Thursday, April 24, 2025

 ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి ఎప్పుడో 40 ఏళ్ళ  క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! 👇

కుంకం పువ్వు
———————-
కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నాకర్థమైపోయింది !

అక్కడ ఉన్నట్టుండి 
పాకే పాకే పసిబిడ్డ 
నెత్తురు ముద్దై పోతుంది 
సామగానం చేసే 
కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి 
వేదం ఆగి - రుధిరం బైటికొస్తుంది

అక్కడ రేపు పల్లకీ లెక్కి 
ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు 
ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో 
హిమాలయాలు సైతం 
మూర్తీభవించిన 
వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం 
వొరుసుకునీ 
నిరంతరం అక్కడ 
నెత్తురోడుతూ ఉంటుంది !
బుద్ధుడు కూడా 
కళ్ళూ నోరూ మూసుకుని 
మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

*Great Poetry*
*Sri Tanikella Bharani*

No comments:

Post a Comment