*_కాళిదాసు కథ_*
_[ఒక వింత సమస్యా పూరణం]_
=================
*కాళిదాసు అద్భుతమైన రచనలు చేస్తూ భోజుడి సభలో పండితుడిగా పేరు పొంది ఎన్నెన్నో రచనలు చేస్తాడు.*
*కానీ, రాజుకు కాళిదాసుకు తరుచుగా వాగ్వివాదాలు జరగటం కాళిదాసు అలిగి రాజ్యం వదిలి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది.*
*ఒకసారి భార్య శాపం ఇచ్చిన తరువాత అక్కడ నుండి బయటకు వెళ్ళిన కాళిదాసు వేశ్యాలోలుడౌతాడు.*
*అట్లా ఒకసారి రాజు కోపంలో కాళిదాసుకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. అతను వెళ్ళి ఒక వేశ్య ఇంట తలదాచుకొని అఙ్ఞాతంలో నివసిస్తూ ఉంటాడు.*
_(భోజుడి రామాయణ చంపూ కావ్యం)_
*ఆ సమయంలో భోజుడు రామాయణం చంపూ కావ్యం రచిస్తాడు.*
*ఆ కావ్యం కాళిదాసు చదివి సవరణలు చేయాలని ఆయనకు ఆరాటం. కానీ, కాళిదాసు ఎక్కడ ఉన్నాడో ఆయనకు తెలియదు.*
*కాళిదాసు కవితాప్రాభవం తెలిసిన రాజుగారు ఒక సమస్యా పూరణం చేయమని ప్రకటిస్తాడు. పూరించిన వారికి అర్ధ రాజ్యం ఇస్తానని కూడా అంటాడు.*
🏵️
*_"కుసుమే కుసుమోత్పత్తిః శృయతే న చ దృష్టతే"_*
🏵️🏵️🏵️🏵️🏵️🏵️
*అంటే... ఒక పుష్పం మీద మరో పుష్పం పూసింది అన్న మాట.*
*ఇది వినటమే కానీ ఎక్కడా చూడలేదు.*
*ఈ సమస్యకు పూరణ కేవలం కాళిదాసే చేయగలడు అన్న నమ్మకం రాజుకు.*
*రాజుగారి ప్రకటన చూసిన వేశ్యకు (కాళిదాసుకు ఆశ్రయమిచ్చిన స్త్రీకి) దురాశ కలుగుతుంది. ఎట్లాగయినా కాళిదాసు చేత ఆ సమస్య పూరణ చేయించి అర్ధ రాజ్యం తానే పొందాలన్న ఆలోచన వస్తుంది. తన ఇంటి గోడ మీద కాళిదాసుకు కనబడేలాగా ఆ పాదం రాస్తుంది. చదివిన కాళిదాసు దాని కింద...*
🏵️🏵️🏵️🏵️🏵️🏵️
*"బాలే! తవ ముఖాంభోజే దృష్టమిందీవర ద్వయం"*
*(కొందరు "బాలే! తవ ముఖాంభోజే నయనేందీవర ద్వయం"......మరి కొందరు, "బాలే! తవ ముఖాంభోజే కథం ఇందీవర ద్వయం")*
🏵️🏵️🏵️🏵️
*అంటే.. "బాలికా! నీ ముఖకమలము మీద పద్మలోచనద్వయం ఉన్నాయి" అన్న అర్ధం.*
*👉అది చూసిన ఆ దుర్మార్గురాలు రాజ్యం సంపాదించాలన్న కోరికతో, కాళిదాసును తల మీద కొట్టి ఒక గుంటలో పడేసి ఆయన చనిపోయాడనుకొని పైన రాళ్ళు కప్పి ఆ సమస్యా పూరణ రాజుగారి వద్దకు తీసుకెళ్తుంది. ఉన్నదున్నట్టు పూరణం చదివేస్తుంది.*
*కానీ, ఆమె అక్కడే ఒక పెద్ద పొరపాటు చేస్తుంది. ఆ పాదం పురుషుడు స్త్రీని సంభోధించిన విషయం రాజు గమనిస్తాడు.*
*వెంటనే ఆమెను నిలదీసి ఈ సమస్యాపూరణం చేసినది ఎవరు అని ప్రశ్నిస్తాడు.*
*ఇంక చేసేది లేక ఆ వేశ్య తాను చేసిన ఘోర కృత్యం వివరిస్తుంది.*
*వెంటనే రాజు హుటాహుటిన తన చంపూ కావ్యం తీసుకొని కొనప్రాణంతో కొట్టుకుంటున్న కాళిదాసు వద్దకు చేరుకొని తన కావ్యం వినిపించటం మొదలెడతాడు.*
*కాళిదాసు ఆ స్థితిలోనే కొన్ని సవరణలు సూచిస్తూ, సుందరకాండ చివరి పద్యం పూర్తవగానే ప్రాణాలు వదులుతాడు.*
*కాళిదాసుకు వినిపించలేక పోయిన దుఃఖంలో రాజు తాను రాసిన కావ్యంలో మిగిలిన రెండూ అంటే యుద్దకాండ ఉత్తరకాండ చించి పారేస్తాడు.*
*ప్రపంచానికి భోజుడి రామాయణ చంపూ కావ్యం కేవలం సుందరకాండ వరకే లభ్యం అని ప్రతీతి.*
*ఒక స్త్రీ (కాళి) వల్ల గొప్ప పండితుడై, మరో స్త్రీ (భార్య) పెట్టిన శాపం వల్ల, స్త్రీలోలుడై ఒక నీచురాలి వల్ల అంతమౌతాడు... ఆ మహా కవి.*
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా🙏}_*
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment