Saturday, July 13, 2024

****హనుమ నామస్మరణం…సర్వపాప నివారణం

 *హనుమ నామస్మరణం…సర్వపాప నివారణం*

భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయస్వామి అనాధి నుండి ఒక విశిష్టమైన స్థానం ఉంది. 
హనుమంతుడు సహవేనుడు. గొప్ప రామభక్తుడు, అతి శక్తి వంతమైన రామనామం స్మరణ తోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలో చిరంజీవిగా నిలిచి పోయాడు. 

వీరత్వానికి ప్రతిక అయిన హనుమను ప్రతి రోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసిక పరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయని తులసీదాసు తాను రాసిన శ్రీహనుమాన్‌ చాలీసాలో చెప్పాడు.

    ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడకు హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చొని రామనామాన్ని భజిస్తాడు. 
     హనుమ ఉన్న చోట భక్తి రసం సెలయేరులా పారుతుంది. 
     రావణ కథానంతరం అయోధ్యలో శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత హనుమంతునికి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడుగు తాడు...
    అప్పుడు హనుమ రామచంద్ర ప్రభూ, నాహృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచి పోవాలని, అదేవిధంగా ప్రతిక్షణం రామనామ స్మరణ తప్ప వేరే ధ్యాస తనకు కలగరాదని అంటూ, రామా! నీ నామస్మరణతోనే నా ఈ జన్మ పునీతం కావాలని అంత కన్నా వేరొక భాగ్యం ఉంటుందా రామా! ప్రతిక్షణం నాలుకపై నీ నామ స్మరణ ఉండాలని కోరుకుంటున్నాను నాయీ కోరికను తీర్చమని హనుమ రాముడిని వేడుకుంటాడు.
 
     అందుకు రామచంద్రుడు తదాస్తు అని అంటాడు,
సీతా మాతకూడ తనకు అత్యంత ప్రేమ పాత్రుడగు హనుమను చూసి హనుమా నీవు ఉన్న చోట సమస్త భోగాలు నా ఆజ్ఞచే ఉండగలవని వరం ఇచ్చి ఆశీర్వదిస్తుంది. 
    దేశంలోని ప్రతి పల్లెలో రామయణం ఉన్నట్లుగానే, ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉంటుంది. 
     హనుమ ఉన్న ఊరు నిత్యకల్యాణం పచ్చతోరణంగా శోభిల్లుతుంది. తులసీదాసు రచించిన హనుమాన్‌ చాలీసాను ప్రతి రోజు ఉదయం, సాయంత్రం క్రమం తప్ప కుండా ఎవరు భక్తితో చదువుతారో వారికి హనుమ నీడలా ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడ తాడు. 

ప్రతి రోజూ హనుమను సేవించడం వల్ల మనకు రోగ బాధలు. 
భూతప్రేత పిశాచ బాధలు తొలగుతాయి,
ప్రతి ఇంట్లో తప్ప నిసరిగా హనుమ ఫొటోను పెట్టుకోవాలి. ఆ పటానికి నిత్యం పూజలు చెయ్యాలి. ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రతి రోజూ హను మను భక్తితో పూజిస్తే వారిలో ఆత్మస్థైర్యం ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చదువులలో, ఆట పాటల్లో గొప్పగా రాణిస్తారు. ప్రతి మంగళవారం, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి, అక్కడ స్వామి ముందు మట్టి ప్రమిదలో నెయ్యివేసి దీపం వెలిగిస్తే చాలు మనలో ఉన్న కోరికలన్నీ తప్పక నెరువేరుతాయి.

హనుమదాలయాలలో హనుమంతుని విగ్రహాలు మనకు అనేక రకాలుగా కనిపిస్తాయి. ప్రసన్నాంజనేయుడు, వీరాంజనేయుడు, అభయాంజనేయుడు, పంచ ముఖాంజనేయుడు ఇలా అనేక రూపాలతో మనకు దర్శనం ఇస్తాడు. హనుమను భక్తితో మనం స్మరిస్తే బుద్ధిబలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం మనలో పెరుగుతుంది. హనుమంతుడు మహాజ్ఞాని, దివ్య వ్యాకరణ పండితుడు స్వయంగా సీతారామ స్త్రోత్తాన్ని రచించి వారి వలన తత్త్వ జ్ఞానోపదేశం పొందాడు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా పదకొండు రోజులు గాని, ఇరవై ఒక్క రోజుగాని సుందరాకాండ పారాయణం చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటాము. మానసిక పరమైన ఆనందం కలుగుతుంది. ఆంజనేయస్వామి ఉపాసన చేయడం వలన మనసు ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఆంజనేయ స్వామి యంత్రాన్ని పెట్టి నిత్యం దానికి పూజలు చేస్తే చాలు ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కళకళ లాడుతుంది.

No comments:

Post a Comment