🔔 *జై శ్రీరాం* 🔔
```
తన చివరి శ్వాసను విడుస్తున్న, జటాయువు… ‘నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు!’
రావణుడు జటాయువు యొక్క రెండు రెక్కలను తెంచినప్పుడు… అప్పుడు మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు…
“జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం ‘ప్రభు శ్రీరాముడి’కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు” అన్నాడు!
మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.
కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు 58 రోజులు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరునవ్వు నవ్వుతున్నారు!
ఈ దృశ్యం చాలా అలౌకికమైనది.
రామాయణంలో జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు ‘శ్రీరామ్’ ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.
అక్కడ మహాభారతంలో…’
భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు ‘శ్రీ కృష్ణుడు’ చిరునవ్వు నవ్వుతున్నాడు.
తేడా ఉందా లేదా?
అదే సమయంలో, జటాయువుకు ప్రభువు ‘శ్రీరాముడి’ ఒడి పాన్పుగా అయింది.
కాని భీష్మపితామహుడు చనిపోయేటప్పుడు బాణపు మొనలు పాన్పుగా అయ్యాయి!
జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు ‘శ్రీరాముడి’ యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు. జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు.
మరియు బాణాలపై భీష్మపితామహుడు ఏడుస్తున్నాడు.
ఇంత తేడా ఎందుకు?
ఇంతటి తేడా ఏమిటంటే..,
ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు. కానీ..
అడ్డుకోలేకపోయాడు!
దుశ్శాసనునికి ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు.
కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ, అరుస్తూ వున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.
దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తరువాత కూడా, బాణాల ములుకుల అంపశయ్య దొరికింది.
జటాయువు స్త్రీని సన్మానించాడు.
తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!
ఇతరులకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో, వారి గతి భీష్ముడిలా అవుతుంది.
ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు.
నిజం అనేది కలత చెందుతుంది, కానీ ఓడిపోదు.✍️```
*"సత్యమేవ జయతే "*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🕉️🙏🕉️
No comments:
Post a Comment