Wednesday, August 18, 2021

27, 28, 32, వయసు గల పెళ్ళి కాని ఆడపిల్లలు ఇంట్లో ఉండిపోతున్నారు

తల్లి దండ్రుల యొక్క మిక్కిలి మహత్వాకాంక్ష కారణం గా
27, 28, 32, వయసు గల పెళ్ళి కాని ఆడపిల్లలు ఇంట్లో
ఉండిపోతున్నారు.

మరి ఇప్పటికి కూడా తల్లి దండ్రులు మేల్కొనక పోతే పరిస్థితి
మరింత దారుణంగా మారుతుంది.

మన సమాజం పిల్లల వివాహ విషయంలో ఎంత జాగ్రత
పడుతుందంటే, పరస్పర బంధుత్వాలు ఏర్పడడంలేదు.

సమాజంలో నేడు 27, 28, 32, సంవత్సరాల వయసు గల అనేక మంది అమ్మాయిలు ఇంట్లో ఉండిపోయారు, ఎందుకంటే, వీరి కలలు,
కోరికలు ఆర్థిక స్థోమత ను మించి ఉంటున్నాయి. ఈ రకమైన అనేక ఉదాహరణలు ఉన్నాయి.

ఇలాంటి వారి కారణంగా సమాజం యొక్క శోభ ఎంతగానో చెడిపోతుంది.

మానవునికి అన్నిటికన్నా గొప్ప సుఖము సంతోషకరమైన వైవాహిక జీవితము.

డబ్బు కూడా అవసరమే కానీ కొంత పరిమితి వరకు.

ధనం కారణంగా మంచి సంబంధాలను తిరస్కరించడం తప్పు.
మొదటి. ప్రాధాన్యత మంచి కుటుంబము, మరియు మంచి బంధుత్వము ఉండాలి.

అధిక ఆస్తి పాస్తుల భ్రమలో మంచి సంబంధాలను దూరం చేయడం
పొరపాటు. ఆస్తులు కొనుక్కోవచ్చు, కానీ గుణము ను కాదు.

నా అభిప్రాయము ఏమిటంటే, మంచి కుటుంబము మరియు అబ్బాయి మంచివాడు అని చూడాలి, కానీ చాలా అనే భ్రమలో మంచి సంబంధమును చేజార్చుకోకూడదు.

సంతోషకర వైవాహిక జీవితము గడపాలి.

30 సంవత్సరాల తర్వాత జరిగే వివాహము వివాహము కాదు, ఒప్పందము అవుతుంది, మరియు ఆరోగ్య స్థితి ప్రకారం చూసినా కూడా అందులో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

నేడు ఇంకా అందులో కూడా జాతకాలు ( కుండలీ ) కలువడము అనే కారణంగా చెడు పరిస్థితి నెలకొంది.

ఎవరికైతే జాతకాలు కలిసినా, కుటుంబము మరియు అబ్బాయి బాగు లేడు, అలాగే అబ్బాయి లో చాలా మంచి గుణాలు ఉన్నాయి కానీ జాతకము కలువలేదు, అలాగే అంతా సవ్యంగా ఉన్నప్పటికీ జాతకాలు కలువలేదని మనం సంబంధము వదులుకుంటాము.

మీరు గమనించి చూడండి, ఎవరికైతే 36 లో 20 లేదా 36 కు 36
గుణాలు కలిసినా కూడా వారి జీవితంలో బాధలు కలగడం లేదా !

ఎందుకంటే మనం అబ్బాయి గుణగణాలు చూడలేదు, జాతకం లో
గుణాలు కలవడం చూసాము.

పండితులు , విద్యావంతులైన ఆధునిక సమాజమును ఒక శతాబ్దం
వెనకకు త్రోసివేయడం, జాతకాలు కలువడము అనే భ్రమలో మంచి సంబంధాలు కలువడం లేదు, నేడు ఈ జాతకాల బిజినెస్ కోట్ల రూపాయల లో సాగుతుంది.

ఉదయం టెలివిజన్ ఆన్చేయగానే శర్మ /శాస్త్రి గారు మీ భవిష్యత్తు
చెప్పడం ఆరంభిస్తాడు. మరి వారికి వారి కుమారుడు లేదా కూతురు యొక్క భవిష్యత్తు ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు.

ప్రస్తుతము సమాజంలో జనాలు అమ్మాయి కి సంబంధం కొరకు అబ్బాయిలలో ఇరువది క్యారెట్ల బంగారం కొనుగోలు చేయడానికి వెళ్తారు. చూస్తూ చూస్తూ నాలుగు ఐదు సంవత్సరాలు గడిచి పోతాయి.

ఉన్నత విద్య లేదా ఉద్యోగం పేరుతో కూడా సమయం గడిపేస్తారు.

అబ్బాయి ని చూసే విధానం కూడా సమయం గడచి పోవడానికి ఒక విచిత్రమైన ఉదాహరణ అయింది.
స్వంత ఇల్లు ఉన్నదా లేదా? ,ఒకవేళ ఉంటే ఫర్నీచర్ ఎలా ఉంది?
ఇంటిలో ఎన్ని గదులు ఉన్నాయి? కారు ఉన్నదా లేదా? ఉంటే ఎలాంటి కారు?
నడవడి, ఆహారపుటలవాట్లు ఎలా ఉన్నాయి?
అన్నదమ్ములు అక్క చెల్లెండ్లు ఎందరు?
ఆస్తి పంపకాలప్పుడు అమ్మా నాన్న లు ఎవరి దగ్గర ఉంటారు?
అక్క చెల్లెండ్లు ఎందరు ,వారి వివాహాలు జరిగాయా?
తల్లి దండ్రుల స్వభావము ఎలాంటిది?
ఇంటివారు సమీప బంధువులు ఆధునికత గలవారా ,కాదా?
అబ్బాయి ఎంత హైట్ ( ఎత్తు ) ఉంటాడు.
రంగు రూపము ఎలా ఉంటాడు,
చదువు, సంపాదన, బ్యాంకు బ్యాలెన్స్ ఎంత ఉంటుంది?
అబ్బాయి -అమ్మాయి సోషల్ మీడియా పై యాక్టివ్ గా
ఉంటారా లేదా. ?
ఆమెకు స్నేహితులు ఎందరు?

అన్ని విషయాలు అడగడం పూర్తి అయిన తరువాత కూడా కొన్ని
ప్రశ్నలు అడగడంలో, మరియు సోషల్ మీడియాపై మాట్లాడుతూ
ఉంటే సమయం గడిచి పోతుంది.
పరిస్థితి గురించి ఏమనాలి? 30 సంవత్సరాల వయసు లో
తల్లి దండ్రుల కండ్లు తెరుచుకుంటాయి.
ఇక నాలుగు -ఐదు సంవత్సరాల ఈ పరుగులాట పిల్లల
యౌవనమును కాలరాయడానికి చాలు
ఈ కారణంగా మంచి సంబంధాలు చేజారిపోతాయి.
మరి తల్లి దండ్రులే తమ పిల్లల కలలను నష్టపరుస్థారు.ఒకప్పుడు కేవలము వంశము చూసి బంధుత్వాలు కలిసేవి. అవి
దీర్ఘ కాలంగా నిలిచి ఉండేవి. వియ్యంకుడు వియ్యపురాలు మధ్య గౌరవ మర్యాదలు ఉండేవి. కష్ట సుఖాలలో పాలు పంచుకునేవారు.
బంధుత్వాల పట్ల అవగాహన ఉండేది. సిరి సంపదలు తక్కువ ఉన్నప్పటికీ ఇల్లు ముంగిలి ఆనందాలతో మెరిసేవి.
ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగితే, కింద మీద మాట్లాడితే పెద్దలు పరస్పరము సర్ది చెప్పేవారు.
తలాక్ ( విడాకులు ) అనే మాట సంబంధాలలో లేనేలేదు.
దాంపత్య జీవితము సుఖ దుఃఖాల అనుభవాలతో సాగి పోయేది
వృద్దాప్యములో ఒకరికొకరు తోడుగా ఉండేవారు.

అలాగే మనుమలు మనమరాండ్లలో సంస్కార బీజాలను
నాటేవారు. ఇప్పుడు ఆ సంస్కారాలు ఎక్కడ?

కండ్లలో లజ్జ సిగ్గు కనుమరుగైపోయింది.
బంధుత్వాల లో ఒప్పందాలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

అబ్బాయి - అమ్మాయి మన సమాజం నకు చెందిన వారు కాకున్నా
కూడా నడిచిపోతుంది. ఇలాంటి విషయాలు కూడా ముందుకు
వస్తున్నాయి.

నేడు సమాజంలోని అమ్మాయిలు- అబ్బాయిలు బహిరంగంగానే
ఇతర మతాల వైపు వెళ్తున్నారు, అంతే కాకుండా సమాజంలో ని
మంచి అమ్మాయిలు -అబ్బాయిలు నా మాదిరిగా లేరుఅని అనడం
నాకు తగిన వారు కాదు అని చెప్పడం.
కారణమేమంటే అమ్మాయిలు ఆధునికత యొక్క పరాకాష్ట ను
అధిగమించారు.
ఎప్పుడైతే ఈ అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమ వివాహాలు
చేసుకుంటారో, అప్పుడు ఈ జాతకాలు కలువడము తో పని
ఏముంది? అప్పుడు ఈ జాతకాల కు ఏమి విలువ ఉండదు.

తల్లి దండ్రులు దీనినే అంగీగరిస్తున్నారు. అపుడు ఏ జాతకాలు,
స్టేటస్ (స్థాయి ) డబ్బు, ఆదాయము ఇవేవీ మధ్య లో రావు.

ఇప్పటికి కూడా తల్లి దండ్రులు మేల్కొనక పోతే పరిస్థితులు ఇంకా
విషమించి పోతాయి.

సమాజంలోని ప్రజలు అర్థం చేసుకోవాలి, అమ్మాయిల వివాహం
22, 23, 24, సంవత్సరాల వయసు లో జరగాలి. అలాగే
అబ్బాయిల వివాహం 25, 26, సంవత్సరాల లో జరగాలిఅని
గ్రహించాలి.
అందరిలో అన్ని మంచి గుణాలు దొరకవు.

ఇల్లు, బండీ( బైక్ ) మేడల కన్నా ముందు వ్యవహారమ ను తరాజు వేయాలి తల్లి దండ్రులు కూడా ఆర్థిక విషయాల మెరుగు లో కొట్టుక పోతున్నారు. పైసలు పరుగులాటలో బంధువులు మైళ్ళ కొద్ది దూరం వెనుకబడి పోతున్నారు.

ఇల్లు వాకిళ్ళు ముక్కలవుతున్నాయి. ప్రేమ ఆప్యాయతలు ఎండి పోతున్నాయి.

ఈ తరం కుటుంబాలు ఎలాంటి తమాషా చేశాయి అంటే రాబోవు
తరాలు " సంస్కారాలను "కేవలము పుస్తకాలలో చదువుకుంటారు.

"సమాజం ఇపుడు మేల్కొనవలసిన అవసరం ఎంతైనా ఉంది."

" లేదంటే బంధుత్వాలు విరిగి పోతుంటాయి ".

ధన్యవాదములు. 👏👏👏👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment