Sunday, September 20, 2020

గరికిపాటి నరసింహారావు తెలుగు రచయిత...

ప్రముఖ అవధాని, కవి, ప్రవచన కర్త
శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.........💐💐🙏

జననం 14 సెప్టెంబరు1958

గరికిపాటి నరసింహారావు తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు. ఇతను దేశ విదేశాల్లో అవధానాలు చేశారు. వాటిలో: ఒక మహా సహస్రావధానం, 8 అష్ట, శత, ద్విశత అవధానాలు, వందలాది అష్టావధానాలు ఉన్నాయి. పలు టెలివిజన్ ఛానెళ్ళలో వివిధ శీర్షికలు నిర్వహిస్తూ వేలాది ఎపిసోడ్ల పాటు పలు సాహిత్య, ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు చేశారు. వాటిలో 11 అంశాలను సీడీలుగా రూపొందించి విడుదల చేశారు. పద్యకావ్యాలు, పరిశోధన, పాటలు వంటి వివిధ అంశాలపై గరికపాటి రాసిన 14 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ధారణా బ్రహ్మరాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, కళారత్న, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం, కొప్పరపు కవులు పురస్కారం తదితర పురస్కారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు మొదలైన గౌరవాలు అందుకున్నారు.

జీవిత విశేషాలు
గరికపాటి నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958, సెప్టెంబర్ 14వ తేదీకి సరియైన విలంబి నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమినాడు జన్మించారు. ఇతడు ఎం.ఎ., ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశారు. ఇతని భార్య పేరు శారద. ఇతనికి ఇద్దరు కొడుకులు. వారికి తన అభిమాన రచయితల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని నామకరణం చేశారు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.

అవధానాలు
ఇతడు అవధానిగా సుప్రసిద్ధుడు. సుమారు 275 అష్టావధానాలు, 8 అర్థ శత, శత, ద్విశత అవధానాలు, ఒక మహా సహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించారు. మొదటి అవధానం 1992 సంవత్సరం విజయదశమి రోజు చేశారు. 2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు. 2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష చేయబడింది. యావదాంధ్ర దేశంలోనే కాక మనదేశంలోని వివిధ నగరాలతోపాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్, కువయిట్, అబుదాభి, దుబాయి, కతార్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు.

రచనలు

సాగరఘోష (పద్యకావ్యం)
మనభారతం (పద్యకావ్యం)
భాష్పగుఛ్ఛం (పద్య కవితా సంపుటి)
పల్లవి (పాటలు)
సహస్రభారతి
ద్విశతావధానం
ధార ధారణ
కవితా ఖండికా శతావధానం
మౌఖిక సాహిత్యం (పరిశోధన)
పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు
మా అమ్మ (లఘుకావ్యం)
అవధాన శతకం
శతావధాన భాగ్యం (సంపూర్ణ శతావధానం)
శతావధాన విజయం (101 పద్యాలు)

టి.వి.కార్యక్రమాలు
ఇతడు అనేక టి.వి.ఛానళ్లలో కార్యక్రమాలు నిర్వహించాడు. వాటిలో కొన్ని:

ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం
ఓం టి.వి. (సి.వి.ఆర్.స్పిరిట్యుయల్)లో రఘువంశం
భక్తి టి.వి.లో ఆంధ్ర మహాభారతం: 1818 ఎపిసోడ్లు
భక్తి టి.వి.లో తరతరాల తెలుగు పద్యం
దూరదర్శన్ సప్తగిరిలో మంచికుటుంబం
ఈ.టి.వి-2 - చమక్కులు (తెలుగు వెలుగు)
తెలుగు వన్ డాట్ కామ్ ఇంటర్నెట్ ఛానల్‌లో సాహిత్యంలో హాస్యం

సి.డి.లు, డి.వి.డి.లు
వివిధ సందర్భాలలో ఈయన చేసిన ప్రసంగాలు, ప్రవచనాలు, సాగరఘోష కావ్యపఠనం సిడిలుగా డివిడిలుగా విడుదల చేయబడ్డాయి. వాటి వివరాలు:

పలకరిస్తె పద్యం (హాస్య పద్యాలు)
శివానంద లహరి
సౌందర్య లహరి
కనకథారా స్తవము
భక్త ప్రహ్లద
గజేంద్ర మోక్షము
కాశీ ఖండము
భగవద్గీత
శకుంతలోపాఖ్యానము
శ్రీకాళహస్తి మహాత్మ్యం
సాగరఘోష (1116 పద్యాలు x 20 గంటల వ్యాఖ్యానంతో సహా) (డివిడి)

పురస్కారాలు

ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ (1989)
కనకాభిషేకాలు - భీమవరం (1997), వెదురుపాక విజయదుర్గా పీఠం ( 2004)
సువర్ణ కంకణాలు- కాకినాడ (1999), విశాఖపట్నం ( 2003, 2004 మరియు2005)
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం (2000)
2002లో సాగరఘోష కావ్యానికి సాధన సాహితీ స్రవంతి, హైదరాబాదు వారి పురస్కారం
2003లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం - సాగరఘోష కావ్యానికి
2004 లో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ)
2005లో ‘సహృదయ’ (వరంగల్లు) వారి సాహిత్య పురస్కారం -సాగరఘోష కావ్యానికి
భగవాన్ సత్య సాయిబాబా వారిచే 2008 నవంబరులో సువర్ణహారం
2008 లో అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం
2011 సెప్టెంబరులో కొప్పరపు కవుల పురస్కారం
సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2012)
తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012
2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.

Source - Whatsapp Message

No comments:

Post a Comment