⛳ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర⛳
" ముందుగా షేర్ చేయండి తర్వాత పూర్తిగా చదువుకోండి "
" అందరికి తెలియజేయండి రాజే జీవిత చరిత్ర "
చత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1627 - ఏప్రిల్ 3, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.
ఉపోద్ఘాతం ⛳
శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్రావ్ అనే మరాఠా యోధుణ్ణి నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు.
==శివాజీ క్రీ.శ. ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ కున్భీ కులానికి చెందినవారు. జిజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై (పార్వతి) పేరు శివాజీకు పెట్టింది.
షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా, మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది, పూణే వదిలి వెల్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు. చత్రపఠీ శివాజీ మహారాజ్ కి జయ్
సామ్రాజ్య అంకురార్పణ ⛳
షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.
సుల్తానులతో యుద్ధాలు ⛳
పోరాడుతున్న శివాజీ
17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.
శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజి అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు.
ప్రతాప్ఘడ్ యుద్ధం ⛳
శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చకొట్టడానికి శివాజీ ఇష్ట దైవమయిన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు.
అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినపుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను, శివాజీ సైన్యాధికారులు అడ్డుకోనగా, శివాజీ తన దగ్గరన్న పిడి పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీనరసింహ వలె చీల్చి చెందాడుతాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుండగా, ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు.
శివాజీ ఉపయోగించినదిగా చెప్పబడుతున్న
అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమయిన అడవుల్లో అటకాయించి మెరుపుదాడులతో మట్టికరపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగయినా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్థూన్ సైనికులను పంపించగా, శివాజీ సేన వేల సంఖ్యలో పస్థూన్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్ఠలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు.
కొల్హాపూర్ యుద్ధం ⛳
ఇది సహించలేని బిజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి మెరికల్లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. 'హర హర మహాదేవ ' అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృభించి శతృవులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికయినా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలు పెట్టాడు.తన మేన మామ షాయైస్త ఖాన్ ను శివాజీ పై యుద్ధానికి పంపాడు.
పవన్ఖిండ్ యుద్ధం ⛳
రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న అదిల్షా మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమయిన సైనిక, ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్హాలా కోటలో శివాజీ కొన్ని వందలమంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ విషయం తెలుసుకొన్న శివాజీ ఎలాగయినా పన్హాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్ఘడ్ కోటకు చేరుకొంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు. కానీ అప్పటికే పన్హాలా కోట చుట్టూ శత్రుసైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్దంగా లేనని దయతలచవలసినదిగా సిద్ది జోహార్కు వర్తమానం పంపాడు. అది తెలుసుకొన్ని సిద్ది జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకొంటుంటే, శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోటవైపు పయనించసాగాడు. చివరిక్షణంలో ఇది తెలుసుకొన్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు.
కోటకు చేరుకొనేలోపు శత్రువులు తమను సమీపించగలరు అన్ని విషయం గ్రహించి బాజీ ప్రభు దేశ్పాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలసి తాము శత్రుసైన్యాన్ని ఎదుర్కొంటామని, శివాజీని తన అంగరక్షకులతో ఎలాగయినా కోట చేరుకోమని చెప్పి ఒప్పించాడు. శివాజీ కోట వైపు వెళ్ళిన వెంటనే బాజీ ప్రభు దేశ్పాండే రెండు చేతులా ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేశాడు.
300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమయిన శత్రువులతో పొరాడి నేలకొరిగారు. అప్పటికి శివాజీ తన కోట చేరుకున్నాడు. కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా పన్హాలా కోట లభించింది.
ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం. ఆ తరువాతి కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది.
మొఘలులతో యుద్ధాలు ⛳
షైస్తా ఖాన్ తో యుద్ధం సవరించు
1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్కు లక్షకు పైగా సుశిక్షుతులయిన సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. బలమయిన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరుచుకొన్నాడు.
ఎప్పటికయినా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమయిన భద్రతను ఏర్పాటు చేసాడు. 1663 ఏప్రిల్లో నగరంలో ఒక పెళ్ళి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలసి పెళ్ళికూతురు తరపున బంధువుల్లో కలసిపోయి లాల్ మహల్ చేరుకొన్నాడు. ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడింది.కాబట్టి, సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకొన్నాడు. శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఖాన్ మూడువేళ్ళు తెగి కింద పడగా, షాయిస్తా ఖాన్ కిటికీలో నుండి దుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు. అంతలో ఇది పసిగట్టిన షైస్తా ఖాన్ అంగరక్షకులు షాయిస్తా ఖాన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళారు. మొఘలులకు మచ్చ తెచ్చిన షాయిస్తా ఖాన్ను ఔరంగజేబు సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపించివేసాడు.
సూరత్ యుద్ధం ⛳
1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపారకేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అపారమయిన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేలమందిని తన సైన్యంలో చేర్చుకొన్నాడు. కొద్దిరోజుల్లో మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు.
ఇది చూసిన ఔరంగజేబు ఆగ్రహోద్రుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడయిన రాజా జై సింగ్ను శివాజీ పైకి పంపించాడు. రాజా జై సింగ్ సంగతి తెలిసిన శివాజి తాను యుద్ధంలో ఓడిపోవడం ఖాయమని తెలుసుకొని సంధికి ఒప్పుకున్నాడు. సంధిలో భాగంగా 23 కోటలను, 4,00,000 రూపాయలను మొఘలులకు చెల్లించాడు.
శివాజీ తాను కూడా ఒక మొఘల్ సర్దార్గా ఉండడానికి అంగీకరించాడు. మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని తన శతృవులయిన బిజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించడానికే శివాజీ మొఘల్ సర్దార్గా ఉండడానికి ఒప్పుకున్నాడు.
ఆగ్రా కుట్ర ⛳
1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. సభలో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజి బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్ళి అక్కడే బందీ చేశారు.
ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా, దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీ, శంభాజీ ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని ఒక వాదన.
అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల, మొఘలులు మరిన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉండడంవల్ల ఔరంగజేబు శివాజీనుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యంపోందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి లక్ష మంది సుశిక్షితులయిన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది.
సింహగఢ్ యుద్ధం ⛳
శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా, పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు. ఆకోటను ఉదయ్భాన్ రాథోడ్ అనే రాజపుతృడు పరిరక్షిస్తుండడమే కారణం. దుర్భేధ్యమయిన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తనదగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకొన్ని తానాజీ మలుసారేకి ఆ కోట స్వాధీనం చెసుకొని బాధ్యత అప్పగించాడు.
తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్దిరోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమయిన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ 'యశ్వంతి ' అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు.
అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారంపైన దాడి చేసాడు. మారాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకరపోరులో మరాఠాలు గెలిచినా తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ 'కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకొన్నాము ' అన్నాడు. సింహంవలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహఘడ్గా మార్చాడు.
చివరిదశ ⛳
శివాజీ పట్టాభిషేకము
జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీఅధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు.
27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించాడు.
శివాజీ పెద్దకొడుకయిన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు.
పరిపాలనా విధానం ⛳
యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్ఠమయిన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసాడు. ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు.
వ్యక్తిత్వం ⛳
సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసాడు.
ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో "నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విదంగా గౌరవించబడ్డారు.
నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులో ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేసాయి.
సైన్యం ⛳
మరాఠా సామ్రాజ్యం ముగిసేవరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. గెరిల్లా యుద్ధ విధానం శివాజీతోనే మొదలయింది. కొత్త ఆయుధాలను కనుగొని వాటితో యుద్ధాలు చేయించడం శివాజీకి ప్రత్యేక అభిరుచి. పటిష్ఠమయిన నౌకా దళాన్ని, ఆశ్వికదళాన్ని ఏర్పాటు చేసాడు. ఎనిమిది నెలలు పంటలు పండించే రైతులు కూడా నాలుగు నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలను అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాలవారు కోటను పరిరక్షించేవారు. మరణించే నాటికి శత్రువులందరూ వెనుకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ.
కోటలు ⛳
మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.
అసలు సిసలు హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ⛳
శివాజి...
(అసలైన హిందువు అసలైన సెక్యులర్)
జననం – 19.02.1627 (వైశాఖ, శుక్ల పక్ష తదియ).
మరణం – 04.041680 (చైత్ర పౌర్ణమి).
17వ శతాబ్ధిలో శివాజీ మనోఫలకం పై ఆవష్కరించిన హైందవ స్వరాజ్యం అధిరోహించిన, “హిందూ సామ్రాజ్య దినోత్సవం” – 06.06.1674 (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, గురువారం).
హి.సా.ది. సంఘ ఉత్సవాలలో 2వది. (ఉగాది, హి.సా.ది., గురుపూర్ణిమ, రక్షాబందన్, విజయదశమి, మకర సంక్రాంతి)
తల్లి – జిజియా బాయి,
తండ్రి – షాహాజీ (షాహాజీ జననం – 1599. తండ్రి పేరు – మాలోజీ). భార్య- సయీ బాయీ.
జన్మ స్థలం – పూణే జిల్లాలోని జున్నార్ పట్టణంలో శివనేరి కోటలో.
పెద్ద కొడుకు – శంభాజీ,
గుఱ్ఱం పేరు- కృష్ణా
పుట్టినది 1627
రాజ్యాధికారం చేపట్టిన సంవత్సరం (16 సం. చిరు వయస్సులో) 1643
హైందవ రాజ్యస్థాపన 1674
మరణం 1680
మొత్తం రాజ్యపాలనా కాలం (1643 నుండి 1680) 37
హైందవ రాజ్యస్థాపన చేసి పాలించిన కాలం (1674-1680) 6
శివాజి వ్యక్తిత్వం ప్రముఖంగా నలుగురు గురువుల సాంగత్యంలో సాగింది. వీరందరి శిక్షణలో అత్యంత పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, మేథావి అయ్యాడు.
మొదటి గురువు జిజియా బాయి. బాల్యంలో ఆమె చెప్పిన కథలు శివాజీని పరాక్రమ వంతుడిగా తీర్చిదిద్దాయి.
రెండవ గురువు దాదాజీ కొండదేవ్. దగ్గర రాజకీయం, యుద్ద తంత్రం నేర్చుకున్నాడు.
మూడవ గురువు తుకారామ్. వీరి దగ్గర సామాజిక సమరసత నేర్చుకున్నాడు శివాజీ.
నాల్గవ గురువు సమర్థ రామదాసు. వీరి దగ్గర ఆధ్యాత్మికత, హైందవ పరిరక్షణనే జీవిత పరమార్థమనే విషయాన్ని నేర్చుకున్నాడు. ఈ విధంగా శివాజీ వ్యక్తిత్వం అన్ని రకాలుగా అత్యంత శ్రేష్ఠమైనదిగా తీర్చి దిద్ద బడింది.
నవాబు కి దండం పెట్టని శివాజి.⛳
షాజీ, తన పని చేస్తున్న బీజాపూర్ సుల్తాన్ దర్బారుకి తీసుకి వెళ్ళాడు. 12 సం.ల శివాజిని కూడా తీసుకు వెళ్ళాడు తండ్రి. సుల్తాన్కి సలాము చేసిన తండ్రి కొడుకుని కూడా సలాము చేయమన్నాడు తండ్రి. “పరాయ రాజుకు ముందు వంగి సలాము చేయను” అన్నాడు శివాజి. తండ్రి శివాజీ ధైర్యాన్ని మనసులోనే అభినందించాడు. బాల్యం నుండి అంతడి దేశ భక్తి, జాతీయాభిమానం కలిగిన వాడిగా తీర్చిదిద్దింది ఆయన తల్లి జిజియా బాయి.
ఆవు – శివాజి⛳
ఒక నాడు ఒక ముస్లిము ఒక ఆవుని వధించడానికి లాక్కుపోతుండగా చూసాడు శివాజి. 10 సం. కూడా నిండని శివాజి ఆ ముస్లిముతో ఆవుని విడిచేదాకా వాదులాడాడు. కబేళాకి తరలిపోతున్న ఆవుని విడిపించాడు.
శివాజి – తోరణ దుర్గ కోట విజయం⛳
16 సం. ప్రాయంలోనే శివాడీ తోరణ్ కోట (దుర్గా)న్ని జయించాడు. ఈ విజయంతో శివాజీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. కొండదేవ్ శిక్షణని అంత అద్భుతంగా ఒడిసి పట్టాడు శివాజి.
శివాజి – తల్లి కొరిక శింహ ఘడ్⛳
చదరంగంలో ఓడిపోయిన శివాజీని ముస్లిముల ఆధిపత్యంలో ఉన్న సింహ ఘడ్ని బహుమతిగా ఇమ్మంది తల్లి. పుత్రుడి పెళ్ళి పనిలో నిమగ్నమైన తానాజీని పిలిపించాడు. తల్లి కొరికని చెప్పాడు. వెంటనే సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు తానాజీ. భయంకర యుద్దం చేసి కోటని స్వాధీనం చేసుకున్నారు సైనికులు. తానాజీ వీరమరణం పొందాడు. “సింహ గడ్ లభించించి కాని సింహం పోయింది” అన్నాడు శివాజి. కొడుకు పెళ్ళిని కూడా లెక్క చేయాక శివాజీ ఆజ్ఞని సిరసావహించి, వీరమరణం పొందిన ఈ ఉదంతం శివాజీ మాటకి అతడి సైనికులో ఎంతటి విలువ ఉందో తెలియ జేస్తుంది.
శివాజి – ఆంధ్ర పర్యటన⛳
1677 లో భాగ్యనగర్ వచ్చిన శివాజి, అక్కడ నుండి శ్రీశైలం వెళ్ళి అష్టాదశ పీఠాలలో ఒకటైన బ్రమరాంబ దేవిని దర్శించాడు. ఆమెకి తన శిరస్సుని బలిగా ఇద్దామని ప్రయస్తున్న శివాజికీ అమ్మ ప్రత్యక్షమై- నీ శిరస్సుని నా కెందుకు. నీ అవసరం దేశానికి చాలు ఉంది. నీ మెధస్సుని, క్షాత్రాన్ని, ధర్మ రక్షణకై వినియోగించు అని పలికిన అంబ శివాజీకి ఒక ఖడ్గాన్ని కానుకగా ఇచ్చింది. శివాజి శేష జీవితాన్ని ధర్మ రక్షణకై వినియోగించారు. ఈ ఉదంతంతో, హైందవ పరిరక్షణ బాధ్యతని దైవమే స్వయంగా శివాజీకి ఇచ్చిందని తెలుస్తుంది.
శివాజీ రాజ్యం – ఇతర ఎన్నో రాజ్యాలు⛳
విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయలు, హరి-హర, బుక్కరాయలులాంటి వారు సామ్రాజ్యాన్ని స్థాపించి వ్యాపించిన తరువాతనే ప్రసిద్ధి పొందారు. శివాజీ స్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా, శివాజి రాజ్య విస్తరణకు పూర్వమే శివాజీ పేరు విన్నంతనే ముస్లిము రాజులకు వణుకు పుట్టేది. శివాజి స్వయంగా ప్రతిసైనికుణ్ణి భర్తీ చేసి తన రాజ్యాన్ని బరహన్ పూర్ (నేడు భుసావల్, జలగావ్) నుండి బెంగుళూరు వరకూ, బీజాపూర్ నుండి పశ్చిమ సముద్రం వరకూ వ్యాపింపచేసాడు. రాజ్యపాలన సౌలభ్యం కొరకు నలుగురు గవర్నర్లను నియమించాడు. సతారాలో పీష్వా (పధాన మంత్రి) పూణేలో ఉండేవారు.
క్రమంగా 28 సంవత్సరాలు వచ్చే సరికి కోండాణా, పురందర్, ప్రతాప్ ఘర్, రాజ ఘర్, చాకణ్ తో పాటు మరోక 40 కొటలపై విజయం సాధించి విజయపతాన్ని ఎగురవేసాడి శివాజి.
మరోక పక్క ఆంగ్లేయులు, పోర్చుగీసువారు, అప్పటికే దేశంలో ఉన్న ముస్లిములు, మొగలులు దేశాన్ని మరింత ఆక్రమించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
శివాజీ - రాజ్యపాలన⛳
ఈ నాడు మనం సామ్యవాదం, సోషలిజం, లిబరలిజం, ప్రజాతంత్రం అనే మాటలను పదే పదే వింటుంటాము. శివాజీ పాలనలో ఇవి అన్ని సర్వసమావేశమై ఉండేవి. అన్ని మత, పూజా పద్ధతులను పాటించేవారికి సమాన హోదా ఉండేది.
శివాజీ – పళ్ళ బుట్ట⛳
అవసరమైనప్పడు శివాజీ మొఘలురాజులకు లొంగినట్లు నటించి వారి శతృ సైన్యం సాయంతోనే బిజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించాడు శివాజి. ఈ క్రమంలో 1666లో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. శివాజిస తన ఆరేళ్ళ కొడుకుతో ఔరంగజేబు కలవడానికి వచ్చాడు. వంచించడమే తెలిసిన ఔరంగజేబు శివజీనీ, శంబాజీని చంపేస్తే మరాఠాల విద్రోహన్ని తట్టుకోవడం కష్టమని తలంచి వారిద్దిరిని చెఱసాలలో వేసాడు. శివాజీ ఆగ్రాలోని ఆపన్నులకు పళ్ళను పంపండానికి అనుమతి పొందాడు. కొన్ని నెలల తరువాత, ఎమరుపాటుగా ఉన్న ఔరంగజేబు బటుల కళ్ళుగప్పి, మారువేషంలో శివాజీ, తన కొడుకుతో సహా పళ్ళ బుట్టలు దాగుని తప్పించుకున్నాడు. ఇలాంటి సమయస్ఫుర్తితో ఎప్పటికప్పుడు నూతన పథకాలతో తని పనిని పూర్తి చేసాడు శివాజి.
శివాజీ - రొడ్ల విస్తరణ, భవన నిర్మాణం⛳
శివాజి పెద్ద పెద్ద రొడ్ల నిర్మాణం చేయించి, వ్యవసాయ, వర్తక వ్యాపారానికి పెద్ద పీట వేసి సర్వాంగీణ వికాశానికి తొడ్పడ్డాడు. సమాజంలోని అన్ని వర్గాలు సుఖంగా, సమృద్దిని సాధించాయి.
శివాజీ - స్వదేశీ విజ్ఞానం⛳
ఐరోపా నుండి ముద్రణ యంత్రాలను తెప్పించి, ఆ యంత్రాల అధ్యయనం చేసి స్వదేశీ అవసరాల కనుగుణంగా నూత యంత్రాల అవిష్కరణని ప్రోత్సహించాడు.
యుద్ధం నెగ్గడంలో అస్త్ర-శస్త్రాల ప్రాముఖ్యతని గుర్తించిన శివాజి, విభిన్న దేశాల నుండి అత్యాధునిక అస్త్ర-శస్త్రాల తెప్పించి, స్వదేశీ విజ్ఞానాన్ని జొడించి వాటిని మరింత మెరగు పరిచి యుద్ధాలలో వాడుకలోకి తీసుకవచ్చాడు.
అదే విధంగా అప్పటికే ప్రవంచంలో ఉన్న పెద్ద ఓడలను కొనుగోలు చేసి, స్వదేశంలో ఉన్న నౌకా శాస్త్ర గ్రంథాల అధ్యయనంతో వాటిని మరింత మెరుగపరిచి ప్రపంచంలో అత్యంత పెద్ద ఔడల నిర్మాణం చేయించాడు. వ్యాపారానికి, యుద్ధానికి ప్రత్యేకమైన నౌకల నిర్మాణం చేపట్టాడు. ఆనాడు శివాజి దగ్గర ఉన్న ఓడలు విదేశీయులను ఆశ్చర్యంలో ముంచెత్తేవి.
ఈ విధంగా శివాజీ శాస్త్ర-సాంకేతికతకి పెద్ద పీట వేసీ ఉత్తమ ఫలితాలను సాధించాడు.
శివాజి – భాష⛳
ప్రతి దేశానికి తన సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకు పోవడానికి భాష చాలా అవసరం. ఆయా ప్రదేశాలలో జన్మించిన భాష మాత్రమే ఈ పని చేయగలదు. కాని విదేశీ ఆక్రమణ దారులు, దౌర్జన్యపూరితంగా ఫారసీని స్థానీయ రాజ్య భాషగా, స్థానీయ భాషగా పాదుకొల్పారు. శివాజి ఈ విదేశీ భాషని తీసి వేసి స్థానీయ భాషని పాలనా భాషగా, ప్రజా భాషగా అభివృధ్ధి చేసాడు.
శివాజి – హిరకణి (గోబాల)⛳
హిరకణి అనే గో బాలిక, శివాజీ కోటలో పాలు అమ్ముకునేది. ఒక సారి అమ్మకం ముగించుకుని ఇంటికి పోదామనుకునేసరికి రాత్రి కావడంతో కోట ముఖద్వారం మూసివేయబడింది. తన పసి బిడ్డడికి పాలు పట్టించవలసి ఉండటంవలన ఒక బండరాయపైకి ఎక్కి కొట దాటి, ఇల్లు చేరుకుని బిడ్డడికి స్తన్యాన్నిచ్చింది ఆ తల్లి.
ప్రముఖద్వారం మూసిఉన్నప్పటికి కొట దాటే మార్గాంతరాన్ని బయట పెట్టినందుకు ఆమెని సన్మానించాడు శివాజి. ఏ బండరాయిని ఎక్కి ఆమె బయట పడిందో దానిని కొట్టించి కొటని మరింత కట్టుదిట్టం చేసాడు శివాజి. ఈ నాటికి ఈ స్థలాన్ని హిరకణి దుర్గం అని పిలిస్తారు.
ఈ ఉదంతం తన కోట యొక్క పటిష్టత, సంరక్షణకి శివాజీ ఎంతటి ప్రాధాన్యతని ఇచ్చాడో తెలియజేస్తుంది. అదే విధంగా ఈ రోజు సైబర్ పటిష్టతకోసం హేకర్లను నియమించుకుని అంతర్జాల పటిష్టతని మరింత మెరుగుపరుచుకుంటున్నామా, శివాజీ ఆ గోబాలకి సన్మానం చేసి పారితోషకాన్ని ఇచ్చి అలాంటి పనినే సాధించాడు.
శివాజి – న్యాయమూ, చట్టమూ⛳
రాంఝా గ్రామం పటేలు ఒక స్త్రీని బలత్కరించినట్లుగా తెలిసింది. విచారణలో అది నిజమని కూడా నిర్థారించబడింది. శివాజీ ఆ పటేలుకి కాళ్ళూ చేతులు నరికివేసే శిక్ష విధించి అమలు పరిచాడు.
శిక్షలను అమలు పరచడంలో ఎంత మాత్రం చాప్యం చెయ్యని కారణంగా శివాజి పరిపాలనలో నేరాల సంఖ్య బహుకొద్దిగా ఉండేవి.
శివాజీ – స్త్రీ గౌరవం⛳
శివాజీ సైనికులు ఒక అత్యంత సుందరమైన ముస్లిము యువతిని బలవంతంగా తీసుకు వచ్చి శివాజీ ముందు హాజరు పరిచి శివాజీ వారి చర్యని అభినందించి బహుమానం ఇస్తాడనుకున్నారు. సైనికులను హెచ్చరించిన శివాజీ ఆమె కాళ్ళపై బడి – తల్లి నా సైనికులు చేసిన పనికి క్షమించు. నా తల్లి కూడా ఇంత అందంగా ఉండి ఉంటే నేను ఇంకేంత అందంగా పుట్టి ఉండేవాడినో అని,. ఆ ముస్లిము యువతిని సకల రాజలాంచనాలతో ఆమె ఇంటికి పంపించాడు శివాజి.
ముస్లుములు, అన్య మతస్తులు, ప్రముఖంగా మహిళలకి ఎన లేని గౌరవాన్ని ఇచ్చాడు శివాజి. ఎవరికి భయం పడకుండా సంచరించే ఉత్తమ పరిపాలనని అందించాడు శివాజి. ఈ రోజు మైనారిటీ వాదమని, మహిళా అధికారాలని, సెక్యూలరిజం అని అంటున్న ఎన్నింటినో శివాజి వాస్తవంగా సాధించి చూపించాడు.
శివాజీ – మతసరసత⛳
శివాజీ తన పాలన లో ఎక్కడ ఎవరికి ప్రత్యేకతలను ఇవ్వకుండా అందరికి సమాన హోదా కల్పించి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించి, అందరికి బద్రత కల్పించాడు. గుళ్ళు గోపురాలతో పాటు ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు ఉండడమే కాక, ప్రముఖ విభాగాలైన ఆయుధాల విభాగానికి - హైదర్ ఆలీ, నావికాదళానికి - ఇబ్రహీం ఖాన్, మందుగుండు విభాగానికి - సిద్ది ఇబ్రహీం అధ్యక్షత పదవీ బాధ్యతలును నిర్వహించారు. దౌలత్ ఖాన్, సిద్ధిక్ లు సర్వ సైన్యాధ్యక్షులుగా ఉండేవారు. విశేషమేమిటంటే, శివాజీ అంగ రక్షకులలో చాలా ప్రముఖ వ్యక్తి మదానీ మెహ్తర్. ఇతను శివాజీనీ అగ్రా కోట నుండి తప్పించడంలో ప్రముఖ పాత్ర నిర్వహించాడు.
మత ప్రాతిపధిక కాక, యోగ్యతకి పెద్ద పీట వేసి, మైనారిటీ, మెజారిటీ అనే నేటి కుహాన విభజనకి అతీతంగా అందరూ సమానమే అనే భావనని నెలకొల్పిన హిందూ రాజు శివాజి. అందుకే శివాజి గొప్ప హిందువు. మరియు నేటి భాషలో గొప్ప సెక్యూలరిస్టు.
శివాజి - అఫ్జల్ ఖాన్⛳
శివాజీ పరాక్రమం, మెరుపుదాడులు, గెరిల్లా యుద్ద పద్దతులను ఎదుర్కోలేనని అఫ్జల్ ఖాన్ శివాజీనీ ప్రత్యక్షంగా యుద్దభూమికి రప్పించి ఓడింద్దామని అనుకున్నాడు. శివాజీ ఇష్ట దైవమయిన భవానీదేవి దేవాలయాలను కూల్చేసి, శివాజీని రెచ్చకొట్టాడు అఫ్జల్ ఖాన్. మొగలుల వ్యవహారశైని బలాబలాలను, పరిస్థితులను అంచనా వేయడంలో దిట్ట అయిన శివాజీ, యుద్దానికి దిగకుండా సంధికి దిగాడు. ప్రతాప్ఘడ్ కోటలో సమావేశానికి ముందు ఇనుప కవచాన్ని ధరించి, పులిగోర్లు పెట్టుకుని బయలుదేరాడు. శివాజి. అఫ్జల్ ఖాన్ శివాజీనీ రా భాయీరా అని కౌగలించుకుని కత్తితో పొడిచి హత్య చేద్దామని ప్రయత్నించాడు. ఇనుప కవచం శివాజీని రక్షించింది. శివాజి మోరుపు వేగంతో తన ముందే తెచ్చుకున్న పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పై దాడి చేసి వధించాడు శివాజి.
పదే పదే దేశం మీద తెగపడుతున్న నేటి పొరుగుతో శిఖరాగ్ర చర్చలు జరుపుతున్న మన ప్రభుత్వాల వ్యవహార శైలికి భిన్నంగా, ఈ ఉదంతం, శివాజీ అంటే నిరంతర అప్పమత్తత, సరియైన సమయంలో సరియైన ఆక్రమణ. స్నేహితిడికి స్నేహితుడు. శత్రువుకి శత్రువు. మంచికి మంచి. చెడుకి చెడు అనే శివాజీ వ్యవహార శైలిని తెలియ జేస్తుంది.
శివాజి - ఔరంగ జేబు⛳
శివాజీ ఔరంగ జేబుకి ఒక లేఖ రాసారు. అందులో ఎన్నో విషయాలు చర్చిస్తూ అంతిమంగా ఇలా రాసారు –
“చక్రవరీ! ఖురాన్ దేవుడిని రబ్బుల్ అలమీన్ గా వర్ణించింది. అంటే విశ్వానికి అంతటికి దేముడు. కేవలం ముసల్మానులకు దేముడని కాదు. ఇస్లాము. హైందవము రెండూ అతీత శక్తులకు సుందరమైన భాష్యం చెప్పాయి. మసీదులో ప్రార్థనకి పిలుపునిస్తే, గుడిలో గంట కొడతారు. మతోన్మాదం, మత విద్వేషం కలవారెవరైనా దేవుడి ఆదేశాలకు వ్యతిరేకంగా నడుస్తున్నట్లే అర్థం. ఇలాంటి పనులు చేసేవారు దేవుడనే కళాకారుడి సృష్టిని ఎదిరిస్తున్నట్లే అర్థం. ఏ రకమైన సృష్టిలో లోపాలు వెదికినట్లైతే దానికర్థం మీరు ఆ కళాకారుడుని వ్యతిరేకిస్తున్నట్లే కదా. అలా చేయకండి.”
ఇలా స్పష్టంగా చెప్పడమే శివాజీ సెక్యూలరిజం. అంతే కాని బుజ్జగింపు ధోరణితో అన్నీ సమానమంటు ఊక దంపడు ఉట్టికింపులివ్వడం శివాజీ నైజం కాదు.
బ్రిటీషు సైన్యం – శివాజి సైన్యం⛳
1795లో వింధ్య పర్వతాలలో ఆంగ్లేయులకి శివాజీకీ పోరు జరిగింది. శివాజీ నాయకుడు మహోదాజీ సింథియా. అప్పటి పీష్వా ఫడ్నవీస్. ఈయన శివాజీ సైన్యంలో గుఱ్ఱపు స్వారీరాని ఏకైక వ్యక్తి. శివాజీ సైన్యం చాలా చిన్నది. బ్రిటీషు సైన్యం చాలా పెద్దది. ఒక పక్క గుఱ్ఱపు స్వారీ రాని నాయకుడు, మరోక పక్క చిన్న సైన్యం అయినా ఆంగ్లేయులు శివాజీ సైన్యంలో అత్యంత దారుణంగా ఓడిపోయారు. ఈ ఉదంతాన్ని, బ్రిటీషువారు, ప్రపంచ చరిత్రలో ఇంతటి పరాజయాన్ని ఎన్నడు చూడలేదని చరిత్రకారుల అభివర్ణించారు.
నిజానికి ప్రపంచ చరిత్రలో ఏర్పడిన రాజులను చూస్తే వారి ముందు శివాజీ బుడతడే.... కాని పరాక్రమంలో, నిష్ఠలో, నిజాయితీలో, వ్యవహారికతలో, నేర్పులో, నిర్భయత్వంలో, మానవత్వ, సమానత్వంలో ప్రపంచంలో ఉద్భవించిన రాజులలో అందిరిలోకి ఉన్నతమైన వాడు శివాజి.
శివాజి-వియత్నాం⛳
వియత్నామ్ అప్పటి రక్షణ శాఖ మంత్రి అయిన మేడమ్ బిన్ 1977 లో భారత పర్యటించినపుడు, శివాజి మా ఆదర్శం అని చెపుతూ, శివాజి విగ్రహాన్ని పూలమాలతో అలంకరించారు. వియత్నమ్-అమెరికా లాంటి పెద్ద దేశంతో తలపడినపుడు, వియత్నామ్ కి శివాజీ గోరిల్లా వార్ ఫేర్ వ్యూహం చాలా సహకరించింది.
అటువంటి శివాజీ గురించి మన ఎన్.సి.ఆర్.టి.సీ. చరిత్ర పుస్తకాలు ఒక పేజీలో నాలుగు వాక్యాలు రాసి చాలు అని పించాయి.
శివాజి – హిందూ రాజుల తప్పలు⛳
శత్రువుని క్షమించని శివాజి – ఫృథ్విరాజ్ జౌహాన్ గజనీ ని 16 సార్లు క్షమించి వదిలాడు. చేసిన తప్పునే పదే పదే చేసాడు. గజనీ ఒక్కసారి ఫృథ్విరాజ్ ని ఓడించగానే అతడి కళ్ళు పీకించి చెఱసాల పాలు చేసి, తరువాత హత్య చేసాడు. శివాజీ శత్రువుకి క్షమాబిక్ష పెట్టడం, వదిలివేయడంలాంటి తప్పిదాలను చేయకుండా శత్రువుని శత్రువుగానే చూసి తగిన శిక్ష వేసిని కారణంగా శత్రువు ఆక్రమణ చేయడానికి కూడా భయపడేలా చేయగలిగాడు శివాజి.
శివాజీ తన యుద్ధ పంథాని కాలానుగుణంగా మార్చుకున్నాడు. ధర్మ బద్ధమైన యుద్ధం చేయని శత్రువు దగ్గర ధర్మం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. అందుకే శివాజి ఎప్పటి, కప్పుడు విజయానికి ఏది ఉత్తమమో అదే చేసాడు.
అర్హలైన అందరిని సైన్యం చేర్చుకున్న శివాజి – జన్మతః క్షత్రియుడు మాత్రమే పోరాటానికి అర్హుడనే అనుచానంగా వస్తున్న ఆచారాన్ని పక్కన పెట్టి, సమాజంలోని అన్ని వర్గాలలోని బలమైన వారి ఎన్నుకుని ఒక ధృడమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని, అన్ని యుద్దాలలోనే విజయాన్ని సాధించాడు శివాజి.
కాల బాహ్యమైన ఆచారాలను, పద్దతులను తుంగలోకి తొక్కి నేటి అవసరాలకు అనుగుణంగా ప్రవర్తించడం కారణంగా శివాజీ హైందవానికి పూర్వ వైభవాన్ని తీసుకురాగలిగాడు. పూర్వం జరిగిన తప్పిదాలను కూడా సవరించగలిగాడు.
అనర్థ హైతువైన ఢాంభికానికి పోని శివాజి – పొగరుబోతుగా వ్యవహరించి, అనవసరమైన ఢాంభికానికి పోయి, శత్రువు యొక్క బలా-బలాల అంచనా వేయకుండా శత్రువు ఎంత బలాడ్యుడైనా ఎదురేగి పోరాడే అనర్థ హేతువైన వీరత్వాన్ని ప్రదర్శించని శివాజి. దానికి బదులుగా, అదును చూసి, శత్రువుని తమ చిన్న సైన్యంతో జయించగలమని అనుకున్నప్పడు మాత్రమే ఎదురించి, విజయాన్ని సాధించిన శివాజి.
నేనే హీరోని. రండి చంపండి అని ఊరికే తన ప్రాణాన్ని తీసుకు పోయి శత్రువు చేతిలో పెట్టలేదు శివాజి. శత్రువు బలమైన వాడైతే, తెలివితో యుద్దం చేసాడు. శత్రువుని ప్రత్యక్షంగా ఎదుర్కోగలనని అనిపించినప్పుడు మాత్రమే ప్రత్యక్ష యుద్ధం చేసాడు. యుద్ధ తంత్రాన్ని బహు గొప్పగా ఉపయోగించిన వాజు శివాజి.
పొరుగు రాజ్యాలతో స్నేహ సంబంధాలు ఆశించిన శివాజి –హిందూ రాజులలో సఖ్యత లేని కారణంగా ఎక్కడ నుంచో వచ్చిన, ఇక్కడి సంస్కృతి, పరిస్థితులు తెలియని విదేశీ రాజు హిందూ రాజులపై పైచేయి సాధించి తమ రాజ్య విస్తరణ చేసుకున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలు గల దేశ చరిత్రని క్షుణంగా అధ్యయనం చేసిన శివాజి పొరుగు రాజ్యాలతో సఖ్యత సాధించి దండయాత్రలు చేసిన ముస్లిము, మొగలు రాజులకు సింహస్వపంగా మారాడు.
ఈ నాడు ప్రభుత్వ తలపెట్టిన “సబ్ కా సాథ్ సబ్ కా వికాస్” అనేదే ఆ నాడు శివాజీ ప్రారంభించి విధానమే.
ఇది శివాజీ సంక్షిప్త చరిత్ర. ప్రతి భారతీయ పౌరుడు తెలుసుకోవలసిన హైందవ సామ్రాజ్యాధిపతి కథ. మనందరికి నిత్య స్మరణీయుడు. మన జాతి రత్నం శివాజి.
శివాజీ మహారాజ్ కీ జై.
అంతిమంగా
ఇది మన సత్తా
సా.శ. 7వ శతాబ్ధంలో ప్రారంభంమయిన వేరు వేరు ముస్లిము తెగల దండయాత్రలు మహమ్మద్ గజనీ (11వ శతాబ్ధం), మహ్మమ్మద్ ఘోరీ (12వ శతాబ్ధం)లతో తారాస్థాయికి చేరుకున్నాయి. తురుఘ్కలూ, అరబ్బులూ, ఇరానీలు, మొగలులూ, అప్గనులూ భారత్ పై మీదికి మిడతల దండుల్లా వచ్చి పడ్డారు. దేశమంతటా విస్తరించి దారుణమైన మారణకాండ చేసి, వినాశనం సృష్టించారు. పవిత్ర స్థలాలను అపవిత్రం చేశారు. హిందూస్థాన్ దీనికి వ్యతిరేకంగా 800 ఏళ్ళపాటు విరామమెరుగని స్వాతంత్ర్య సమరం సాగించింది. బహుశా ప్రపంచ చరిత్రలోనే జాతి స్వేచ్ఛ కోసం ఇంతగా కదిలించిన సమరగాథ మరొకటి కానరాకపోవచ్చు. రాజస్థాన్ లో మహారాణా, కుంభ్ నుంచి మహారాణా ప్రతాప సింహ్, రాజసింహ్లు వరకూ, దక్షిణాన బుక్క సోదరుల నుంచి శ్రీ కృష్ణ దేవరాయల వరకూ, మహారాష్ట్రలో శివాజి నుంచి పీష్వాల వరకూ, పంజాబులో గురుగోవింద్ సింహ్ వంటి అమరవీరులూ, గురువుల నుండి బందా బైరాగీ, రంజీత్ సింహ్ ల వరకూ, బుందేల్ ఖండ్ లోని ఛత్రసాల్ మొదలుకొని అస్సాములోని లాచిత్ బాస్కర్ బడ్ ఫుకన్ వరకూ లెక్కకు మించి యోధాగ్రేసరులు స్వాతంత్ర్య నౌకని అనేక తుఫానుల్లోంచి భధ్రంగా ముందుకు నడిపారు. వారి విడుపులేని పోరాటం కారణంగా, తిరుగులేని దెబ్బల మూలాన ఇస్లాము విజయ ఖడ్గం ముక్కలై మట్టి కరిచింది. మౌలానా హాలీ విలపించినట్లు- “సప్త సముద్రాల మీద ఎదురులేకుండా, ఓటమి ఎరుగ కుండా వీరవిహారం చేసిన ఇస్లాము అనే నౌకాదళం హిందూస్తాన్ చేరుకునే సరికి గంగలో మునిగిపోయింది”.
#feb19thsaffronday #chatrapatishivajimaharaj *హిందూహృద్యసమ్రాట్* #jaibhavanijaishivaji
No comments:
Post a Comment