిగితే వారు జీవితంలో కర్త్రుత్వ భావనకలిగి నిరపేక్ష బుద్ధితో జీవించగలరు.

 ఎప్పుడైతే పిల్లలు, యువత యొక్క ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుందో, అప్పుడు నిరాశావాదం తొలగి జీవితంలో ప్రతీక్షణం ఉత్సాహం గా ఉల్లాసంగా ఉండి జీవితంలో అన్నీ రంగాలలో పురోభివృద్ధి సాధిస్తారు. అప్పుడు ఈ ఆత్మహత్యలు నివారింపబడి ముఖ్యంగా యువత విశ్వశాంతి నెలకొల్పుతారు.

 స్వామీ వివేకానంద, మహాత్మా గాంధీ వంటి వారు నిత్యం భగవద్గీత పారాయణ చేసుకొని, వారికి నిత్య జీవితం లో ఎదురయ్యే ఎన్నో సవాళ్లకు సమాధానం పొందారు. ఈ గీతాసారం ఆధునిక యాజమాన్య నిర్వాహణకు కావలసిన ఎన్నో సూత్రాలను తెలియజేస్తుంది 

గీతాపారాయణం నిత్యకృత్యం అనుసరణీయం

ఇటీవల ఒక ముఖ పుస్తక మిత్రుడు తాను ఇంతకాలం ఎవరికీ పెట్టకుండానే భుజించేవాడినని కానీ భగవద్గీత లోని ఒక వాక్యం తన జీవనాగమనాన్ని మార్చిందని తెలియచేసారు.. మనలో చాలా మంది భగవద్గీత వింటారు చదువుతారు, కానీ ఆచరణ పర్యంతంలోకి తెచ్చుకోరు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తారో వారిని ఆచార్యులుగా పేర్కొంది. 

అందుకే శ్రీకృష్ణుడు గీతాచార్యుడు అయినాడు. నిత్యజీవితంలో భగవద్గీత ప్రయోజనం ఇదే.

🔹🔸🔹🔸🔹🔸🔹🔸

భావన, ఆలోచన, స్పందలతో మనసు మనసు నిరంతరం ఏదోక దానితో మమేకమై పోతుంటే, దాన్ని అదే ఎలా అదుపులో పెట్టుకుంటుంది ?

 🙏🕉🙏 ...... *"శ్రీ"*


                 💖💖💖

        💖💖 *"291"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

     

*"భావన, ఆలోచన, స్పందలతో మనసు మనసు నిరంతరం ఏదోక దానితో మమేకమై పోతుంటే, దాన్ని అదే ఎలా అదుపులో పెట్టుకుంటుంది ?"*

**************************


*"మనసు శరీరభావనతో ఉన్నప్పుడు శరీరం తాలూకా కష్టసుఖాలను అనుభవిస్తుంది. మండుటెండలో తిరిగినప్పుడు కష్టంగా అనిపించటం, ఏసీ గదిలో ఉంటే హాయిగా ఉండటం వంటివి మనసు పొందే దేహానుభవాలు. మనసు ఆలోచనలో ఉన్నప్పుడు శరీరంతో నిమిత్తంలేని సంతోష దుఃఖాలను అనుభవిస్తుంది. ఏదైనా శుభవార్త గుర్తుకు రావటంతోనే సంతోషం కలగటం, అవమానకరమైన విషయం గుర్తుకు రాగానే దుఃఖం కలగటం మన అనుభవంలోనివే. మనసు శరీరభావం, ఆలోచనలతో కాకుండా తన సహజస్థితిలో ఉంటే ఆత్మశాంతితో ఉంటుంది. అంటే ఆత్మలక్షణమైన పరిపూర్ణ శాంతిని మనసు అనుభవిస్తుంది. క్రియలో శరీరానికి కష్టసుఖాలు, భావనతో సంతోష దుఃఖాలు, కలుగుతున్నాయి. కాబట్టే నీళ్ళలో పడినట్లు కలవస్తే మనసుకు మాత్రం ఆందోళన ఉన్నా నిజంగా శరీరానికి ఏ తడి అంటదు. మనసు ఈ భావనాస్థితిని దాటితే మనోమూలంలోనే ఉన్న ఆత్మశాంతి అనుభవంలోకి వస్తుంది. ఆత్మగుణమైన పరిపూర్ణశాంతి మనసుకు కలగటమే ఆత్మానుభవం. అదే దైవదర్శనం" !*


*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*

           🌼💖🌼💖🌼

                 🌼🕉🌼

              

మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలా...??

మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలా...
??

సహజంగా మనసు ప్రశాంతంగా ఉండదు. దాన్ని మనమే సరిచేసుకుంటూ ఉండాలి. లేకపోతే చిక్కులు పడిన తాడులా ఉంటుంది. అర్థం కాని సమస్యలా ప్రతీసారి మన ముందుకు వచ్చి నిలబడుతుంది.

ఎందుకిలా జరుగుతుంది? మనసుతో ఈ ఇబ్బంది ఏమిటి? చాలా సార్లు, చాలా మందికి అనిపిస్తుంది. మనసుతో ఇలాంటి గొడవ ఏదో ఒక రోజు రావాలి. అదే నాంది - మనసును శోధించడానికి. మనసును సాధించడానికి. దాని సంగతి తేల్చుకోవడానికి.

మనిషికి చాలా సంతోషకరమైన, మేధాపరమైన ఆట ఏది అంటే, మనసుతో నిత్యం ఆడేదేే! మనసుతో ఆడాలి. మనసును పరుగెత్తించాలి. మనల్ని మనసు పరుగెత్తిస్తుంటే ఆపాలి. మనసుకు ఎదురుతిరగాలి అంటారు - స్వామి వివేకానంద.

మనసు భయపెడుతుంది. బాధ పెడుతుంది. విసిగిస్తుంది. చివరకు కాళ్లబేరానికి వచ్చి బుజ్జగించి, లాలిస్తుంది. రాయిలా మనం కదలక మెదలక ఉంటే, చివరకు దండం పెడుతుంది - రమణ మహర్షికి వశమైన మనసులా.

మనసు లేని మనిషి గడ్డకట్టిన సరస్సులాగా ఉంటాడు. శీతోష్ణ, సుఖ, దుఃఖాలను సమంగా చూస్తాడు.

ఇలాంటి ప్రశాంతమైన మనసు కలిగిన మనిషే శక్తికి పుట్టినిల్లు అవుతాడు. శక్తి కావాలంటే నిరంతరం ఆలోచనలతో సతమతమయ్యే మనసును భారంగా మొయ్యడం కాదు. ఆలోచనలను నియంత్రించుకుని, సృజనాత్మక భావాల మీద ఏకాగ్రత నిలిపితే అసలైన శక్తి పుడుతుంది.

ఆ శక్తి అపారం. దాన్ని అందుకోగలిగిన నాడు, లోకంలో దేన్నయినా సాధించగలం. మనోవిజయమే లోక విజయం.

ప్రశాంతమైన మనసే అద్భుతాలు సృష్టించగలదు. ఆలోచనలు తగ్గుతున్న కొలదీ సృజనాత్మకత పెరుగుతుంది. వందలు, వేల కొద్దీ క్రమం లేని ఆలోచనలు మనసులోని శక్తిని తగ్గించేస్తాయి. ఒక మంచి, గొప్ప ఆలోచన దివ్య మార్గంలో నడిపిస్తుంది.

హృదయం మనసుకు అనుసంధానమైనప్పుడు పుట్టే ప్రతి ఆలోచనా గొప్పది అవుతుంది. హృదయం కలగజేసుకోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే క్రమబద్ధమైన, శక్తిమంతమైన ఉపయోగకరమైన ఆలోచనలు చెయ్యాలి.

ఆలోచనలకు ముందు ధ్యానం చెయ్యాలి. ఆలోచించిన తరవాత ధ్యానం చెయ్యాలి. మరిన్ని మంచి ఆలోచనల కోసం ఆలోచనల తీరుతెన్నులు తెలుసుకోవాలి. ఆలోచనలకు స్థావరమైన మనసును ముఖాముఖీ ఎదుర్కోవాలి. అవసరమైతే పక్కకు తప్పుకొని మనసుకు సాక్షిగా నిలబడి ఉండాలి. ఇదంతా సాధన వల్లనే సాధ్యపడుతుంది.

మనసుతో వ్యాయామం చెయ్యని మనిషి సాధనలో పరిణతి చెందలేడు. మనసుకు అతీతంగా వెళ్లని మనిషి ఆధ్యాత్మిక రహస్యాలు అందిపుచ్చుకోలేడు.

మనసు మనకు మంచి మిత్రుడు. దారుణమైన శత్రువు కూడా. ఉపయోగించుకోవడంలో అంతా ఉంది.

మనసు గాలిలో దీపంలా ఉంది. దీన్నెలా వశంచేసుకోవాలని దీనంగా ప్రార్థించాడు అర్జునుడు.

అప్పుడు పరమాత్మ చెప్పాడు-

‘నిస్సందేహంగా మనసు చంచలమైనది. దాన్ని వశపరచుకోవడం చాలా కష్టం. అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని నియంత్రించడం సాధ్యమే. మనసు వశం చేసుకున్న ప్రయత్నపరుడైన మనిషికి సాధనద్వారా సహజంగా యోగ సిద్ధి పొందడం సాధ్యమే’ అని వివరించాడు.

సేకరణ

వయస్సు దాటుతున్న వేళ ఎలా ఉండాలి?

  నేటి మంచిమాట. వయస్సు దాటుతున్న వేళ ఎలా ఉండాలి? 
  
  1. ఈ సమయం  ఇన్నాళ్ళూ  సంపాదించినదీ,  దాచుకున్నదీ  తీసి  ఖర్చు  పెట్టె  వయసు.తీసి  ఖర్చు  పెట్టి  జీవితాన్ని  ఎంజాయ్  చెయ్యండి.   
  దాన్ని  ఇంకా  దాచి  అలా  దాచడానికి  మీరు  పడిన  కష్టాన్ని,  కోల్పోయిన ఆనందాలనూ    మెచ్చుకునేవారు  ఎవరూ  ఉండరు  అనేది  గుర్తు పెట్టుకోండి  
  2. మీ  కొడుకులూ,  కోడళ్ళూ  మీరు  దాచిన  సొమ్ముకోసం  ఎటువంటి  ఆలోచనలు చేస్తున్నారో? ఈ  వయసులో  ఇంకా  సంపాదించి    సమస్యలనూ,  ఆందోళనలూ  కొని తెచ్చుకోవడం  అవుసరమా?  
  ప్రశాంతంగా  ఉన్నది  అనుభవిస్తూ జీవితం  గడిపితే  చాలదా?  
  3. మీ  పిల్లల  సంపాదనలూ,  వాళ్ళ  పిల్లల  సంపాదనల  గురించిన  చింత  మీకు  ఏల?    వాళ్ళ  గురించి  మీరు  ఎంత  వరకూ  చెయ్యాలో  అంతా  చేశారుగా?    వాళ్లకి  చదువు,  ఆహారం, నీడ మీకు  తోచిన  సహాయం  ఇచ్చారు.  ఇపుడు  వాళ్ళు  వాళ్ళ  కాళ్ళమీద  నిలబడ్డారు.ఇంకా  వాళ్ళకోసం  మీ  ఆలోచనలు  మానుకోండి. వాళ్ళ  గొడవలు  వాళ్ళను  పడనివ్వండి.  
   4. ఆరోగ్యవంతమైన  జీవితం  గడపండి.   అందుకోసం  అధిక  శ్రమ  పడకండి. తగిన  మోతాదులో  వ్యాయామం  చెయ్యండి. (నడక, యోగా   వంటివి  ఎంచుకోండి) తృప్తిగా  తినండి.  హాయిగా  నిద్రపోండి.     అనారోగ్య  పాలుకావడం  ఈ వయసులో  చాలా  సులభం,  ఆరోగ్యం  నిలబెట్టుకోవడం  కష్టం.  అందుకే  మీ  ఆరోగ్య  పరిస్థితిని  గమనించుకుంటూ  ఉండండి. మీ వైద్య  అవుసరాలూ,  ఆరోగ్య  అవుసరాలూ   చూసుకుంటూ  ఉండండి.  మీ డాక్టర్  తో  టచ్  లో  ఉండండి.  అవుసరం  అయిన  పరీక్షలు  చేయించుకుంటూ  ఉండండి.    (ఆరోగ్యం  బాగుంది  అని  టెస్ట్ లు  మానేయకండి)  
  5. మీ  భాగస్వామికోసం  ఖరీదైన  వస్తువులు  కొంటూ  ఉండండి.  మీ  సొమ్ము  మీ  భాగస్వామితో  కాక  ఇంకెవరితో  అనుభవిస్తారు?   గుర్తుంచుకోండి ఒకరోజు  మీలో  ఎవరో  ఒకరు  రెండో  వారిని  వదిలిపెట్టవలసి  వస్తుంది.  మీ డబ్బు  అప్పుడు  మీకు  ఎటువంటి  ఆనందాన్నీ  ఇవ్వదు.  ఇద్దరూ  కలిసి  అనుభవించండి.  
  6. చిన్న  చిన్న  విషయాలకు  ఆందోళన  పడకండి. ఇప్పటివరకూ  జీవితం  లో  ఎన్నో  ఒత్తిడులను  ఎదుర్కొన్నారు.   ఎన్నో  ఆనందాలూ,  ఎన్నో  విషాదాలూ  చవి  చూశారు.  అవి  అన్నీ  గతం.  
  మీ  గత  అనుభవాలు మిమ్మల్ని  వెనక్కులాగేలా  తలచుకుంటూ  ఉండకండి,  మీ భవిష్యత్తును భయంకరంగా  ఊహిచుకోకండి.  ఆ  రెండిటివలన  మీ  ప్రస్తుత  స్థితిని   నరకప్రాయం  చేసుకోకండి. ఈరోజు  నేను  ఆనందంగా  ఉంటాను అనే  అభిప్రాయంతో  గడపండి.   చిన్నసమస్యలు  వాటంతట  అవే  తొలగిపోతాయి .  
  7. మీ  వయసు    అయిపొయింది  అనుకోకండి.  మీ  జీవిత  భాగస్వామిని  ఈ  వయసులో  ప్రేమిస్తూనే  ఉండండి. జీవితాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. కుటుంబాన్ని  ప్రేమిస్తూనే  ఉండండి. మీ  పొరుగువారిని  ప్రేమిస్తూ  ఉండండి.  
   "జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలూ  ఉన్నన్ని నాళ్ళూ   మీరు  ముసలివారు  అనుకోకండి.   నేను  ఏమిచెయ్యగలనూ  అని  ఆలోచించండి.  నేను  ఏమీ  చెయ్యలేను  అనుకోకండి"  
  8. ఆత్మాభిమానం  తో  ఉండండి  (మనసులోనూ బయటా  కూడా) హెయిర్  కట్టింగ్  ఎందుకులే    అనుకోకండి.  గోళ్ళు  పెరగనియ్యిలే అనుకోకండి.  చర్మసౌందర్యం  మీద  శ్రద్ధ   పెట్టండి.  పళ్ళు  కట్టించుకోండి. ఇంట్లో  పెర్ఫ్యూమ్ లూ,  సెంట్లూ ఉంచుకోండి. బాహ్య  సౌందర్యం  మీలో అంతః సౌందర్యం  పెంచుతుంది అనే  విషయం  మరువకండి.  మీరు  శక్తివంతులే!  
  
  9. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయిన ఒక  స్టైల్స్ ఏర్పరచుకోండి.  వయసుకు  తగ్గ  దుస్తులు  చక్కటివి  ఎంచుకోండి. మీకు  మాత్రమె  ప్రత్యేకం  అయినట్టుగా  మీ  అలంకరణ ఉండాలి.  మీరు  ప్రత్యేకంగా  హుందాగా ఉండాలి.  
  10. ఎప్పటికప్పుడు  అప్ డేట్  గా  ఉండండి. న్యూస్ పేపర్లు  చదవండి. న్యూస్ చూడండి.  పేస్  బుక్ , వాట్సాప్ లలో  ఉండండి. మీ  పాత  స్నేహాలు  మీకు  దొరకవచ్చు.   
  11. యువతరం ఆలోచనలను  గౌరవించండి.  
  మీ  ఆదర్శాలూ  వారి  ఆదర్శాలూ  వేరు  వేరు  కావచ్చు. అంతమాత్రాన  వారిని  విమర్శించకండి.
  సలహాలు  ఇవ్వండి,   అడ్డుకోకండి. మీ  అనుభవాలు  వారికి  ఉపయోగించేలా  మీ  సూచనలు  ఇస్తే  చాలు. వారు  వారికి  నచ్చితే  తీసుకుంటారు.  దేశాన్ని  నడిపించేది వారే!  
  12. మా  రోజుల్లో ...  అంటూ   అనకండి.  మీరోజులు  ఇవ్వే!  
  మీరు  బ్రతికి  ఉన్నన్ని  రోజులూ   " ఈరోజు నాదే"  అనుకోండి  
  అప్పటికాలం  స్వర్ణమయం  అంటూ  ఆరోజుల్లో   బ్రతకకండి.   
  తోటివారితో కఠినంగా  ఉండకండి.  
  జీవితకాలం  చాలా  తక్కువ.  పక్కవారితో కఠినంగా   ఉండి   మీరు  సాధించేది  ఏమిటి?    పాజిటివ్  దృక్పధం,    సంతోషాన్ని  పంచే  స్నేహితులతో  ఉండండి.    దానివలన  మీ  జీవితం  సంతోషదాయకం  అవుతుంది.    కఠిన  మనస్కులతో  ఉంటె   మీరూ  కఠినాత్ములుగా  మారిపోతారు.    అది  మీకు  ఆనందాన్ని  ఇవ్వదు.  మీరు  త్వరగా  ముసలివారు  అవుతారు.  
  13. మీకు  ఆర్ధికశక్తి  ఉంటె,  ఆరోగ్యం  ఉంటె   మీ  పిల్లలతో  మనుమలతో  కలిసి ఉండకండి. కుటుంబ సభ్యులతో  కలిసి  ఉండడం  మంచిది  అని  అనిపించవచ్చు.  కానీ  అది  వారి  ప్రైవసీకి  మీ  ప్రైవసీకి కూడా  అవరోధం  అవుతుంది.వారి  జీవితాలు  వారివి.   
  మీ  జీవితం  మీది. వారికి  అవుసరం  అయినా,  మీకు  అవుసరం  అయినా  తప్పక  పిల్లలతో  కలిసి  ఉండండి.  
  14. మీ  హాబీలను  వదులుకోకండి.    ఉద్యోగజీవితం  లో  అంత  ఖాళీ  లేదు  అనుకుంటే  ఇప్పుడు  చేసుకోండి.  
  తీర్థ  యాత్రలు  చెయ్యడం,  పుస్తకపఠనం, డాన్స్, పిల్లినో, కుక్కనో  పెంచడం,  తోట పెంపకం, పెయింటింగ్ ...  రచనా  వ్యాసంగం   ...  ఏదో  ఒకటి  ఎంచుకోండి.  
  15. ఇంటిబయటకు  వెళ్ళడం  అలవాటు  చేసుకోండి.  కొత్త  పరిచయాలు  పెంచుకోండి.   పార్కుకి  వెళ్లండి, గుడికి  వెళ్ళండి,  ఏదైనా  సభలకు  వెళ్ళండి.  ఇంటిబయట  గడపడం  కూడా  మీ  ఆరోగ్యానికి  మేలు  చేస్తుంది.  
  16. మర్యాదగా   మాట్లాడడం  అలవాటు  చేసుకోండి.  నోరు  మంచిది  అయితే  ఊరు  మంచిది  అవుతుంది.    పిర్యాదులు  చెయ్యకండి. లోపాలను  ఎత్తిచూపడం  అలవాటు  చేసుకోకండి. విమర్శించకండి. పరిస్థితులను  అర్ధం  చేసుకుని  ప్రవర్తించండి. సున్నితంగా  సమస్యలను  చెప్పడం  అలవాటు  చేసుకోండి.  
  17. వృద్ధాప్యం  లో  బాధలూ,  సంతోషాలూ  కలిసి  మెలసి  ఉంటాయి.  బాధలను  తవ్వి  తీసుకుంటూ ఉండకండి.   అన్నీ  జీవితంలో  భాగాలే  
  18. మిమ్మల్ని  బాధపెట్టిన  వారిని  క్షమించండి   
  మీరు  బాధపెట్టిన  వారిని  క్షమాపణ  కోరండి  
  మీ తోపాటు  అసంతృప్తిని  వెంటబెట్టుకోకండి.  
  అది మిమ్మల్ని విచారకరం  గానూ,  
  కఠినం గానూ   మారుస్తుంది  
  ఎవరు  రైటు అన్నది  ఆలోచించకండి.  
  19. ఒకరిపై పగ  పెట్టుకోవద్దు  
  క్షమించు,  మర్చిపో,  జీవితం  సాగించు.  
  20. నవ్వండి నవ్వించండి. బాధలపై  నవ్వండి  
  ఎందరికన్నానో  మీరు  అదృష్టవంతులు.  
  దీర్ఘకాలం  హాయిగా  జీవించండి.  
  ఈ వయసు వరకు  కొందరు  రాలేరు  అని  గుర్తించండి.  
  మీరు  పూర్ణ  ఆయుర్దాయం  పొందినందుకు   ఆనందించండి. 
శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

మీరు ముందుగా మీ విధులను నిర్వర్తించాలి, తద్వారా ఇతరులకు ధర్మ మార్గాన్ని ప్రేరేపించాలి మార్గదర్శనం చేయాలి

 ఒకప్పుడు, అత్యంత సద్గుణవంతుడైన పెద్దమనిషి తన కుటుంబంతో సహా తీర్థయాత్రకు బయలుదేరాడు.

అనేక మైళ్ల దూరం ప్రయాణించిన తరువాత, కుటుంబం మొత్తం దాహంతో పరితపించారు.  అవి తీవ్రమైన వేసవి నెలలు కావడంతో నీరు ఎక్కడా కనిపించలేదు.  వారు వెంట తెచ్చుకున్న నీరు కూడా అయిపోయింది.   పిల్లలు  దాహంతో అలమటిస్తున్నారు,  అతని వద్ద ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం  లేకపోయింది.  చివరి ప్రత్యామ్నాయంగా  దైవాన్ని ప్రార్థించే సమయం వచ్చింది, "ఓ ప్రభూ!  దయచేసి  ఈ పరిస్థితిని పరిష్కరించే భారం మీదే ",  అని వేడుకున్నాడు.

వెంటనే, అతను కొంత దూరంలో ధ్యానంలో కూర్చోనిఉన్న ఒక ఋషి ని చూశాడు.  ఆ వ్యక్తి ఋషి వద్దకు వెళ్లి తన సమస్యను వివరించాడు.  ఆ ఋషి, ‘ఇక్కడ నుండి ఒక మైలు దూరంలో, ఉత్తరాన ఒక చిన్న నది ప్రవహిస్తుంది, మీరు అక్కడకు వెళ్లి మీ దాహం తీర్చుకోవచ్చు’, అని అతనికి తెలియజేశాడు.

ఇది విని ఆ వ్యక్తి చాలా సంతోషించి, ఋషికి కృతజ్ఞతలు తెలిపాడు. నడవలేని పరిస్థితిలోఉన్న తన భార్య , పిల్లలను అక్కడే ఉండమని చెప్పి, అతనే  స్వయంగా నది వైపు నీరు తీసుకురావడానికి వెళ్లాడు.

అతను నీటితో తిరిగి వస్తుండగా, దారిలో విపరీతమైన దాహంతో ఉన్న ఐదుగురు వ్యక్తులు కనిపించారు, అతను చాలా ధర్మశీలుడైనందున, వారిని ఆ స్థితిలో చూడలేకపోయాడు,  దాహంతో ఉన్న వారికి తన నీటిని ఇచ్చి, తిరిగి నదికి వెళ్లాడు.  అతను తిరిగి వస్తున్నప్పుడు,  మళ్లీ నీటి కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్న కొంతమంది వ్యక్తులను కలుసుకున్నాడు. మరోసారి, అతను తన నీటిని మొత్తం వారికి ఇచ్చాడు.

అతను మూడవసారి నీరు తీసుకుని  కుటుంబాన్ని చేరే సమయానికి, వారందరూ తీవ్రమైన దాహార్తికి గురై,  అపస్మారక స్థితిలో నేలపై పడి ఉన్నారు.  వారి ముఖాలపై నీరు చల్లి మేల్కొల్పడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. అతను తీవ్రంగా ఏడ్చాడు, నిరాశతో ఋషి వద్దకు పరుగెత్తాడు.  అతని పాదాలపై పడి దుఃఖిస్తూ, “మహర్షీ చెప్పండి, నా కుటుంబం ఈ స్థితిలో ఉండటానికి నేను ఏపాపం చేసాను? నేను ఆపదలోఉన్నవారికి  సహాయం చేసి, ధర్మబద్ధమైన పని చేసాను.  దయచేసి నా కుటుంబానికి సహాయం చేయండి స్వామి,” అని వేడుకున్నాడు.

దానికి ఋషి, "ఓ సజ్జనుడా! నీవు నది నుండి నీళ్లు తెచ్చుకుంటూ, దాహంతో ఉన్న బాటసారుల కోసం నీ పాత్రను ఖాళీ చేసుకున్నావు. దీనివల్ల నువ్వు ఏమి ప్రయోజనం పొందావు చెప్పు?" అని అడిగాడు.

ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు, "దాని నుండి నేను పొందే దాని గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు; ఎలాంటి స్వార్థపూరితమైన ఆలోచన లేకుండా నేను ధర్మాన్ని పాటించానని భావించాను."

ఋషి ఇలా అన్నాడు, " మీ బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు, అలాంటి నీతి, ధర్మాల వలన ఉపయోగం ఏమిటి? నీ స్వంత పిల్లలను, కుటుంబాన్ని కాపాడుకోలేని పుణ్యం వల్ల ఏమిటి లాభం? మీరు మీ ధర్మాన్ని నేను చూపిన మార్గంలో కూడా నెరవేర్చి ఉండవచ్చు కదా!."

ఆ వ్యక్తి ఆసక్తిగా, "ఎలా మహానుభావా?" అని అడిగాడు.

దానికి ఋషి, "నీ కోసం నేను నీళ్లు ఇవ్వడానికి బదులుగా, నదికి వెళ్లే మార్గాన్ని నీకు చూపించాను. మీరు కూడా, ఆ దారిన వెళ్లే వారందరికీ మార్గం చూపించి, వారిని నదికి నడిపించాల్సింది. ఆ విధంగా, మీ స్వంత కుటుంబంతో సహా అందరి దాహం తీరిఉండేది.  ఇతరుల కోసం ఎవరూ తమ స్వంత పాత్రను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు."   అని   ఋషి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు తన దీవెనలు ఇచ్చి, అదృశ్యమయ్యాడు.

ఆ వ్యక్తి  తన గుణపాఠాన్ని నేర్చుకున్నాడు. స్వంత  బాధ్యతలను విస్మరించి, మంచి పనుల్లో పాల్గొనడం అంత ధర్మం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకున్నాడు.

 మీరు ముందుగా మీ విధులను నిర్వర్తించాలి, తద్వారా ఇతరులకు ధర్మ మార్గాన్ని ప్రేరేపించాలి  మార్గదర్శనం చేయాలి 

ఎవరికైనా మంచి చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, భగవంతుని మార్గాన్ని, సత్య మార్గాన్ని చూపించటమే.


సేకరణ. మానస సరోవరం 👏

Wednesday, July 27, 2022

మంచిని గ్రహించండి! చెడుని వదలండి!!

🙏ఆప్తులు అందరికీ శుభోదయం 🙏

మంచిని గ్రహించండి!
➖➖➖✍️

మంచిని గ్రహించండి! చెడుని వదలండి!!

క్షమిస్తున్నారు కదా అని
మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ
కష్టపెట్టకు!
వాళ్ళు ఒక్క క్షణం
మంచితనాన్ని మర్చిపోయారంటే
వేరేలా మారడానికి
నిమిషం కూడా పట్టదు!

మనకు ఎన్ని పనులు ఉన్నా
ఉదయాన్నే మనసుకు నచ్చినవారిని పలకరించడంలో ఉండే ఆనందం
మాటల్లో చెప్పలేం!

విలువ లేని దుమ్ము కూడా,
ఒక్కోసారి నీ కంట్లో పడి,
నిన్ను విలవిలలాడేలా చేస్తుంది..!

అలాగే కొందరు విలువ లేని మనుషులు కూడా,
చాలాసార్లు వారి మాటలతో బాధపెడతారు,
ఊదేసుకుని ముందుకు వెళ్ళడమే ఉత్తముల లక్షణం...!

"నీ చుట్టూ ఉన్నవాళ్ళ స్థానం, స్థాయి మారితే
నిన్ను మర్చిపోతారేమో.
అయినా కూడా
నువ్వు నీలానే ఉండాలి!
స్థానం మారినా, స్థాయి మారినా!
అదే వ్యక్తిత్వం అంటే!"

"ఏదీ శాశ్వతం కాదు!
నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు.
ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే
మారిపోక తప్పదు."

కాలం ఎందరినో
పరిచయం చేస్తుంది.
కానీ కొందరినే
మనసుకు నచ్చిన వారిగా
మార్చుతుంది.
అది స్నేహమైనా, ప్రేమైనా..!!

మనిషిని గెలుచుకోవడంలో
సంతోషం ఎన్నిరోజులు
ఉంటుందో తెలియదు కానీ...
మనసును గెలుచుకోవడంలో
ఉండే సంతోషం మాత్రం...
జీవితాంతం ఉంటుంది....!!

మనం ఇతరులకి సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకి ఇవ్వడమే తెలుసు. మంచి మనుషులు కూడా అంతే… ఇతరులకి సాయం చెయ్యడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడు ఏమీ ఆశించరు!

మన కష్టంలో మనవాళ్లే
కలిసిరానప్పుడు
ఎవరో ఆదుకోవడానికి
రాలేదని బాధపడటం
అనవసరం.

ఎక్కువగా నమ్మటం,
ఎక్కువగా ప్రేమించటం,
ఎక్కువగా ఆశించటం..
ఫలితంగా వచ్చే బాధ కూడా
ఎక్కువగానే ఉంటుంది.✍️


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀