Monday, March 16, 2026

 Amaranth vasireddy

నిజాలకు పాతరేస్తే ?
అదొక సంచలన ఘటన .
 రెండు నెలల  క్రితం అందరూ దాని గురించే మాట్లాడుకున్నారు .
ఇప్పుడు మరచి పోయారు .
ఆ సంఘటన గురించి నిజాలు బయటకు రావు .

దీని వల్ల  సమాజానికి జరిగే నష్టం లేదు .

వ్యక్తులు .. వ్యక్తిగత జీవితాలు .
కాలక్షేపం కోసం .. అవతలి వారి జీవితాల్లోకి తొంగి చూసి .. గుసగుసలు పోవడం ఒక రకమయిన మానసిక రోగం .
మన చుట్టూరా  జరిగే ఘటనలనుంచి మనం ఏమి గ్రహించాలి ?.. మన జీవితాలను ఎలా మలచుకోవాలి? అనే కోణంలోనే మనం ఆలోచించాలి .
 అంతకు మించి కుతూహలం చూపడం మంచిది కాదు .

"అది ఏ ఘటన?" .." అందులో నిజాలేవి ".. లాంటి కామెంట్స్ పెట్టకండి .
చెప్పాలి అనుకొంటే నేరుగా చెప్పేసే వాడిని కదా ?
నా ఫోకస్ అది కాదు .
సంచలనాలు .. మిస్టరీలు...  నరాలు చిట్లిపోవడాలు .. కావాలనుకొంటే యూట్యూబ్ వీడియో లు దొరుకుతాయి .
మనం-  మన జీవితాలు అనే కోణం లోనే నా  పోస్ట్  లు ఉంటాయి .

ఇంత క్లియర్ గా చెప్పినా" ఓ ఆ కేసా ? ఏమి జరిగింది" .. లాంటి కామెంట్స్ వస్తే బ్లాక్ చేస్తాను . నా పోస్ట్ లను చూసే అవకాశం కోల్పోతారు .

వ్యక్తిగత విషయాల్లో నిజాలు బయటకు రాకపోతే ఏమీ నష్టం లేదు కానీ .. అందరి జీవితాలకు సంభందించిన విషయాల్లో నిజాలకు సమాధి  కడితే ఏమి జరుగుతుందో చెబుతాను .. చదవండి .

ADHD ..
 అంటే అటెన్షన్ డెఫిషిట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్ .
ఈ సమస్య ఉన్న  పిలల్లు నింపాదిగా ఒక చోట కూర్చోరు . 
ఏకాగ్రత కు వీరు వెయ్యి మైళ్లు  దూరం .
   ఒకేసారి    నాలుగైదు పనులు చేస్తారు .
 ఉదాహరణకు మీరు  వారికి    అన్నం తినిపించాలి అని చూస్తే ఒక ముద్ద  పెట్టుకొని  పరుగెత్తుతారు . బీరువా ఓపెన్      చేసి అందులో వస్తువులను కింద పడేస్తారు . 
 మీరు బీరువా దగ్గరకు వెళ్లి ఆ వస్తువులను  చూపితే అక్కడ వుండరు . కిచెన్ కు పరుగెత్తుతారు .
 అక్కడ ఉన్న  కాయగూరల్ని కింద పడేస్తారు . ఇంట్లో మిగతా పిల్లలుంటే వారిని గీరు తారు .
 గిచ్చు తారు . 
కొడుతారు .
 పరుగెత్తుతారు .. 
దూకుతారు .

 నిద్ర పోతున్నప్పుడు తప్పించి మిగతా సమయాల్లో నరకం చూపుతారు . ధర్మ రాజు లాంటి వ్యక్తి కూడా   నిగ్రహం     కోల్పోయేలా వీరి  ప్రవర్తన      ఉంటుంది .
ఇరవై ఏళ్లుగా బడిలో పాఠాలు  చెబుతున్న ఏ టీచర్ నైనా అడగండి .. అప్పట్లో అసలు ఈ మాటే వినిపించేది కాదు . ఇలాంటి పిల్లలు ఎక్కడో లక్షల్లో ఒకరు .

 ఇప్పుడు ..ప్రతి క్లాసులో ఇద్దరు ముగ్గురు . 
పాఠం వినరు . బ్లాక్ బోర్డు పై రాయాలని అటు తిరిగే లోగా  పక్క పిల్లాడిని గిల్లి     రక్కేసి     ఉంటారు . 
ఆ పిల్లాడి పేరెంట్స్ కంప్లైంట్ .
 ఈ పిల్లాడి పేరెంట్స్  కూడా మనల్నే తప్పుపడుతారు . 
"క్లాసులో మీరే చూసుకోవాలి కదా ? "అని అడుగుతారు . 
దేవుడు నాకేమైనా తలవెనుక కళ్ళు ... ముప్పై పొడవాటి చేతులు పెట్టాడా ? ప్రతి విద్యార్థి దగ్గర కూర్చోలేను కదా ? క్షణంలో అవతలి వారిని రక్కేస్తే  ఏమి చెయ్యాలి ? విసుగు వచ్చేస్తుంది . ఉద్యోగం వదిలి పారిపోవాలి అనిపిస్తుంది " అంటారు .
గత పదేళ్లుగా ముఖ్యంగా గత అయిదేళ్లుగా ADHD  సమస్య తీవ్రమయ్యింది .
పిల్లల చేతికి సెల్ ఫోన్ ఇవ్వడం .   ఇంట్లో    ఎప్పడూ వైఫై ఆన్ లో ఉండడడం ..  మనుషుల మధ్య    సామజిక సంభందాలు బలహీనం కావడం .. ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం .. స్ట్రెస్ పెరగడం    గర్బిణీ  స్త్రీలు     ఉదరానికి   దగ్గర గా లాప్ టాప్ పెట్టుకొని వాడడం .. ఇవీ దీనికి కారణాలు .
కారణాలు తెలిస్తే .. పరిష్కారం తెలుస్తుంది .
నిజాల్ని ఒప్పేసుకొంటే సెల్ ఫోన్  .. డేటా కనెక్షన్ స్మార్ట్ టీవీ .. ఓటిటి .. ఇలా చాలామందికి నష్టం .
 కాబట్టి నిజాన్ని బయటకు రానివ్వరు .
"ఒకప్పుడు కూడా ADHD  ఉండేది . కాకపోతే ఇప్పుడు టెస్టింగ్ అవగాహన పెరిగింది కాబట్టి కేసులు పెరిగినట్టు కనిపిస్తుంది "అని కట్టు కథ అల్లేశారు . 

ఓరి  నీ  అసాధ్యం కూలా . 
లక్షలాది మంది టీచర్స్ మొఖాన ఉమ్మేస్తారు అని భయం కూడా లేక పొతే ఎలా ?

వైఫై .. సెల్ ఫోన్ .. స్మార్ట్ టీవీ .. ఒటిటి .. జంక్ ఫుడ్  కు...  ADHD  కి సంబంధమే లేదు .. అని తేల్చేస్తే ?
అమెరికా లో ఇదే జరుగుతోంది .
వీటన్నింటికీ దూరం జరిగితే కొంతలో కొంత మెరుగుపడే ఛాన్స్ .
 కానీ  బడా కంపెనీ  ల చేతుల్లో కీలుబొమ్మగా మారిన ...  సైన్స్... ఒప్పుకోదు .

ప్రతి క్లాసులో ఇద్దరో ముగ్గురో హైపర్ ఆక్టివిటీ పిల్లలు  . 

టీచర్స్ ఏమి  చేయగలుగుతారు ?
అమెరికా లో ఇలాంటి పిల్లలకు బడుల్లో మెడిసిన్ ఇస్తున్నారు . 
ఈ మందులు రెండు రకాలు . స్టిములంట్  మెడిసిన్ . నాన్  స్టిములంట్ . 
రిటలిన్ , ADDERALL అనేవి మొదటి కోవ .
 వీటి సైడ్ ఎఫెక్ట్స్ .. 
గుండె వేగం గా కొట్టుకొంటుంది . బిపి పెరుగుతుంది . పెరుగుదల దెబ్బతింటుంది . నిద్ర సరిగా పట్టదు . ఇరిటబిలిటీ మరింత పెరుగుతుంది .
STRATTERA  నాన్  స్టిములంట్ . 
మూడ్ చేంజ్ .. వాంతులు .. కళ్ళు తిరగడం . బిపి పెరగడం .. కొన్ని కేసుల్లో లివర్ పాడైపోవడం .. ఆత్మ అహత్య ఆలోచనలు . ఇదీ దీని సైడ్ ఎఫెక్ట్స్ 

మందు వేయకపోతే వారు బడిలో..  క్లాసులో..  కూర్చోరు .
 మందేస్తే ఆరోగ్యం నాశనం .
 ఒక సారి మందు ఇస్తే దాని కారణంగా నిద్ర పట్టదు .
 చిరాకు పడుతారు . 
చిరాకు తగ్గించడానికి ఇచ్చే మందు చిరాకు ను తెప్పిస్తుంది . 
మందు  వేస్తె మళ్ళీ మళ్ళీ వెయ్యాలి . 
సమస్య మరింత జటిలం 
రాస్తుంటే నాకు ఏడుపు వస్తుంది .
నిజాలకు పాతరవేస్తే అది మన జీవితాలకు సమాధి  కడుతుంది.

No comments:

Post a Comment