Saturday, June 21, 2025

****ధ్యానం చేసేవారు ధన్యులు! విహారాన్ని మించిన మానసిక ప్రశాంతత

 

ధ్యానం చేసేవారు ధన్యులు!

విహారాన్ని మించిన మానసిక ప్రశాంతత

లాస్ ఏంజిల్స్: కునుకుపడితె మనసు కాస్త కుదుట పడతదనీ... వారం పదిరోజులు ఎటన్నా విహారానికి పోయొస్తే నూతనోత్తేజం నింపుకోవచ్చనీ అనుకుంటాం. కానీ... వీటన్నింటికన్నా మిన్నగా మనసుకూ, శరీరానికీ విశ్రాంతినిచ్చేది ధ్యానమేనట! కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, హార్వర్డ్ మెడి కల్ స్కూల్ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలిందీ విషయం. వారం రోజులే ధ్యానం చేసినా.. జీవకణాలకు దీర్ఘకాలిక రక్షణ కల్పించడం, జీవ క్రియ బలోపేతం కావడం వంటి ప్రయోజనాలను వారు గుర్తించారు. ఈ పరిశోధనలో 30-60 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతులైన మహిళలు 94 మంది పాల్గొన్నారు. వీరందర్నీ రిసార్టుకు తీసుకెళ్లగా... సగం మంది విహా రంలోనూ, మిగతావారు ధ్యాన సాధనలోనూ నిమగ్నమయ్యారు. మరో 30 మంది అనుభవజ్ఞులైన ధ్యాన సాధకులు ప్రత్యేక శిక్షణలో పాల్గొన్నారు. వీరందరి నుంచి రక్తనమూనాలను సేకరించి, ఒత్తిడి స్థాయిలను గుర్తిం చారు. వారం తర్వాత మళ్లీ వీరికి రక్త పరీక్షలు చేశారు. నెల రోజుల తర్వాత కూడా వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. కొత్తగా ధ్యానం చేసినవారు, అనుభవజ్ఞులైన సాధకుల్లో ధ్యాన ప్రభావం చాలాకాలం ఉన్నట్లు గుర్తించారు. విహారానికి వెళ్లొచ్చినవారి కంటే వీరు ఎక్కువ ఆనం దంగా, ఒత్తిడి రహితంగా జీవనం సాగిస్తున్నట్లు గమనించారు. "పర్యటనతో తాత్కాలిక ఆనందం చేకూరుతుంది. అయితే.. ధ్యానంతో దీర్ఘకాలిక మాన సిక, శారీరక ప్రయోజనాలు కలుగుతాయని గుర్తించాం” అని హార్వర్డ్ విశ్వ. విద్యాలయ ఆచార్యుడు రుడాల్ఫ్ టాన్జ్ వివరించారు. 'ట్రాన్స్లేషనల్ సైకి యాట్రీ' పత్రిక ఈ అధ్యయనంపై ఇటీవల కథనం ప్రచురించింది.

No comments:

Post a Comment