Wednesday, June 25, 2025

 *☘️వేదమూర్తుల స్తుతులు☘️*
*(14 వ భాగము)*

*అదే సమయంలో జీవులందరు భగవంతుని దివ్యదేహము నుండే పుట్టినవారు. భగవంతునికి, జీవులకు గల ఈ సంబంధము వేదాలలో చక్కగా వివరించబడింది. భగవంతుడు తన సంతానానికి వారు కోరినది ఇచ్చి పోషిస్తాడని అందులో చెప్ప బడింది. అదేవిధంగా భగవద్గీతలో కూడ "జీవులందరికీ నేనే బీజప్రదాతవైన తండ్రిని" అని శ్రీకృష్ణుడు అన్నాడు. తండ్రి పిల్లలకు జన్మనిచ్చినా వారంతా తమ కోరికల ననుసరించి వర్తిస్తారనేది తెలిసికోవడము సులభమే. కనుక తన సంతానము. యొక్క వివిధ స్థితిగతులకు తండ్రి ఎన్నడును బాధ్యుడు కాబోడు. ప్రతీ పిల్లవానికి తండ్రి ఆస్తి, ఉపదేశములు లభించి ఉంటాయి. పిల్లలందరికీ ఆస్తి, ఉపదేశము సమానంగానే ఇవ్వ బడినప్పటికిని ప్రతీ పిల్లవాడు తన కోరికల ననుసరించి జీవితాన్ని తయారు చేసికొని ఆ విధంగా సుఖదుఃఖాలను అనుభవిస్తాడు.*

*అదేవిధంగా భగవద్గీత ఉపదేశము ఎల్లరకు సమానంగానే* *లభిస్తున్నది. ప్రతి యొక్కరు భగవంతునకే శరణుజొచ్చాలి; భగవంతుడే ఎల్లరినీ సకల పాపాల నుండి కాపాడతాడనేది ఆ ఉపదేశము. భగవంతుని సృష్టిలో జీవనసౌకర్యములు జీవు లందరికీ సమానంగానే ఇవ్వబడింది. భూమిపై ఉన్నది, నీళ్ళలో ఉన్నది లేదా ఆకాశంలో ఉన్నది సమస్తమూ జీవులందరికీ సమానంగా ఇవ్వబడింది. జీవు లందరు భగవంతుని సంతానమే కనుక అతడు ఇచ్చిన భౌతిక సౌకర్యాలను అందరూ అనుభవించవచ్చును. కాని దుర్భాగ్యులైన జీవులు తమలో తాము కలహించుకొని దుర్భరమైన పరిస్థితులు తయారు చేసికొంటారు. ఈ కలహానికి, అనుకూల ప్రతికూల పరిస్థితుల తయారీకి బాధ్యత జీవులదే గాని భగవంతునిది కాదు. కనుక జీవులు భగవద్గీతలో ఒసగబడిన భగవంతుని ఉపదేశాలను తీసికొని భక్తిభావనను వృద్ధిచేసికొంటే వారి జీవితాలు ఉదాత్తమౌతాయి. వారు భగవద్ధామానికి వెళతారు.*

*ఈ భౌతిక జగత్తును సృష్టించినది భగవంతుడే కనుక దాని స్థితికి భగవానుడి కారణమని ఎవరేని వాదించే అవకాశము ఉన్నది. భౌతికజగత్తు యొక్క సృష్టి పోషణలకు నిక్కముగా భగవంతుడు పరోక్షముగా బాధ్యుడే అయినను జీవుల, వివిధస్థితులకు అతడెన్నడును బాధ్యుడు కాడు. భగవంతుడు ఈ భౌతిక జగత్తును సృష్టించడాన్ని మేఘము మొక్కలను ఉత్పన్నము చేయడము వంటిది. మేఘము. నేలపై వర్షాన్ని కురిపిస్తుందేగాని ఎన్నడు దానిని తాకదు. అదేవిధంగా భగవానుడు కేవలము ప్రకృతిని వీక్షించడముచే ఈ జగత్తును సృష్టిస్తాడు. "అతడు ప్రకృతిపై వీక్షణాన్ని సారించగానే సృష్టి జరిగింది" అని వేదాలలో ఇది ధ్రువపరుపబడినది. ప్రకృతిపై తన దివ్యవీక్షణాన్ని సారించి భగవంతుడు స్థావరజంగమ జీవులను సృష్టిస్తాడని భగవద్గీతలో కూడా ధ్రువపరుపబడింది.*

*కనుక భౌతికజగత్తు సృష్టిని ఒకానొక భగవల్లీలగా తీసికోవచ్చును. భౌతిక జగత్తును భగవంతుడు తాను కోరినప్పుడే సృష్టిస్తాడు కనుక అది భగవల్లీలయే అవుతుంది. భగవంతుని ఈ కోరిక కూడ అతని పరమకరుణయే అవుతుంది. ఎందుకంటే నిజచైతన్యాన్ని వృద్ధిపరచుకొని భగవద్ధామానికి వెళ్ళడానికి అది బద్ధ జీవులకు మరొక అవకాశాన్ని ఇస్తుంది. కనుక ఈ భౌతికజగత్తును సృష్టించి.. నందుకు భగవంతుని ఎవ్వరూ నిందించకూడదు.*

💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"వేదమూర్తుల స్తుతులు" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦 
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*

*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🪷🍁 🙏🕉️🙏 🍁🪷🍁

No comments:

Post a Comment