Sunday, March 2, 2025




 నేను నిన్ను శపిస్తున్నాను వాసుదేవా! 
ఈనాడు ఈ విధంగా కురుకుల సంహారం జరిగిందో... 
సరిగ్గా 36 సంవత్సరాలకు యాదవ కులం కూడా పరస్పరం సంహరించుకొని పూర్తిగా నాశనం అవుతుంది.

-కుంతి

అంతేనా ....
మాకు మీరు విధించే శిక్ష ఇంతేనా ...
యాదవులు తమ సామర్ధ్యాన్ని చూసి తామే గర్వపడుతుంటారు 
వారు ఆ దారిలో వెళ్లకుంటేనే ఎక్కువ ఆశ్చర్యపోవాలి 
మీ శాపం ఒక రకంగా దీవెన 
దాన్ని నేను స్వీకరిస్తున్నాను మాతా

- శ్రీకృష్ణుడు 

********

మహాభారత యుద్దానంతరం 36 సంవత్సరాల తరువాత యదువంశం నశించింది; యిది అన్ని గ్రంధాల్లోను పేర్కొనబడిన వాస్తవం. 

ఈ కాలమంతా శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు. ఈ వ్యవధి అయన చేసిన ఏదైనా విశేష కార్యం కానీ మనకు ఎక్కడా కనిపించదు. 

అంతే కాదు, ఈ సుదీర్ఘ కాలంలో అయన ద్వారక దాటి హస్తినాపురానికి గానీ వెళ్ళినట్లు గానీ, తన ప్రియసఖుడైన అర్జునుణ్ణి కలిసినట్లుగానీ మనకు కనిపించదు. 

సుదీర్ఘ కాలం జీవించాక, ఆఖరి ఘడియలు ఓ కుటుంబ పెద్దలాగా, నిర్వికారభావంతో గడిపినట్లు, శ్రీకృష్ణుడు జీవించి ఉంటాడని అనిపిస్తుంది.

ఈ ముప్పైఆరు సంవత్సరాల కాలానికి సంబంధించి దొరికిన వివరాల ఆధారంగా వీటికో కధారూపం యిచ్చే ప్రయత్నం చేశాను.

- దినకర్ జోషి

No comments:

Post a Comment