Wednesday, July 3, 2024

రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో

 *జై శ్రీమన్నారాయణ:*
*రామాయణం‌ 108 ప్రశ్నలు –జవాబులతో*
 
*రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి...*

*1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?*
= : వాల్మీకి.

*2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?*
= : నారదుడు.

*3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?*
= : తమసా నది.

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
= : 24,000.

*5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?*
= : కుశలవులు.

*6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?*
= : సరయూ నది.

*7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?*
= : కోసల రాజ్యం.

*8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?*
= : సుమంత్రుడు.

*9. దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?*
= : కౌసల్య, సుమిత్ర, కైకేయి.

*10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?*
= : పుత్రకామేష్ఠి.

*11. యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?*
= : కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.

*12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?*
= : జాంబవంతుడు.

*13. వాలి ఎవరి అంశతో జన్మించెను?*
= : దేవేంద్రుడు.

*14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?*
= : హనుమంతుడు.

*15. కౌసల్య కుమారుని పేరేమిటి?*
= : శ్రీరాముడు.

*16. భరతుని తల్లి పేరేమిటి?*
= : కైకేయి.

*17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?*
= : లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.

*18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?*
= : వసిష్ఠుడు.

*19. విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?*
= : 16 సంవత్సరములు.

*20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?*
= : మారీచ, సుబాహులు.

*21.  రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?*
= : బల-అతిబల.

*22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?*
= : సిద్ధాశ్రమం.

*23. తాటక భర్త పేరేమిటి?*
= : సుందుడు.

*24. తాటకను శపించిన మహర్షి ఎవరు?*
= : అగస్త్యుడు.

*25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?*
= : భగీరథుడు.

*26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?*
= : జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.

*27. అహల్య భర్త ఎవరు?*
= : గౌతమ మహర్షి.

*28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?*
= : శతానందుడు.

*29. సీత ఎవరికి జన్మించెను?*
= : నాగటి చాలున జనకునికి దొరికెను.

*30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?*
= : దేవరాతుడు.

*31. శివధనుస్సును తయారు చేసినదెవరు?*
= : విశ్వకర్మ.

*32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?*
= : మాండవి, శృతకీర్తి.

*33. లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?*
= : జనకుడు.

*34. జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?*
= : కుశధ్వజుడు.

*35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?*
= : వైష్ణవ ధనుస్సు.

*36. భరతుని మేనమామ పేరు ఏమిటి?*
= : యుధాజిత్తు.

*37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?*
= : మంధర.

*38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?*
= : గిరివ్రజపురం, మేనమామ యింట.

*39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?*
= : శృంగిబేరపురం.

*40. సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?*
= : గారచెట్టు.

*41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?*
= : భారద్వాజ ముని.

*42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?*
= : మాల్యవతీ.

*43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?*
= : తైలద్రోణములో.

*44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?*
= : జాబాలి.

*45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?*
= : నందిగ్రామము.

*46. అత్రిమహాముని భార్య ఎవరు?*
= : అనసూయ.

*47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?*
= : విరాధుడు.

*48. పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?*
= : అగస్త్యుడు.

*49. పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?*
= : గోదావరి.

*50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?*
= : శూర్ఫణఖ.

*51. ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?*
= : జనస్థానము.

*52. సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?*
= : మారీచుడు.

*53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?*
= : బంగారులేడి.

*54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?*
= : జటాయువు.

*55. సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?*
= : దక్షిణపు దిక్కు.

*56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?*
= : కబంధుని.

*57. సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?*
= : మతంగ వనం, పంపానదీ.

*58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?*
= : ఋష్యమూక పర్వతం.

*59. రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?*
= : హనుమంతుడు.

*60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?*
= : అగ్ని సాక్షిగా.

*61. రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?*
= : కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.

*62. సుగ్రీవుని భార్య పేరు?*
= : రుమ.

*63. వాలి భార్యపేరు?*
= : తార.

*64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?*
= : కిష్కింధ.

*65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?*
= : మాయావి.

*66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?*
= : దుందుభి.

*67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?*
= : మతంగముని.

*68. వాలి కుమారుని పేరేమిటి?*
= : అంగదుడు.

*69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?*
= : ఏడు.

*70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?*
= : ప్రసవణగిరి.

*71. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు "తూర్పు" దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?*
= : వినతుడు.

*72. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు "దక్షిణ" దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?*
= : అంగదుడు.

*73. సుగ్రీవునికి,  సీతాన్వేషణ కోసం  "పశ్చిమ" దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?*
= : మామగారు, తార తండ్రి.

*74. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు "ఉత్తర" దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?*
= : శతబలుడు.

*75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను?* 
= : మాసం (ఒక నెల).

*76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?*
= : దక్షిణ దిక్కు.

*77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?*
= : తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.

*78. హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?*
= : స్వయంప్రభ.

*79. సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?*
= : సంపాతి.

*80. హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?*
= : పుంజికస్థల.

*81. హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?*
= : మహేంద్రపర్వతము.

*82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?*
= : మైనాకుడు.

*83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?*
= : సురస.

*84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?*
= : సింహిక.

*85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?*
= : నూరు యోజనములు.

*86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?*
= : లంబ పర్వతం.

*87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?*
= : అశోక వనం.

*88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?*
= : పన్నెండు

*89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?*
= : త్రిజట.

*90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?*
= : రామ కథ.

*91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?*
= : చూడామణి.

*92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?*
= : ఎనభై వేలమంది.

*93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?*
= : ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.

*94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?*
= : విభీషణుడు.

*95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?*
= : మధువనం.

*96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?*
= : మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.

*97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?*
= : ఆలింగన సౌభాగ్యం.

*98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?*
= : నలుడు

*99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?*
= : నికుంభిల.

*100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?*
= : అగస్త్యుడు.

*101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?*
= : ఇంద్రుడు.

*102.  రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?*
= : మాతలి.

*103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?*
= : కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

*104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?*
= : హనుమంతుడు.

*105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?*
= : శత్రుంజయం.

*106.  శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?*
= : స్వయంగా తన భవనమునే యిచ్చెను.

*107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?*
= : బ్రహ్మ.

*108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?*
= : తన మెడలోని ముత్యాలహారం.

(సేకరణ)
🙏🙏🙏 🔔🔔🔔 🙏🙏🙏

No comments:

Post a Comment